Luke - లూకా సువార్త 2 | View All

1. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.

1. ఇది యిలా వుండగా రోమా సామ్రాజ్యమంతటా జనాభా లెక్కలు సేకరించటానికి కైసరు ఔగుస్తు చక్రవర్తి ఒక ప్రకటన జారీ చేశాడు.

2. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.

2. కురేనియ సిరియ దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటి సారిగా ఇలాంటి జనాభా లెక్కలు సేకరింపబడ్డాయి.

3. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి.

3. అందువల్ల ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్ళారు.

4. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు

4. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతడు గలిలయలోని నజరేతు అనే పట్టణం నుండి యూదయ దేశంలోని దావీదు పట్టణానికి వెళ్ళాడు. దీన్ని బేత్లెహేము అని అనే వాళ్ళు.

5. గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.

5. మరియతో ఇతనికి పెళ్ళి నిశ్చయమై ఉంది. మరియ గర్భంతో ఉంది. అతడు ఆమెను తన వెంట తీసుకొని తమ పేర్లు జాబితాలో వ్రాయించుకోటానికి వెళా?్ళడు.

6. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక

6. వాళ్ళక్కడ ఉండగా ఆమెకు ప్రసవవేదన వచ్చింది.

7. తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.

7. ఆమె మగ శిశువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్ళకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది.

8. ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా

8. ఊరు ప్రక్క పొలాల్లో ఉన్న గొఱ్ఱెల కాపరులు రాత్రివేళ తమ గొఱ్ఱెల్ని కాపలాకాస్తూ ఉన్నారు.

9. ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.

9. ఒక దేవదూత వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ చుట్టూ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. వాళ్ళు చాలా భయపడ్డారు.

10. అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;

10. ఆ దేవదూత వాళ్ళతో, “భయపడకండి! మీకే కాక ప్రజలందరికి ఆనందం కలిగించే సువార్త తెచ్చాను.

11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు

11. దావీదు పట్టణంలో ఈ రోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆయనే మన ప్రభువు.

12. దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.

12. మీకొక గుర్తు చెబుతాను. పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు” అని అన్నాడు.

13. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి

13. తక్షణం పరలోకంలోనుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు:

14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.

14. “మహోన్నత లోకంలోవున్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక! భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక!”

15. ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులుజరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితోనొకడు చెప్పుకొని

15. దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళి పొయ్యాక గొఱ్ఱెల కాపరులు, “జరిగిన దాన్ని గురించి ప్రభువు మనకు చెప్పాడు. బేత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం” అని మాట్లాడుకొన్నారు.

16. త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.

16. వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళారు. మరియను, యోసేపును, తొట్టిలో పడుకొనివున్న పసివాణ్ణి, చూసారు.

17. వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.

17. ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు.

18. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

18. వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు.

19. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.

19. కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది.

20. అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.

20. గొఱ్ఱెల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపొయ్యారు.

21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
ఆదికాండము 17:12, లేవీయకాండము 12:3

21. ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు.

22. మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు
లేవీయకాండము 12:6

22. మోషే ధర్మశాస్త్రానుసారం మరియ, యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించటానికి యెరూషలేముకు వెళ్ళారు.

23. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును,
నిర్గమకాండము 13:2, నిర్గమకాండము 13:12, నిర్గమకాండము 13:15

23. ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి అని వ్రాయబడి ఉంది.

24. ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.
లేవీయకాండము 5:11, లేవీయకాండము 12:8

24. అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండుపావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు.

25. యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతి మంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.
యెషయా 40:1, యెషయా 49:13

25. ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు.

26. అతడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయము లోనికి వచ్చెను.

26. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు.

27. అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలి దండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు

27. పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు.

28. అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను

28. సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు:

29. నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;

29. “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు.

30. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
యెషయా 40:5, యెషయా 52:10

30. నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను.

31. నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన
యెషయా 40:5, యెషయా 52:10

31. నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు!

32. నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
యెషయా 25:7, యెషయా 42:6, యెషయా 46:13, యెషయా 49:6

32. యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే. నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!”

33. యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.

33. యేసు తల్లితండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు.

34. సుమెయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;
యెషయా 8:14-15

34. ఆ తర్వాత సుమెయోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరియతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు.

35. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను.

35. తద్వారా మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట పడ్తాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.”

36. మరియఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై,

36. ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది.

37. యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.

37. అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది.

38. ఆమెకూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.
యెషయా 52:9

38. మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది.

39. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయ లోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి.

39. ప్రభువు ధర్మశాస్త్రానుసారం చేయవలసినవన్నీ చేశాక మరియ, యోసేపులు తమ స్వగ్రామమైన గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు.

40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.

40. యేసు పెరిగి పెద్ద వాడయ్యాడు. బలంతోపాటు తెలివి కూడా ఆయనలో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది.

41. పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు.
నిర్గమకాండము 12:24-27, ద్వితీయోపదేశకాండము 16:1-8

41. ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు.

42. ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి.

42. కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు పండ్రెండు సంవత్సరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు.

43. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను.

43. పండుగ తర్వాత ఆయన తల్లి దండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళటానికి ప్రమాణమయ్యారు. కాని యేసు యెరూషలేములోనే ఉండి పొయ్యాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు.

44. ఆయన తలిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి.

44. తమ గుంపులో ఉన్నాడనుకొని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసారు. తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో, బంధువులతో ఉన్నాడనుకొని వాళ్ళలో వెతకసాగారు.

45. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

45. ఆయన కనిపించక పోయే సరికి వాళ్ళు ఆయన్ని వెతకటానికి యెరూషలేము తిరిగి వెళ్ళారు.

46. మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.

46. మూడు రోజులు వెతికాక ఆయన వాళ్ళకు మందిరంలో కూర్చొని వాళ్ళు చెప్పినవి వింటూ, వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కన్పించాడు.

47. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.

47. ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడవున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.

48. ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లికుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా
యెషయా 52:14

48. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ను చూసి చాలా ఆశ్చర్య పోయారు. యేసు తల్లి ఆయనతో, “ఇలా ఎందుకు చేసావు బాబు? నేను, మీ నాన్న దిగులుపడి అన్ని చోట్లా వెతికాము!” అని అన్నది.

49. ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను;

49. యేసు, “నా కోసం ఎందుకు వెతికా రమ్మా! నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా?” అని అన్నాడు.

50. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.

50. వాళ్ళకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు.

51. అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.

51. ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయతలతో నడుచుకునే వాడు. కాని ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది.

52. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.
1 సమూయేలు 2:26, సామెతలు 3:4

52. యేసు జ్ఞానంలో, బలంలో, అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు. కైసరు తిబెరి రాజ్యపాలన చేస్తున్న పదు నైదవ సంవత్సరములో యూదయ దేశాన్ని



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు జననం. (1-7) 
దేవుడు తన కుమారుడిని స్త్రీకి జన్మించి, ధర్మశాస్త్రానికి లోబడి ఈ లోకానికి పంపాలని సంకల్పించినప్పుడు నిర్ణీత సమయం వచ్చింది. అతని పుట్టుక చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా వినయపూర్వకంగా ఉన్నాయి. క్రీస్తు ఒక సత్రంలో జన్మించాడు, భూమిపై అతని తాత్కాలిక బసను సూచిస్తుంది, ఇది ఒక సత్రంలో ప్రయాణికుడు వలె. ఇది మాకు విలువైన పాఠం నేర్పడానికి ఉద్దేశించబడింది. పాపం ద్వారా మనం విడిచిపెట్టబడిన మరియు నిస్సహాయ శిశువుల వలె, క్రీస్తు కూడా వినయ స్థితిలో ఈ లోకంలోకి ప్రవేశించాడు.
సౌఖ్యం మరియు విలాసాలను వెతకడం, మన పిల్లలకు అలంకారం మరియు భోగభాగ్యాలను కోరుకునే మన మానవ ధోరణుల గురించి ఆయనకు బాగా తెలుసు. పేదలు ధనవంతుల పట్ల ఎంత సులభంగా అసూయపడగలరో, ధనవంతులు పేదలను చిన్నచూపు చూస్తారని అతను అర్థం చేసుకున్నాడు. అయితే, విశ్వాసం అనే కటకం ద్వారా దేవుని కుమారుడు మానవుడిగా మారడం మరియు తొట్టిలో పడుకోవడం గురించి మనం ఆలోచించినప్పుడు, అది మన గర్వాన్ని, ఆశయాన్ని మరియు అసూయను తగ్గిస్తుంది. ఆయన సన్నిధిలో, మనకు మరియు మన పిల్లలకు గొప్పతనం కోసం మన కోరికలను విడనాడవలసి వస్తుంది.

ఇది గొర్రెల కాపరులకు తెలియజేయబడింది. (8-20) 
దేవదూతలు కొత్తగా జన్మించిన రక్షకుని దూతలుగా పనిచేశారు, అయినప్పటికీ వారు తమ మందను శ్రద్ధగా చూసుకునే వినయపూర్వకమైన, సద్గుణమైన గొర్రెల కాపరుల సమూహాన్ని సందర్శించమని నిర్దేశించబడ్డారు. దైవ సందర్శనలు అసాధారణమైన పరిస్థితులకు మాత్రమే పరిమితం కావు, కానీ మనం నిజాయితీగల వృత్తిలో నిమగ్నమైనప్పుడు, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు సంభవించవచ్చని ఇది వెల్లడిస్తుంది. "అత్యున్నతమైన దేవునికి మహిమ" అని దేవదూతలు ప్రకటించినట్లుగా, ఈ సంఘటన యొక్క మహిమను దేవునికి ఆపాదిద్దాం. మానవాళి పట్ల దేవుని దయ, మెస్సీయను పంపడం ద్వారా ప్రదర్శించబడింది, ఇది అతని ప్రశంసలకు కారణం. దేవుని పనులన్నీ ఆయనకు ఘనతను తెచ్చిపెడుతున్నప్పటికీ, ప్రపంచ విమోచన ఆయన మహిమకు అత్యున్నత నిదర్శనంగా నిలుస్తుంది. మెస్సీయను పంపడంలో దేవుని సద్భావన ద్వారా, ఈ భూసంబంధమైన రాజ్యంలోకి శాంతి తీసుకురాబడింది, ఇది మన స్వభావాన్ని స్వీకరించడం ద్వారా క్రీస్తు నుండి ఉత్పన్నమయ్యే అనేక రకాల ఆశీర్వాదాలను సూచిస్తుంది.
అనేక మంది దేవదూతలచే ధృవీకరించబడిన ఈ సత్యం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు విశ్వవ్యాప్త ఆమోదానికి అర్హమైనది: మానవాళి పట్ల దేవుని చిత్తశుద్ధి అతని మహిమను అత్యున్నతంగా తెలియజేస్తుంది మరియు ఇది భూమిపై శాంతిని కలిగిస్తుంది. గొర్రెల కాపరులు సమయాన్ని వృథా చేయకుండా నిర్దేశించిన ప్రదేశానికి త్వరత్వరగా వెళ్లారు. వారు చూసిన దానితో సంతృప్తి చెందారు, వారు ఈ వార్తలను చాలా దూరం పంచుకున్నారు, వారు కనుగొన్న బిడ్డ రక్షకుడని, క్రీస్తు ప్రభువు అని సాక్ష్యమిచ్చారు. మేరీ ఈ అద్భుతమైన సంఘటనలన్నింటినీ శ్రద్ధగా గమనించింది మరియు ఆలోచించింది, ఇది ఆమె భక్తి భావాలను ప్రేరేపించడానికి ఉపయోగపడింది. మన హృదయాలలో ఈ విషయాలపై లోతైన ప్రతిబింబం నుండి మనం కూడా ప్రయోజనం పొందుతాము, ఎందుకంటే ఇది మరింత ఖచ్చితమైన అవగాహన మరియు ధర్మబద్ధమైన ప్రవర్తనకు దారి తీస్తుంది.
రక్షకుడైన క్రీస్తు ప్రభువు మన కొరకు జన్మించాడనే ప్రకటన మన చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది మరియు ఈ వార్త అందరికీ ఆనందాన్ని కలిగించాలి.

క్రీస్తు దేవాలయంలో సమర్పించబడ్డాడు. (21-24) 
మన ప్రభువైన యేసు పాపం లేకుండా జన్మించాడు, అందువల్ల, పాడైన స్వభావం యొక్క మరణాన్ని లేదా సున్నతి ద్వారా సూచించబడిన పవిత్రతను పునరుద్ధరించడం అతనికి అవసరం లేదు. బదులుగా, అతని విషయంలో, ఈ ఆచారం, బాధలు మరియు ప్రలోభాలను ఎదుర్కొన్నప్పటికీ, మన రక్షణ కోసం ఆయన చేసిన ఆత్మబలిదానానికి ముగింపు పలికి, చట్టం యొక్క మొత్తానికి అతని భవిష్యత్తు అచంచలమైన విధేయతకు నిదర్శనంగా పనిచేసింది.
నలభై రోజులు గడిచిన తర్వాత, మేరీ తన శుద్ధీకరణ కోసం నిర్దేశించిన బలులు అర్పించడానికి ఆలయానికి ఎక్కింది. జోసెఫ్ కూడా, చట్టం యొక్క నిబంధనల ప్రకారం, మొదటి పుట్టిన కుమారునికి ఆచారం ప్రకారం, పవిత్ర బిడ్డ యేసును సమర్పించాడు. అదేవిధంగా, మన పిల్లలను ప్రభువుకు అంకితం చేయాలి, వారు ఆయన నుండి వచ్చిన బహుమతి అని అంగీకరించాలి మరియు వారిని పాపం మరియు మరణం నుండి విముక్తి చేయమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, వారిని ఆయన పవిత్రతకు అంకితం చేయాలి.

సిమియోను యేసు గురించి ప్రవచించాడు. (25-35) 
సిమియోను ఆశను పెంచిన అదే దైవిక ఆత్మ అతని ఆనందాన్ని కూడా పెంచింది. క్రీస్తును ఎదుర్కోవాలని కోరుకునే వారు ఆయన దేవాలయంలో ఆయనను వెతకాలి. సిమియోన్ యొక్క విశ్వాసం యొక్క ఒప్పుకోలు అతను ఊయలలో ఉంచిన బిడ్డ రక్షకుడని, దేవునిచే నియమించబడిన మోక్షానికి స్వరూపిణి అని నమ్మకం. క్రీస్తును తమ చేతులలో పట్టుకొని మోక్షానికి సంబంధించిన వాగ్దానాన్ని చూసినప్పుడు దాని ప్రాముఖ్యతను గుర్తించి, అతను భూలోకానికి వీడ్కోలు పలికాడు. నీతిమంతుని మరణం దేవునితో శాంతి, మనస్సాక్షి యొక్క ప్రశాంతత మరియు మరణాన్ని ఎదుర్కొనే ప్రశాంతతతో గుర్తించబడిన ప్రగాఢమైన ఓదార్పు. క్రీస్తును అంగీకరించిన వారు మరణాన్ని కూడా సమదృష్టితో స్వీకరించగలరు.
ఈ పిల్లవాడి గురించి మాట్లాడిన మాటలకు జోసెఫ్ మరియు మేరీ ఆశ్చర్యపోయారు. సిమియోన్ వారి ఆనందానికి గల కారణాలను కూడా భయాందోళనలతో వారికి వెల్లడించాడు. యేసు, ఆయన బోధలు మరియు ఆయన అనుచరులు ఇప్పటికీ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు; అతని సత్యం మరియు పవిత్రత సవాలు చేయబడ్డాయి మరియు దూషించబడ్డాయి మరియు అతని బోధించిన పదం ప్రజల స్వభావాన్ని అంచనా వేయడానికి ప్రమాణంగా కొనసాగుతుంది. కొందరి హృదయాలలో దాగి ఉన్న నీతి సంబంధమైన ప్రేమలు క్రీస్తును అంగీకరించడం ద్వారా బహిర్గతం అవుతాయి, మరికొందరిలో దాగివున్న అవినీతి ఆయన పట్ల వారికున్న శత్రుత్వం ద్వారా బహిర్గతమవుతుంది. చివరికి, ప్రజలు క్రీస్తు గురించి వారి ఆలోచనలు మరియు భావాలను బట్టి తీర్పు తీర్చబడతారు. అతను బాధాకరమైన యేసుగా మిగిలిపోతాడు మరియు అతని తల్లి వారి బంధం యొక్క సన్నిహిత బంధం మరియు అతని పట్ల ఆమెకున్న గాఢమైన ఆప్యాయత కారణంగా అతని బాధలో పాలుపంచుకుంటుంది.

అన్నా అతని గురించి ప్రవచించాడు. (36-40) 
చర్చి చాలా తప్పుల వల్ల చెడిపోయిన సమయంలో, దేవుడు తన ఉనికిని తెలియజేసాడు. అన్నా స్థిరంగా ఆలయంలో లేదా కనీసం తరచుగా నివసించేవారు. ఆమె ప్రార్థన స్ఫూర్తిని కొనసాగించింది, ప్రార్థనకు తనను తాను అంకితం చేసుకుంది మరియు తన ప్రయత్నాలన్నింటిలో భక్తితో దేవునికి సేవ చేసింది. క్రీస్తును ఎదుర్కొనే ఆధిక్యత కలిగిన వారికి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తగినంత కారణం ఉంది. అన్నా కూడా అతని గురించి తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంది. గౌరవనీయులైన సెయింట్స్, సిమియోన్ మరియు అన్నా యొక్క ఆదర్శప్రాయమైన జీవితాలు, వెండి జుట్టుతో ఉన్నవారిని ధైర్యపరచాలి, వారి వృద్ధాప్య తలలు, వారి మాదిరిగానే, కీర్తి కిరీటాన్ని సూచిస్తాయి, ధర్మ మార్గంలో నడవడం ద్వారా పొందబడ్డాయి. సమాధిలో నిశ్శబ్దం కోసం ఉద్దేశించిన వారి పెదవులు విమోచకుని ప్రశంసలను నిరంతరం కీర్తిస్తూ ఉండాలి.
ప్రతి అంశంలోనూ, క్రీస్తు తన సహోదరులవలె తయారుచేయబడుట యుక్తమైనది; అందువలన, అతను ఇతర పిల్లల వలె బాల్యం మరియు బాల్యం అనుభవించాడు, అయినప్పటికీ పాపం లేకుండా ఉన్నాడు, అతని దైవిక స్వభావం యొక్క స్పష్టమైన సంకేతాలను ప్రదర్శిస్తాడు. దేవుని స్పిరిట్ ద్వారా, అతని సామర్థ్యాలన్నీ మరెవరికీ లేని విధంగా పనిచేశాయి. ఇతర పిల్లలు తరచుగా వారి మాటలు మరియు చర్యలలో మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తుండగా, అతను పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా జ్ఞానంతో నిండి ఉన్నాడు. అతను చెప్పిన మరియు చేసిన ప్రతిదీ అతని సంవత్సరాలకు మించిన జ్ఞానంతో గుర్తించబడింది. ఇతర పిల్లలు వారి మానవ స్వభావం యొక్క లోపాలను వ్యక్తపరుస్తుండగా, అతని జీవితం దేవుని యొక్క స్పష్టమైన దయను కలిగి ఉంది.

దేవాలయంలో పండితులతో క్రీస్తు. (41-52)
పిల్లలు బహిరంగ ఆరాధనలో పాల్గొంటే అది క్రీస్తుకు గౌరవం. విందు మొత్తం ఏడు రోజులు పూర్తయ్యే వరకు అతని తల్లిదండ్రులు వెళ్ళలేదు. "ఇక్కడ ఉండటం మంచిది" అనే సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తూ పవిత్రమైన శాసనం ముగిసే వరకు ఉండటం అభినందనీయం. క్రీస్తులో తమ ఆధ్యాత్మిక సౌఖ్యాలను కోల్పోయిన వారు మరియు ఆయనతో వారి కనెక్షన్ యొక్క హామీని కోల్పోయిన వారు వాటిని ఎక్కడ, ఎప్పుడు, మరియు ఎలా తప్పుగా ఉంచారో ఆలోచించి, ఆపై వారి దశలను తిరిగి పొందేందుకు సమయాన్ని వెచ్చించాలి. క్రీస్తుతో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పొందాలనుకునే వారు ఆయనను ఆరాధించే ప్రదేశానికి తిరిగి రావాలి, అక్కడ వారు ఆయనను ఎదుర్కోవాలని ఆశిస్తారు.
మేరీ మరియు జోసెఫ్ దేవాలయంలోని ఒక భాగంలో యేసును కనుగొన్నారు, అక్కడ ధర్మశాస్త్ర పండితులు బోధన కోసం సమావేశమయ్యారు. ఆయన అక్కడ కూర్చొని, వారి బోధలను శ్రద్ధగా వింటూ, ప్రశ్నలు వేస్తూ, వివేకంతో సమాధానాలు చెబుతూ, విన్నవారిని ఎంతగానో ఆకట్టుకున్నారు. యౌవనస్థులు దైవిక సత్యం గురించిన జ్ఞానాన్ని చురుగ్గా వెతకాలి, సువార్త పరిచర్యకు హాజరు కావాలి మరియు వారి అవగాహనను పెంపొందించుకోవడానికి వారి పెద్దలు మరియు ఉపాధ్యాయులకు ప్రశ్నలు వేయాలి. కష్టాల సమయంలో క్రీస్తు కోసం వెతుకుతున్న వారు మరింత ఎక్కువ ఆనందంతో ఆయనను కనుగొంటారు.
యేసు యొక్క ప్రతిస్పందన, "నేను నా తండ్రి ఇంటిలో ఉండాలని మీకు తెలియదు; నా తండ్రి పనిలో ఉండాలి; నేను నా తండ్రి పని గురించి ఉండాలి," ఒక ఉదాహరణగా పనిచేస్తుంది. ఇది దేవుని పిల్లలు తమ పరలోకపు తండ్రి పనికి ప్రాధాన్యతనివ్వమని మరియు అన్ని ఇతర ఆందోళనలను దానికి లొంగిపోయేలా అనుమతించమని కోరింది. దేవుని కుమారుడైనప్పటికీ, యేసు తన భూసంబంధమైన తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు, మానవులందరికీ, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవిధేయత చూపే వారికి ఒక ఉదాహరణను అందించాడు. మానవ పదాలను వాటి అస్పష్టత కారణంగా మనం విస్మరించినప్పటికీ, మనం ఎప్పుడూ దేవుని మాటలను తక్కువ అంచనా వేయకూడదు. ప్రారంభంలో చీకటిగా కనిపించేది చివరికి స్పష్టంగా మరియు అర్థమయ్యేలా మారవచ్చు. గొప్ప మరియు తెలివైన వ్యక్తులు, అత్యున్నత స్థాయి ఉన్నవారు కూడా, ఈ అద్భుతమైన మరియు దైవిక శిశువు నుండి నేర్చుకోవచ్చు, ఆత్మ యొక్క నిజమైన గొప్పతనం మన స్థానాన్ని మరియు పాత్రను అర్థం చేసుకోవడం, మన స్టేషన్‌తో సరిపడని వినోదాలు మరియు ఆనందాలను తిరస్కరించడంలో ఉంది. పిలుస్తోంది.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |