Matthew - మత్తయి సువార్త 21 | View All

1. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి

1. వాళ్ళు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు:

2. మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడి దయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కన బడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి;

2. “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి.

3. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడలఅవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను.

3. ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.”

4. ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదే మనగా

4. దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది:

5. ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కినీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.
యెషయా 62:11, జెకర్యా 9:9

5. “గాడిదనెక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు చూడు! బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు! అని సీయోను కుమారితో చెప్పండి.” జెకర్యా 9:9

6. శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి

6. శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు.

7. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.

7. గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు.

8. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.

8. అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు.

9. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
కీర్తనల గ్రంథము 118:25-26

9. ఆయనకు ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు. “దావీదు కుమారునికి హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్నవాడు ధన్యుడు! మహోన్నతమైన స్థలములో హోసన్నా!”28 కీర్తన 118:26

10. ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయుఈయన ఎవరో అని కలవరపడెను.

10. యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని ప్రజలు ప్రశ్నించారు.

11. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.

11. “ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు.

12. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి

12. యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను. పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు.

13. నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
యెషయా 56:7, యెషయా 60:7, యిర్మియా 7:11

13. ఆయన వాళ్ళతో,”‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’ అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు.

14. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

14. గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు.

15. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి
కీర్తనల గ్రంథము 118:25

15. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా!’ అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది.

16. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి
కీర్తనల గ్రంథము 8:2

16. “చిన్న పిల్లలేమంటున్నారో నీవు విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు. యేసు, “విన్నాను, ‘చిన్న పిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేసావు! ‘అని వ్రాసారు. ఇది మీరు ఎన్నడూ చదువలేదా?” అని అన్నాడు.

17. వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతని యకు వెళ్లి అక్కడ బసచేసెను.

17. ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు.

18. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.

18. ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది.

19. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను.

19. యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.

20. శిష్యులదిచూచి ఆశ్చర్యపడిఅంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.

20. శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు.

21. అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

21. యేసు, “ఇది సత్యం మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది.

22. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

22. దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.

23. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా

23. యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.

24. యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును.

24. యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను.

25. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారుమనము పరలోక మునుండి అని చెప్పితిమా, ఆయనఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును;

25.

26. మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి

26.

27. అందుకాయనఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.

27. అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు. ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు.

28. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చికుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా

28. “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.

29. వాడుపోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను.

29. “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు.

30. అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడుఅయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను.

30. “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు.

31. అందుకు వారుమొదటివాడే అనిరి. యేసుసుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

31. “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాలించారు? అని యేసు అడిగాడు.” “మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు.

32. యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్ము నట్లు పశ్చాత్తాపపడక పోతిరి.

32. మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.

33. మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.
యెషయా 5:1-7

33. “ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి ఉండేవాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షరసాన్ని తీయటానికి ఒక గానుగను, తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు.

34. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా

34. కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు.

35. ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి.

35. “ఆ రైతులు, ఆ సేవకుల్ని పట్టుకొని వాళ్ళలో ఒకణ్ణి కొట్టారు. మరొకణ్ణి చంపారు. మూడవవాణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు.

36. మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.

36. ఆ ఆసామి ఈ సారి మొదటి కన్నా యింకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు. కాని ఆ రైతులు వాళ్ళ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు.

37. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.

37. ఆ ఆసామి ‘నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు!’ అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.

38. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందమురండని తమలో తాము చెప్పుకొని

38. కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి ‘ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్ణి చంపేసి అతని ఆస్థిని తీసుకొందాం” అని పరస్పరం మాట్లాడుకొన్నారు.

39. అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.

39. ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోటకవతల పారవేసారు.

40. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయుననెను.

40. “మరి ఆ ద్రాక్షతోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు?”

41. అందుకు వారుఆ దుర్మార్గులను కఠిన ముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి.

41. వాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమాధానం చెప్పారు.

42. మరియయేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా?
కీర్తనల గ్రంథము 118:22-23

42. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “లేఖనాల్లో మీరీ విషయం ఎన్నడూ చదువలేదా? ‘ఇట్లుకట్టువాళ్ళు తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది. ఇది ప్రభువు చేసాడు. ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది!’ కీర్తన 118:22-23

43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొల గింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.

43. “అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసికొని, ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు యిస్తాడు.

44. మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను.
యెషయా 8:14-15, దానియేలు 2:34-35, దానియేలు 2:44-45

44. ఈ బండ మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.”

45. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి

45. ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్టుగా గ్రహించారు.

46. ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.

46. వాళ్ళు ఆయన్ని బంధించటానికి మార్గాన్ని వెతికారు. కాని ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకొనే వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల్ని చూసి భయపడి పోయారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 21 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible


క్రీస్తు యెరూషలేములో ప్రవేశించాడు. (1-11) 
జెకర్యా 9:9లో జెకర్యా ప్రవక్త ద్వారా క్రీస్తు రాక గురించి ముందే చెప్పబడింది. క్రీస్తు తన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు, అది మహిమ కంటే సాత్వికతతో వర్ణించబడింది, మోక్షం కోసం దయను నొక్కి చెబుతుంది. జియోన్ రాజు జెరూసలేంలోకి విజయవంతమైన ప్రవేశం సమయంలో సౌమ్యత మరియు బాహ్య పేదరికాన్ని ప్రదర్శించాడు, జియాన్ పౌరులలో దురాశ, ఆశయం మరియు జీవిత గర్వం యొక్క తప్పుగా ఉంచబడిన విలువలకు విరుద్ధంగా హైలైట్ చేశాడు. వారు గాడిదను అందించినప్పటికీ, దానిని ఉపయోగించే ముందు యేసు యజమాని యొక్క సమ్మతిని కోరాడు మరియు అందుబాటులో ఉన్న ఉచ్చులు ఉపయోగించబడ్డాయి. క్రీస్తు సేవలో సమర్పించబడటానికి మనపైన ఏదీ, మన వస్త్రాలు కూడా చాలా విలువైనవిగా పరిగణించబడకూడదనే ఆలోచనను ఇది నొక్కిచెబుతోంది.
తరువాత, ప్రధాన యాజకులు మరియు పెద్దలు యేసును సిలువపై దుర్మార్గంగా ప్రవర్తించిన గుంపుతో జతకట్టారు, కాని వారు ఆయనను గౌరవించిన వారితో చేరలేదు. క్రీస్తును తమ రాజుగా అంగీకరించే వారు ఆయన అధికారం క్రింద సమస్తమును అప్పగించాలి. "హోసన్నా" యొక్క కేకలు, "ఇప్పుడు రక్షించు, మేము నిన్ను వేడుకుంటున్నాము! ప్రభువు నామంలో వచ్చేవాడు ధన్యుడు!" విజయవంతమైనట్లు అనిపించవచ్చు, కానీ ప్రజల ఆమోదం యొక్క చంచలత్వం స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే అదే సమూహం "అతన్ని సిలువ వేయండి" అని కేకలు వేయడానికి సులభంగా మారవచ్చు. ప్రజల కరతాళ ధ్వనులు నశ్వరమైనవి, మరియు అనేకమంది సువార్తను ఆమోదించినట్లు కనిపించినప్పటికీ, కొంతమంది మాత్రమే స్థిరమైన శిష్యులుగా మారడానికి కట్టుబడి ఉంటారు. యేసు జెరూసలేంలోకి ప్రవేశించినప్పుడు, నగరం మొత్తం కదిలిపోయింది, కొంతమంది ఇజ్రాయెల్ యొక్క ఓదార్పుని ఊహించి ఆనందాన్ని అనుభవించారు, మరికొందరు, ముఖ్యంగా పరిసయ్యులు అసూయతో కదిలారు. సమీపిస్తున్న క్రీస్తు రాజ్యం ప్రజల హృదయాలలో మరియు మనస్సులలో వివిధ ప్రతిచర్యలను పొందుతుంది.

ఆయన ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిని వెళ్లగొట్టాడు. (12-17) 
కొన్ని దేవాలయాల కోర్ట్‌లు పశువులు మరియు బలిదానాలలో ఉపయోగించే వస్తువులకు మార్కెట్ ప్లేస్‌గా మారాయని, డబ్బు మార్చేవారు స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించారని క్రీస్తు కనుగొన్నాడు. తన పరిచర్య ప్రారంభంలో చేసినట్లే యోహాను 2:13-17, యేసు వారిని ఆ ప్రాంతం నుండి వెళ్లగొట్టాడు. అతని చర్యలు మరియు పనులు హోసన్నల కంటే బిగ్గరగా మాట్లాడాయి మరియు ఆలయంలో అతని స్వస్థత, తరువాతి ఇంటి వైభవం పూర్వపు ఇంటి వైభవాన్ని అధిగమిస్తుందనే వాగ్దానాన్ని నెరవేర్చింది. క్రీస్తు నేడు తన కనిపించే చర్చిలోని అనేక విభాగాల్లోకి ప్రవేశించినట్లయితే, అతను అనేక దాగివున్న చెడులను బహిర్గతం చేసి శుద్ధి చేస్తాడు. మతం ముసుగులో అనేక కార్యకలాపాలు, ప్రార్థనా మందిరం కంటే దొంగల గుహకు తగినవిగా వెల్లడవుతాయి.

బంజరు అంజూరపు చెట్టు శపించింది. (18-22) 
బంజరు అంజూరపు చెట్టును శపించడం సాధారణంగా కపటవాదుల స్థితికి ప్రతీకగా ప్రాతినిధ్యం వహిస్తుంది. క్రీస్తు నిజమైన మత శక్తిని ప్రకటించే వారి నుండి మరియు దాని యొక్క నిజమైన సారాంశాన్ని దాని బాహ్య రూపాన్ని మాత్రమే ప్రదర్శించే వారి నుండి ఆశిస్తున్నాడనే పాఠాన్ని ఇది తెలియజేస్తుంది. తరచుగా, తమ వృత్తిలో బాహ్యంగా అభివృద్ధి చెందుతున్న వారి నుండి క్రీస్తు యొక్క న్యాయమైన అంచనాలు నెరవేరవు; అతను చాలా మందిని సంప్రదించాడు, ఆధ్యాత్మిక ఫలాలను కోరుకుంటాడు, కేవలం ఉపరితల ఆకులను కనుగొనడానికి.
విశ్వాసం యొక్క తప్పుడు వృత్తి ఈ ప్రపంచంలో తరచుగా వాడిపోతుంది, మరియు ఈ వాడిపోయే ప్రభావం క్రీస్తు శాపానికి ఆపాదించబడింది. పండు లేని అంజూరపు చెట్టు త్వరగా ఆకులను కోల్పోతుంది. ఇది యూదు దేశం మరియు దాని ప్రజల స్థితిని ప్రతిబింబిస్తుంది. యేసు వాటిని పరిశీలించినప్పుడు, అతనికి గణనీయమైన ఏదీ కనిపించలేదు—ఆకులు మాత్రమే. క్రీస్తును తిరస్కరించిన తరువాత, ఆధ్యాత్మిక అంధత్వం మరియు కాఠిన్యం వారిని అధిగమించాయి, ఇది వారి అంతిమ పతనానికి మరియు వారి దేశం యొక్క నాశనానికి దారితీసింది. ప్రభువు చర్యలు వారి ఫలించకపోవడానికి ప్రతిస్పందనగా ఉన్నాయి. బంజరు అంజూరపు చెట్టుపై ఉచ్ఛరించే తీర్పు మనలో లోతైన ఆందోళనను రేకెత్తించే ముఖ్యమైన హెచ్చరికగా ఉపయోగపడనివ్వండి.

దేవాలయంలో యేసు ప్రసంగం. (23-27) 
మన ప్రభువు తనను తాను మెస్సీయ అని బహిరంగంగా వెల్లడించినప్పుడు, ప్రధాన పూజారులు మరియు శాస్త్రులు చాలా బాధపడ్డారు, ప్రత్యేకించి అతను వారు ఆమోదించిన దుర్వినియోగాలను బహిర్గతం చేసి సరిదిద్దాడు. యోహాను పరిచర్య మరియు బాప్టిజం గురించి యేసు వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాడు. తరచుగా, ప్రజలు తమ సొంత ఆలోచనలు, ఆప్యాయతలు, ఉద్దేశాలు లేదా గుర్తుంచుకోవడం లేదా మరచిపోయే సామర్థ్యం గురించి అబద్ధాలు మాట్లాడటానికి దారితీసే పాపం కంటే మోసపూరితమైన అవమానానికి ఎక్కువగా భయపడతారు. వారి ప్రశ్నకు సమాధానంగా, చెడ్డ విరోధులతో అనవసరమైన వివాదాలను నివారించే జ్ఞానాన్ని నొక్కి చెబుతూ, యేసు సమాధానం ఇవ్వకూడదని ఎంచుకున్నాడు.

ఇద్దరు కుమారుల ఉపమానం. (28-32) 
మందలింపు కోసం రూపొందించబడిన ఉపమానాలు నేరస్తులను సూటిగా సంబోధిస్తాయి, వారి స్వంత పదాలను ఉపయోగించి వారిని జవాబుదారీగా ఉంచుతాయి. ద్రాక్షతోటలో పని చేయడానికి నియమించబడిన ఇద్దరు కుమారుల ఉపమానం, జాన్ యొక్క బాప్టిజం యొక్క చట్టబద్ధత గురించి తెలియని లేదా సందేహాస్పదంగా ఉన్నవారు దానిని అంగీకరించి మరియు అంగీకరించిన వారిచే అవమానించబడ్డారని వివరిస్తుంది. మానవాళి మొత్తం ప్రభువు పెంచిన పిల్లలను పోలి ఉంటుంది, కానీ చాలామంది అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఎంచుకున్నారు, కొందరు అవిధేయత యొక్క మోసపూరిత రూపాన్ని ప్రదర్శిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధైర్యమైన తిరుగుబాటుదారుడు పశ్చాత్తాపానికి దారితీసి దేవుని సేవకుడిగా మారడం తరచుగా జరుగుతుంది, అయితే ఫార్మాలిస్ట్ గర్వం మరియు శత్రుత్వంతో స్థిరపడతాడు.

దుష్టులైన భర్తల ఉపమానం. (33-46)
ఈ ఉపమానం యూదు దేశం యొక్క పాపం మరియు పతనాన్ని సూటిగా వర్ణిస్తుంది, బాహ్య చర్చి యొక్క అధికారాలలో పాలుపంచుకునే వారందరికీ హెచ్చరికగా ఉపయోగపడే పాఠాలతో. దేవుని ప్రజలతో వ్యవహరించే విధానం క్రీస్తు భౌతికంగా ఉన్నట్లయితే వ్యక్తులు అతనితో ఎలా ప్రవర్తిస్తారో ప్రతిబింబిస్తుంది. అతని కారణానికి నమ్మకంగా ఉన్నవారికి, దుష్ట లోకం నుండి లేదా క్రైస్తవ మతానికి భక్తిహీనమైన అనుచరుల నుండి అనుకూలమైన ఆదరణను ఆశించడం అవాస్తవమైన నిరీక్షణగా మారుతుంది. ద్రాక్షతోట మరియు దాని ప్రయోజనాలను కలిగి ఉన్న మనం, ఒక సంఘంగా, కుటుంబంగా లేదా వ్యక్తులుగా, సరైన కాలంలో ఫలాలను అందిస్తామా అనే దాని గురించి ఆలోచించమని ఇది మనల్ని ప్రేరేపిస్తుంది.
తన ప్రశ్నను వేస్తూ, మన రక్షకుడు ద్రాక్షతోటకు ప్రభువు వస్తాడని మరియు ఆయన రాకతో దుష్టులపై ఖచ్చితంగా తీర్పు తెస్తాడని నొక్కి చెప్పాడు. ప్రధాన యాజకులు మరియు పెద్దలు, బిల్డర్లుగా పనిచేస్తున్నారు, క్రీస్తు బోధలను మరియు చట్టాలను తిరస్కరించారు, అతన్ని తృణీకరించబడిన రాయిగా భావించారు. అయితే, యూదుల తిరస్కరణ అన్యజనులు అతనిని కౌగిలించుకునేలా చేసింది. సువార్త మార్గాలను ఉపయోగించడం ద్వారా ఫలాలను పొందేవారిని క్రీస్తు గుర్తించాడు. పాపుల అపనమ్మకం అంతిమంగా వారి నాశనానికి దారి తీస్తుంది, అయినప్పటికీ దేవుడు కోపం యొక్క ప్రకోపాన్ని అరికట్టడానికి మరియు దానిని తన కీర్తికి మార్చడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తాడు. క్రీస్తు తన చర్చికి బలమైన పునాది మరియు మూలస్తంభంగా మన ఆత్మలకు విలువైనదిగా మారాలి. ఆయన నిమిత్తము అసహ్యమైనా, ద్వేషాన్నీ సహించేటప్పటికి మనం ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉంటాము.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |