మరణం తర్వాత ఏమౌతాది?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-after-death.html

మరణం తర్వాత ఏంజరుగుద్ది అనే విషయంపై క్రైస్తవ విశ్వాసంలోనే పలు అనుమానాలున్నాయి. మరణం తర్వాత ప్రతి ఒక్కరు అంతిమ తీర్పు వరకు నిద్రిస్తారని, ఆ తర్వాత పరలోకమునకుగాని నరకమునకుగాని పంపబడతారని కొంతమంది నమ్ముతారు. మరి కొందరైతే మరణమైన తక్షణమే తీర్పువుంటుందని నిత్య గమ్యానికి పంపింపబడతారని నమ్ముతారు. మరణము తర్వాత ప్రాణాత్మలు తాత్కాలికమైన పరలోకము లేక నరకమునకు పంపబడతాయని అక్కడ అంతిమ పునరుత్ధానము కోసం వేచియుంటారని, అంతిమ తీర్పు తర్వాత నిత్య గమ్యాలకు పంపబడతారని మరి కొంతమంది చెప్పుతారు. కాబట్టి మరణం తర్వాత ఏమి జరుగుద్ది అన్నదానిని బైబిలు ఏమి చెప్తుంది?

మొదటిగా క్రీస్తునందున్న విశ్వాసి బైబిలు చెప్పుతున్నట్లుగా చనిపోయిన తర్వాత అతని/ఆమె ఆత్మ పరలోకమునకు కొనిపోబడతాది. ఎందుకంటే ఆ వ్యక్తి పాపములు క్రీస్తు స్వంతరక్షకునిగా అంగీకరించుటనుబట్టి క్షమించబడినవికాబట్టి యోహాను 3:16.18,36). విశ్వాసునికి మరణము అంటే శరీరమునుండి వేరు పరచబడి ప్రభువుతో యింటికి చేరటమే (2 కొరింథి 5:6-8; ఫిలిప్పీయులకు 1:23). అయితే, 1కొరింథి 15:50-54 మరియు 1థెస్సలోనీయులకు 1: 13-17 ప్రకారము ఒక విశ్వాసి పునరుత్ధానుడై మహిమగల శరీరము ఇవ్వబడినట్లు వివరిస్తున్నాయి. విశ్వాసులు మరణనంతరం క్రీస్తు దగ్గరకు వెళ్ళేవాళ్ళాయితే ఇటువంటి పునరుత్ధానము యొక్క ఉద్డేశము ఏంటి? బహుశా! విశ్వాసులు యొక్క ప్రాణాత్మాలు మరణాంతరం క్రీస్తుదగ్గరకు వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి భౌతిక దేహము సమాధిలో నిడ్రించునేమో. విశ్వాసులు యొక్క పునరుత్ధాన సమయంలో వారి భౌతికధేహము పునరుత్ధానమై మహిమ శరీరముతో తిరిగి కలుసుకొనును. ఈవిధముగా తిరిగి ఏకపరచబడిన ప్రాణాత్మదేహాలను విశ్వాసులు కలిగియుండి నూతన ఆకాశాములోను నూతనలోకములోను నిత్యత్వములో గడుపుదురు.

రెండవదిగా ఎవరైతే యేసుక్రీస్తుని స్వంతరక్షకునిగా అంగీకరించరో వారికి మరణము అంటే నిత్య శిక్ష. అయితే విశ్వాసులు యొక్క గమ్యము వలే అవిశ్వాసులు కూడ మరణానంతరం ఓ తాత్కలిక ప్రదేశములో ఉంచబడతారు. వారు అంతిమ పునరుత్ధానము, తీర్పు, నిత్యగమ్యము కొరకు వేచియుంటారు. ధనవంతుడు మరణాంతరము శిక్షపొందునట్లుగా లూకా 16: 22-23 వివరిస్తుంది. అవిశ్వాసులైన మృతులు యొక్క పునరుత్ధానమును ప్రకటనగ్రంధం 20: 11-15 వివరిస్తుంది. వారు ధవళమైన మహాసింహాసనపు తీర్పు పొంది అగ్ని గుండములో త్రోయబడుదురు. కాబట్టి అవిశ్వాసులు మరణం తర్వాత అనంతరమే నరకమునకు (అగ్ని గుండంలోనికి) త్రోయబడరు కాని తాత్కలికముగా తీర్పును, శిక్షను అనుభవిస్తారు. అయితే విశ్వాసులు మరణాంతరం అగ్నిగుండంలోనికి త్రోయబడకపోయిన వారి స్థితి సుఖవంతమైంది కాదు. ధనవంతుడు నేను ఈ అగ్ని జ్వాలలో యాతనపడుచున్నానని కేకలు వేసెను (లూకా 16:24).

కాబట్టి మరణాంతరం ఓ వ్యక్తి తాత్కలికమైన పరలోకము లేక నరకములో గడుపుతారు/ గడుపుతాడు. తాత్కలిక స్థితి తర్వాత అంతిమ పునరుత్ధానపు సమయంలో ఓ వ్యక్తి నిత్య గమ్యమైతే మారదు. స్థానభ్రమణం తప్పించి నిత్య గమ్యములో మార్పువుండదు. అంతిమముగా ఆ నూతన ఆకాశమునకు, నూతన భూమికి ప్రవేశము అనుగ్రహించబడుతాది. అవిశ్వాసులు అగ్నిగుండమునకు పంపబడుతారు. రక్షణ విషయమై యేసుక్రీస్తుని నమ్మారా లేదా అన్నదానిపై ఆధారపడివున్న అంతిమ నిత్య గమ్యాలు ఇవే.