John - యోహాను సువార్త 11 | View All

1. మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.

1. బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియు, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు.

2. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.

2. ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు.

3. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.

3. ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.

4. యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.

4. యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కులుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు.

5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.

5. యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది.

6. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.

6. లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి,

7. అటుపిమ్మట ఆయనమనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా

7. ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.

8. ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.

8. వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.

9. అందుకు యేసు పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.

9. యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు.

10. అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.

10. రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.

11. ఆయన యీ మాటలు చెప్పిన తరువాతమన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా

11. ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”

12. శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.

12. ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు.

13. యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.

13. యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.

14. కావున యేసు లాజరు చనిపోయెను,

14. అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.

15. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.

15. నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.

16. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.

16. దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో,”యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.

17. యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.

17. యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది.

18. బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము

18. బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది.

19. గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.

19. చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.

20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.

20. యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.

21. మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.

21. మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు.

22. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.

22. కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అంది.

23. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా

23. యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.

24. మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.
దానియేలు 12:2

24. మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.

25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;

25. యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు.

26. బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

26. జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.

27. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.

27. ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.

28. ఆమె ఈ మాట చెప్పి వెళ్లిబోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్య ముగా పిలిచెను.

28. ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళ్ళి తన సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, “బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” అని అంది.

29. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.

29. మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది.

30. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను

30. యేసు గ్రామంలోకి రాలేదు. ఆయనింకా మార్త కులుసుకొన్న చోటే ఉన్నాడు.

31. గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.

31. మరియ యింట్లో ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె హడావుడిగా లేచి బయటకు వెళ్ళటం చూసారు. ఆమె దుఃఖించటానికి సమాధి దగ్గరకు వెళ్తోందిని ఆమె వెంట వెళ్ళారు.

32. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.

32. మరియ యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన్ని చూసి, కాళ్ళ ముందుపడి, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు!” అని అన్నది.

33. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా,

33. ఆమె, ఆమెతో వచ్చిన యూదులు దుఃఖించటం చూసి యేసు తన ఆత్మలో కలవర పడ్డాడు. ఆయన హృదయం కరిగి పోయింది.

34. వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.

34. “అతన్నెక్కడ సమాధిచేసారు?” అని యేసు అడిగాడు. “వచ్చి చూడండి ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

35. యేసు కన్నీళ్లు విడిచెను.

35. యేసు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

36. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.

36. అప్పుడు యూదులు, “యేసు అతన్నెంతగా ప్రేమించాడో చూడండి!” అని అన్నారు.

37. వారిలో కొందరుఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.

37. కాని కొందరు, “గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించిన యితడు, చనిపోకుండా చెయ్యలేక పోయాడా?” అని అన్నారు.

38. యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.

38. యేసు హృదయం మళ్ళీ కదిలింది. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధి ఒక గుహలా ఉంది. ఒక రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది.

39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.

39. “ఆ రాయి తీసి వెయ్యండి!” అని అన్నాడు. చనిపోయిన వాని సోదరి మార్త, “కాని, ప్రభూ! అతని దేహం నాలుగు రోజులనుండి అక్కడవుంది. యిప్పటికది కంపు కొడ్తూ ఉంటుంది” అని అంది.

40. అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;

40. అప్పుడు యేసు, “నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా?” అని అన్నాడు.

41. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

41. వాళ్ళు ఆ రాయి తీసి వేసారు. యేసు పైకి చూసి, “తండ్రి నీవు నా మాటలు విన్నందుకు కృతజ్ఞుణ్ణి.

42. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.

42. నా మాటలు అన్ని వేళలా వింటావని నాకు తెలుసు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, వీళ్ళకు అర్థం కావాలాని అక్కడ నిలుచున్న వాళ్ళ మంచి కోసం యిలా అంటున్నాను” అని అన్నాడు.

43. ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా

43. ఈ విధంగా అన్నాక యేసు పెద్ద స్వరంతో, “లాజరూ! వెలుపలికి రా!” అని పిలిచాడు.

44. చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.

44. చినిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. అతని కాళ్ళు చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నయి. అతని ముఖం మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది. యేసు వాళ్ళతో, “సమాధి దుస్తుల్ని తీసి వేయండి, అతణ్ణి వెళ్ళనివ్వండి!” అని అన్నాడు.

45. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని

45. మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు.

46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.

46. కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి యేసు చేసింది చెప్పారు.

47. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.

47. అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు.

48. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.

48. అతణ్ణి ఈ విధంగా వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు.

49. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు.

49. వాళ్ళలో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్స రానికి ప్రధాన యాజకుడు.

50. మన జనమంతయు నశింప కుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.

50. అతడు యింకా, “దేశమంతా నాశనం కావటానికన్నా ప్రజల కోసం ఒక మనిషి చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదా?” అని అన్నాడు.

51. తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక

51.

52. యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.
ఆదికాండము 49:10

52.

53. కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.

53. ప్రధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం మొదలు పెట్టారు.

54. కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగ ముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను.

54. అందువల్ల యేసు యూదుల మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామానికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కొంత కాలం గడిపాడు.

55. మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లె టూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.
2 దినవృత్తాంతములు 30:17

55. యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేంకు వెళ్ళారు.

56. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

56. అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా?రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.

57. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.

57. ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

లాజరస్ యొక్క అనారోగ్యం. (1-6) 
క్రీస్తు ప్రేమను ఇష్టపడే వారు అనారోగ్యం అనుభవించడం ఒక కొత్త సంఘటన కాదు; శారీరక రుగ్మతలు అవినీతిని సరిదిద్దడానికి మరియు దేవుని ప్రజల కృపలను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. క్రీస్తు తన అనుచరులను అటువంటి బాధల నుండి రక్షించడానికి రాలేదు కానీ వారి పాపాల నుండి మరియు రాబోయే కోపం నుండి వారిని రక్షించడానికి వచ్చాడు. ఏది ఏమైనప్పటికీ, మన జబ్బుపడిన మరియు బాధిత స్నేహితులు మరియు బంధువుల తరపున ఆయనను వెతకవలసిన బాధ్యత మనపై ఉంది. ప్రొవిడెన్స్ యొక్క అత్యంత అస్పష్టమైన మలుపులు కూడా దేవుని మహిమ కోసం నిర్వహించబడుతున్నాయని అర్థం చేసుకోవడంలో మనం ఓదార్పుని పొందుతాము-అది అనారోగ్యం, నష్టం లేదా నిరాశ ద్వారా కావచ్చు. దేవుడు మహిమపరచబడితే, మన తృప్తి అనుసరించాలి.
మార్త, ఆమె సహోదరి, లాజరులపట్ల యేసుకు ఉన్న వాత్సల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ మరియు శాంతి వర్ధిల్లినప్పుడు కుటుంబాలు అదృష్టవంతులు అయితే, నిజమైన సంతోషం యేసు ప్రేమను పొందడం మరియు ఆ ప్రేమను తిరిగి పొందడంలోనే ఉంటుంది. దురదృష్టవశాత్తు, చిన్న కుటుంబాలలో కూడా యేసుతో అలాంటి సామరస్యపూర్వక సంబంధం చాలా అరుదు. దేవుని జాప్యాలు ప్రయోజనం లేకుండా లేవని గుర్తించడం చాలా ముఖ్యం; వాటి వెనుక దయగల ఉద్దేశాలు ఉన్నాయి. తాత్కాలిక లేదా ఆధ్యాత్మిక విమోచన సందర్భంలో, అది బహిరంగమైనా లేదా వ్యక్తిగతమైనా, ఆలస్యం కేవలం అనుకూలమైన క్షణం కోసం వేచి ఉంది.

క్రీస్తు యూదయకు తిరిగి వస్తాడు. (7-10) 
ఆపద సమయాల్లో క్రీస్తు ఎల్లప్పుడూ తన ప్రజలకు తోడుగా ఉంటాడు; అతను వారి పక్కన లేకుండా వారిని ఎప్పుడూ ఆపదలోకి తీసుకెళ్లడు. మన స్వంత సంపద, కీర్తి, సౌలభ్యం మరియు భద్రత కోసం ఉత్సాహంతో ప్రభువు పట్ల ఉత్సాహాన్ని తప్పుగా భావించడం సులభం. కాబట్టి, మన సూత్రాలను పరిశీలించడం చాలా ముఖ్యం. మా పని పూర్తయ్యే వరకు మరియు మా సాక్ష్యం నెరవేరే వరకు మా రోజులు పొడిగించబడతాయి. ఒక వ్యక్తి కర్తవ్య మార్గంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా వివరించబడినట్లుగా మరియు అతని ప్రొవిడెన్స్ ద్వారా నిర్దేశించబడినప్పుడు, ఓదార్పు మరియు సంతృప్తి ఉంటుంది. క్రీస్తు, తన భూలోక ప్రయాణంలో, పగటిపూట నడిచాడు, అలాగే మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటే మనం కూడా నడుస్తాము. అయినప్పటికీ, ఎవరైనా తమ హృదయపు కోరికలను అనుసరించి, ప్రపంచ మార్గాలకు అనుగుణంగా ఉంటే, దేవుని చిత్తం మరియు మహిమపై కంటే వారి స్వంత ప్రాపంచిక తర్కంపై ఎక్కువగా ఆధారపడినట్లయితే, వారు ప్రలోభాలు మరియు ఉచ్చులలో పడే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి పొరపాట్లు చేస్తాడు, ఎందుకంటే వారికి మార్గనిర్దేశం చేసే అంతర్గత కాంతి లేదు; మన సహజ చర్యలకు మన చుట్టూ ఉన్న కాంతి ఎంత అవసరమో, మనలోని కాంతి మన నైతిక చర్యలకు కీలకం.

లాజరస్ మరణం. (11-16) 
చివరికి మళ్లీ పైకి లేస్తామన్న హామీని బట్టి, నిత్యజీవానికి ఆ పునరుత్థానంపై ఆశాజనకమైన విశ్వాసం మన శరీరాలను వదులుకోవడం మరియు మరణాన్ని ఎదుర్కోవడం మన బట్టలు విప్పి నిద్రపోవడం వంటి అప్రయత్నంగా ఎందుకు చేయకూడదు? నిజమైన క్రైస్తవుడు మరణించినప్పుడు, అది ప్రశాంతమైన నిద్రతో సమానం-ముందు రోజు శ్రమల నుండి విశ్రాంతి. నిజానికి, మరణం అనేది నిద్రను అధిగమిస్తుంది, అంటే నిద్ర అనేది క్లుప్తమైన విశ్రాంతి అయితే, మరణం అనేది భూసంబంధమైన శ్రమలు మరియు శ్రమల ముగింపును సూచిస్తుంది.
లాజరస్ పట్ల శిష్యులు మొదట విముఖత చూపినట్లే, బహిర్గతం మరియు ప్రమాదం గురించి భయపడి, సవాలు చేసే పరిస్థితులలో క్రీస్తు మనలను నడిపించడం అనవసరమని మనం భావించే సమయాలు ఉన్నాయి. తరచుగా, ఎవరైనా అవసరమైన మంచి పనిని చేపడతారని మేము ఆశిస్తున్నాము, ప్రత్యేకించి ప్రమాదం ఉన్నట్లయితే. అయినప్పటికీ, క్రీస్తు లాజరును మృతులలోనుండి లేపినప్పుడు ప్రదర్శించబడినట్లుగా, అలాంటి చర్యలు అనేకులు ఆయనను విశ్వసించేలా చేయగలవు, విశ్వాసం బలపడటానికి గణనీయంగా తోడ్పడతాయి.
సవాళ్లను ఎదుర్కోవడంలో, కష్ట సమయాల్లో థామస్ చేసినట్లుగా క్రైస్తవులు ఒకరికొకరు మద్దతునివ్వాలి. ప్రభువైన యేసు మరణము దేవుడు కోరినప్పుడల్లా మన స్వంత మరణాన్ని స్వీకరించే సంసిద్ధతను మనలో కలిగించాలి. మరణము మనలను క్రీస్తు ప్రేమ నుండి విడదీయదు, లేదా ఆయన దైవిక పిలుపుకు మించిన మనలను ఉంచదు.

క్రీస్తు బేతనియకు వస్తాడు. (17-32) 
దేవుని భయము, మరియు అతని ఆశీర్వాదం ఉన్న ఈ నివాసంలో, శోక వాతావరణం ఉంది. దయ హృదయాన్ని దుఃఖం నుండి రక్షించగలదు, కానీ అది ఇంటిని దాని నుండి మినహాయించదు. దేవుడు తన కృప మరియు ప్రొవిడెన్స్ ద్వారా దయ మరియు ఓదార్పుతో మనలను సమీపించినప్పుడు, మార్తాలాగే మనం కూడా ఆయనను కలవడానికి విశ్వాసం, ఆశ మరియు ప్రార్థనతో ఉత్సాహంగా ముందుకు సాగాలి.
మార్త యేసును ఎదుర్కోవడానికి బయలుదేరినప్పుడు, మరియ ఇంట్లోనే కూర్చుని ఉంది. ఈ ప్రవృత్తి ఒకప్పుడు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, అతని బోధనలను గ్రహించడానికి ఆమెను క్రీస్తు పాదాల వద్ద ఉంచడం, కష్ట సమయాల్లో, అది ఆమెను విచారం వైపు మొగ్గు చూపింది. ప్రలోభాలకు వ్యతిరేకంగా మనం అప్రమత్తంగా ఉండటం మరియు మన సహజ స్వభావాల ప్రయోజనాలను ఉపయోగించుకోవడం తెలివైన పని. ప్రత్యేకంగా ఏమి అడగాలి లేదా ఆశించాలి అనే దాని గురించి అనిశ్చితంగా ఉన్నప్పుడు, మనల్ని మనం దేవునికి అప్పగించడం వివేకం, అతను ఉత్తమంగా భావించేదాన్ని చేయడానికి అనుమతించడం.
మార్తా యొక్క అంచనాలను పెంచడానికి, మన ప్రభువు తనను తాను పునరుత్థానం మరియు జీవితంగా ప్రకటించుకున్నాడు. ప్రతి కోణంలో, ఆయన పునరుత్థానం-దాని మూలం, పదార్ధం, మొదటి ఫలాలు మరియు కారణం. విమోచించబడిన ఆత్మ మరణం తర్వాత శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది మరియు పునరుత్థానం తరువాత, శరీరం మరియు ఆత్మ రెండూ అన్ని చెడుల నుండి శాశ్వతంగా భద్రపరచబడతాయి.
మరణానంతర జీవితంలోని లోతైన అంశాల గురించి క్రీస్తు మాటలు చదివిన తర్వాత లేదా విన్న తర్వాత, మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఈ సత్యాన్ని మనం నిజంగా నమ్ముతున్నామా? నిత్యత్వపు సత్యాలను మనం వాటికి అర్హమైన విషయంలో కలిగి ఉంటే ప్రస్తుత ఆనందాలు మరియు సవాళ్లు మనపై తక్కువ లోతైన ప్రభావాన్ని చూపుతాయి. మన గురువు క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన మనలను పిలుస్తాడు. అతను తన మాటలు మరియు శాసనాల ద్వారా వస్తాడు, మనలను వారి వద్దకు పిలుస్తాడు, వారి ద్వారా మనల్ని పిలుస్తాడు మరియు చివరికి మనల్ని తన వైపుకు ఆహ్వానిస్తాడు. శాంతి సమయాల్లో, క్రీస్తు నుండి నేర్చుకునేందుకు అతని పాదాల వద్ద తమను తాము నిలబెట్టుకునే వారు, ఆపద సమయంలో, ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు నిశ్చయతతో ఆయన పాదాల వద్ద తమను తాము వేసుకోవచ్చు.

అతను లాజరును లేపుతాడు. (33-46) 
ఈ దుఃఖిస్తున్న స్నేహితుల పట్ల క్రీస్తు ప్రగాఢమైన కనికరం అతని ఆత్మ యొక్క గందరగోళం ద్వారా స్పష్టంగా కనిపించింది. విశ్వాసులు ఎదుర్కొనే ప్రతి పరీక్షలో, ఆయన వారి బాధలలో పాలుపంచుకుంటాడు. అతని నిష్క్రమించిన స్నేహితుడి అవశేషాల గురించి అతని శ్రద్ధగల విచారణలో వారి పట్ల అతని శ్రద్ధ వ్యక్తమైంది. మనిషి రూపాన్ని ధరించి, మనుష్యుల తీరులో తనను తాను నడిపించాడు. అతని సానుభూతి కన్నీళ్ల ద్వారా మరింత ప్రదర్శించబడింది, అతను దుఃఖంతో పరిచయం ఉన్న వ్యక్తిగా, కరుణతో కన్నీళ్లు కార్చాడు-క్రీస్తును ప్రతిబింబించే సెంటిమెంట్. అయితే, క్రీస్తు కల్పిత బాధల కథల కోసం కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు చాలా మంది గొప్పగా చెప్పుకునే భావోద్వేగ సున్నితత్వాన్ని ఆమోదించలేదు, కానీ నిజమైన బాధల పట్ల ఉదాసీనంగా ఉంటారు. పనికిమాలిన ఉల్లాస దృశ్యాల నుండి వైదొలగడానికి, బాధలో ఉన్నవారిని ఓదార్చడానికి మన దృష్టిని మళ్లించడానికి అతను మనకు ఒక ఉదాహరణగా నిలిచాడు. మన బలహీనతలపై సానుభూతి చూపగల ప్రధాన పూజారి ఉండటం మన అదృష్టం.
రాయి తీసివేయబడినప్పుడు, పక్షపాతాలను పక్కన పెట్టినప్పుడు మరియు వాక్యం హృదయంలోకి చొచ్చుకుపోయే మార్గం తెరవబడినప్పుడు ఆధ్యాత్మిక పునరుజ్జీవనం వైపు పురోగతి ఏర్పడుతుంది. క్రీస్తు వాక్యం, శక్తి మరియు విశ్వసనీయతపై విశ్వాసం ఉంచడం వల్ల మనం దేవుని మహిమను సాక్ష్యమివ్వడానికి మరియు ఆ దృష్టిలో ఆనందాన్ని పొందగలుగుతాము. మన ప్రభువైన యేసు, తన స్వంత ఉదాహరణ ద్వారా, ప్రార్థనలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించమని బోధించాడు, వినయపూర్వకమైన భక్తితో మరియు పవిత్ర ధైర్యంతో ఆయనను చేరుకుంటాడు. దేవునితో అతని బహిరంగ సంభాషణ, ఎత్తైన కళ్ళు మరియు పెద్ద స్వరంతో గుర్తించబడింది, తండ్రి తనను తన ప్రియమైన కుమారుడిగా ప్రపంచంలోకి పంపాడని నమ్మదగిన ప్రకటనగా పనిచేసింది.
క్రీస్తు తన శక్తి మరియు సంకల్పం యొక్క నిశ్శబ్ద శ్రమ ద్వారా లాజరస్‌ను పునరుత్థానం చేయగలిగినప్పటికీ, అతను బిగ్గరగా పిలుపునిచ్చాడు. ఈ చర్య సువార్త పిలుపును సూచిస్తుంది, ఆత్మీయంగా చనిపోయిన ఆత్మలను పాప సమాధి నుండి బయటకు తీసుకువస్తుంది మరియు చివరి రోజున ప్రధాన దేవదూత ట్రంపెట్ ధ్వనిని సూచిస్తుంది, గొప్ప న్యాయస్థానం ముందు దుమ్ములో నిద్రిస్తున్న వారందరినీ పిలుస్తుంది. క్రీస్తు పునరుజ్జీవింపబడిన వారికి పాప సమాధిలో మరియు ఈ లోకంలో స్థానం లేదు; అవి తప్పక ఉద్భవించాయి. లాజరు తిరిగి బ్రతికించడమే కాకుండా పూర్తిగా తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. అదేవిధంగా, ఒక పాపి తన స్వంత ఆత్మను పునరుద్ధరించుకోలేడు, వారు దయ యొక్క మార్గాలను ఉపయోగించాలి. అలాగే, ఒక విశ్వాసి తమను తాము పవిత్రం చేసుకోలేరు, కానీ వారు ప్రతి అవరోధాన్ని విస్మరించాలి. మనం మన బంధువులు మరియు స్నేహితులను మార్చలేనప్పటికీ, మనం వారికి సూచనలను అందించాలి, హెచ్చరికలు అందించాలి మరియు ఆహ్వానాలను అందజేయాలి.

యేసుకు వ్యతిరేకంగా పరిసయ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. (47-53) 
ఇక్కడ అందించబడిన రికార్డు మానవ హృదయంలో వేళ్లూనుకున్న మూర్ఖత్వానికి మరియు దేవునిపట్ల దాని తీరని శత్రుత్వాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తుంది. ప్రవచనాత్మక పదాలను ఉచ్చరించడం హృదయంలోని దయగల సూత్రానికి స్పష్టమైన రుజువుగా ఉపయోగపడదు. హాస్యాస్పదంగా, పాపం ద్వారా మనం తప్పించుకోవాలనుకునే విపత్తు తరచుగా మనపై మనం తెచ్చుకునే పర్యవసానంగా మారుతుంది. ఇది క్రీస్తు రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ, తమ స్వంత ప్రాపంచిక ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్తున్నామని నమ్మే వారికి సమానంగా ఉంటుంది. అయితే, చెడ్డవారు భయపడతారేమోననే భయం చివరికి వారిని అధిగమిస్తుంది.
ఆత్మలను మార్చడం అనేది క్రీస్తును వారి సార్వభౌమాధికారం మరియు పవిత్ర స్థలంగా ఆకర్షిస్తుంది, దీని కోసం అతను తనను తాను త్యాగం చేశాడు. అతని మరణం ద్వారా, అతను వాటిని తన కోసం సంపాదించుకున్నాడు మరియు వారి కోసం పరిశుద్ధాత్మ బహుమతిని పొందాడు. విశ్వాసుల పట్ల ఆయన మరణంలో ప్రదర్శించబడిన ప్రేమ వారి మధ్య బలమైన బంధాన్ని పెంపొందించాలి.

యూదులు అతని కోసం వెతుకుతున్నారు. (54-57)
మన సువార్త పాస్ ఓవర్కు ముందు, మన పశ్చాత్తాపాన్ని రిఫ్రెష్ చేసుకోవడం అత్యవసరం. చాలా మంది వ్యక్తులు, వారి చుట్టూ ఉన్నవారి కంటే ఎక్కువ భక్తితో, జెరూసలేంలో పాస్ ఓవర్‌కు దారితీసే రోజులలో స్వచ్ఛంద శుద్దీకరణ మరియు మతపరమైన వ్యాయామాలలో పాల్గొంటారు. దేవునితో ఒక ఎన్‌కౌంటర్ కోసం ఎదురుచూడేటప్పుడు, గంభీరమైన తయారీ అవసరం. మానవ నిర్మిత పథకాలు దేవుని ఉద్దేశాలను మార్చలేవు, మరియు కపటవాదులు ఆచారాలు మరియు వాదోపవాదాలలో పాల్గొంటున్నప్పుడు మరియు ప్రాపంచిక వ్యక్తులు వారి స్వంత అజెండాలను అనుసరిస్తున్నప్పుడు, యేసు తన మహిమ మరియు తన ప్రజల మోక్షం కోసం అన్ని విషయాలను ఆర్కెస్ట్రేట్ చేస్తూనే ఉన్నాడు.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |