యేసునుగూర్చి ఎన్నడూ వినని వారికి ఏమి జరుగుతుంది? యేసునుగూర్చి ఎన్నడూ వినుటకు అవకాశం లభించని వ్యక్తిని దేవుడు ఖండించునా?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-never-heard.html

ప్రజలందరూ యేసును గూర్చి వినిన లేక వినకపోయిన వారు దేవునికి జవాబుదారులు. బైబిలు స్పష్టముగా విశదపరుస్తుంది దేవుడు సృష్టిద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు (రోమా 1:20) మరియు ప్రజల హృదయములో (పరమగీతములు 3:11) ఇక్కడ సమస్య మానవజాతియే పాపముతో నిండినవారు; మనమందరం దేవుని గూర్చిన ఙ్ఞామును తిరస్కరించి ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటును చేసాము (రోమా 1:21-223). దేవుని కృపమనపట్ల లేనట్లయితే, మన హృదయానికి ఇష్టానుసారమైన పాపములు చేయటానికి అప్పగించబడేవాళ్ళం, మనము ఎంత పనికిమాలినవారమో, ఆయనకు వేరుగా ఎంత ధౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నామో కనుగొనటానికి అనుమతించాడు.

వాస్తవంగా, ఇది కొంతమంది దేవుని విషయము విననివరి గురుంచే కాదు. దానికంటె అధికమైన సమస్యేంటంటే వారు ఏదైతే విన్నారో సృష్టిద్వారా ప్రత్యక్షమయిన దానిని ఏదైతే చూచారో దానిని తిరస్కరించారు. ద్వితియోపదేశకాండం 4:29లో అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.ఈ వచనము ఒక ముఖ్యమైన సూత్రాన్ని భోదిస్తుంది- ప్రతీ ఒక్కరూ ఎవరైతే దేవునిని వెదకుతారో వారు దేవునిని కనుగొంటారు. ఒక వ్యక్తి నిజంగా దేవునిని వెదకుటకు ఇష్టపడినట్లయితే దేవుడు ఆవ్యక్తికి ప్రత్యక్షపరచుకుంటాడు.

సమస్య ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు (రోమా 3:11). ప్రజలు దేవునిని గూర్చిన ఙ్ఞానమును అంటె సృష్టి ద్వారా, వారి హృదయములోను వెల్లడిపరచినదానిని తిరస్కరించి, దానికి బదులుగా వారు స్వహస్తాలతో చేసికొనిన సృష్టాన్ని “దేవుని” ఆరాధించటానికి నిర్ణయించుకున్నారు. యేసుక్రీస్తు సువార్తను వినటానికి ఒక్కసారికూడ అవకాశం లభించని వ్యక్తులను దేవుడు న్యాయమైన రీతిలో ఒకరిని నరకమునకు పంపించుట అనేదాన్ని గురించి వాదించటము అనాలోచితమైంది. బైబిలు చెప్తుంది ప్రజలు ఆయన ఙ్ఞానాన్ని తిరస్కరించారని మరియు అందుచేత వారి నరకానికి ఖండించుటలో దేవుడు న్యాయవంతుడు.

విననివారి గతి ఏంటి అని తర్కించుటకు బదులుగా , మనము, క్రైస్తవులముగా, మనకు చేతనైనంత వరకు శ్రేష్టమైనవిధంగా వారు ఖచ్చితముగా వినేటట్లు చూడటం. మనము సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటకు పిలువబడ్డాము ( మత్తయి 28:19-20; అపోస్తలులకార్యములు 1:8). సృష్టి ద్వారా ప్రత్యక్షమైన దేవుని ఙ్ఞానాన్ని ప్రజలు తిరస్కరిస్తారన్ని మనము ఎరిగినప్పటికి అది మనలను యేసుక్రీస్తుద్వారా లభించే రక్షణ సువార్తను ప్రకటించాలని మనలను పురికొల్పుతుంది. దేవుని కృప కేవలము యేసుక్రీస్తుద్వారా లభించినదాన్ని అంగీకరించుటవలన , ప్రజలు వారి పాపాలనుండి రక్షించబడి, మరియు దేవునికి వేరుగా నిత్యత్వపు శిక్షనుండి తప్పింపబడుతారు.

ఒకవేళ సువార్త ఎన్నడూ విననివారికి ప్రత్యేకమైన కృప దేవుడు చూపిస్తాడు అని ఊహించుకుంటునట్లైతే మనము భీకరమైన సమస్యలో చిక్కుకుంటాం. ఒకవేళ ఎన్నడూ సువార్త వినని ప్రజలు రక్షించబడినట్లైతే ,ఇంకా ఎవరూ సువార్త వినకుండా ఖచ్చితంగా చూడటం సత్కారికం. మనము మరీ హీనంగా చేయగలిగిందేటంటే ఒక వ్యక్తికి సువార్తనందించి మరియు అతడు లేక ఆమె తిరస్కరించుటకు విడచిపెట్టుట మాత్రమే. ఈ వ్హిధంగా జరిగినట్లయితే ఆమె లేక అతడు ఖండించబడతారు. ప్రజలు ఎవరైతే సువార్త వినరో వారు నిషేధించబడాలి, లేకపోయినట్లైతే సువార్త అందించుటకు ప్రేరణ వుండదు. సువార్తను తిరస్కరిస్తారని మరియు ఎన్నడూ సువార్త వినలేదని ఎందుకంటే ఇంతకుముందే రక్షింబడ్డామని గర్హీంచుకొంటూ వుండే వారి వెంట ఎందుకు విపత్కరంగా వెంటపడాలి?

toilax 5mg bhalsbrand.site toilax spc
rigevidon reddit rigevidon risks rigevidon quantity