Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించునుమత్తయి 2:23, యోహాను 7:42, అపో. కార్యములు 13:23, హెబ్రీయులకు 7:14, ప్రకటన గ్రంథం 5:5, ప్రకటన గ్రంథం 22:16
యెషయా 10:33-34 లో ప్రవక్త అష్షూరువారిని ఎత్తయిన చెట్లతో పోలుస్తూ దేవుడు వారిని కూల్చివేస్తాడని చెప్పాడు. ఇక్కడ చిగురు లేక చిన్న కొమ్మ గురించి చెప్తున్నాడు. ఈ అంకురం లేక కొమ్మ యెషయా 7:14 లోనూ యెషయా 9:6-7 లోనూ ఉన్న అభిషిక్తుడు, కుమారుడు, శిశువు తప్ప మరెవరూ కాదు. ఆయన సర్వాతీతుడైన దేవుని అవతారం, ప్రపంచాన్ని భావి కాలంలో పరిపాలించబోతున్నవాడు. యెష్షయి దావీదు తండ్రి. ఈ కొమ్మ పుట్టేది దావీదు వంశంనుండి. “మొద్దు”– యెషయా 6:13 చూడండి. దావీదు రాజ్యం అష్షూరు, బబులోను, రోమ్ వారి చేతుల్లో దాదాపు పూర్తిగా నాశనమై పోయినట్టే. చెట్టు పోయింది, వేరు మాత్రం మిగిలింది. “కొమ్మ”– యెషయా 4:2; యిర్మియా 23:5; యిర్మియా 33:15; జెకర్యా 3:8; జెకర్యా 6:12.
2. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును ఎఫెసీయులకు 1:17, 1 పేతురు 4:14
దేవుని కుమారుడు మానవుడుగా వచ్చినప్పుడు దేవుని సేవకులందరికీ జరగవలసిన రీతిగానే ఆయనకు దైవాత్మ అభిషేకం జరిగింది – యెషయా 61:1; మత్తయి 3:16; లూకా 4:16-21; అపో. కార్యములు 10:37-38. దేవుని సేవకులందరికీ ఈ వచనంలో ఉన్న ఆధ్యాత్మిక సామర్థ్యాలనూ, తోడ్పాటులనూ దేవుని ఆత్మ కొద్దో గొప్పో తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆయన క్రీస్తుకైతే ఈ ప్రభావాన్నీ తోడ్పాటులనూ మితం లేకుండా పరిపూర్ణంగా దయ చేశాడు (యోహాను 3:34). ఈ వచనంలోనూ, తరువాతి వచనం మొదటి భాగంలోనూ దేవుని పట్ల భయభక్తులు ఉండడంలో గల ప్రాముఖ్యత నొక్కి చెప్పడం చూస్తున్నాం. ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7 లో నోట్స్ చూడండి. యేసులో ఇలాంటి భయభక్తులు పూర్తిగా ఉన్నాయి. యోహాను 5:30; యోహాను 8:29; హెబ్రీయులకు 5:7; మార్కు 14:36 చూడండి. యేసు ఏ పని చేసినా ఏమి మాట్లాడినా కేవలం దేవుణ్ణి సంతోషపెట్టడం, ఘనపరచడం, దేవుని పేరును గొప్పచేయడం, ఆయనకు ఇష్టం లేనిది ఏమీ చేయకుండా చూచుకోవడం, ఇలాంటి ఉద్దేశాలతోనే చేశాడు. దేవుని పేరున ప్రార్థించే వారందరి ఉద్దేశాలూ ఇవే అయి ఉండాలి.
3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.యోహాను 7:24
యోహాను 2:25; యోహాను 7:24.
4. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును యోహాను 7:24, 2 థెస్సలొనీకయులకు 2:8, ప్రకటన గ్రంథం 19:11-15, ఎఫెసీయులకు 6:17
ఈ వచనాల నెరవేర్పు క్రీస్తు మొదటి రాకడను దాటి ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిపాలించే సమయంలో జరుగబోతున్నది. ఈ వచనంలో ఉన్న వర్ణనకు సరిపోయినదేదీ ఇంకా జరగలేదు. అందువల్ల ఇది భవిష్యత్తులో నెరవేరవలసి ఉంది. భూమి పై క్రీస్తు పరిపాలిస్తాడని ఈ నోట్స్ రచయిత నమ్మకం. దీన్ని గురించి యెషయా 2:1-4; యెషయా 9:7; ప్రకటన గ్రంథం 20:4-6 నోట్స్ చూడండి. ఇక్కడ మళ్ళీ పేదలపట్ల, అవసరతలో ఉన్నవారి పట్ల దేవుని శ్రద్ధను చూడగలం. “దండం”– కీర్తనల గ్రంథము 2:9; ప్రకటన గ్రంథం 19:15. “ఊపిరి”– 2 థెస్సలొనీకయులకు 2:8; యెషయా 30:28, యెషయా 30:33; యెషయా 40:7, యెషయా 40:24.
5. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.ఎఫెసీయులకు 6:14
ప్రకటన గ్రంథం 19:11.
6. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.
ఇలాంటి వర్ణనలు అక్షరాలా నెరవేరుతాయా లేక ఇది భూమి పై శాంతి భద్రతలను కావ్యరూపంగా సూచించడమేనా? క్రీస్తు భవిష్యత్తులో భూమి పై అక్షరాలా పరిపాలించే సమయంలో ఇవన్నీ అక్షరాలా నెరవేరుతాయని అనేకమంది పండితులు నమ్ముతారు. ఇలా అనుకోవడం పొరపాటని ఎవరు నిరూపించగలరు? యెషయా 65:25 లో కూడా దేవుడు సృష్టించబోయే క్రొత్త ఆకాశం, భూమి సన్నివేశాన్ని వర్ణించేటప్పుడు ఇలాంటి వివరాలే కనిపిస్తాయి (యెషయా 65:17).
7. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.
8. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును
9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.
సముద్రం సంపూర్ణంగా నీటితో నిండి ఉంటుంది. ఆ విధంగా భూమి యెహోవా గురించిన జ్ఞానంతో నిండిన సమయం యెషయా కాలం నుండి ఎప్పుడూ రాలేదు. అయితే భవిష్యత్తులో వస్తుంది (యెషయా 2:2-4).
10. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.రోమీయులకు 15:12, ప్రకటన గ్రంథం 5:5, ప్రకటన గ్రంథం 22:16
“ఆ కాలంలో”– అభిషిక్తుడైన యేసుప్రభువు ప్రత్యక్షమై పరిపాలించే కాలంలో అని అర్థం. ఇక్కడ ఆయనను యెష్షయి యొక్క వేరు అంటున్నాడు ప్రవక్త. వ 1 పోల్చి చూడండి. క్రీస్తు దావీదు కుమారుడు. అదే సమయంలో దావీదుకు ప్రభువు (కీర్తనల గ్రంథము 110:1). దావీదు వేరు, చిగురు రెండూ ఆయనే (యెషయా 22:41-45; ప్రకటన గ్రంథం 22:16). “వస్తారు”– ఒకవేళ ఇవి ఈ యుగంలో అనేకమంది క్రీస్తు మార్గానికి తిరుగుతున్న సంగతిని సూచించవచ్చు. అయితే రాబోయే యుగాన్ని ఈ మాటలు సూచిస్తున్నాయనుకొనేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది (ప్రకటన గ్రంథం 21:22-26).
11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును
“ఆ కాలంలో”– అభిషిక్తుని ప్రత్యక్షం, పరిపాలన కాలంలో అని అర్థం. అంటే ఇలా చెదిరిపోయిన ఇస్రాయేల్వారిని, యూదావారిని సమకూర్చడం క్రీ.పూ. 538లో ఆరంభమై యూదులు బబులోను, అష్షూరు రాజ్యాలనుండి స్వదేశం తిరిగి రావడం అని అనుకోవడం కష్టం. ఇస్రాయేల్వారు యూదావారు ప్రపంచమంతటికి చెదిరిపోయిన విషయాన్ని 11వ వచనంలోని మాటలు సూచిస్తున్నాయి. వారిని పోగు చెయ్యబోయేది కూడా ప్రపంచం నలుమూలల నుండే. బహుశా ఈ వచనాలు ఆమోసుప్రవక్త (యెషయా 9:14-15) చెప్పిన మాటలు ఒకే ఒక యూదుల సమకూర్పు గురించినదే. ఆ విధంగా వారిని సమకూర్చడం జరిగిన తరువాత వారిని తిరిగి పెళ్ళగించడం ఎన్నడూ జరగదని దేవుడు ఆమోసుద్వారా తెలియజేశాడు. అయితే క్రీ.పూ. 538లో ఆరంభమై యూదులు స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఇలా జరగలేదు. క్రీ. శ. 70లో మరోసారి యూదులను రోమ్వారు అక్కడినుంచి కదిలించి అనేక దేశాలకు చెదరగొట్టారు. మత్తయి 24:2; లూకా 19:41-44 లో యేసు ఇలా జరుగుతుందని చెప్పాడు.
12. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.
13. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు
ఇప్పటికి ఎఫ్రాయింవారి అసూయ సమసిపోయినా, యూదా విరోధులు ఇంకా నశించిపోలేదు. యెషయా 14:2; యెషయా 49:23 మొదలైన చోట్ల తమ పొరుగు రాజ్యాల పై ఇస్రాయేల్, యూదావారిదే పై చేయిగా ఉంటుందని చెప్పడం కనిపిస్తున్నది.
14. వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు
15. మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.ప్రకటన గ్రంథం 16:12
ఆ ప్రాంతంలో ఈ భౌగోళిక మార్పులింకా జరగలేదు. ప్రకటన గ్రంథం 16:12 లో కూడా ఇలాంటి సంగతి ఉంది.
16. కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
“రాజమార్గం”– యెషయా 57:14; యెషయా 62:10. ఈ అధ్యాయం ఈ సంఘ యుగంలో పూర్తిగా నెరవేరలేదని స్పష్టమే. యెషయా అనంత యుగాలను దృష్టిలో ఉంచుకుని రాస్తున్నాడని అనుకోవడానికి అవకాశం చాలా తక్కువ. వ 6-16 జంతువులలో ప్రకృతిలో కలగబోయే మార్పుల గురించి చెప్తున్నాయి. అనంత యుగాల్లో నాగుపాములు, కట్లపాములు ఉంటాయా? ఆ యుగాల్లో దేవుడు తన ప్రజలను సమకూర్చుకునే అవసరం ఉంటుందా (వ 12)? శాశ్వత యుగాల్లో దోచుకోవడం (వ 14) జరగదు గదా. ఆ యుగాల్లో వ 15,16లో ఉన్న మార్పులు కలిగించడం అవసరంగా ఉంటుందా? ఈ అధ్యాయం గతంలో ఇస్రాయేల్ దేశంలో నెరవేరలేదు. ఈ సంఘ యుగంలో నెరవేరడం లేదు. ఇది అనంత యుగాలకు ముందు నెరవేరవలసి ఉంటే నెరవేరబోయే కాలం వెయ్యేళ్ళ పరిపాలన కాలమేనని తోస్తుంది.