John - యోహాను సువార్త 12 | View All

1. కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.

1. పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు.

2. మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.

2. అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు.

3. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను

3. మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.

4. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా

4.

5. యీ అత్తరెందుకు మూడు వందల దేనార ములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.

5.

6. వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.

6. యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.

7. కాబట్టి యేసునన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;

7. యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది.

8. బీదలు ఎల్లప్పు డును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 15:11

8. మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.

9. కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి.

9. ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు.

10. అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాస ముంచిరి గనుక

10.

11. ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.

11.

12. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూ హము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని

12. మరుసటి రోజు పండుగ కోసం వచ్చిన గుంపు ఒకటి యేసు యెరూషలేంలోకి వస్తున్నాడని విన్నది.

13. ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.
కీర్తనల గ్రంథము 118:25-26

13. వాళ్ళు ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని, “హోసన్నా! ప్రభూవు పేరిట వచ్చిన ఇశ్రాయేలు రాజు ధన్యుడు!” కీర్తన 118:25-26 అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు.

14. సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు

14. యేసు ఒక గాడిదపిల్లను కనుగొని దానిపై కూర్చున్నాడు. ఈ సందర్భాన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

15. అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.
యెషయా 40:9, జెకర్యా 9:9

15. “సీయోను కుమారీ, భయపడకు! గాడిద పిల్లపై కూర్చొని నీ రాజు వస్తున్నాడు చూడు!” జెకర్యా 9:9

16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చు కొనిరి.

16. ఇవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థంకాలేదు. కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు ఆయన్ను గురించి వ్రాశారని గుర్తించారు. అంతేగాక తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకొన్నారు.

17. ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతు లలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి.

17. యేసు లాజరును సమాధినుండి లేచి రమ్మని పిలవటము, అతణ్ణి బ్రతికించటము చూసిన ప్రజలు ఆవార్త ప్రచారం చేసారు.

18. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి.

18. చాలా మంది ఆయన ఈ అద్భుతాన్ని చేసాడని విన్నందువలన ఆయన్ని కలుసు కోవటానికి వెళ్ళారు.

19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.

19. అందువలన పరి సయ్యులు పరస్పరం, “చూడండి! మనం గెలవటం లేదు. ప్రపంచమంతా అతని వెంట ఎట్లా వెళ్తున్నారో చూడండి!” అని మాట్లాడుకున్నారు.

20. ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి.

20. పండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు.

21. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా

21. వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు, గలిలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందిన వాడు.

22. ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.

22. ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్ళియేసుతో చెప్పారు.

23. అందుకు యేసు వారితో ఇట్లనెను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి యున్నది.

23. యేసు ఇలా అన్నాడు: “మనుష్యుకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది.

24. గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.

24. ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది.

25. తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

25. తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు.

26. ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

26. నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు.

27. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నే నేమందును?తండ్రీ, యీ గడియ తటస్థింపకుండనన్ను తప్పించుము; అయి నను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;
కీర్తనల గ్రంథము 6:3, కీర్తనల గ్రంథము 42:5, కీర్తనల గ్రంథము 42:11

27. “ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా!

28. తండ్రీ, నీ నామము మహిమపరచు మని చెప్పెను. అంతటనేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.

28. తండ్రీ నీ పేరుకు మహిమ కలిగించుకో.” అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది.

29. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.

29. అక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు. మరి కొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు.

30. అందుకు యేసు ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను.

30. యేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా కోసం కాదు.

31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;

31. ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది.

32. నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.

32. కాని దేవుడు నన్ను ఈ భూమ్మీదినుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించుకుంటాను” అని అన్నాడు.

33. తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.

33. ఇది చెప్పి తాను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు.

34. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
కీర్తనల గ్రంథము 89:4, కీర్తనల గ్రంథము 89:36, కీర్తనల గ్రంథము 110:4, యెషయా 9:7, దానియేలు 7:14

34. ప్రజలు, “మేము ధర్మశాస్త్రం ద్వారా ‘క్రీస్తు’చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనుష్యకుమారుణ్ణి దేవుడుపై కెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనుష్యకుమారుడెవరు?” అని అన్నారు.

35. అందుకు యేసుఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు.

35. అప్పుడు యేసు వాళ్ళతో, “వెలుగు మీ కోసం యింకా కొంత కాలం మాత్రమే ఉంటుంది. చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళుతున్నాడో తెలియదు.

36. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

36. వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళి పోయాడు.

37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.

37. యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వసం కలుగలేదు.

38. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువుయొక్క బాహువు ఎవనికి బయలుపరచ బడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.
యెషయా 53:1

38. ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి యిలా జరిగింది: “ప్రభూ! మా సందేశం ఎవరు విశ్వసించారు? ప్రభువు తన శక్తిని ఎవరికి చూపాడు?” యెషయా 53:1

39. ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా

39. అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది నెరవేరునట్లు యిలా జరిగింది:

40. వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.
యెషయా 6:9-10

40. “ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి, వాళ్ళ హృదయాలు మూసి వేశాడు. వాళ్ళు చూడ రాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశ్యం. అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్లుతారు. వాళ్ళకు నేను నయం చేయవలసివస్తుంది.” యెషయా 6:10

41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.

41. యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు.

42. అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.

42. ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు.

43. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.

43. ఎందుకంటే, వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ యిష్టం.

44. అంతట యేసు బిగ్గరగా ఇట్లనెనునాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.

44. యేసు, “నన్ను విశ్వసించేవాడు, నన్నే కాక నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు.

45. నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.

45. అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని చూస్తున్నట్లే!

46. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

46. నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చాను! ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండ కూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రీ నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే.

47. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని.

47. “ఎవడైనను నా మాటలు విని వాటిని అనుసరించని వానికి నేను తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చటానికి రాలేదు, కాని నేను రక్షించటానికి వచ్చాను.

48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.

48. నన్ను, నా మాటల్ని ఇష్టపడక వ్యతిరేకించేవానిపై ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున వానికి తీర్పుతీరుస్తుంది.

49. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.

49. నేను నా యిష్ట ప్రకారం మాట్లాడలేదు, గాని నా తండ్రి ఏమి చెప్పుమని నాకు ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను.

50. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.

50. ఆయన ఆజ్ఞ నిత్య జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే” అని అన్నాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మేరీచే అభిషేకించబడిన క్రీస్తు. (1-11) 
క్రైస్ట్ ఇంతకుముందు మార్తా సేవ చేయడంలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. అయినప్పటికీ, ఆమె సేవ చేయడం మానేయలేదు, కొంతమందికి భిన్నంగా, ఒక తీవ్రమైన విషయంలో నిందలు వచ్చినప్పుడు, వ్యతిరేక తీవ్రతకు వెళ్లడం ద్వారా ప్రతిస్పందిస్తారు. మార్తా సేవ చేస్తూనే ఉంది, కానీ ఇప్పుడు ఆమె క్రీస్తు దయగల మాటలను వినగలిగేంతలోనే చేసింది. దీనికి విరుద్ధంగా, మేరీ క్రీస్తు పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది, ఆమె మరియు ఆమె కుటుంబం పట్ల అతని ప్రేమ యొక్క నిజమైన టోకెన్‌లను పరస్పరం ప్రతిస్పందించింది. దేవుని అభిషిక్తుడు మనచేత కూడా అభిషేకించబడుట యుక్తము. దేవుడు ఇతరులకు మించిన ఆనంద తైలాన్ని అతనికి ప్రసాదించినట్లయితే, మన ప్రగాఢమైన ఆప్యాయతలను ఆయనపై కుమ్మరిస్తాము.
జుడాస్, అయితే, సహేతుకమైన సాకుతో పాపపు చర్యను దాచిపెట్టాడు. మనకు ఇష్టమైన పద్ధతిలో సేవ చేయని వారు ఆమోదయోగ్యమైన సేవను అందించడం లేదని మనం భావించకూడదు. డబ్బుపై వ్యాపించిన ప్రేమ ఒకరి హృదయాన్ని దొంగిలించడంతో సమానం. క్రీస్తు కృప పవిత్రమైన పదాలు మరియు చర్యలను ఉదారంగా వివరిస్తుంది, లోపాలను ఉత్తమంగా చేస్తుంది మరియు సద్గుణాలను పెంచుతుంది. అవకాశాలు, ముఖ్యంగా క్షణికావేశానికి గురయ్యే అవకాశం ఉన్న వాటిని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి మరియు ఉపయోగించుకోవాలి.
అద్భుతం యొక్క నిరంతర ప్రభావాన్ని అడ్డుకోవడానికి లాజరస్ మరణాన్ని పన్నాగం చేయాలనే నిర్ణయంలో ప్రదర్శించబడిన దుష్టత్వం, దుర్మార్గం మరియు మూర్ఖత్వం దేవునికి వ్యతిరేకంగా మానవ శత్రుత్వం యొక్క నిరాశాజనకంగా మాత్రమే అర్థం చేసుకోవచ్చు. ప్రభువు తిరిగి బ్రతికించిన వ్యక్తిని చంపాలని వారు నిశ్చయించుకున్నారు. సువార్త యొక్క విజయం తరచుగా దుష్ట వ్యక్తులలో తీవ్రమైన కోపాన్ని రేకెత్తిస్తుంది, వారు సర్వశక్తిమంతుడిపై విజయం సాధించగలరని నమ్ముతున్నట్లుగా వారు మాట్లాడతారు మరియు ప్రవర్తిస్తారు.

అతను జెరూసలేంలోకి ప్రవేశించాడు. (12-19) 
జెరూసలేంలోకి క్రీస్తు విజయవంతమైన ప్రవేశం సువార్తికులందరిచే నమోదు చేయబడింది. దేవుని బోధనలు మరియు దైవిక ప్రణాళికలో అనేక లోతైన అంశాలు, శిష్యులు మొదట్లో దేవుని విషయాలను ఎదుర్కొన్నప్పుడు వారి గ్రహణశక్తిని తరచుగా తప్పించుకుంటాయి. క్రీస్తు రాజ్యం యొక్క ఆధ్యాత్మిక సారాంశం యొక్క సరైన అవగాహన, దానిని సూచించే లేఖనాలను తప్పుగా అర్థం చేసుకోకుండా మనలను కాపాడుతుంది.

గ్రీకులు యేసును చూడటానికి దరఖాస్తు చేసుకుంటారు. (20-26) 
పవిత్రమైన ఆచారాలలో, ముఖ్యంగా సువార్త పస్కాలో పాల్గొంటున్నప్పుడు, యేసును ఎదుర్కోవాలని - ఆయనను మన స్వంత వ్యక్తిగా భావించాలని, ఆయనతో సంబంధాన్ని కొనసాగించాలని మరియు ఆయన సన్నిధి నుండి దయను పొందాలని మన లోతైన కోరిక ఉండాలి. అన్యజనులను చేర్చుకోవడం విమోచకుడిని కీర్తించింది. వృద్ధిని పొందాలంటే గోధుమ గింజను నాటాలి, క్రీస్తు మానవ రూపాన్ని తీసుకోకుండానే తన ఖగోళ వైభవాన్ని నిలుపుకున్నాడు. ప్రత్యామ్నాయంగా, మానవ స్వభావాన్ని కలిగి ఉన్నందున, అతను తన దోషరహిత ధర్మం ద్వారా మాత్రమే స్వర్గానికి చేరుకోగలడు, బాధలు లేదా మరణం లేకుండా. అయితే, అటువంటి దృష్టాంతంలో, మానవ జాతి నుండి ఏ పాపమూ మోక్షాన్ని అనుభవించలేదు. పూర్వం మరియు ఇప్పటి నుండి చివరి వరకు ఆత్మలను రక్షించడం ఈ గోధుమ గింజను త్యాగం చేయడానికి కారణమని చెప్పవచ్చు. క్రీస్తు మన మహిమ యొక్క నిరీక్షణా కాదో తెలుసుకోవడానికి ఆత్మపరిశీలన చేసుకుందాం; మనం ప్రభువైన యేసును ఇష్టపూర్వకంగా సేవిస్తూ, ఆయన పవిత్రమైన మాదిరిని అనుకరించటానికి ఈ జీవితంలోని అల్పమైన విషయాల పట్ల మనలో ఉదాసీనతను కలిగించమని ఆయనను వేడుకుందాం.

స్వర్గం నుండి ఒక స్వరం క్రీస్తుకు సాక్ష్యంగా ఉంది. (27-33) 
క్రీస్తు మనలను విమోచించి రక్షించే పనిని చేపట్టినప్పుడు మన ఆత్మల పాపం అతని ఆత్మను కలవరపెట్టింది, మన పాపాలకు అతని ఆత్మను అర్పణగా చేసింది. క్రీస్తు బాధలను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అతను దాని నుండి తప్పించుకోమని ప్రార్థించాడు. ఇబ్బందికి వ్యతిరేకంగా ప్రార్థించడం దాని సమయంలో సహనంతో మరియు దాని మధ్యలో దేవుని చిత్తానికి లొంగిపోవచ్చు. మన ప్రభువైన యేసు దేవుని బాధించిన గౌరవాన్ని సంతృప్తి పరచడానికి కట్టుబడి ఉన్నాడు, దానిని తన స్వంత వినయం ద్వారా సాధించాడు. స్వర్గం నుండి వచ్చిన తండ్రి స్వరం, గతంలో అతని బాప్టిజం మరియు రూపాంతరం సమయంలో అతనిని ప్రియమైన కుమారుడిగా ప్రకటించాడు, ఇప్పుడు అతను తన పేరును మహిమపరిచాడని మరియు దానిని కొనసాగిస్తాడని ప్రకటించాడు.
తన మరణం యొక్క యోగ్యత ద్వారా ప్రపంచాన్ని దేవునితో సమాధానపరచడంలో, క్రీస్తు మరణం యొక్క శక్తిని విచ్ఛిన్నం చేశాడు మరియు సాతానును విధ్వంసకుడిగా బహిష్కరించాడు. తన సిలువ బోధల ద్వారా ప్రపంచాన్ని దేవుని వద్దకు తీసుకురావడం ద్వారా, అతను పాపం యొక్క శక్తిని విచ్ఛిన్నం చేశాడు మరియు సాతానును మోసగాడిగా వెళ్లగొట్టాడు. ఒకప్పుడు క్రీస్తు ప్రభావానికి దూరంగా ఉన్నవారు ఆయనను ప్రేమిస్తారు మరియు విశ్వసిస్తారు. యేసు పరలోకానికి ఆరోహణమైనప్పుడు, ప్రజల హృదయాలను తన వైపుకు ఆకర్షించాడు. క్రీస్తు మరణం ఆత్మలను అతని వైపుకు ఆకర్షించే శక్తిని కలిగి ఉంది. సువార్త ఉచిత దయ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసింది మరియు విధిని కూడా నొక్కి చెప్పింది; రెండింటినీ వేరు చేయకుండా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం చాలా అవసరం.

ప్రజలతో అతని ఉపన్యాసం. (34-36) 
లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుంటూ, ప్రజలు క్రీస్తు బాధలు మరియు మరణం గురించిన ప్రవచనాలను పట్టించుకోకుండా సరికాని ఆలోచనలను ఏర్పరచుకున్నారు. మన ప్రభువు కాంతి వారితో ఎక్కువ కాలం ఉండదని వారిని హెచ్చరించాడు మరియు చీకటి వారిని చుట్టుముట్టకముందే దానిని స్వీకరించమని వారిని ప్రోత్సహించాడు. వెలుగులో నడవాలంటే, దానిని విశ్వసించాలి మరియు క్రీస్తు మార్గదర్శకత్వాన్ని పాటించాలి. అయితే, విశ్వాసం లేనివారు యేసు సిలువపై ఎత్తబడడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించలేరు మరియు పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడి చేయబడిన దాని రూపాంతర ప్రభావం గురించి తెలియదు. తమ అవిశ్వాసాన్ని సమర్థించుకోవడానికి వారు అనేక అభ్యంతరాలను లేవనెత్తారు.

యూదుల అవిశ్వాసం. (37-43) 
ఇక్కడ వివరించిన మార్పిడి ప్రక్రియను పరిగణించండి. పాపులు దైవిక విషయాల యొక్క వాస్తవికతను గుర్తించి, వాటి గురించి కొంత అవగాహన పొందుతారు. పరివర్తనలో పాపం నుండి క్రీస్తు వైపు తిరగడం, ఆయనను తమ ఆనందానికి మూలంగా మరియు అంతిమ భాగంగా గుర్తించడం. దేవుడు, ఈ మార్పిడిలో, వైద్యం చేసేవాడు, సమర్థించేవాడు మరియు పవిత్రుడుగా వ్యవహరిస్తాడు. అతను వారి పాపాలను క్షమిస్తాడు, రక్తస్రావం గాయాలుగా చిత్రీకరించబడ్డాడు మరియు ప్రచ్ఛన్న వ్యాధులతో పోల్చబడిన వారి అవినీతిని అణచివేస్తాడు.
ఇతరుల నుండి ప్రశంసలు లేదా విమర్శలను పొందడం గురించిన ఆందోళనల కారణంగా నేరారోపణలను అణచివేయడంలో ప్రపంచం యొక్క ప్రభావాన్ని ఈ ప్రకరణం హైలైట్ చేస్తుంది. మానవ ఆమోదం కోసం కోరిక, అకారణంగా ధర్మబద్ధమైన చర్యలలో ద్వితీయ ఉద్దేశ్యంగా ఉపయోగించినప్పుడు, మతం ప్రజాదరణ పొందినప్పుడు వంచనకు దారి తీస్తుంది మరియు క్రెడిట్ పొందవలసి ఉంటుంది. అదేవిధంగా, తప్పుడు కార్యకలాపాలలో అవినీతి సూత్రంగా పురుషుల నుండి ప్రశంసలు పొందడం అనేది మతం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మతభ్రష్టుడిగా మార్చగలదు మరియు దాని కోసం సామాజిక స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంది.

వారికి క్రీస్తు చిరునామా. (44-50)
మన ప్రభువు తనను విశ్వసించే వారెవరైనా, ఆయనను నిజమైన శిష్యునిగా గుర్తించి, ఆయనపై మాత్రమే కాకుండా, తనను పంపిన తండ్రిపై కూడా విశ్వాసం ఉంచుతారని మన ప్రభువు బహిరంగంగా ప్రకటించాడు. మనం యేసును చూస్తూ, ఆయనలోని తండ్రి మహిమను గుర్తించినప్పుడు, ఆయనకు విధేయత చూపడానికి, ప్రేమించడానికి మరియు విశ్వసించడానికి మనం మొగ్గు చూపుతాము. ప్రపంచంలోకి వెలుగుగా వచ్చిన వ్యక్తిని నిరంతరం ధ్యానించడం ద్వారా, అజ్ఞానం, దోషం, పాపం మరియు దుఃఖం అనే చీకటి నుండి క్రమంగా బయటపడతాము. మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ నిత్యజీవానికి దారితీస్తుందని మనం అర్థం చేసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ, అదే పదం దానిని తిరస్కరించే లేదా నిర్లక్ష్యం చేసేవారికి తీర్పుగా ఉపయోగపడుతుంది.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |