Matthew - మత్తయి సువార్త 27 | View All

1. ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి

మత్తయి 26:66.

2. ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.

ఇస్రాయేల్‌దేశాన్ని రోమ్‌వారు పరిపాలిస్తున్నారు. రోమ్ ఆ కాలంలో అన్ని రాజ్యాల్లోకీ అతి శక్తివంతమైనది. జెరుసలం యూదయ రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్రాధిపతి పిలాతు. ఎవరికైనా మరణశిక్ష విధించేందుకు యూదుల నాయకులకు అధికారం లేదు కాబట్టి వారు యేసును పిలాతు దగ్గరికి తీసుకుపోయారు (యోహాను 18:31).

3. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి

1 తిమోతికి 6:10. యూదా పశ్చాత్తాపపడి దేవుని కృపపై ఆధారపడలేదు. వ 5ను బట్టి ఇది స్పష్టం అయింది. తాను చేసిన అనేక పాపాలకు మరోదాన్ని చేర్చాడు. అతడి దుఃఖం కేవలం లౌకికమైనది – 2 కోరింథీయులకు 7:10.

4. నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా

అందరూ ఎరిగినట్టుగానే యేసు ఏ తప్పూ లేని నిర్దోషి అని యూదాకు కూడా తెలుసు (మత్తయి 26:60). తాము పాపం చేశామని మరి కొందరు దుర్మార్గులు ఒప్పుకున్నారు – నిర్గమకాండము 9:27; 1 సమూయేలు 26:21. పాపాన్ని విడిచిపెట్టకుండా కేవలం ఒప్పుకుని ఊరుకోవడం వ్యర్థం (సామెతలు 28:13). యూదుల అధికారులైతే యూదాకన్నా మరింత కఠినులనీ, నిర్దయులనీ, భ్రష్టులనీ తమ ప్రవర్తన ద్వారా బయట పెట్టుకున్నారు.

5. అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.

ఒక వ్యక్తి తనను తాను హత్య చేసుకోవడం యూదులు ఘోర పాపంగా ఎంచడం న్యాయమే. ఇతరులను చంపడానికి ప్రజలకు హక్కు లేనట్టుగానే, తనను తాను చంపుకోవడానికి కూడా వారికి హక్కు లేదు.

6. ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసికొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.

యేసును పట్టుకుని చంపించడంకోసం తాము చెల్లించిన డబ్బు కాబట్టి వారు దాన్ని “రక్తాన్ని కొన్న డబ్బు” అన్నారు. దేవునికి అర్పించేందుకు అది తగిన ధనం కాదని వారికి తెలుసు. దేవుని ఏకైక కుమారుణ్ణి అన్యాయంగా చంపడానికి నిశ్చయించుకుని ఉన్న సమయంలో కూడా బయటి ఆచారాలను పాటించడం విషయంలో ఎంత పట్టింపు, శ్రద్ధ చూపుతున్నారో చూడండి.

7. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి.

ఇది యిర్మియా 32:6-9; జెకర్యా 11:12-13 నెరవేర్పు. పొలం కొనడం గురించి యిర్మీయా రాశాడు. జెకర్యా 30 వెండి నాణేల గురించి, కుమ్మరివాడి గురించి రాశాడు (బహుశా ఇతడు రాసిన మాటలు ముందు యిర్మీయా పలికినవే అని రాయకపోయి ఉండవచ్చు). ఈ వాక్యాలను పోల్చి చూడండి: అపో. కార్యములు 20:35 (శుభవార్తల్లో ఎక్కడా రాసిలేని మాట); యూదా 1:14 (ఆదికాండంలో ఈ మాట లేదు). తన వాక్కు నెరవేర్చుకోవడానికి దేవుడు భయభక్తులు, నమ్మకం లేనివారి మనసుల్లో, చర్యల్లో కూడా ఎలా పని చేస్తాడో గమనించండి. యోహాను 11:49-53; అపో. కార్యములు 2:22-23 పోల్చి చూడండి.

8. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.

9. అప్పుడువిలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది
యిర్మియా 32:6-9, జెకర్యా 11:12-13

10. వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.
యిర్మియా 32:6-9, జెకర్యా 11:12-13

11. యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను

యూదుల అధికారులు యేసుపై మోపిన మరో నేరమేమిటంటే రోమ్‌కు వ్యతిరేకంగా యేసు యూదులపై రాజుగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని. లూకా 23:2, లూకా 23:14; యోహాను 19:12 చూడండి. యేసు అవునని జవాబిచ్చాడు. గానీ ఈ భూమిపై రాజకీయ అధికారం కోసం తాను ప్రయత్నిస్తున్నానని చెప్పలేదు – యోహాను 18:36-37.

12. ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.
యెషయా 53:7

మత్తయి 26:63; 1 పేతురు 2:23. పిలాతు ఇంతవరకు చాలామంది నేరస్థులను విచారణ చేసి ఉంటాడు. అయితే తమపై మోపిన నేరాలు తాము చెయ్యలేదని దాదాపుగా అందరూ చెప్పేవారు. కనీసం ఏదో ఒక సాకు చెప్పేవారు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నవారిని బహుశా ఎప్పుడూ చూచి ఉండడు.

13. కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.

14. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
యెషయా 53:7

15. జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.

పస్కా సమయంలో ప్రతి ఏటా అతడు ఇలా చేసేవాడు.

16. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.

బరబ్బ తిరుగుబాటుదారుడు, హంతకుడు (మార్కు 15:7; లూకా 23:19).

17. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని

యేసును విడుదల చెయ్యాలని వారు అడుగుతారన్న ఆశతో పిలాతు ఇలా అన్నాడు. సాక్ష్యాధారాలను పరిశీలించడమెలాగో అతనికి తెలుసు కాబట్టి త్వరగానే యేసు నిర్దోషి అని గ్రహించాడు. అతణ్ణి తన చేతుల్లోనుంచి వదిలించుకోవాలని చూశాడు (లూకా 23:4, లూకా 23:7, లూకా 23:16, లూకా 23:22; యోహాను 19:12).

18. విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను

అసూయ అనేది ఎంత ప్రాణాంతకమైన ఘోర పాపమో చూడండి. అపో. కార్యములు 7:9; అపో. కార్యములు 13:45; అపో. కార్యములు 17:5 పోల్చి చూడండి. అసూయ విషయం జాగ్రత్తగా ఉందాము. అది మనచేత భయంకరమైన నేరాలు చేయించగలదు (సామెతలు 14:30; సామెతలు 27:4; రోమీయులకు 13:13; 1 కోరింథీయులకు 3:3; 2 కోరింథీయులకు 12:20; గలతియులకు 5:26; యాకోబు 3:14, యాకోబు 3:16; యాకోబు 4:2).

19. అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను.

యేసు నిర్దోషి అని మరోసారి ప్రకటించబడింది. ఈసారి ఎవరూ ఊహించని వైపునుంచి అది వచ్చింది. అయినా యేసును సిలువ వేయించకుండా ఉండేలా అది పిలాతును ఆపలేకపోయింది.

20. ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి

అధికారం, శక్తి ఉన్న అన్యాయస్థులు ప్రజల గుంపుల్ని తరచుగా బహు తేలికగా రెచ్చగొట్టగలరు. కీడు చేసేందుకు గుంపులో పడి పరుగెత్తడం గురించి దేవుడు మనల్ని హెచ్చరించాడు (నిర్గమకాండము 23:2). తప్పు చేయడానికి ఉరకలు వేస్తున్న గుంపుకు ఎదురు నిలిచి సరైనది చెయ్యగలగడానికి, గుణం బలమైన వ్యక్తిత్వం అవసరం.

21. అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు బరబ్బనే అనిరి.

దేవుని పవిత్ర కుమారుణ్ణి తృణీకరించి వారొక హంతకుణ్ణి కోరుకున్నారు (అపో. కార్యములు 3:13-14). వారికంటే మనం స్వభావసిద్ధంగా మంచివాళ్ళం అని ఆలోచించవద్దు. మన భ్రష్ట స్వభావం ఎలాంటిదో నేర్చుకుందాం (యిర్మియా 17:9; రోమీయులకు 3:9, రోమీయులకు 3:19, రోమీయులకు 3:23).

22. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి.

పిలాతు వేసినది అందరూ తలపోయవలసిన ప్రశ్న. మనం క్రీస్తును ఏం చేస్తామో అదే మన శాశ్వత గమ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం ఆయన్ను స్వీకరించి, ఆయనతో శాశ్వతంగా ఉంటాం. లేదా మన గతి అగ్ని సరస్సు పాలే (మత్తయి 25:41, మత్తయి 25:46). ఆయన్ను నిరాకరించడమంటే ఆయన్ను సిలువ వేసిన ఆయన శత్రువుల పక్షం చేరడమే. “సిలువ”– ఇది రోమ్‌వారి శిక్షా పద్ధతి. ఒక నిలువుకొయ్యకు అడ్డకొయ్య కట్టారు. మరణశిక్ష పడిన వాడి కాళ్ళను నిలువుకొయ్య ఒక చివరన మేకులతో కొట్టారు. చేతులు రెంటినీ అడ్డకొయ్య రెండు వైపులా మేకులతో కొట్టారు. అప్పుడు సిలువను గుంటలో పూడ్చి నిలబెట్టారు. ఇది చాలా క్రూరమైన అనాగరికమైన మరణశిక్ష. యేసు చేసిన ఒక్క చెడ్డపని ఇదని ఆయన బద్ధ శత్రువులు కూడా చెప్పలేకపోయారు (మత్తయి 26:59-60 కూడా చూడండి). వారు చెయ్యగలిగినదల్లా ఆయనకు వ్యతిరేకంగా చిందులు తొక్కుతూ గొంతు చించుకోవడమే.

23. అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారుసిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

24. పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొనిఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 21:6-9, కీర్తనల గ్రంథము 26:6

ఇలా చేసి బాధ్యతనుంచి తప్పించుకోవాలని చూడడం వ్యర్థం. పిలాతు అక్కడున్నది న్యాయం చెయ్యడానికి. కానీ పాపభరితమైన తన బలహీనతలో యూదులను ఊరుకోబెట్టడానికి ఒక మనిషిని క్రూరమైన మరణానికి వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అలా చేయడంలో తానుకూడా వారి దోషాన్ని పంచుకున్నాడు. దేవుడు మనపై పెట్టే బాధ్యతనుంచి ఎప్పుడైనా ఏ విధంగానైనా చేతులు కడిగేసుకుని తప్పించుకోవడం అసాధ్యం. పాపాన్నీ, దోషాన్నీ కేవలం ఇక్కడ పిలాతు ఎవరిని సిలువకు అప్పగించాడో ఆయన రక్తంద్వారా మాత్రమే కడగడానికి వీలుంది (మత్తయి 26:28).

25. అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
యెహెఙ్కేలు 33:5

“రక్తం”అంటే ఇక్కడ ఆయన చావుకు బాధ్యత అని అర్థం. యేసు హత్యా దోషాన్ని భరించడానికి వారు సిద్ధమే. అంతేగాక తమ సంతానాన్ని కూడా ఇందులో దోషులుగా చేయడానికి సిద్ధమే. ఆయనపై అర్థం పర్థం లేని వారి ద్వేషం అంత గొప్పదన్నమాట. పాపానికి లొంగిపోయిన మనుషులు వీలైతే దేవుణ్ణే చంపడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగానే ఆయన యేసుప్రభువుగా అవతరించి వారి చేతులకు చిక్కినప్పుడు అక్షరాలా అలా చేశారు కూడా.

26. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

తన దేశం చట్టాలను, దేవుని చట్టాన్ని, తన అంతర్వాణిని పిలాతు అతిక్రమించాడు. ఒక మనిషిని చంపడానికి కొన్నిసార్లు వారు కొట్టే కొరడాదెబ్బలే చాలు. తన భ్రష్టత్వంలో బలహీనతలో పిలాతు యేసును అలాంటి శిక్షకు, సిలువకు రెంటికీ అప్పగించాడు.

27. అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి.

దీనికి పిలాతు కూడా బాధ్యుడే. వీళ్ళు అతడి సైనికులే. యేసుపై మోపిన నేరాల్లో ఒకటి ఆయన తనను తాను రాజుగా చేసుకుంటున్నాడన్నది (వ 11). సైనికుల వెక్కిరింతలు ఇందుకే. ఎర్రటి వస్త్రం రాజులు వేసుకునేది. రెల్లుకర్రను ఎగతాళిగా రాజదండానికి మారుగా ఆయన చేతిలో పెట్టారు. రాజులకు కిరీటాలుంటాయి గనుక యేసుకు కూడా ఒకటి పెట్టారు. యేసు పరలోక మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు (ప్రకటన గ్రంథం 19:16). మానవ భ్రష్ట స్వభావం ఆ ఘనతను ఆయనకివ్వకుండా, దానంతటినీ క్రూరమైన అవహేళనగా మార్చివేసింది. రోమీయులకు 8:7 లోని అర్థాన్ని మనం నేర్చుకోవాలి.

28. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి

29. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

30. ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.
యెషయా 50:6

మత్తయి 26:67.

31. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.

32. వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి.

మొదట యేసే తన సిలువను మోశాడు (యోహాను 19:17). తాను తిన్న దెబ్బలవల్ల నీరసించిపోయినందుచేత ఇక మోయలేక పోయాడన్నమాట?

33. వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి

కల్వరికి హీబ్రూ పేరు గొల్గొతా. ఈ రెంటికీ ఒకటే అర్థం “కపాలం”. ఇది జెరుసలం ప్రాకారం బయట ఉంది.

34. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
కీర్తనల గ్రంథము 69:21, కీర్తనల గ్రంథము 69:26

కీర్తనల గ్రంథము 69:21. మరణశిక్ష పొందబోయేవారికి మత్తెక్కించి, ఎక్కువగా నొప్పి తెలియకుండా చేసేందుకు ఇలా చేశారు. మానవ పాపాలకోసం పడవలసిన బాధనంతటినీ పూర్తిగా అనుభవించేందుకు యేసు ఎన్నుకున్నాడు.

35. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.
కీర్తనల గ్రంథము 22:18

వ 26; కీర్తనల గ్రంథము 22:18. వారు అంటే రోమ్ సైనికులు.

36. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి యుండిరి.

ఆయన చనిపోయేవరకు ఆయన్నెవరూ తీసుకుపోకుండా కాపలా కాయడమే వారి పని.

37. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.

ఇది పిలాతు చేసిన పని (యోహాను 19:19). యేసును తమ రాజుగా తిరస్కరించిన యూదుల పట్ల హేళన పూర్వకంగా అలా రాయించాడు. అయితే తాను నమ్మినదానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ సత్యాన్నే అతడు రాయించాడు. నేరస్థుల్ని సిలువ వేసినప్పుడు వారిపై మోపిన నేరాలను ఒక కొయ్య పలకపై రాసి వారి తలలకు పైగా తగిలించడం వాడుక.

38. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువవేయ బడిరి.
యెషయా 53:12, కీర్తనల గ్రంథము 69:21

యెషయా 53:12.

39. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు
కీర్తనల గ్రంథము 22:7, కీర్తనల గ్రంథము 109:25, విలాపవాక్యములు 2:15

కీర్తనల గ్రంథము 22:6-18 లో ఈ సమయాన యేసుప్రభువు అంతరంగంలోని అనుభవం వెల్లడి అయింది.

40. దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

ఇక్కడ కూడా ఆయన మాటలను వీరు వక్రం చేశారు (మత్తయి 26:61).

41. ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు

42. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

యేసుప్రభువుకు తనను తాను రక్షించుకోవడానికి మనసు లేదు కాబట్టే రక్షించుకోలేకపోయాడు. మత్తయి 26:53 పోల్చి చూడండి. లోకానికి రావడంలో అసలు ఆయన ఉద్దేశమే లోకమంతటి పాపాలకోసం తనను తాను బాధలకూ మరణానికీ అర్పించుకునేందుకు (మత్తయి 20:28). ఒకవేళ ఆయన యూదుల వెక్కిరింతలను పట్టించుకుని సిలువనుంచి తిరిగి వస్తే ఎన్నడూ ఎవరూ పాపవిముక్తి పొందేవారు కారు.

43. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
కీర్తనల గ్రంథము 22:8

యేసు దేవునిమీద నమ్మకముంచడం అంటే సిలువనుంచి విడుదల కావాలని కాదు. ఇంతకన్నా గొప్ప విడుదల జరగబోతున్నది – అది సమాధినుంచీ మరణంనుంచీ (మత్తయి 28:6; అపో. కార్యములు 3:15).

44. ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.

ఈ ఇద్దరు దొంగల్లో ఒకడు తరువాత మనసు మార్చుకున్నాడు (లూకా 23:39-43).

45. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
ఆమోసు 8:9

ఇది దేవుడు పంపిన అద్భుతమైన సూచన. పాపులకోసం న్యాయమైన శిక్షను భరిస్తున్నవాడుగా యేసు ప్రవేశించిన ఆత్మ సంబంధమైన అంధకారాన్ని ఇది సూచిస్తున్నది. మత్తయి 8:12; మత్తయి 22:13; మత్తయి 25:30; లూకా 22:53; ఎఫెసీయులకు 5:8; కొలొస్సయులకు 1:13; 2 పేతురు 2:4, 2 పేతురు 2:17; యూదా 1:13 చూడండి. లోకానికి వెలుగుగా ఉన్న యేసు (యోహాను 8:12) అలా చీకటిలో మునగడం అంటే అది ఎంత భయంకరమైన అనుభవమో ఆయనకే తెలుసు.

46. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
కీర్తనల గ్రంథము 22:1

“చేయి...పెట్టావు”– కీర్తనల గ్రంథము 22:1 ను, దాని నోట్‌ను చూడండి. ఇందులో కూడా పాపులకు పడవలసిన శిక్షను ప్రభువు భరిస్తున్నాడు (మత్తయి 7:23; మత్తయి 25:41; 2 థెస్సలొనీకయులకు 1:9). తండ్రి అయిన దేవుడు ఆయన్ను వదిలేశాడు. దేవుని ముఖకాంతీ, ఆయన సన్నిధి ఆనందమూ తొలగిపోయాయి. ఆయన్ను నలగ్గొట్టడం దేవుని సంకల్పం (యెషయా 53:10). ఆయన మనకోసం పాపంగా చెయ్యబడి (2 కోరింథీయులకు 5:21) పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని కోపాన్ని అనుభవించాడు.

47. అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.

ఆయన మాటలు వారికి అర్థం కాలేదు.

48. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;

కీర్తనల గ్రంథము 69:21.

49. తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి.

50. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

యోహాను 19:30 లో ఆయన చెప్పేదేమిటో తెలుస్తున్నది. యేసుప్రభువు స్వేచ్ఛాపూర్వకంగా ప్రాణం విడిచాడు. ఎవరూ ఆయన్నుంచి దాన్ని తీసుకోలేరు (యోహాను 10:17-18).

51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;
నిర్గమకాండము 26:31-35

దేవునినుంచి మరో అద్భుత సూచన. ఈ తెరకున్న అంతరార్థం కోసం నిర్గమకాండము 26:31-33 నోట్ చూడండి. ఈ తెరను దేవుడే రెండు ముక్కలు చేశాడనుకోవడంలో సందేహం ఉందా? తెర చినగడమంటే క్రీస్తు బలి అర్పణ మూలంగా దేవుని సన్నిధిలోకి మార్గం ఏర్పడిందన్నమాట – హెబ్రీయులకు 9:3, హెబ్రీయులకు 9:8; హెబ్రీయులకు 10:19-22. దాదాపుగా ఈ సమయంలో ఒక యాజి పవిత్ర స్థలంలో ధూప ద్రవ్యం వేస్తూ నిలబడి ఉంటాడు.

52. సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
యెహెఙ్కేలు 37:12

క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఈ సంభవం రాసి ఉన్న చోటు ఇదొక్కటే. ఈ పవిత్రులకు తరువాత ఏం జరిగిందో మనకు తెలియదు. కన్ను మూయడం (వ 52) లేక నిద్రపోవడం బైబిల్లో చనిపోవడానికి తరచుగా వాడబడిన మాట (యోహాను 11:11, యోహాను 11:14; అపో. కార్యములు 7:60 నోట్స్ చూడండి).

53. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.
యెహెఙ్కేలు 37:12

“పవిత్ర నగరం”– జెరుసలం.

54. శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.

రోమ్ సైనికులు దీన్ని ఒప్పుకున్నారు గానీ ఇంత జరిగాక కూడా యూదుల మతనాయకులు దీన్ని ఒప్పుకోలేదు. ఈ విధంగా ఒక విదేశీ సైన్యానికి చెందిన మోటు సైనికులకన్నా తామే ఎక్కువ కఠినులుగా, దేవుని సత్యాన్ని ఎదిరించడానికి మరింత మొండి పట్టు పట్టేవారుగా కనపరచుకున్నారు.

55. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.

56. వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.

మార్కు 15:40; లూకా 8:2.

57. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
ద్వితీయోపదేశకాండము 21:22-23

దేవుని రాజ్యంలోకి ప్రవేశం పొందిన ధనికులకు ఇతడు ఉదాహరణ. మత్తయి 19:22-24 పోల్చి చూడండి. యేసుప్రభువు సన్నిహిత శిష్యులు భయం, గందరగోళంలో పడి ఉన్న సమయంలో (యోహాను 20:19) యోసేపు ధైర్యంగా బహిరంగంగా ఆయనతో తనకున్న సంబంధాన్ని వెల్లడిస్తున్నాడు. ధనవంతుడి సమాధిలో యేసుప్రభువును ఉంచడం యెషయా 53:9 నెరవేర్పు.

58. పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.
ద్వితీయోపదేశకాండము 21:22-23

59. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి

60. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.

61. మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి.

62. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి

ఇది పస్కా పండుగకు సిద్ధపడే రోజు.

63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.

ఈ మతనాయకులు సిగ్గు లేకుండా యేసును “మోసగాడు” అంటున్నారు. ఇలా అనడానికి వారికి రుజువేమీ లేదు. ఇలా కాదనుకోవడానికి బోలెడన్ని రుజువులున్నాయి. ద్వేషం మనుషులకు సత్యాన్ని కనిపించనీయకుండా గుడ్డితనం కలగజేస్తుంది. సత్యాన్ని వ్యతిరేకించేలా బలవంతం చేస్తుంది. ఈ సందర్భంలో అయితే క్రీస్తు సజీవంగా లేవడం గురించిన రుజువును మరింత తేటతెల్లంగా నిస్సందేహంగా చేసేందుకు దేవుడు వీరి ద్వేషాన్ని ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే వీరిమూలంగా ఆయన్ను ఉంచిన సమాధికి ముద్ర వేసి కాపలా ఏర్పాటు చేశారు. మనుషుల ద్వేషాన్నంతటినీ, సైతాను కుతంత్రాలన్నిటినీ తన మంచి ఉద్దేశాలకూ, తన ప్రజల మేలుకూ అనుగుణంగా దేవుడు మలుచుకుంటాడు. ఆదికాండము 50:20 ను, దాని నోట్‌ను చూడండి. తాను లేస్తానని యేసు చెప్పిన మాటలను ఆయన శత్రువులు జ్ఞాపకం ఉంచుకోవడం, ఆయన స్వంత శిష్యులు మర్చిపోవడం వింతగా ఉంది.

64. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి.

65. అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.

66. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible


క్రీస్తు పిలాతుకు అప్పగించాడు, జుడాస్ యొక్క నిరాశ. (1-10) 
దుర్మార్గులు తరచూ తమ నేరాలకు పాల్పడే సమయంలో వాటి యొక్క పూర్తి పరిణామాలను గ్రహించడంలో విఫలమవుతారు, అయినప్పటికీ వారు చివరికి జవాబుదారీగా ఉంటారు. జుడాస్ తన తప్పును ప్రధాన పూజారులకు బహిరంగంగా అంగీకరించాడు, ఒక అమాయక వ్యక్తికి ద్రోహం చేశాడని అంగీకరిస్తూ, క్రీస్తు పాత్రకు స్పష్టమైన సాక్ష్యాన్ని అందించాడు. ఇంత జరుగుతున్నా నేతలు మాత్రం నిక్కచ్చిగా ఉన్నారు. నిరాశతో మరియు దైవిక కోపం యొక్క భయాన్ని భరించలేక, జుడాస్ డబ్బును కిందకు విసిరి, వెళ్లి, ఉరి వేసుకున్నాడు. జుడాస్ మరణం జీసస్ మరణానికి ముందే జరిగి ఉండవచ్చు, కానీ నాయకులు యేసు రక్తం కోసం దాహం వేయడం, అతనికి ద్రోహం చేయడానికి జుడాస్‌ను నియమించడం మరియు అన్యాయంగా అతనికి మరణశిక్ష విధించడంలో వారి పాత్ర పట్ల ఉదాసీనంగా కనిపించారు. ఇది పాపాన్ని చిన్నచూపు చూసే మూర్ఖత్వాన్ని మరియు ఇతరుల తప్పులపై దృష్టి సారించడం ద్వారా తమ సొంత పాపాలను తక్కువ చేసి చూపే ధోరణిని ఎత్తిచూపుతుంది. దేవుని తీర్పు సత్యం మీద ఆధారపడి ఉంటుంది. జెకర్యా 11:12లోని ప్రవచనాన్ని నెరవేర్చడం ద్వారా క్రీస్తు రక్తం ద్వారా అపరిచితులకు మరియు అన్యజాతి పాపులకు అందించిన దయకు చిహ్నంగా జుడాస్ తిరిగి వచ్చిన డబ్బుతో భూమిని కొనుగోలు చేయడం కొందరు వ్యాఖ్యానిస్తారు. జుడాస్ పశ్చాత్తాపం వైపు అడుగులు వేసాడు కానీ మోక్షానికి దూరమయ్యాడు. "నేను స్వర్గానికి వ్యతిరేకంగా పాపం చేసాను, తండ్రీ" అని చెప్పి దైవిక క్షమాపణను పొందడంలో అతను విఫలమైనందున అతని ఒప్పుకోలు దేవునికి కాదు, అధికారుల వైపు మళ్ళింది. అహంకారం, శత్రుత్వం మరియు తిరుగుబాటుతో సహజీవనం చేసే అసంపూర్ణ నేరారోపణలను పరిష్కరించకుండా ఇది హెచ్చరిక రిమైండర్‌గా పనిచేస్తుంది.

పిలాతు ముందు క్రీస్తు. (11-25) 
పిలాతు యేసు పట్ల ఎలాంటి ద్వేషాన్ని కలిగి ఉండనప్పటికీ, అతను అతనిని నిర్దోషిగా చేయడానికి ప్రయత్నించాడు మరియు అతనిని విడుదల చేయమని కోరాడు. పిలాతు భార్య నుండి వచ్చిన హెచ్చరిక హెచ్చరిక సూచనగా పనిచేసింది. పాపులను వారి తప్పుడు పనులలో నిరోధించడానికి దేవుడు వివిధ మార్గాలను ఉపయోగిస్తాడు, అంటే ప్రొవిడెన్స్ నుండి జోక్యం, దృఢమైన స్నేహితులు మరియు మన స్వంత మనస్సాక్షి. "ప్రభువు అసహ్యించుకునే ఈ హేయమైన పనిలో పాల్గొనవద్దు!" అనే ఉపదేశాన్ని మనం విన్నప్పుడు. మనం టెంప్టేషన్‌ను సమీపిస్తున్నప్పుడు, దానిని గమనించడం తెలివైన పని. పూజారుల ప్రభావంతో ప్రజలు బరబ్బాను ఎంచుకున్నారు. దేవుని కంటే ప్రపంచాన్ని తమ పాలకుడిగా మరియు వారసత్వంగా ఎంచుకునే చాలా మంది, సారాంశంలో, వారి స్వంత భ్రమలను ఎంచుకుంటున్నారు. క్రీస్తు మరణం పట్ల యూదుల అచంచలమైన దృఢ నిశ్చయం పిలాతుకు కట్టుబడి ఉండవలసిందిగా భావించి, అత్యంత కఠినంగా ఉన్న వ్యక్తులపై కూడా మనస్సాక్షి ప్రభావాన్ని వెల్లడి చేసింది. అయినప్పటికీ, క్రీస్తు తన తప్పు కోసం కాకుండా తన ప్రజల పాపాల కోసం సహించాడని నొక్కిచెప్పడానికి ప్రతి వివరాలు విప్పబడ్డాయి. అమాయక రక్తం యొక్క అపరాధం నుండి తనను తాను రక్షించుకోవడానికి పిలేట్ చేసిన వ్యర్థమైన ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. యూదులు స్వయంగా విధించుకున్న శాపం వారి దేశం యొక్క బాధలలో దాని భయంకరమైన నెరవేర్పును కనుగొంది. పాపం లేనివాడు మాత్రమే ఇతరుల పాపాలను భరించగలడు. మనమందరం చిక్కుకోలేదా? పాపులు తమ ప్రియమైన పాపాలను అంటిపెట్టుకుని ఉండటానికి మోక్షాన్ని తిరస్కరించినప్పుడు, తద్వారా దేవుని మహిమను దోచుకుని, వారి ఆత్మలను ప్రమాదంలో పడవేసినప్పుడు, వారు యేసు కంటే బరబ్బను ఎన్నుకోవడం లేదా? యూదుల తిరస్కరణ పర్యవసానంగా క్రీస్తు రక్తం ఇప్పుడు మన ప్రయోజనం కోసం మనపై ఉంది. అందుచేత మనం దానిని శరణు వేడుకుందాం.

బరబ్బా వదులుకున్నాడు, క్రీస్తు వెక్కిరించాడు. (26-30) 
సిలువ వేయడం, రోమన్‌లకు ప్రత్యేకమైన మరణశిక్ష, అనూహ్యంగా భయంకరమైనది మరియు వేదన కలిగించేది. ఈ ప్రక్రియలో నేలపై శిలువను వేయడం, చేతులు మరియు కాళ్ళను గోళ్ళతో భద్రపరచడం, ఆపై దానిని పైకి లేపడం మరియు నిటారుగా అమర్చడం వంటివి ఉన్నాయి. మరణం సంభవించే వరకు వారి శరీర బరువు గోళ్లపై వేలాడదీయడం వల్ల వ్యక్తి విపరీతమైన నొప్పిని భరిస్తాడు. ఈ విధంగా, క్రీస్తు ఒక స్తంభంపై పెరిగిన ఇత్తడి పాము యొక్క ప్రతీకాత్మకతను నెరవేర్చాడు. మనకు నిత్యజీవం, ఆనందం మరియు కీర్తిని పొందేందుకు ఆయన ఇష్టపూర్వకంగా చిత్రీకరించబడిన దుఃఖాన్ని మరియు అవమానాన్ని అనుభవించాడు.

క్రీస్తు శిలువ వేయబడటానికి దారితీసింది. (31-34) 
క్రీస్తు ఒక గొఱ్ఱెపిల్ల వలె వధకు నడిపించబడ్డాడు, బలిపీఠానికి బలి అర్పించాడు. దుర్మార్గుల దయ కూడా నిజంగా క్రూరంగా ఉంటుంది. వారు అతని నుండి సిలువను తీసుకున్నారు మరియు దానిని మోయమని సైమన్‌ను బలవంతం చేశారు. ప్రభూ, నీవు మాకు అప్పగించిన శిలువలను భరించేందుకు మమ్మల్ని సిద్ధం చేయి, మేము నిన్ను వెంబడిస్తున్నప్పుడు సంతోషంతో ప్రతిరోజూ వాటిని ఇష్టపూర్వకంగా తీసుకుంటాము. అతనితో పోల్చదగిన దుఃఖం ఎప్పుడైనా ఉందా? ఆయన మరణించిన తీరును మనం చూసినప్పుడు, మనపట్ల ఆయనకున్న అసాధారణ ప్రేమను అందులో చూద్దాం. బాధాకరమైన మరణం సరిపోదన్నట్లుగా, వారు దాని చేదును మరియు భయాన్ని వివిధ మార్గాల్లో తీవ్రతరం చేశారు.

అతను సిలువ వేయబడ్డాడు. (35-44) 
తప్పు చేసేవారిని వారి నేరాల గురించి వ్రాతపూర్వక నోటీసును ప్రదర్శించడం ద్వారా బహిరంగంగా అవమానించడం ఆచారం, మరియు వారు క్రీస్తు తలపై అదే చేశారు. నిందగా భావించినప్పటికీ, దేవుడు దానిని తిప్పికొట్టాడు, తద్వారా ఆ నింద కూడా అతనికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇద్దరు దొంగలు అతనితో పాటు సిలువ వేయబడ్డారు, మన మరణాలలో, మనం పరిశుద్ధులలో లెక్కించబడటానికి, అతిక్రమించినవారిలో అతని మరణాన్ని సూచిస్తారు. అతను అనుభవించిన అవమానాలు మరియు అవహేళనలు ఇక్కడ నమోదు చేయబడ్డాయి. క్రీస్తు విరోధులు మతం గురించి మరియు దేవుని ప్రజల గురించి ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, అసత్యమని తమకు తెలిసిన అబద్ధాలను ప్రచారం చేస్తారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు మరియు పెద్దలు యేసును ఇశ్రాయేలు రాజుగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ రాజు సిలువ నుండి దిగివస్తే, అవసరమైన కష్టాలు లేకుండా తన రాజ్యాన్ని కోరుకుంటూ చాలా మంది సంతోషంగా అంగీకరిస్తారు. అయితే, సిలువ లేకుండా, క్రీస్తు లేడు, కష్టాలను భరించకుండా, కిరీటం లేదు. అతనితో కలిసి రాజ్యమేలాలని కోరుకునే వారు అతనితో బాధపడడానికి సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా, యేసు, దేవుని న్యాయాన్ని సంతృప్తి పరచాలనే తన నిబద్ధతను నెరవేర్చడంలో, మానవత్వంలోని చెత్తగా విధించిన శిక్షను స్వీకరించాడు. క్రీస్తు బాధలకు సంబంధించిన ప్రతి వివరాలు, నమోదు చేయబడినట్లుగా, ప్రవక్తలు లేదా కీర్తనలలో కనిపించే అంచనాలతో సరితూగుతాయి.

క్రీస్తు మరణం. (45-50) 
చీకటిలో ఉన్న మూడు గంటలలో, యేసు తీవ్రమైన వేదనను అనుభవించాడు, చీకటి శక్తులతో పోరాడాడు మరియు మానవాళి పాపాల పట్ల తన తండ్రి యొక్క అసంతృప్తిని భరించాడు. ఈ తరుణంలో, అతను తన ఆత్మను త్యాగం చేశాడు. మానవాళిని సృష్టించినప్పటి నుండి ఇంత లోతైన మరియు అరిష్ట కాలం ఎప్పుడూ లేదు; ఇది విముక్తి మరియు మోక్షం యొక్క గొప్ప పథకంలో కీలకమైన క్షణాన్ని గుర్తించింది. యేసుకీర్తనల గ్రంథము 22:1 నుండి ఒక విలాపాన్ని వినిపించాడు, ప్రార్థనకు మార్గనిర్దేశం చేయడంలో మరియు మన ప్రార్థనలలో లేఖనాలను ఉపయోగించడాన్ని సమర్థించడంలో దేవుని వాక్యం యొక్క ప్రయోజనాన్ని ప్రదర్శిస్తుంది.
విశ్వాసులు కొంత చేదును రుచి చూసినప్పటికీ, వారు క్రీస్తు బాధల పరిమాణంలో కొంత భాగాన్ని మాత్రమే గ్రహించగలరు. దీని ద్వారా, వారు పాపుల పట్ల రక్షకుని ప్రేమను, పాపం యొక్క క్రూరమైన స్వభావం గురించి లోతైన అవగాహనను మరియు రాబోయే కోపం నుండి వారిని విడిపించినందుకు క్రీస్తుకు ప్రగాఢమైన కృతజ్ఞత గురించి అంతర్దృష్టిని పొందుతారు. అతని శత్రువులు అతని విలాపాన్ని ఎగతాళి చేశారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మరియు దాని అనుచరులకు వ్యతిరేకంగా ఎన్ని నిందలు అపోహల నుండి ఉత్పన్నమవుతున్నాయో ఉదాహరించారు.
తన తుది శ్వాసకు ముందు, క్రీస్తు తన జీవితాన్ని బలవంతంగా తీసుకోలేదని, తన తండ్రికి ఇష్టపూర్వకంగా లొంగిపోయాడని నొక్కి చెప్పాడు. అతను మరణం యొక్క అధికారాలను ధిక్కరించాడు, పూజారి మరియు త్యాగం వలె, అతను బిగ్గరగా కేకలు వేయడంతో శాశ్వతమైన ఆత్మ ద్వారా తనను తాను సమర్పించుకున్నాడని ధృవీకరించాడు. అప్పుడు, అతను తన ఆత్మను విడిచిపెట్టాడు. సిలువపై, దేవుని కుమారుడు నిజంగా మరణించాడు, అతనికి కలిగించిన బాధ యొక్క తీవ్రతకు లొంగిపోయాడు. అతని ఆత్మ అతని శరీరం నుండి విడిపోయింది, మరియు అతని నిర్జీవమైన శరీరం అతని మరణాన్ని నిస్సందేహంగా ధృవీకరించింది. క్రీస్తు మరణం పాపం కోసం అర్పణగా మారడానికి అతని నిబద్ధతకు అవసరమైన నెరవేర్పు, ఈ ప్రయోజనం కోసం తన జీవితాన్ని ఇష్టపూర్వకంగా అప్పగించింది.

సిలువలో జరిగిన సంఘటనలు. (51-56) 
ముసుగును చింపివేయడం క్రీస్తు మరణం ద్వారా దేవునికి మార్గం తెరవబడిందని సూచిస్తుంది. క్రీస్తుకు కృతజ్ఞతలు, భవిష్యత్తులో మనకు కృపా సింహాసనం, కరుణాపీఠం మరియు కీర్తి సింహాసనానికి అపరిమితమైన ప్రాప్యత ఉంది. క్రీస్తు మరణాన్ని ధ్యానించడం మన కఠినమైన మరియు లొంగని హృదయాలను విడదీయడానికి దారి తీస్తుంది, ఎందుకంటే ఇది హృదయాన్ని విచ్ఛిన్నం చేయాలి, బట్టలు మాత్రమే కాదు. ఏసుక్రీస్తు శిలువను ఎదుర్కొన్నప్పుడు లొంగని మరియు కదలకుండా ఉండే హృదయం రాయి కంటే కఠినమైనది.
సమాధులు తెరుచుకున్నాయి, నిద్రిస్తున్న సాధువుల అనేక శరీరాలు లేచాయి. వారు ఎలా కనిపించారు, ఏ పద్ధతిలో మరియు ఎలా అదృశ్యమయ్యారు అనే వివరాలు బహిర్గతం చేయబడవు మరియు బహిర్గతం చేయబడిన దానికంటే ఎక్కువ జ్ఞానం పొందాలని మనం కోరుకోకూడదు. శతాధిపతి మరియు రోమన్ సైనికులను పట్టుకున్న భీభత్సంలో కనిపించే విధంగా, అతని ప్రొవిడెన్స్‌లో దేవుని విస్మయం కలిగించే వ్యక్తీకరణలు పాపులను దోషులుగా నిర్ధారించడానికి మరియు మేల్కొల్పడానికి రహస్యమైన మార్గాల్లో పని చేస్తాయి.
యేసు పాత్రను ధృవీకరిస్తున్న సమృద్ధిగా ఉన్న సాక్ష్యాలలో మనం ఓదార్పుని పొందవచ్చు. మనము ఆయన కొరకు జీవించినట్లయితే, మనము మన పాత్రలను సమర్థించుటకు ప్రభువును విశ్వసించడం ద్వారా నేరానికి సరైన కారణం ఇవ్వకుండా తప్పించుకోవడం ద్వారా, మనం ఈ సాక్ష్యాలను ఓదార్పుతో ప్రతిబింబించవచ్చు. విశ్వాసం యొక్క కటకం ద్వారా, క్రీస్తు మరియు అతని సిలువ మరణాన్ని మనం దర్శిద్దాం, అతను మన కోసం బాధలు అనుభవించడానికి దారితీసిన ప్రగాఢమైన ప్రేమతో కదిలిపోతాము. అతని స్నేహితులు అతనికి సహాయం చేయలేకపోయారు, పాపం యొక్క భయానక స్వభావం మరియు పరిణామాలు స్పష్టంగా వెల్లడయ్యాయి, తండ్రి ప్రియమైన కుమారుడు సిలువపై వేలాడదీసిన రోజున, అన్యాయానికి న్యాయంగా బాధలను భరిస్తూ, మమ్మల్ని దగ్గరికి తీసుకువచ్చాడు. దేవునికి. ఆయన సేవకు మనల్ని మనం మనస్ఫూర్తిగా అంకితం చేద్దాం.

క్రీస్తు సమాధి. (57-61)
క్రీస్తు సమాధిలో ఎటువంటి వైభవం లేదా వేడుక లేదు. క్రీస్తుకు తన భూజీవితంలో తన స్వంత ఇల్లు లేనట్లే, మరణంలో అతని శరీరానికి వ్యక్తిగత సమాధి కూడా లేదు. మన ప్రభువైన యేసు, పాపం నుండి విముక్తుడు, అంకితమైన విశ్రాంతి స్థలం లేదు. అతను సిలువ వేయబడిన దొంగలతో పాటు అతనిని దుష్టుల మధ్య పాతిపెట్టాలని యూదులు ఉద్దేశించారు, కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు, యెషయా 53:9 లోని ప్రవచనాన్ని నెరవేర్చాడు.
అంత్యక్రియలకు సాక్ష్యమివ్వడం ద్వారా మానవుల దృష్టిలో భయాన్ని కలిగించవచ్చు, క్రీస్తు తన ఖననం ద్వారా విశ్వాసులకు సమాధి యొక్క స్వభావాన్ని ఎలా మార్చాడో ప్రతిబింబిస్తుంది. మన పాపాల ఆధ్యాత్మిక సమాధిలో స్థిరంగా నిమగ్నమవ్వడం ద్వారా క్రీస్తు సమాధిని అనుకరించడానికి మనం పిలువబడ్డాము.

 సమాధి సురక్షితం. (62-66)
యూదుల సబ్బాత్ రోజున, ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు తమ ఆరాధనలలో నిమగ్నమై ఉండకుండా, సమాధి రక్షణ గురించి పిలాతుతో చర్చిస్తున్నారు. మన ప్రభువు పునరుత్థానానికి కాదనలేని సాక్ష్యాలను నిర్ధారించడానికి ఇది అనుమతించబడింది. సమాధిని వీలైనంత జాగ్రత్తగా భద్రపరచడానికి పిలాతు వారికి అనుమతి ఇచ్చాడు. వారు రాయిని మూసివేశారు, ఒక గార్డును నియమించారు మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వారు విశ్వసించారు. ఏది ఏమైనప్పటికీ, బలహీనమైన శిష్యుల నుండి సమాధిని రక్షించడానికి ప్రయత్నించడం అనవసరం మరియు మూర్ఖత్వం, అయితే దేవుని శక్తికి వ్యతిరేకంగా దానిని రక్షించాలని ఆలోచించడం వ్యర్థం మాత్రమే కాదు, అర్ధంలేనిది కూడా. వారు తెలివిగా వ్యవహరిస్తున్నారని వారి నమ్మకం ఉన్నప్పటికీ, ప్రభువు వారి కుటిల ప్రణాళికలను వారిపైకి తిప్పాడు. చివరికి, క్రీస్తు శత్రువుల ఆవేశం మరియు పథకాలన్నీ ఆయన మహిమను పెంపొందించడానికి ఉపయోగపడతాయి.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |