Luke - లూకా సువార్త 2 | View All

1. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.

1. அந்நாட்களில் உலகமெங்கும் குடிமதிப்பு எழுதப்படவேண்டுமென்று அகஸ்துராயனால் கட்டளை பிறந்தது.

2. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.

2. சீரியா நாட்டிலே சிரேனியு என்பவன் தேசாதிபதியாயிருந்தபோது இந்த முதலாம் குடிமதிப்பு உண்டாயிற்று.

3. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి.

3. அந்தப்படி குடிமதிப்பெழுதப்படும்படிக்கு எல்லாரும் தங்கள் தங்கள் ஊர்களுக்குப் போனார்கள்.

4. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు

4. அப்பொழுது யோசேப்பும், தான் தாவீதின் வம்சத்தானும் குடும்பத்தானுமாயிருந்தபடியினாலே, தனக்கு மனைவியாக நியமிக்கப்பட்டுக் கர்ப்பவதியான மரியாளுடனே குடிமதிப்பெழுதப்படும்படி,

5. గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.

5. கலிலேயா நாட்டிலுள்ள நாசரேத்தூரிலிருந்து யூதேயா நாட்டிலுள்ள பெத்லகேம் என்னும் தாவீதின் ஊருக்குப் போனான்.

6. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక

6. அவ்விடத்திலே அவர்கள் இருக்கையில், அவளுக்குப் பிரசவகாலம் நேரிட்டது.

7. తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.

7. அவள் தன் முதற்பேறான குமாரனைப் பெற்று, சத்திரத்திலே அவர்களுக்கு இடமில்லாதிருந்தபடியினால், பிள்ளையைத் துணிகளில் சுற்றி, முன்னணையிலே கிடத்தினாள்.

8. ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా

8. அப்பொழுது அந்த நாட்டிலே மேய்ப்பர்கள் வயல்வெளியில் தங்கி, இராத்திரியிலே தங்கள் மந்தையைக் காத்துக்கொண்டிருந்தார்கள்.

9. ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.

9. அவ்வேளையில் கர்த்தருடைய தூதன் அவர்களிடத்தில் வந்து நின்றான், கர்த்தருடைய மகிமை அவர்களைச் சுற்றிலும் பிரகாசித்தது; அவர்கள் மிகவும் பயந்தார்கள்.

10. అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;

10. தேவதூதன் அவர்களை நோக்கி: பயப்படாதிருங்கள்; இதோ, எல்லா ஜனத்துக்கும் மிகுந்த சந்தோஷத்தை உண்டாக்கும் நற்செய்தியை உங்களுக்கு அறிவிக்கிறேன்.

11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు

11. இன்று கர்த்தராகிய கிறிஸ்து என்னும் இரட்சகர் உங்களுக்குத் தாவீதின் ஊரிலே பிறந்திருக்கிறார்.

12. దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.

12. பிள்ளையைத் துணிகளில் சுற்றி, முன்னணையிலே கிடத்தியிருக்கக் காண்பீர்கள்; இதுவே உங்களுக்கு அடையாளம் என்றான்.

13. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి

13. அந்தக்ஷணமே பரமசேனையின் திரள் அந்தத் தூதனுடனே தோன்றி:

14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.

14. உன்னதத்திலிருக்கிற தேவனுக்கு மகிமையும், பூமியிலே சமாதானமும், மனுஷர்மேல் பிரியமும் உண்டாவதாக என்று சொல்லி, தேவனைத் துதித்தார்கள்.

15. ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులుజరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితోనొకడు చెప్పుకొని

15. தேவதூதர்கள் அவர்களை விட்டுப் பரலோகத்துக்குப் போனபின்பு, மேய்ப்பர்கள் ஒருவரையொருவர் நோக்கி: நாம் பெத்லகேம் ஊருக்குப் போய், நடந்ததாகக் கர்த்தரால் நமக்கு அறிவிக்கப்பட்ட இந்தக் காரியத்தைப் பார்ப்போம் வாருங்கள் என்று சொல்லி,

16. త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.

16. தீவிரமாய் வந்து, மரியாளையும் யோசேப்பையும், முன்னணையிலே கிடத்தியிருக்கிற பிள்ளையையும் கண்டார்கள்.

17. వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.

17. கண்டு, அந்தப் பிள்ளையைக்குறித்துத் தங்களுக்குச் சொல்லப்பட்ட சங்கதியைப் பிரசித்தம்பண்ணினார்கள்.

18. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

18. மேய்ப்பராலே தங்களுக்குச் சொல்லப்பட்டதைக் கேட்ட யாவரும் அவைகளைக்குறித்து ஆச்சரியப்பட்டார்கள்.

19. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.

19. மரியாளோ அந்தச் சங்கதிகளையெல்லாம் தன் இருதயத்திலே வைத்து, சிந்தனைபண்ணினாள்.

20. అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.

20. மேய்ப்பர்களும் தங்களுக்குச் சொல்லப்பட்டதின்படியே கேட்டு கண்ட எல்லாவற்றிற்காகவும் தேவனை மகிமைப்படுத்தி, துதித்துக்கொண்டு திரும்பிப்போனார்கள்.

21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
ఆదికాండము 17:12, లేవీయకాండము 12:3

21. பிள்ளைக்கு விருத்தசேதனம் பண்ணவேண்டிய எட்டாம் நாளிலே, அது கர்ப்பத்திலே உற்பவிக்கிறதற்கு முன்னே தேவதூதனால் சொல்லப்பட்டபடியே, அதற்கு இயேசு என்று பேரிட்டார்கள்.

22. మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు
లేవీయకాండము 12:6

22. மோசேயின் நியாயப்பிரமாணத்தின்படியே அவர்களுடைய சுத்திகரிப்பின் நாட்கள் நிறைவேறினபோது,

23. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును,
నిర్గమకాండము 13:2, నిర్గమకాండము 13:12, నిర్గమకాండము 13:15

23. முதற்பேறான எந்த ஆண்பிள்ளையும் கர்த்தருக்குப் பரிசுத்தமானதென்னப்படும் என்று கர்த்தருடைய நியாயப்பிரமாணத்தில் எழுதியிருக்கிறபடி அவரைக் கர்த்தருக்கென்று ஒப்புக்கொடுக்கவும்,

24. ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.
లేవీయకాండము 5:11, లేవీయకాండము 12:8

24. கர்த்தருடைய நியாயப்பிரமாணத்தில் சொல்லியிருக்கிறபடி, ஒரு ஜோடு காட்டுப்புறாவையாவது இரண்டு புறாக்குஞ்சுகளையாவது பலியாகச் செலுத்தவும், அவரை எருசலேமுக்குக் கொண்டுபோனார்கள்.

25. యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతి మంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.
యెషయా 40:1, యెషయా 49:13

25. அப்பொழுது சிமியோன் என்னும் பேர்கொண்ட ஒரு மனுஷன் எருசலேமில் இருந்தான்; அவன் நீதியும் தேவபக்தியும் உள்ளவனாயும், இஸ்ரவேலின் ஆறுதல்வரக் காத்திருக்கிறவனாயும் இருந்தான்; அவன்மேல் பரிசுத்தஆவி இருந்தார்.

26. అతడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయము లోనికి వచ్చెను.

26. கர்த்தருடைய கிறிஸ்துவை நீ காணுமுன்னே மரணமடையமாட்டாய் என்று பரிசுத்த ஆவியினாலே அவனுக்கு அறிவிக்கப்பட்டுமிருந்தது.

27. అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలి దండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు

27. அவன் ஆவியின் ஏவுதலினால் தேவாலயத்திலே வந்திருந்தான். இயேசு என்னும் பிள்ளைக்காக நியாயப்பிரமாணமுறைமையின்படி செய்வதற்குத் தாய் தகப்பன்மார் அவரை உள்ளே கொண்டுவருகையில்,

28. అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను

28. அவன் அவரைத் தன் கைகளில் ஏந்திக்கொண்டு, தேவனை ஸ்தோத்திரித்து:

29. నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;

29. ஆண்டவரே, உமது வார்த்தையின்படி உமது அடியேனை இப்பொழுது சமாதானத்தோடே போகவிடுகிறீர்;

30. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
యెషయా 40:5, యెషయా 52:10

30. புறஜாதிகளுக்குப் பிரகாசிக்கிற ஒளியாகவும், உம்முடைய ஜனமாகிய இஸ்ரவேலுக்கு மகிமையாகவும்,

31. నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన
యెషయా 40:5, యెషయా 52:10

31. தேவரீர் சகல ஜனங்களுக்கும் முன்பாக ஆயத்தம்பண்ணின.

32. నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
యెషయా 25:7, యెషయా 42:6, యెషయా 46:13, యెషయా 49:6

32. உம்முடைய இரட்சணியத்தை என் கண்கள் கண்டது என்றான்.

33. యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.

33. அவரைக்குறித்துச் சொல்லப்பட்டவைகளுக்காக யோசேப்பும் அவருடைய தாயாரும் ஆச்சரியப்பட்டார்கள்.

34. సుమెయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;
యెషయా 8:14-15

34. பின்னும் சிமியோன் அவர்களை ஆசீர்வதித்து, அவருடைய தாயாகிய மரியாளை நோக்கி: இதோ, அநேகருடைய இருதய சிந்தனைகள் வெளிப்படத்தக்கதாக, இஸ்ரவேலில் அநேகர் விழுகிறதற்கும் எழுந்திருக்கிறதற்கும், விரோதமாகப் பேசப்படும் அடையாளமாவதற்கும், இவர் நியமிக்கப்பட்டிருக்கிறார்.

35. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను.

35. உன் ஆத்துமாவையும் ஒரு பட்டயம் உருவிப்போகும் என்றான்.

36. మరియఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై,

36. ஆசேருடைய கோத்திரத்தாளும், பானுவேலின் குமாரத்தியுமாகிய அன்னாள் என்னும் ஒரு தீர்க்கதரிசி இருந்தாள்; அவள் கன்னிப்பிராயத்தில் விவாகமானதுமுதல் ஏழுவருஷம் புருஷனுடனே வாழ்ந்தவளும், அதிக வயதுசென்றவளுமாயிருந்தாள்.

37. యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.

37. ஏறக்குறைய எண்பத்துநாலு வயதுள்ள அந்த விதவை தேவாலயத்தைவிட்டு நீங்காமல், இரவும் பகலும் உபவாசித்து, ஜெபம்பண்ணி, ஆராதனை செய்துகொண்டிருந்தாள்.

38. ఆమెకూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.
యెషయా 52:9

38. அவளும் அந்நேரத்திலே வந்து நின்று, கர்த்தரைப் புகழ்ந்து, எருசலேமிலே மீட்புண்டாகக் காத்திருந்த யாவருக்கும் அவரைக்குறித்துப் பேசினாள்.

39. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయ లోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి.

39. கர்த்தருடைய நியாயப்பிரமாணத்தின்படி சகலத்தையும் அவர்கள் செய்துமுடித்தபின்பு, கலிலேயா நாட்டிலுள்ள தங்கள் ஊராகிய நாசரேத்துக்குத் திரும்பிப்போனார்கள்.

40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.

40. பிள்ளை வளர்ந்து, ஆவியிலே பெலன்கொண்டு, ஞானத்தினால் நிறைந்தது. தேவனுடைய கிருபையும் அவர்மேல் இருந்தது.

41. పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు.
నిర్గమకాండము 12:24-27, ద్వితీయోపదేశకాండము 16:1-8

41. அவருடைய தாய் தகப்பன்மார் வருஷந்தோறும் பஸ்கா பண்டிகையில் எருசலேமுக்குப் போவார்கள்.

42. ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి.

42. அவருக்குப் பன்னிரண்டு வயதானபோது, அவர்கள் அந்தப் பண்டிகைமுறைமையின்படி எருசலேமுக்குப்போய்,

43. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను.

43. பண்டிகைநாட்கள் முடிந்து, திரும்பிவருகிறபோது, பிள்ளையாகிய இயேசு எருசலேமிலே இருந்துவிட்டார்; இது அவருடைய தாயாருக்கும் யோசேப்புக்கும் தெரியாதிருந்தது.

44. ఆయన తలిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి.

44. அவர் பிரயாணக்காரரின் கூட்டத்திலே இருப்பாரென்று அவர்கள் நினைத்து, ஒருநாள் பிரயாணம் வந்து, உறவின் முறையாரிடத்திலும் அறிமுகமானவர்களிடத்திலும் அவரைத் தேடினார்கள்.

45. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

45. காணாததினாலே அவரைத் தேடிக்கொண்டே எருசலேமுக்குத் திரும்பிப்போனார்கள்.

46. మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.

46. மூன்றுநாளைக்குப் பின்பு, அவர் தேவாலயத்தில் போதகர் நடுவில் உட்கார்ந்திருக்கவும், அவர்கள் பேசுகிறதைக் கேட்கவும், அவர்களை வினாவவும் கண்டார்கள்.

47. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.

47. அவர் பேசக்கேட்ட யாவரும் அவருடைய புத்தியையும் அவர் சொன்ன மாறுத்தரங்களையுங்குறித்துப் பிரமித்தார்கள்.

48. ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లికుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా
యెషయా 52:14

48. தாய் தகப்பன்மாரும் அவரைக்கண்டு ஆச்சரியப்பட்டார்கள். அப்பொழுது அவருடைய தாயார் அவரை நோக்கி: மகனே! ஏன் எங்களுக்கு இப்படிச் செய்தாய்? இதோ, உன் தகப்பனும் நானும் விசாரத்தோடே உன்னைத் தேடினோமே என்றாள்.

49. ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను;

49. அதற்கு அவர்: நீங்கள் ஏன் என்னைத் தேடினீர்கள்? என் பிதாவுக்கடுத்தவைகளில் நான் இருக்கவேண்டிதென்று அறியீர்களா என்றார்.

50. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.

50. தங்களுக்கு அவர் சொன்ன வார்த்தையை அவர்கள் உணர்ந்துகொள்ளவில்லை.

51. అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.

51. பின்பு அவர் அவர்களுடனே கூடப்போய், நாசரேத்தூரில் சேர்ந்து, அவர்களுக்குக் கீழ்ப்படிந்திருந்தார். அவருடைய தாயார் இந்தச் சங்கதிகளையெல்லாம் தன் இருதயத்திலே வைத்துக்கொண்டாள்.

52. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.
1 సమూయేలు 2:26, సామెతలు 3:4

52. இயேசுவானவர் ஞானத்திலும், வளர்த்தியிலும், தேவகிருபையிலும், மனுஷர் தயவிலும் அதிகமதிகமாய் விருத்தியடைந்தார்.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు జననం. (1-7) 
దేవుడు తన కుమారుడిని స్త్రీకి జన్మించి, ధర్మశాస్త్రానికి లోబడి ఈ లోకానికి పంపాలని సంకల్పించినప్పుడు నిర్ణీత సమయం వచ్చింది. అతని పుట్టుక చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా వినయపూర్వకంగా ఉన్నాయి. క్రీస్తు ఒక సత్రంలో జన్మించాడు, భూమిపై అతని తాత్కాలిక బసను సూచిస్తుంది, ఇది ఒక సత్రంలో ప్రయాణికుడు వలె. ఇది మాకు విలువైన పాఠం నేర్పడానికి ఉద్దేశించబడింది. పాపం ద్వారా మనం విడిచిపెట్టబడిన మరియు నిస్సహాయ శిశువుల వలె, క్రీస్తు కూడా వినయ స్థితిలో ఈ లోకంలోకి ప్రవేశించాడు.
సౌఖ్యం మరియు విలాసాలను వెతకడం, మన పిల్లలకు అలంకారం మరియు భోగభాగ్యాలను కోరుకునే మన మానవ ధోరణుల గురించి ఆయనకు బాగా తెలుసు. పేదలు ధనవంతుల పట్ల ఎంత సులభంగా అసూయపడగలరో, ధనవంతులు పేదలను చిన్నచూపు చూస్తారని అతను అర్థం చేసుకున్నాడు. అయితే, విశ్వాసం అనే కటకం ద్వారా దేవుని కుమారుడు మానవుడిగా మారడం మరియు తొట్టిలో పడుకోవడం గురించి మనం ఆలోచించినప్పుడు, అది మన గర్వాన్ని, ఆశయాన్ని మరియు అసూయను తగ్గిస్తుంది. ఆయన సన్నిధిలో, మనకు మరియు మన పిల్లలకు గొప్పతనం కోసం మన కోరికలను విడనాడవలసి వస్తుంది.

ఇది గొర్రెల కాపరులకు తెలియజేయబడింది. (8-20) 
దేవదూతలు కొత్తగా జన్మించిన రక్షకుని దూతలుగా పనిచేశారు, అయినప్పటికీ వారు తమ మందను శ్రద్ధగా చూసుకునే వినయపూర్వకమైన, సద్గుణమైన గొర్రెల కాపరుల సమూహాన్ని సందర్శించమని నిర్దేశించబడ్డారు. దైవ సందర్శనలు అసాధారణమైన పరిస్థితులకు మాత్రమే పరిమితం కావు, కానీ మనం నిజాయితీగల వృత్తిలో నిమగ్నమైనప్పుడు, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు సంభవించవచ్చని ఇది వెల్లడిస్తుంది. "అత్యున్నతమైన దేవునికి మహిమ" అని దేవదూతలు ప్రకటించినట్లుగా, ఈ సంఘటన యొక్క మహిమను దేవునికి ఆపాదిద్దాం. మానవాళి పట్ల దేవుని దయ, మెస్సీయను పంపడం ద్వారా ప్రదర్శించబడింది, ఇది అతని ప్రశంసలకు కారణం. దేవుని పనులన్నీ ఆయనకు ఘనతను తెచ్చిపెడుతున్నప్పటికీ, ప్రపంచ విమోచన ఆయన మహిమకు అత్యున్నత నిదర్శనంగా నిలుస్తుంది. మెస్సీయను పంపడంలో దేవుని సద్భావన ద్వారా, ఈ భూసంబంధమైన రాజ్యంలోకి శాంతి తీసుకురాబడింది, ఇది మన స్వభావాన్ని స్వీకరించడం ద్వారా క్రీస్తు నుండి ఉత్పన్నమయ్యే అనేక రకాల ఆశీర్వాదాలను సూచిస్తుంది.
అనేక మంది దేవదూతలచే ధృవీకరించబడిన ఈ సత్యం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు విశ్వవ్యాప్త ఆమోదానికి అర్హమైనది: మానవాళి పట్ల దేవుని చిత్తశుద్ధి అతని మహిమను అత్యున్నతంగా తెలియజేస్తుంది మరియు ఇది భూమిపై శాంతిని కలిగిస్తుంది. గొర్రెల కాపరులు సమయాన్ని వృథా చేయకుండా నిర్దేశించిన ప్రదేశానికి త్వరత్వరగా వెళ్లారు. వారు చూసిన దానితో సంతృప్తి చెందారు, వారు ఈ వార్తలను చాలా దూరం పంచుకున్నారు, వారు కనుగొన్న బిడ్డ రక్షకుడని, క్రీస్తు ప్రభువు అని సాక్ష్యమిచ్చారు. మేరీ ఈ అద్భుతమైన సంఘటనలన్నింటినీ శ్రద్ధగా గమనించింది మరియు ఆలోచించింది, ఇది ఆమె భక్తి భావాలను ప్రేరేపించడానికి ఉపయోగపడింది. మన హృదయాలలో ఈ విషయాలపై లోతైన ప్రతిబింబం నుండి మనం కూడా ప్రయోజనం పొందుతాము, ఎందుకంటే ఇది మరింత ఖచ్చితమైన అవగాహన మరియు ధర్మబద్ధమైన ప్రవర్తనకు దారి తీస్తుంది.
రక్షకుడైన క్రీస్తు ప్రభువు మన కొరకు జన్మించాడనే ప్రకటన మన చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది మరియు ఈ వార్త అందరికీ ఆనందాన్ని కలిగించాలి.

క్రీస్తు దేవాలయంలో సమర్పించబడ్డాడు. (21-24) 
మన ప్రభువైన యేసు పాపం లేకుండా జన్మించాడు, అందువల్ల, పాడైన స్వభావం యొక్క మరణాన్ని లేదా సున్నతి ద్వారా సూచించబడిన పవిత్రతను పునరుద్ధరించడం అతనికి అవసరం లేదు. బదులుగా, అతని విషయంలో, ఈ ఆచారం, బాధలు మరియు ప్రలోభాలను ఎదుర్కొన్నప్పటికీ, మన రక్షణ కోసం ఆయన చేసిన ఆత్మబలిదానానికి ముగింపు పలికి, చట్టం యొక్క మొత్తానికి అతని భవిష్యత్తు అచంచలమైన విధేయతకు నిదర్శనంగా పనిచేసింది.
నలభై రోజులు గడిచిన తర్వాత, మేరీ తన శుద్ధీకరణ కోసం నిర్దేశించిన బలులు అర్పించడానికి ఆలయానికి ఎక్కింది. జోసెఫ్ కూడా, చట్టం యొక్క నిబంధనల ప్రకారం, మొదటి పుట్టిన కుమారునికి ఆచారం ప్రకారం, పవిత్ర బిడ్డ యేసును సమర్పించాడు. అదేవిధంగా, మన పిల్లలను ప్రభువుకు అంకితం చేయాలి, వారు ఆయన నుండి వచ్చిన బహుమతి అని అంగీకరించాలి మరియు వారిని పాపం మరియు మరణం నుండి విముక్తి చేయమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, వారిని ఆయన పవిత్రతకు అంకితం చేయాలి.

సిమియోను యేసు గురించి ప్రవచించాడు. (25-35) 
సిమియోను ఆశను పెంచిన అదే దైవిక ఆత్మ అతని ఆనందాన్ని కూడా పెంచింది. క్రీస్తును ఎదుర్కోవాలని కోరుకునే వారు ఆయన దేవాలయంలో ఆయనను వెతకాలి. సిమియోన్ యొక్క విశ్వాసం యొక్క ఒప్పుకోలు అతను ఊయలలో ఉంచిన బిడ్డ రక్షకుడని, దేవునిచే నియమించబడిన మోక్షానికి స్వరూపిణి అని నమ్మకం. క్రీస్తును తమ చేతులలో పట్టుకొని మోక్షానికి సంబంధించిన వాగ్దానాన్ని చూసినప్పుడు దాని ప్రాముఖ్యతను గుర్తించి, అతను భూలోకానికి వీడ్కోలు పలికాడు. నీతిమంతుని మరణం దేవునితో శాంతి, మనస్సాక్షి యొక్క ప్రశాంతత మరియు మరణాన్ని ఎదుర్కొనే ప్రశాంతతతో గుర్తించబడిన ప్రగాఢమైన ఓదార్పు. క్రీస్తును అంగీకరించిన వారు మరణాన్ని కూడా సమదృష్టితో స్వీకరించగలరు.
ఈ పిల్లవాడి గురించి మాట్లాడిన మాటలకు జోసెఫ్ మరియు మేరీ ఆశ్చర్యపోయారు. సిమియోన్ వారి ఆనందానికి గల కారణాలను కూడా భయాందోళనలతో వారికి వెల్లడించాడు. యేసు, ఆయన బోధలు మరియు ఆయన అనుచరులు ఇప్పటికీ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు; అతని సత్యం మరియు పవిత్రత సవాలు చేయబడ్డాయి మరియు దూషించబడ్డాయి మరియు అతని బోధించిన పదం ప్రజల స్వభావాన్ని అంచనా వేయడానికి ప్రమాణంగా కొనసాగుతుంది. కొందరి హృదయాలలో దాగి ఉన్న నీతి సంబంధమైన ప్రేమలు క్రీస్తును అంగీకరించడం ద్వారా బహిర్గతం అవుతాయి, మరికొందరిలో దాగివున్న అవినీతి ఆయన పట్ల వారికున్న శత్రుత్వం ద్వారా బహిర్గతమవుతుంది. చివరికి, ప్రజలు క్రీస్తు గురించి వారి ఆలోచనలు మరియు భావాలను బట్టి తీర్పు తీర్చబడతారు. అతను బాధాకరమైన యేసుగా మిగిలిపోతాడు మరియు అతని తల్లి వారి బంధం యొక్క సన్నిహిత బంధం మరియు అతని పట్ల ఆమెకున్న గాఢమైన ఆప్యాయత కారణంగా అతని బాధలో పాలుపంచుకుంటుంది.

అన్నా అతని గురించి ప్రవచించాడు. (36-40) 
చర్చి చాలా తప్పుల వల్ల చెడిపోయిన సమయంలో, దేవుడు తన ఉనికిని తెలియజేసాడు. అన్నా స్థిరంగా ఆలయంలో లేదా కనీసం తరచుగా నివసించేవారు. ఆమె ప్రార్థన స్ఫూర్తిని కొనసాగించింది, ప్రార్థనకు తనను తాను అంకితం చేసుకుంది మరియు తన ప్రయత్నాలన్నింటిలో భక్తితో దేవునికి సేవ చేసింది. క్రీస్తును ఎదుర్కొనే ఆధిక్యత కలిగిన వారికి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తగినంత కారణం ఉంది. అన్నా కూడా అతని గురించి తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంది. గౌరవనీయులైన సెయింట్స్, సిమియోన్ మరియు అన్నా యొక్క ఆదర్శప్రాయమైన జీవితాలు, వెండి జుట్టుతో ఉన్నవారిని ధైర్యపరచాలి, వారి వృద్ధాప్య తలలు, వారి మాదిరిగానే, కీర్తి కిరీటాన్ని సూచిస్తాయి, ధర్మ మార్గంలో నడవడం ద్వారా పొందబడ్డాయి. సమాధిలో నిశ్శబ్దం కోసం ఉద్దేశించిన వారి పెదవులు విమోచకుని ప్రశంసలను నిరంతరం కీర్తిస్తూ ఉండాలి.
ప్రతి అంశంలోనూ, క్రీస్తు తన సహోదరులవలె తయారుచేయబడుట యుక్తమైనది; అందువలన, అతను ఇతర పిల్లల వలె బాల్యం మరియు బాల్యం అనుభవించాడు, అయినప్పటికీ పాపం లేకుండా ఉన్నాడు, అతని దైవిక స్వభావం యొక్క స్పష్టమైన సంకేతాలను ప్రదర్శిస్తాడు. దేవుని స్పిరిట్ ద్వారా, అతని సామర్థ్యాలన్నీ మరెవరికీ లేని విధంగా పనిచేశాయి. ఇతర పిల్లలు తరచుగా వారి మాటలు మరియు చర్యలలో మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తుండగా, అతను పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా జ్ఞానంతో నిండి ఉన్నాడు. అతను చెప్పిన మరియు చేసిన ప్రతిదీ అతని సంవత్సరాలకు మించిన జ్ఞానంతో గుర్తించబడింది. ఇతర పిల్లలు వారి మానవ స్వభావం యొక్క లోపాలను వ్యక్తపరుస్తుండగా, అతని జీవితం దేవుని యొక్క స్పష్టమైన దయను కలిగి ఉంది.

దేవాలయంలో పండితులతో క్రీస్తు. (41-52)
పిల్లలు బహిరంగ ఆరాధనలో పాల్గొంటే అది క్రీస్తుకు గౌరవం. విందు మొత్తం ఏడు రోజులు పూర్తయ్యే వరకు అతని తల్లిదండ్రులు వెళ్ళలేదు. "ఇక్కడ ఉండటం మంచిది" అనే సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తూ పవిత్రమైన శాసనం ముగిసే వరకు ఉండటం అభినందనీయం. క్రీస్తులో తమ ఆధ్యాత్మిక సౌఖ్యాలను కోల్పోయిన వారు మరియు ఆయనతో వారి కనెక్షన్ యొక్క హామీని కోల్పోయిన వారు వాటిని ఎక్కడ, ఎప్పుడు, మరియు ఎలా తప్పుగా ఉంచారో ఆలోచించి, ఆపై వారి దశలను తిరిగి పొందేందుకు సమయాన్ని వెచ్చించాలి. క్రీస్తుతో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పొందాలనుకునే వారు ఆయనను ఆరాధించే ప్రదేశానికి తిరిగి రావాలి, అక్కడ వారు ఆయనను ఎదుర్కోవాలని ఆశిస్తారు.
మేరీ మరియు జోసెఫ్ దేవాలయంలోని ఒక భాగంలో యేసును కనుగొన్నారు, అక్కడ ధర్మశాస్త్ర పండితులు బోధన కోసం సమావేశమయ్యారు. ఆయన అక్కడ కూర్చొని, వారి బోధలను శ్రద్ధగా వింటూ, ప్రశ్నలు వేస్తూ, వివేకంతో సమాధానాలు చెబుతూ, విన్నవారిని ఎంతగానో ఆకట్టుకున్నారు. యౌవనస్థులు దైవిక సత్యం గురించిన జ్ఞానాన్ని చురుగ్గా వెతకాలి, సువార్త పరిచర్యకు హాజరు కావాలి మరియు వారి అవగాహనను పెంపొందించుకోవడానికి వారి పెద్దలు మరియు ఉపాధ్యాయులకు ప్రశ్నలు వేయాలి. కష్టాల సమయంలో క్రీస్తు కోసం వెతుకుతున్న వారు మరింత ఎక్కువ ఆనందంతో ఆయనను కనుగొంటారు.
యేసు యొక్క ప్రతిస్పందన, "నేను నా తండ్రి ఇంటిలో ఉండాలని మీకు తెలియదు; నా తండ్రి పనిలో ఉండాలి; నేను నా తండ్రి పని గురించి ఉండాలి," ఒక ఉదాహరణగా పనిచేస్తుంది. ఇది దేవుని పిల్లలు తమ పరలోకపు తండ్రి పనికి ప్రాధాన్యతనివ్వమని మరియు అన్ని ఇతర ఆందోళనలను దానికి లొంగిపోయేలా అనుమతించమని కోరింది. దేవుని కుమారుడైనప్పటికీ, యేసు తన భూసంబంధమైన తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు, మానవులందరికీ, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవిధేయత చూపే వారికి ఒక ఉదాహరణను అందించాడు. మానవ పదాలను వాటి అస్పష్టత కారణంగా మనం విస్మరించినప్పటికీ, మనం ఎప్పుడూ దేవుని మాటలను తక్కువ అంచనా వేయకూడదు. ప్రారంభంలో చీకటిగా కనిపించేది చివరికి స్పష్టంగా మరియు అర్థమయ్యేలా మారవచ్చు. గొప్ప మరియు తెలివైన వ్యక్తులు, అత్యున్నత స్థాయి ఉన్నవారు కూడా, ఈ అద్భుతమైన మరియు దైవిక శిశువు నుండి నేర్చుకోవచ్చు, ఆత్మ యొక్క నిజమైన గొప్పతనం మన స్థానాన్ని మరియు పాత్రను అర్థం చేసుకోవడం, మన స్టేషన్‌తో సరిపడని వినోదాలు మరియు ఆనందాలను తిరస్కరించడంలో ఉంది. పిలుస్తోంది.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |