John - యోహాను సువార్త 6 | View All

1. అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.

1. ఇది జరిగిన కొద్ది రోజులకు, యేసు గలిలయ సముద్రం (తిబెరియ సముద్రం) దాటి వెళ్ళాడు.

2. రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.

2. ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగుచెయ్యటం చూసి, పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ని అనుసరిస్తూవచ్చింది.

3. యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.

3. యేసు తన శిష్యులతో కలిసి కొండ మీదికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు.

4. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.

4. అవి పస్కా పండుగకు ముందు రోజులు. పస్కా యూదల పండుగ.

5. కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని

5. యేసు తలెత్తి పెద్ద ప్రజలగుంపు తన వైపు రావటం చూసి, ఫిలిప్పుతో, “వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ కొందాం?”అని అడిగాడు.

6. యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.

6. అతణ్ణి పరీక్షించటానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చెయ్యాలో ముందే ఆలోచించుకొన్నాడు.

7. అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.

7. ప్రతి ఒక్కనికి ఒక్కొక్క ముక్క దొరకాలన్నా, రెండువందల దేనారాలు ఖర్చు చేయవలసి వస్తుంది. అయినా అది చాలదు.

8. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ

8. యేసు శిష్యుల్లో ఒకడైన అంద్రెయ అక్కడున్నాడు. యితడు సీమోను పేతురు సోదరుడు.

9. ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా

9. “ఇక్కడ ఒక బాలుని దగ్గర యవలతో చేసిన ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చేపలు ఉన్నాయి. కాని యింతమందికి అవి ఎట్లా సరిపోతాయి?”అని అన్నాడు.

10. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.

10. యేసు, “ప్రజల్ని కూర్చోపెట్టండి!”అని అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య ఐదువేలు.

11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

11. యేసు ఆ రొట్టెల్ని తీసుకొని, దేవునికి కృతజ్ఞత చెప్పి, అక్కడ కూర్చున్నవాళ్ళకు పంచిపెట్టాడు. అదే విధంగా చేపల్ని కూడా పంచి పెట్టాడు. అందరూ కావలసినంత తిన్నారు.

12. వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.

12. వాళ్ళు తృప్తిగాతిన్నాక, తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా వాళ్ళు తినగా మిగిలిన ముక్కల్ని ఎత్తి పెట్టండి!” అని అన్నాడు.

13. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

13. ఐదు బార్లీ రొట్టెల్ని పంచగా మిగిలిన ముక్కల్ని శిష్యులు పండ్రెండు గంపలనిండా నింపారు.

14. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
ద్వితీయోపదేశకాండము 18:15, ద్వితీయోపదేశకాండము 18:18

14. ప్రజలు యేసు చేసిన ఆ మహాకార్యాన్ని చూసి, “లోకానికి రానున్న ప్రవక్త ఈయనే!” అని అనటం మొదలు పెట్టారు.

15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.

15. యేసు వాళ్ళు తనను బలవంతంగా రాజును చెయ్యాలనుకుంటున్నారని గ్రహించాడు. కనుక ఆయన ఏకాంతంగా కొండకు వెళ్ళిపోయ్యాడు.

16. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.

16. సాయంకాలమైంది. ఆయన శిష్యులు సముద్రం దగ్గరకు వెళ్ళారు.

17. అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

17. వాళ్ళు ఒక పడవనెక్కి సముద్రంకు అవతలి వైపుననున్న కపెర్నహూము అనే పట్టణం వైపు వెళ్ళసాగారు. అప్పటికే చీకటి పడింది. యేసు వాళ్ళనింకా కలుసుకోలేదు.

18. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.

18. గాలి తీవ్రంగా వీయటంవల్ల అలలు అధికమయ్యాయి.

19. వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;

19. మూడు నాలుగుమైళ్ళ దూరందాకా తెడ్లు వేసాక, యేసు నీళ్ళ పై నడుస్తూ పడవ దగ్గరకు రావటం వాళ్ళు చూసారు. వాళ్ళకు బాగా భయం వేసింది.

20. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.

20. కాని, యేసు వాళ్ళతో, “నేనే! భయపడకండి!” అని అన్నాడు.

21. కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

21. ఈమాట అన్న తర్వాత ఆయన పడవలోకి రావటానికి వాళ్ళు అంగీకరించారు. ఆ తదుపరి వాళ్ళు, తాము వెళ్ళ దలచిన తీరాన్ని త్వరలోనే చేరుకున్నారు.

22. మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.

22. తెల్లవారింది. అవతలి ఒడ్డున ఉండి పోయిన ప్రజలకు అక్కడ ఒకే పడవ ఉందని, యేసు శిష్యులతో కలిసి వెళ్ళలేదని, శిష్యులు మాత్రమే వెళ్ళారని, తెలుసు కొన్నారు.

23. అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.

23.

24. కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.

24.

25. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా

25. యేసు అవతలి ఒడ్డున కనిపించగానే, వాళ్ళు ఆయనతో, “రబ్బీ! మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అని అడిగారు.

26. యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

26. యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు.

27. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

27. చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు.

28. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను అడుగగా

28. వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు.

29. యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

29. యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు.

30. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?

30. కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగైతే, మేము నమ్మేటట్లు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు?

31. భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.
నిర్గమకాండము 16:4-15, సంఖ్యాకాండము 11:7-9, Neh-h 9 15:1, కీర్తనల గ్రంథము 78:24, కీర్తనల గ్రంథము 105:40

31. మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను తిన్నారు. దీన్ని గురించి గ్రంథల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన, వాళ్ళు తినటానికి పరలోకం నుండి ఆహారం యిచ్చాడు.”

32. కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.

32. యేసు జవాబు చెప్పుతూ, “ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండ్రి.

33. పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

33. ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు” అని అన్నాడు.

34. కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.

34. వాళ్ళు, “అయ్యా! యికనుండి ఈ ఆహారం మాకివ్వండి!” అని అన్నారు.

35. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,

35. యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు.

36. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.

36. కాని నేను ఇంతకు క్రితం చెప్పినట్లు, నన్ను చూసారు! అయినా మీరు నమ్మలేదు!

37. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.

37. తండ్రి నాకప్పగించిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణెవణ్ణి నేను ఎన్నటికి నెట్టి వేయను.

38. తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.

38. ఎందుకంటే, నేను పరలోకం నుండి నా యిష్టం నెర వెర్చుకోవటానికి దిగిరాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చాను.

39. నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

39. నన్ను పంపిన వాని కోరిక యిది: నా కప్పగింపబడిన వాళ్ళను నేను పోగొట్టు కోరాదు. వాళ్ళను చివరి రోజు బ్రతికించాలి.

40. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.

40. కుమారుని వైపు చూసి ఆయన్ని నమ్మినవాడు అనంత జీవితం పొందాలి. ఇది నా తండ్రి కోరిక. అలా నమ్మిన వాణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను.”

41. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

41. ఆయన, “నేను పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని” అని అనటం విని యూదులు గొణిగారు.

42. కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?

42. “ఇతడు యోసేపు కుమారుడైన యేసు కదా! ఇతని తల్లిదండ్రుల్ని మనం ఎరుగుదమే! మరి యిప్పుడితడు, ‘నేను పరలోకంనుండి దిగి వచ్చానని’ ఎందుకు అంటున్నాడు?” అని వాళ్ళన్నారు.

43. ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.

43. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీలో మీరు గొణుక్కోవడం చాలించండి.

44. అందుకు యేసుమీలో మీరు సణుగుకొనకుడి;

44. నన్ను పంపిన తండ్రి పంపితే తప్ప, నా దగ్గరకు ఎవ్వడూ రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణి చివరి రోజు నేను బ్రతికిస్తాను.

45. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
యెషయా 54:13

45. ప్రవక్తల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది:’దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు.’ తండ్రి మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు.

46. వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

46. దేవుని నుండి వచ్చినవాడు తప్ప తండ్రినెవ్వరూ చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని చూసాడు.

47. దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్న వాడు.

47. ఇది నిజం. నమ్మినవానికి అనంత జీవితం లభిస్తుంది.

48. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.

48. నేను మీ జీవితానికి ఆహారాన్ని.

49. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

49. మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు.

50. దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే.

50. కాని ఈయన పరమునుండి వచ్చిన నిజమైన ఆహారం. దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణించడు.

51. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

51. పరమునుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”

52. యూదులుఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

52. ఆ తర్వాత, “మనకు తన శరీరాన్ని తినటానికి ఈయన ఏవిధంగా యిస్తాడు?” అని యూదులు పరస్పరం తీవ్రంగా వాదించుకున్నారు.

53. కావున యేసు ఇట్లనెనుమీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.

53. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మనుష్యకుమారుని శరీరం తిని, ఆయన రక్తం తాగ్రితే తప్ప మీలో జీవం ఉండదు.

54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

54. నా శరీరము తిని, నా రక్తం త్రాగిన వానికి అనంతజీవితం లభిస్తుంది. అతణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను.

55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.

55. ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం. నా రక్తం నిజమైన పానీయము.

56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.

56. నా శరీరం తిని, నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు.

57. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

57. సజీవుడైన నా తండ్రి నన్ను పంపాడు. ఆయన కారణంగానే నేను జీవిస్తున్నాను. అదే విధంగా నన్ను ఆహారంగా తిన్నవాడు నాకారణంగా జీవిస్తాడు.

58. ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను

58. పర లోకంనుండి దిగివచ్చిన నిజమైన ఆహారం యిదే! ఇది మన పూర్వీకులు తిన్న ఆహారంలాంటిది కాదు. వాళ్ళు అది తిన్నా చని పొయ్యారు. కాని ఈ ఆహారాన్ని తిన్నవాళ్ళు అనంతజీవితం పొందుతారు.”

59. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.

59. యేసు, కపెర్నహూములోని యూదుల సమాజ మందిరంలో బోధిస్తూ ఈ విషయాలు చెప్పాడు.

60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.

60. ఆయన చెప్పినవి విని చాలా మంది శిష్యులు, “ఈ బోధన చాల కష్టమైనది. దీన్ని ఎవరు అంగీకరించ గలరు?” అని అన్నారు.

61. యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?

61. తన శిష్యులు ఈ విషయాన్ని గురించి గొణుక్కుంటున్నారని యేసు గ్రహించాడు. ఆయన వాళ్ళతో, “ఇది మీకు కష్టంగా ఉందా?

62. ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?
కీర్తనల గ్రంథము 47:5

62. మనుష్యకుమారుడు, తాను ముందున్న చోటికి వెళ్ళటం చూస్తే మీరెమంటారు?

63. ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని

63. ఆత్మ జీవాన్నిస్తాడు. శరీరానికి విలువ లేదు. నామాటలు ఆత్మకు సంబంధించినవి. అవి జీవం.

64. మీలో విశ్వ సించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.

64. కాని, మీలో కొందరు నమ్మటం లేదు” అని అన్నాడు. తనను నమ్మని వాడెవడో, తనకు ద్రోహం చేసేవాడెవడో యేసుకు ముందునుండి తెలుసు.

65. మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.

65. యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “తండ్రి అనుమతిస్తే తప్ప నా దగ్గరకు ఎవ్వరూ రాలేరని అందుకే అన్నాను.”

66. అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.

66. ఆ రోజు నుండి చాలా మంది శిష్యులు ఆయన్ని అనుసరించటం మానుకొని వెనక్కు మళ్ళి పోయారు.

67. కాబట్టి యేసుమీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా

67. యేసు, “మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా?” అని పన్నెండు మందిని అడిగాడు.

68. సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;

68. సీమోను పేతురు, “ప్రభూ మేము ఎవరి దగ్గరకు వెళ్ళాలి? అనంత జీవితాన్ని గురించి చెప్పే మాటలు మీ దగ్గర ఉన్నాయి.

69. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.

69. మీరు దేవునికి సంబంధించిన వారని, పవిత్రులని మాకు తెలుసు. అది మేము నమ్ముతున్నాము” అని సమాధానం చెప్పాడు.

70. అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను.

70. అప్పుడు యేసు, “మీ పన్నెండు మందిని ఎన్నుకొన్న వాణ్ణి నేనే కదా! అయినా మీలో ఒకడు సైతాను!” అని అన్నాడు.

71. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.

71. ఆయన ఉద్దేశ్యం సీమోను కుమారుడైన ఇస్కరి యోతు యూదా అని. యూదా పన్నెండు మందిలో ఒకడైయుండి యేసుకు ద్రోహం చేస్తాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఐదువేలు అద్భుతంగా తినిపించారు. (1-14) 
జాన్ సమూహానికి అద్భుతమైన ఆహారం అందించడాన్ని వివరిస్తాడు, దానిని తదుపరి చర్చకు అనుసంధానించాడు. ఈ అద్భుతం ప్రజలపై చూపిన ప్రభావాన్ని గమనించండి. ఒక గొప్ప ప్రవక్తగా మెస్సీయ రాక గురించి యూదుల సాధారణ అంచనాలు ఉన్నప్పటికీ, తమను తాము చట్టంలో నిపుణులుగా భావించే పరిసయ్యులు సాధారణ ప్రజల పట్ల అసహ్యకరమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు. అయితే, ఈ అకారణంగా సాధారణ వ్యక్తులు చట్టాన్ని నెరవేర్చే వ్యక్తి గురించి లోతైన అవగాహన కలిగి ఉన్నారు. ప్రజలు క్రీస్తును ప్రవచించబడిన ప్రవక్తగా గుర్తించడం మరియు అదే సమయంలో ఆయన సందేశాన్ని విస్మరించడం కూడా సాధ్యమే.

యేసు సముద్రం మీద నడుస్తున్నాడు. (15-21) 
ఇక్కడ క్రీస్తు శిష్యులు నమ్మకంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు, అదే సమయంలో, క్రీస్తు ప్రార్థనలో వారి కోసం మధ్యవర్తిత్వం వహించాడు. విధినిర్వహణలో ఉన్నప్పటికీ వారు అవస్థలు పడ్డారు. క్రీస్తుతో జతకట్టిన వారికి కూడా, ప్రస్తుత క్షణంలో సవాళ్లు మరియు బాధలు ఉండవచ్చు. కాంతి మరియు పగటి అనుచరులు తరచుగా మేఘాలు మరియు చీకటిని ఎదుర్కొంటారు. అలాంటి సమయాల్లో, యేసు సమీపిస్తున్నట్లు, సముద్రం మీద నడుస్తున్నట్లు వారు గ్రహించవచ్చు. ఆశ్చర్యకరంగా, ఓదార్పు మరియు విముక్తిని కలిగించే చాలా క్షణాలు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడతాయి మరియు భయాన్ని రేకెత్తిస్తాయి.
పాపులను దోషులుగా నిర్ధారించే శక్తివంతమైన శక్తి, "నీవు హింసించే యేసును నేనే" అనే ప్రకటనలో ఉంది, అయితే పరిశుద్ధుల ఓదార్పు కోసం, "నేను నీవు ప్రేమించే యేసును" అనే హామీని మించినది ఏమీ లేదు. మనము క్రీస్తుయేసును మన ప్రభువుగా స్వీకరించినట్లయితే, చీకటి రాత్రులలో మరియు అలలు వీచే గాలుల మధ్య కూడా మనకు భరోసా లభిస్తుంది, మనం చాలా కాలం ముందు ఒడ్డుకు చేరుకుంటాము.

అతను ఆధ్యాత్మిక ఆహారానికి దర్శకత్వం వహిస్తాడు. (22-27) 
యేసు అక్కడికి ఎలా వచ్చాడు అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇచ్చే బదులు, వారి విచారణను దారి మళ్లించాడు. మోక్షం కోసం అన్వేషణకు అత్యంత శ్రద్ధ మరియు నియమించబడిన పద్ధతులను శ్రద్ధగా ఉపయోగించడం అవసరం, అయినప్పటికీ అది మనుష్యకుమారుడు ప్రసాదించిన బహుమతిగా అనుసరించాలి. తండ్రి తన దివ్య స్వభావాన్ని ధృవీకరిస్తూ కుమారునికి ధృవీకరించారు. అలా చేయడం ద్వారా, అతను మనుష్యకుమారుడిని దేవుని కుమారుడిగా ప్రకటించాడు, అధికారం మరియు శక్తితో ఉన్నాడు.

సమూహంతో అతని ఉపన్యాసం. (28-65) 
28-35
మోక్షాన్ని కోరుకునే పాపులుగా మన నుండి ఆశించే విధేయత యొక్క అత్యంత కీలకమైన మరియు సవాలు చేసే అంశంగా క్రీస్తుపై విశ్వాసాన్ని స్థిరంగా ఉంచడం. ఆయన కృప ద్వారా, దేవుని కుమారునిపై విశ్వాసంతో కూడిన జీవితాన్ని గడపడానికి మనకు అధికారం లభించినప్పుడు, అది పవిత్రమైన సద్గుణాల అభివృద్ధికి మరియు ఆమోదయోగ్యమైన సేవా చర్యలకు దారి తీస్తుంది. దేవుడు, ప్రత్యేకంగా తండ్రి, ఒకప్పుడు వారి పూర్వీకులకు వారి భౌతిక జీవితాలను నిలబెట్టడానికి స్వర్గపు జీవనోపాధిని అందించాడు, ఇప్పుడు వారి ఆత్మల విముక్తి కోసం నిజమైన రొట్టెని అందజేస్తాడు. యేసును సమీపించడం మరియు ఆయనపై నమ్మకం ఉంచడం ఒకే సందేశాన్ని తెలియజేస్తాయి. రొట్టె శరీరాన్ని ఎలా నిలబెట్టి పోషిస్తుందో, ఆధ్యాత్మిక జీవితానికి మద్దతు ఇవ్వడంలో అదే విధమైన పాత్రను నిర్వర్తిస్తూ, తాను నిజమైన రొట్టె అని క్రీస్తు నొక్కిచెప్పాడు. అతను దేవుని నుండి ఉద్భవించిన రొట్టె, మన ఆత్మలకు జీవనోపాధిగా పనిచేయడానికి తండ్రి ప్రసాదించాడు. భౌతిక రొట్టె సజీవ శరీరం యొక్క జీవశక్తి ద్వారా పోషించబడుతుండగా, క్రీస్తు జీవించి ఉన్న రొట్టె, తన స్వంత స్వాభావిక శక్తి ద్వారా పోషించడం. సిలువ వేయబడిన క్రీస్తు సిద్ధాంతం ఎప్పటిలాగే విశ్వాసులకు బలాన్ని మరియు ఓదార్పునిస్తుంది. అతను స్వర్గం నుండి దిగివచ్చిన రొట్టె, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మరియు అతని అధికారం రెండింటినీ సూచిస్తుంది, అలాగే అతని ద్వారా మనకు ప్రవహించే అన్ని మంచి యొక్క దైవిక మూలం. ఈ రొట్టెని మనకు నిరంతరం అందించమని అవగాహనతో మరియు చిత్తశుద్ధితో ప్రభువును వేడుకుందాం.

36-46
అపరాధం, ఆపద మరియు పరిష్కారం, పరిశుద్ధాత్మ సూచనలచే మార్గనిర్దేశం చేయబడి, అతని నుండి మోక్షానికి ఆటంకం కలిగించే ప్రతిదాన్ని విడిచిపెట్టి, వ్యక్తులలో చేరుకోవటానికి సుముఖత మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. కుమారునికి అప్పగింపబడిన వారిలో ఎవ్వరూ తొలగించబడకూడదని లేదా అతనిచే కోల్పోకూడదని తండ్రి కోరిక. దైవానుగ్రహం అణచివేసి, కొంతవరకు వారి హృదయాన్ని మార్చే వరకు ఎవరూ రారు; అందువల్ల, వచ్చిన ఎవరైనా తిరస్కరణను ఎదుర్కోరు. సువార్త బహిర్గతం చేసే వినయపూర్వకమైన, పవిత్రమైన పద్ధతిలో రక్షింపబడే ఎవరినీ ఎదుర్కోదు. బదులుగా, దేవుడు తన మాట మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షిస్తాడు మరియు మానవ బాధ్యత వినడం మరియు నేర్చుకోవడం-అర్పించిన దయను స్వీకరించడం మరియు వాగ్దానానికి సమ్మతించడం. తండ్రి, తన ప్రియమైన కుమారునికి తప్ప మిగతా వారికి కనిపించని, కుమారుని మనస్సులపై అంతర్గత ప్రభావం, మాట్లాడే మాట మరియు వారి మధ్యకు పంపే మంత్రుల ద్వారా తన బోధనలను తెలియజేస్తాడు.

47-51
మన్నా యొక్క ప్రయోజనం పరిమితమైనది, ఈ భూసంబంధమైన జీవితానికి మాత్రమే విస్తరించింది. దీనికి విరుద్ధంగా, జీవించే రొట్టె చాలా గొప్పది, దానిలో పాలుపంచుకునే వారు ఎన్నటికీ మరణాన్ని అనుభవించలేరు. ఈ రొట్టె క్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని సూచిస్తుంది, ప్రపంచ పాపాల కోసం తండ్రికి బలి అర్పించాలని ఆయన భావించారు. ఇది ప్రతి దేశం నుండి పశ్చాత్తాపపడిన విశ్వాసులకు జీవితం మరియు దైవభక్తికి సంబంధించిన అన్నింటినీ పొందేందుకు ఉపయోగపడుతుంది.

52-59
మనుష్యకుమారుని యొక్క మాంసం మరియు రక్తం మానవ రూపంలో ఉన్న విమోచకుడికి ప్రతీక - క్రీస్తు సిలువ వేయబడి మరియు అతని ద్వారా సాధించిన విమోచన, దానితో పాటు అది తెచ్చే అమూల్యమైన ప్రయోజనాలను సూచిస్తుంది. వీటిలో పాప క్షమాపణ, దైవిక అంగీకారం, కృపా సింహాసనానికి ప్రాప్తి, ఒడంబడిక వాగ్దానాల నెరవేర్పు మరియు నిత్యజీవ బహుమతి ఉన్నాయి. క్రీస్తు యొక్క మాంసం మరియు రక్తం అని పిలుస్తారు, ఎందుకంటే అవి అతని శరీరాన్ని విచ్ఛిన్నం చేయడం మరియు అతని రక్తాన్ని చిందించడం ద్వారా పొందబడ్డాయి కాబట్టి నియమించబడ్డాయి. అంతేకాకుండా, అవి మన ఆత్మలకు జీవనోపాధిగా పనిచేస్తాయి, క్రీస్తుపై విశ్వాసం యొక్క సారాంశాన్ని సూచిస్తాయి. విశ్వాసం ద్వారా, మనం క్రీస్తులో మరియు ఆయన అందించే ఆశీర్వాదాలలో పాలుపంచుకుంటాము. ఒక వివేచనగల ఆత్మ, తన స్థితి మరియు అవసరాల గురించి తెలుసుకుని, మనస్సాక్షిని శాంతపరచడానికి మరియు నిజమైన పవిత్రతను పెంపొందించడానికి అవసరమైన ప్రతిదాన్ని విమోచకుడైన అవతార దేవునిలో కనుగొంటుంది. క్రీస్తు యొక్క సిలువను ధ్యానించడం మన పశ్చాత్తాపం, ప్రేమ మరియు కృతజ్ఞతతో జీవం పోస్తుంది. మన శరీరాలు ఆహారం ద్వారా జీవాన్ని పొందే విధంగానే, మనం ఆధ్యాత్మికంగా ఆయన ద్వారా జీవిస్తాము. అతను మన జీవితానికి మూలం, తల మరియు దాని సభ్యులు లేదా రూట్ మరియు శాఖల మధ్య సంబంధానికి సారూప్యంగా ఉన్నాడు; ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తాం.

60-65
క్రీస్తు యొక్క మానవత్వం ఇంతకు ముందు స్వర్గంలో లేదు, కానీ దేవుడు మరియు మనిషి యొక్క అసాధారణ కలయికగా, ఆ విశేషమైన జీవి స్వర్గం నుండి దిగి వచ్చినట్లు సరిగ్గా గుర్తించబడింది. మెస్సీయ యొక్క ఆధిపత్యం భూసంబంధమైన రాజ్యానికి చెందినది కాదు; అతనిపై ఆధ్యాత్మిక ఆధారపడటం మరియు అతని సమృద్ధి గురించి అతని బోధనలను అర్థం చేసుకోవడానికి విశ్వాసం అవసరం. మానవత్వం యొక్క సందర్భంలో ఆత్మ లేకుండా శరీరానికి విలువ లేనట్లే, అన్ని మతపరమైన ఆచారాలు జీవం లేనివి మరియు దేవుని ఆత్మ లేకుండా అర్థరహితమైనవి. మన ఆత్మలను అందించిన వ్యక్తి ఈ విషయాలలో మనకు బోధించగల ఏకైక మార్గదర్శి మరియు మనల్ని క్రీస్తు వైపుకు నడిపించగలడు, తద్వారా మనం ఆయనపై విశ్వాసం ద్వారా జీవించగలము. కృతజ్ఞతతో, మనం క్రీస్తు వైపు తిరగవచ్చు, ఆయనను సంప్రదించడానికి ఇష్టపడే ఎవరైనా హృదయపూర్వకంగా స్వీకరించబడతారని హామీ ఇచ్చారు.

చాలా మంది శిష్యులు తిరిగి వెళతారు. (66-71)
మేము యేసు మాటలు మరియు పనుల గురించి సవాలు చేసే ఆలోచనలను కలిగి ఉన్నప్పుడు, మనల్ని మనం ప్రలోభాలకు గురిచేస్తాము, అది ప్రభువు దయతో జోక్యం చేసుకోకపోతే, తిరోగమనానికి దారితీయవచ్చు. మానవత్వం యొక్క అవినీతి మరియు పాపాత్మకమైన స్వభావం తరచుగా ఒక గొప్ప సౌకర్యాన్ని కలిగి ఉండవలసిన వాటిని పొరపాట్లు చేసే సందర్భంగా మారుస్తుంది. మునుపటి సంభాషణలో, మన ప్రభువు తన అనుచరులకు శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు. శిష్యులు ఆ సూటి ప్రకటనను పట్టుకున్నారు మరియు ఇతరులు కష్టమైన బోధలపై దృష్టి సారించి, ఆయనను విడిచిపెట్టినప్పటికీ, ఆయనకు కట్టుబడి ఉండాలని నిశ్చయించుకున్నారు.
క్రీస్తు బోధనలు నిత్యజీవానికి సంబంధించిన సందేశాన్ని ఏర్పరుస్తాయి, కాబట్టి మనం జీవితంలో మరియు మరణం రెండింటిలోనూ వాటికి కట్టుబడి ఉండాలి. క్రీస్తును విడిచిపెట్టడం అంటే మన స్వంత ఆశీర్వాదాలను విడిచిపెట్టడం. యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయ అని, సజీవ దేవుని కుమారుడని శిష్యులు విశ్వసించారు. వెనుదిరగడానికి లేదా వెనుదిరగడానికి టెంప్టేషన్ ఎదురైనప్పుడు, ప్రాథమిక సూత్రాలను గుర్తుకు తెచ్చుకోవడం మరియు వాటికి స్థిరంగా కట్టుబడి ఉండటం తెలివైన పని.
మన ప్రభువు యొక్క పరిశీలనాత్మక ప్రశ్నను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం: "నువ్వు కూడా వెళ్లి నీ విమోచకుడిని విడిచిపెడతావా?" మనం ఇంకా ఎవరిని ఆశ్రయించగలం? ఆయన మాత్రమే పాప క్షమాపణ ద్వారా మోక్షాన్ని అందించగలడు. ఈ హామీ ఆత్మవిశ్వాసాన్ని, ఓదార్పుని మరియు ఆనందాన్ని తెస్తుంది, భయం మరియు నిరుత్సాహాన్ని దూరం చేస్తుంది. ఇది ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆనందాన్ని భద్రపరుస్తుంది మరియు తదుపరి ఆనందానికి మార్గం సుగమం చేస్తుంది.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |