Matthew - మత్తయి సువార్త 28 | View All

1. విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.

యేసును సిలువ వేసిన తరువాత ఇది మూడో రోజు (అపో. కార్యములు 10:40; 1 కోరింథీయులకు 15:4). “విశ్రాంతిదినం”– నిర్గమకాండము 20:8-11. మరో మరియ అంటే యాకోబు, యోసే అనేవారి తల్లి (మత్తయి 27:56).

2. ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను.

దేవదూత సమాధి రాయిని అవతలకు దొర్లించినది యేసు బయటికి రాగలిగేందుకు కాదు గాని యేసు శిష్యులు లోపలికి వెళ్ళి అది ఖాళీగా ఉందని చూచేందుకు (వ 6). “దూత” గురించి ఆదికాండము 16:7 నోట్ చూడండి.

3. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.

యెహెఙ్కేలు 1:13-14; దానియేలు 10:6; ప్రకటన గ్రంథం 15:6; ప్రకటన గ్రంథం 18:1.

4. అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.

దానియేలు 8:17; లూకా 1:12; లూకా 2:9. దేవదూతను చూచే మనుషులు ఇంత కంగారు పడితే, సాక్షాత్తూ దేవుని ఎదుట నిలబడితే ఏం చేస్తారో (ప్రకటన గ్రంథం 20:11-12).

5. దూత ఆ స్త్రీలను చూచిమీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును;

మానవ చరిత్రలోనే మహోదయం ఇది. ఇది ఆనంద సమయమే గాని భయపడవలసినది కాదు. అయితే దూత భయపడవద్దని కావలివారికి చెప్పలేదు. యేసును వెతుకుతున్న స్త్రీలతో చెప్పాడు. ఇతర మనుషులు భయపడే చాలా విషయాల గురించి క్రీస్తు శిష్యులు భయపడనవసరం లేదు. వారికి మహానంద కారణం ఇతరులకు గొప్ప భయకారణం కావచ్చు.

6. ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి

యేసుప్రభువు తాను తిరిగి సజీవంగా లేస్తానని చెప్పాడు (మత్తయి 16:21; మత్తయి 17:23; మత్తయి 20:19; యోహాను 10:17-18). అలా జరక్కుండా చేసేందుకు ఆయన శత్రువులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సజీవంగా లేచాడు. ఒక మనిషి చనిపోకముందు తాను చనిపోయాక సజీవంగా లేస్తానని చెప్పడమే గొప్ప విశేషం. ప్రపంచ సాహిత్యమంతట్లో ఇలాంటిది ఎక్కడా లేదు. ఇక అక్షరాలా ఆ విధంగా లేవడమన్నది సాటిలేని పరమాద్భుతమే. దేవదూత మాటలను జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభువు మొత్తంగా – అంటే శరీరం, ప్రాణం, మనసు, ఆత్మ సహితంగా – సజీవంగా లేచి సమాధి బయటికి వచ్చాడు. సమాధిలో ఉంచిన ఆయన మృత దేహం అక్కడ లేదు. ఆ స్త్రీలు తమ కళ్ళతో ఇది చూశారు. చనిపోయి సజీవంగా లేవడం ద్వారా యేసు తాను మోసగాడు కాడనీ (మత్తయి 27:63), పరలోకంనుంచి వచ్చిన దేవుని కుమారుడనీ రుజువు చేశాడు (రోమీయులకు 1:4). మరణాన్ని జయించినవాడనీ, తాను చెప్పిన రీతిగా శాశ్వత జీవాన్ని ఇచ్చేవాడనీ నిరూపించుకున్నాడు (యోహాను 5:21-29; యోహాను 11:25-26). క్రీస్తు సజీవంగా లేవడంనుంచి మనం నేర్చుకోదగిన మరి కొంత సత్యం కోసం 1 కొరింతు 15వ అధ్యాయం చూడండి. ఈ దేవదూత “ఆయన సజీవంగా లేచాడు” అని చెప్పిన మాటను మనం సందేహించడానికి ఆధారమేమన్నా ఉందా? ఏదీ లేదు. ఉన్న సాక్ష్యాధారాలన్నీ రుజువులన్నీ ఆయన లేచాడనే చెప్తున్నాయి. మొట్టమొదటగా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసు చెప్పిన మాటలే మనకు ఆధారం (మత్తయి 16:21; మత్తయి 17:23; మత్తయి 20:19; యోహాను 10:17-18; లూకా 24:45). అంతేగాక ఆయన సజీవంగా లేచిన తరువాత చాలామంది ఆయన్ను చూశారు. ఈ ప్రత్యక్ష సాక్షులు ఆయన లేచాడన్న మాట కోసం బాధలను అనుభవించి మరణించడానికైనా సిద్ధమయ్యారు (అపొ కా గ్రంథం దీన్ని స్పష్టం చేస్తున్నది). అంతేగాక వారు ప్రకటించిన ఈ సత్యాన్ని స్థిరపరిచేందుకు దేవుడు కూడా వారితో కలిసి అమిత శక్తితో పని చేశాడు (హెబ్రీయులకు 2:3-4). ఈ ప్రత్యక్ష సాక్షులకు యేసు కనిపించిన సందర్భాల గురించి మత్తయి శుభవార్తలో రాసి ఉన్నదానికంటే మరింత వివరంగా కావాలంటే లూకా 24వ అధ్యాయం, యోహాను 20,21 అధ్యాయాలు; అపో. కార్యములు 1:3-9 చూడండి.

7. త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.

వ 10,16. క్రీస్తు సజీవంగా లేచాక జరిగిన సంభవాల వరుస క్రమం స్పష్టంగా లేదు. ఏ ఒక్క శుభవార్తలోనూ అవన్నీ రాసిలేవు. ప్రతి రచయితా దేవుడు అతణ్ణి ప్రేరేపించిన రీతిగా వర్ణించాడు. యేసుప్రభువు పదకొండు వేరువేరు సందర్భాల్లో శిష్యులకు కనిపించినట్టుంది. వీటి క్రమం బహుశా ఇది: మగ్దలేనే మరియకు (మార్కు 16:9; యోహాను 20:14); ఆమె లేకుండా సమాధినుంచి తిరిగి వస్తున్న స్త్రీలకు (మత్తయి 28:9-10); తరువాత పేతురుకు (లూకా 24:34); ఎమ్మాయస్ గ్రామానికి పోయేదారిలో ఇద్దరు శిష్యులకు (లూకా 24:13); తరువాత తోమా లేని సమయంలో జెరుసలంలో కొందరు శిష్యులకు (యోహాను 20:19); తోమా ఉన్నప్పుడు (యోహాను 20:26-29); తరువాత గలలీ సరస్సు ఒడ్డున ఏడుగురు శిష్యులకు (యోహాను 21:1); గలలీ ప్రదేశంలోని కొండపై కొంతమంది శిష్యులకు (మత్తయి 28:16); తరువాత ఒకే సమయంలో 500 కంటే ఎక్కువమందికి (1 కోరింథీయులకు 15:6); యాకోబుకు (1 కోరింథీయులకు 15:7); చివరికి ఆలీవ్ కొండ మీద తన పదకొండుమంది రాయబారులకు (లూకా 24:50-51; అపో. కార్యములు 1:9-12). ఆయన తన రాయబారులకు 40 దినాలపాటు కనిపిస్తూ వచ్చాడు గనుక బైబిలులో రాయని ప్రత్యక్షాలు మరి కొన్ని జరిగి ఉండాలి (అపో. కార్యములు 1:3). ఈ ప్రత్యక్షాలన్నీ ఒకే ఒక గొప్ప సత్యాన్ని పూర్తిగా రుజువు చేసి శాశ్వతంగా స్థిరపరచాయి – చనిపోయిన యేసు తిరిగి సజీవంగా లేచాడు.

8. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా

కీర్తనల గ్రంథము 2:11. యేసు చనిపోయి తిరిగి లేచాడనే సంగతి వాస్తవంగా నమ్మినవారికి అది ఎప్పటికీ ఆనంద కారణంగా ఉంటుంది (లూకా 24:52; యోహాను 20:20).

9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా

యోహాను 20:17.

10. యేసు భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.

యేసు సజీవంగా లేచాడన్న దివ్యమైన సత్యం మనలోని భయాన్ని తొలగించి దాన్ని గురించి మాట్లాడేందుకు లోకంలోకి పంపించగలగాలి. “నా సోదరులు” అంటే శిష్యులు (మత్తయి 12:48-49; హెబ్రీయులకు 2:11-12). వారు వెంటనే గలలీకు ప్రయాణం కట్టలేదు. క్రీస్తు సజీవంగా లేచాడన్న సత్యాన్ని వారు త్వరగా నమ్మలేదు – మత్తయి 16:11, మత్తయి 16:13-14. అందువల్ల ఆయన వారికి జెరుసలంలో కనిపించాడు (యోహాను 20:19-29).

11. వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి.

సత్యంపట్ల ద్వేషం మనుషులను సత్యంనుంచి మరింత దూరం చేస్తుంది. అందుకు ఇది మరో ఉదాహరణ. ఈ యూదులు చెప్పినది కేవలం కట్టు కథేనని జెరుసలంలో ఉన్నవారికీ, లోకంలో ఉన్నవారందరికీ త్వరలోనే అర్థమైపోయింది. ఆ తరువాత శిష్యులు ప్రవర్తించిన తీరు యేసు దేహాన్ని దొంగిలించుకు వెళ్ళి ఎక్కడో దాచిపెట్టిన మోసగాళ్ళ తీరు కాదు. యేసు సజీవంగా లేచాడని తాము ప్రకటించిన సత్యంకోసం వారు బాధలను అనుభవించి మరణించారు.

12. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి

13. మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి;

ఎంత విచిత్రమైన ఆదేశాలు! వారు నిద్రపోతూ ఉంటే యేసు దేహానికి ఏం జరిగిందో వారికెలా తెలుస్తుంది? ఇలాంటి సాక్ష్యాన్ని లోకంలో ఏ కోర్టూ అంగీకరించదు గదా.

14. ఇది అధిపతి చెవిని బడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి.

15. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.

16. పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి.

వ 10.

17. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి.

“ఆరాధించారు”– మత్తయి 2:11; మత్తయి 4:10; మత్తయి 14:33 చూడండి. “సందేహించారు”– వారు సందేహించినది దేన్నో స్పష్టంగా లేదు. అయితే లూకా, యోహాను శుభవార్తల్లో ఉన్నదాన్ని బట్టి యేసు సజీవంగా లేచిన తరువాత ఆయన స్వరూపం అచ్చంగా అంతకు ముందులాగా లేదనీ, తక్షణమే ఆయన్ను గుర్తుపట్టడం కుదరలేదనీ స్పష్టంగా ఉంది (లూకా 24:16, లూకా 24:31, లూకా 24:36-43; యోహాను 20:15; యోహాను 21:5). దగ్గరగా వచ్చి వారితో మాట్లాడ్డం ద్వారా యేసు వారి సందేహాలు తొలగించేశాడు. అసలు ఇలా సందేహపడ్డారు అని చెప్పడంలో శుభవార్త రచయితల యథార్థత బయట పడుతున్నది. ఒకవేళ యేసు నిజంగా సజీవంగా లేవలేదనుకోండి, ఆయన అలా లేచాడని వీరు తమ పుస్తకాల ద్వారా ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారనుకోండి. అలాంటప్పుడు, కొందరి సందేహాల గురించీ ఆయన్ను గుర్తు పట్టడంలోని సమస్యల గురించీ అసలు రాసి ఉండేవారా?

18. అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.
దానియేలు 7:14

యోహాను 3:35; యోహాను 17:2; యోహాను 5:22-23; అపో. కార్యములు 2:32-33, అపో. కార్యములు 2:36; ఫిలిప్పీయులకు 2:9-11. యేసుప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ప్రకటన గ్రంథం 19:16. అలా ఆయన్ను స్వీకరించి ఆయనలో నమ్మకం ఉంచినవారు ధన్యులు (కీర్తనల గ్రంథము 2:6-12). ఆయన భూమిపై జరుగుతున్నవాటిని తన ఇష్టప్రకారం నిర్వహిస్తూ తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఈ అధికారం ఆయనకు “ఇవ్వబడింది”. ఎవరిచ్చారు? తండ్రియైన దేవుడు. ఈ జగత్తు గురించిన వ్యవహారాలను నిర్వహించడంలో ఆయన కుమారుని కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. (యోహాను 10:29; యోహాను 14:28; 1 కోరింథీయులకు 15:22-28).

19. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు

మార్కు 16:15; లూకా 24:47-49; యోహాను 20:21; అపో. కార్యములు 1:8. యేసుకు మనుషులందరిమీదా అధికారం ఉంది (యోహాను 17:2) కాబట్టి ఆయన ఆజ్ఞాపించినట్టెల్లా ఆయన శిష్యులు చేయగలుగుతారు. మనుషుల్ని శిష్యులుగా చేయడం వారి పని. అంటే కేవలం శుభవార్త ప్రకటించడమే కాదు. వారు చేయవలసినదానిలో అది ఒక భాగం మాత్రమే. యేసు ఉపదేశించినదంతా మనుషులకు ఉపదేశించి వారిని దానికంతటికి విధేయులుగా చేయాలి (వ 20; యోహాను 14:21, యోహాను 14:23; 1 యోహాను 2:3-6). “బాప్తిసం” గురించి నోట్ మత్తయి 3:6. “పేరట”– దేవుని పేరును గురించి చివరిగా యేసు ఇక్కడ వెల్లడిస్తున్నాడు. పేరు అన్నది ఏకవచనమే, బహువచనం కాదు. ఎందుకంటే తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ముగ్గురు దేవుళ్ళు కాదు; స్వభావంలోను లక్షణాలలోనూ పరిపూర్ణ ఐక్యత గల ఒకే ఒక దేవుడు. దేవుని పేరును వెల్లడి చేయడం అంటే దేవుడెలాంటివాడో చెప్పడమే (యోహాను 17:6; నిర్గమకాండము 34:5-7). దేవుడు త్రిత్వం (మత్తయి 3:16-17; మత్తయి 11:27; యోహాను 1:1, యోహాను 1:14, యోహాను 1:18; యోహాను 5:30; యోహాను 10:30; యోహాను 14:16-17; 2 కోరింథీయులకు 13:14; ఎఫెసీయులకు 4:4-6).

20. నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
హగ్గయి 1:13

క్రీస్తు రాయబారులు ఈ ఆజ్ఞను గంబీరమైనదిగా ఎంచారు. దాన్ని ఆషామాషీగా తీసుకోలేదు. దీనిప్రకారం చేసేందుకు బహు శక్తివంతంగా పని చేశారు. అపొ కా గ్రంథంలోనూ వారు రాసిన లేఖనాల్లోనూ ఇది స్పష్టంగా ఉంది. “మీకు” అంటే అక్కడున్న శిష్యులు మాత్రమే కాదు, ఈ యుగమంతటిలోనూ వారి తరువాత వచ్చినవారు కూడా. ఈ చివరి మాటల్లో ఇది స్పష్టంగా తెలుస్తున్నది. క్రీస్తు రాయబారులు ఆరంభించిన పనిని కొనసాగించడానికి ప్రతి తరంలోనూ నమ్మకమైన మనుషులు కావాలి. క్రీస్తు తానే ఎప్పుడూ అలాంటివారితో ఉంటాడు. మత్తయి మొదటి అధ్యాయంలో ఇమ్మానుయేలు వస్తున్నాడన్న ప్రకటన ఉంది (మత్తయి 1:23). ఈ చివరి వచనంలో ఈ యుగాంతం వరకు ఇమ్మానుయేలు తన ప్రజలతో ఉంటాడన్న వాగ్దానం ఉంది. మత్తయి 18:20 కూడా చూడండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 28 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible


క్రీస్తు పునరుత్థానం. (1-8) 
అతని మరణం తరువాత మూడవ రోజు, క్రీస్తు లేచాడు, అతను తరచుగా ప్రస్తావించిన ప్రవచించిన కాలపరిమితిని నెరవేర్చాడు. వారంలోని మొదటి రోజున చీకటి నుండి వెలుగును ఉద్భవించమని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, ఈ ముఖ్యమైన రోజున ప్రపంచపు వెలుగు, క్రీస్తు సమాధి యొక్క చీకటి నుండి ఉద్భవించాడు. ఈ రోజు, ఇప్పుడు తరచుగా క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడింది, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గౌరవిస్తూ క్రైస్తవ ఆచారాలు మరియు ఆరాధనకు మూలస్తంభంగా మారింది. సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తరలించడానికి యేసుకు అధికారం ఉన్నప్పటికీ, అతను ఈ పనిని దేవదూతకు అప్పగించాడు.
పునరుత్థానం, క్రీస్తు అనుచరులకు ఆనందానికి మూలం, అతని శత్రువులలో భయం మరియు గందరగోళాన్ని కలిగించింది. దేవదూత స్త్రీలకు భరోసా ఇచ్చాడు, వారి భయాలను పోగొట్టాడు మరియు వారిని ప్రోత్సహించాడు. పాపభరిత హృదయాలతో సీయోనులో ఉన్నవారికి, విస్మయం మరియు వణుకు యొక్క భావం అవసరం. అయితే, విశ్వాసులకు, క్రీస్తు పునరుత్థానంలో ఓదార్పు ఉంది.
క్రీస్తుతో మనకున్న అనుబంధం ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆయన బోధలపై విశ్వాసంతో ఉండాలి. ఈ ప్రపంచాన్ని మన శాశ్వత నివాసంగా మార్చుకోవాలని శోదించబడినప్పుడు, యేసు ఇక్కడ లేడని మనం గుర్తుంచుకోవాలి; ఆయన లేచెను. పర్యవసానంగా, మన హృదయాలు స్వర్గపు లక్ష్యాలను కోరుకుంటూ పైకి లేవాలి. ఈ సంఘటన క్రీస్తు అంచనాలకు అనుగుణంగా ఉంటుంది, ప్రస్తుత బాధలు మరియు భవిష్యత్తు కీర్తి రెండింటినీ ఆశించాలని మనకు గుర్తుచేస్తుంది.
విశ్వాసం ద్వారా ఖాళీ సమాధిపై ప్రతిబింబించడం తీవ్ర ప్రభావం చూపుతుంది. స్త్రీలు సమాధి వద్ద ఉండడం మంచిదే అయినప్పటికీ, దేవుని సేవకులకు విస్తృత బాధ్యతలు ఉన్నాయి. దేవునితో ప్రైవేట్ కమ్యూనికేషన్ కంటే ప్రజా సేవకు ప్రాధాన్యత ఉంటుంది. శిష్యులకు పునరుత్థానం గురించి తెలియజేయమని, వారి ప్రస్తుత దుఃఖాల మధ్య వారికి ఓదార్పును అందించాలని స్త్రీలకు సూచించబడింది.
తన శిష్యుల ఆచూకీ తెలుసుకున్న క్రీస్తు వారిని సందర్శిస్తానని వాగ్దానం చేశాడు. సమృద్ధిగా ఉన్న ఆధ్యాత్మిక వనరులకు దూరంగా ఉన్నవారు కూడా ఆయన దయగల ఉనికిని అనుభవిస్తారు. భయం మరియు ఆనందం యొక్క మిశ్రమం స్త్రీలను తొందరపాటుకు ప్రేరేపించింది. అలాగే, క్రీస్తు శిష్యులు తమ ఆత్మల కోసం దేవుడు చేసిన దానికి సాక్ష్యమిస్తూ, ప్రభువుతో సహవాసం యొక్క అనుభవాలను ఆసక్తిగా పంచుకోవాలి.

అతను స్త్రీలకు కనిపిస్తాడు. (9,10) 
మనం మన విధులలో నిమగ్నమైనప్పుడు దేవుని నుండి దైవిక సందర్శనలు తరచుగా జరుగుతాయి. ఇతరుల ప్రయోజనం కోసం తమ వనరులను ఉపయోగించే వారికి, మరిన్ని ఆశీర్వాదాలు వాగ్దానం చేయబడ్డాయి. ఈ సందర్భంలో క్రీస్తుని కలుసుకోవడం ఊహించనిది అయినప్పటికీ, క్రీస్తు తన మాట ద్వారా మనకు దగ్గరగా ఉన్నాడు. ఈ శుభాకాంక్షల ద్వారా క్రీస్తు మానవాళి పట్ల ఉన్న చిత్తశుద్ధిని వ్యక్తపరుస్తుంది, ఆయన ఉన్నత స్థితిలోకి ప్రవేశించిన తర్వాత కూడా.
క్రీస్తు తన అనుచరులు ఆనందంగా మరియు ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటాడు మరియు అతని పునరుత్థానం వేడుకలకు తగినంత కారణాన్ని అందిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్రీస్తు పునరుత్థానం ఆయన ప్రజలకు ఉన్న భయాలను అణచివేయడానికి ఉపయోగపడుతుంది. తన బాధల సమయంలో శిష్యులు ఇటీవల విడిచిపెట్టిన చర్య ఉన్నప్పటికీ, క్రీస్తు క్షమాపణ చర్యలో మరియు మనకు ఒక పాఠంగా, వారిని సోదరులుగా సూచిస్తాడు. క్రీస్తు మరియు విశ్వాసుల మధ్య మహిమ మరియు స్వచ్ఛతలో అపారమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ, వారిని తన సహోదరులుగా సంబోధించడానికి అతను దయతో వంగి ఉంటాడు.

సైనికుల ఒప్పుకోలు. (11-15) 
ధన వ్యామోహం ప్రజలను నీచమైన చర్యలకు పురికొల్పుతుంది. ఈ సందర్భంలో, తెలిసిన అబద్ధాన్ని ప్రచారం చేసినందుకు సైనికులకు ఉదారంగా రివార్డ్ ఇవ్వబడింది, అయితే చాలామంది తెలిసిన సత్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చిన్న మొత్తాన్ని అందించడానికి వెనుకాడతారు. యోగ్యమైన వారు జీవనోపాధి కోసం కష్టపడుతున్నప్పుడు సందేహాస్పద కారణాల కోసం గణనీయమైన మద్దతును చూడటం నిరుత్సాహపరుస్తుంది. పూజారులు పిలాతు కోపం నుండి సైనికులను రక్షించడానికి ప్రయత్నించారు, కాని వారు అబద్ధాలను ఆలింగనం చేసి ప్రచారం చేసే వారిపై దైవిక న్యాయం నుండి తప్పించుకోలేకపోయారు.
ఉద్దేశపూర్వక పాపాల పర్యవసానాల నుండి వ్యక్తులను కాపాడతామని చెప్పుకునే వారు తరచుగా అతిగా ప్రామిస్ చేసి డెలివరీ చేస్తారు. సైనికులు రూపొందించిన కథ దానంతట అదే విడిపోయింది. వారంతా నిద్రపోయి ఉంటే, ఈ సంఘటనలు వారికి తెలియవు. ఎవరైనా మేల్కొని ఉంటే, వారు మోసాన్ని నిరోధించేవారు మరియు డ్యూటీలో నిద్రపోతున్నట్లు అంగీకరించడం శిక్షకు దారితీయవచ్చు. ఇంకా, నివేదిక ఏదైనా నిజం కలిగి ఉంటే, అధికారులు అపొస్తలులను కఠినంగా విచారించేవారు. మొత్తం కథనం దాని అబద్ధాన్ని వెల్లడిస్తుంది.
ఇటువంటి చర్యలకు కేవలం మేధోపరమైన లోపాలను మాత్రమే కాకుండా గుండె యొక్క నైతిక అవినీతికి కారణమని చెప్పడం చాలా ముఖ్యం. వారి మోసపూరిత మార్గాన్ని బహిర్గతం చేయడానికి దేవుడు వారిని అనుమతించాడు. క్రీస్తు యొక్క దైవిక గుర్తింపుకు అత్యంత బలవంతపు రుజువు అతని పునరుత్థానం, ఈ సైనికులు ప్రత్యక్ష సాక్ష్యంతో, లంచాల కోసం తిరస్కరించడానికి ఎంచుకున్నారు. పరిశుద్ధాత్మ యొక్క పరివర్తనాత్మక పని లేకుండా స్పష్టమైన సాక్ష్యం కూడా వ్యక్తులను ఒప్పించదు అనే గంభీరమైన వాస్తవాన్ని ఇది హైలైట్ చేస్తుంది.

తన శిష్యులకు క్రీస్తు ఆజ్ఞ. (16-20)
ఈ సువార్తికుడు లూకా మరియు జాన్‌లచే డాక్యుమెంట్ చేయబడినట్లుగా, క్రీస్తు కనిపించిన ఇతర సందర్భాలను విస్మరించడాన్ని ఎంచుకుంటాడు మరియు ఒక ముఖ్యమైన సంఘటనపై దృష్టి సారిస్తాడు-అతని మరణానికి ముందు మరియు అతని పునరుత్థానం తర్వాత సంభవించే ఒక సంఘటన. విశ్వాసం అనే కటకం ద్వారా ప్రభువైన యేసును గ్రహించేవారు నిస్సందేహంగా ఆయనను ఆరాధిస్తారు. అయినప్పటికీ, భక్తుల విశ్వాసం కూడా బలహీనంగా మరియు అనిశ్చితంగా ఉండవచ్చు. అయినప్పటికీ, క్రీస్తు తన పునరుత్థానానికి సంబంధించిన బలమైన సాక్ష్యాలను అందించాడు, అది వారి సందేహాలను అధిగమించింది.
ఈ గంభీరమైన క్షణంలో, క్రీస్తు అపొస్తలులు మరియు అతని పరిచారకులను అన్ని దేశాలలోకి ప్రవేశించడానికి అధికారికంగా అధికారం ఇస్తాడు. వారు ప్రకటించే మోక్షం విశ్వవ్యాప్తం; దాని ప్రయోజనాలను కోరుకునే ఎవరికైనా ఇది అందుబాటులో ఉంటుంది. క్రీస్తు యేసు అందరినీ స్వాగతిస్తున్నాడు. క్రైస్తవ మతం, దాని ప్రధాన భాగం, అర్హమైన కోపం మరియు పాపం నుండి విముక్తిని కోరుకునే పాపి విశ్వాసం. ఇది అవతార కుమారుని ప్రాయశ్చిత్తం ద్వారా తండ్రి దయను చేరుకోవడం, పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడడం మరియు అన్ని శాసనాలు మరియు ఆజ్ఞలలో త్రియేక దేవుడు-తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ-ఆరాధన మరియు సేవకు తనను తాను అంకితం చేసుకోవడం.
బాప్టిజం ఆత్మ ద్వారా అంతర్గత పవిత్రీకరణ యొక్క బాహ్య అభివ్యక్తిని సూచిస్తుంది, విశ్వాసి యొక్క సమర్థనను నిర్ధారిస్తుంది మరియు బహిర్గతం చేస్తుంది. అందువల్ల, వ్యక్తులు ఆత్మపరిశీలన చేసుకోవడం అత్యవసరం, వారు పాపానికి చనిపోవడం మరియు ధర్మానికి పునర్జన్మ పొందడం వంటి అంతర్గత మరియు ఆధ్యాత్మిక దయను నిజంగా కలిగి ఉన్నారో లేదో అంచనా వేయండి.
విశ్వాసులు తమ ప్రభువు యొక్క శాశ్వత ఉనికిని అన్ని సమయాలలో-ప్రతిరోజు వాగ్దానం చేస్తారు. మన ప్రభువైన యేసు తన చర్చిలు మరియు మంత్రులతో నిరంతరం ఉంటాడు; అతని ఉనికి లేకుండా, వారు కోల్పోతారు. ఇజ్రాయెల్ దేవుడు, రక్షకుడు, కొన్నిసార్లు దాగి కనిపించవచ్చు, అతను ఎప్పుడూ దూరంగా ఉండడు. ఈ లోతైన పదాలకు, ప్రతిస్పందన "ఆమెన్" జోడించబడింది. లార్డ్ జీసస్, అలాగే ఉండండి. మీరు మాతో మరియు మీ ప్రజలందరితో ఉండండి. మా జీవితాలను ప్రకాశవంతం చేయండి, తద్వారా మీ మార్గాలు భూమిపై తెలుస్తుంది మరియు మీ మోక్షం అన్ని దేశాలకు చేరుతుంది.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |