Matthew - మత్తయి సువార్త 4 | View All

1. అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.

అపనింద పిశాచం అని అర్థమిచ్చే గ్రీకు పదానికి (డయాబొలొస్‌) అర్థం నిందలు మోపేవాడు లేక దూషించేవాడు. దయ్యాల అధిపతి సైతానుకు ఇది మరో పేరు. సైతాను గురించి నోట్స్ 1 దినవృత్తాంతములు 21:1; యోహాను 8:44; 2 కోరింథీయులకు 11:14. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో రెండు అదృశ్య రాజ్యాలు ఒకదాన్నొకటి వ్యతిరేకించుకుంటూ ఉన్నాయి – ఒకటి దేవుని రాజ్యం, రెండోది సైతాను రాజ్యం (మత్తయి 12:22-28). సైతాను దేవుని రాజ్యాన్ని పాడు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. మనుషుల్లో దుష్‌ప్రేరేపణ కలిగించడం అతడు ఉపయోగించే విధానాల్లో ఒకటి. యేసుకు వచ్చిన విషమ పరీక్షలను శ్రద్ధగా చదివితే ఆయన ఎలాంటివాడో, సైతాను ఎలాంటివాడో, ఇలాంటి విషమ పరీక్షలను జయించడమెలానో మనం నేర్చుకోగలం. యేసుప్రభువును తన అమోఘమైన పరిచర్య కోసమని అంతకుముందే దేవుని ఆత్మ అభిషేకించాడు. దేవుని రాజ్యం సమీపించింది, రాజు అభిషేకం పొందాడు. కానీ లోకంలోని సింహాసనాన్ని దేన్నో ఎక్కించకుండా ఆత్మ ఆయన్ను విషమ పరీక్షలను లేక దుష్‌ప్రేరణలను (ఇక్కడున్న గ్రీకు పదానికి ఈ రెండు అర్థాలూ వస్తాయి) ఎదుర్కొనేందుకు అరణ్యంలోకి తోడుకు వెళ్ళాడు. గొప్ప రాజ్యాన్ని తీసుకువచ్చే పద్ధతి ఉపవాసం, ఆకలి, పరీక్షలకు గురి కావడమేనా? ఇది మనిషి పద్ధతి ఎంతమాత్రం కాదు. ఇది దేవుని పద్ధతి. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనది. ఆ రాజ్యానికి రాజు అయిన వ్యక్తి స్వభావాన్ని పరీక్షలకు గురి చేసి ఆమోదించాలి. ఆయన దేవుని రాజ్యానికి శత్రువైన సైతానును ఓడించాలి. ఈ విషమ పరీక్షలవల్ల యేసు పరమ తండ్రికి పూర్తిగా విధేయుడనీ అన్నిటిలోనూ ఆయన్ను ఆనందపరిచే వాడనీ వెల్లడి అయింది. మనం రెండు సత్యాలను గనుక గుర్తిస్తే యేసుప్రభువు గురి అయిన పరీక్షను మనం అర్థం చేసు కోవడానికి అవి సహాయపడతాయి. పరీక్షకు గురి అవుతున్నది ఆయన మానవ స్వభావమే గానీ ఆయన దైవస్వభావం కాదు (కీడు చేసేలా దేవునికి ప్రేరేపణ కలగడం అసాధ్యం – యాకోబు 1:13); చివరి ఆదాముగా యేసు ఈ పరీక్షలకు గురి అయ్యాడు (1 కోరింథీయులకు 15:45-49). మొదటి ఆదాము మానవ జాతికి ప్రతినిధి; యేసైతే ఒక కొత్త రకం ఆధ్యాత్మిక ప్రజకు ప్రతినిధి, అలాంటివారిని కలగజేసేవాడు (రోమీయులకు 5:12-21). ఆదాము విషమ పరీక్షకు గురి అయినప్పుడు పతనం చెంది మానవ జాతినంతటినీ పతనం పాలు చేశాడు. యేసు ఈ పరీక్షకు ఎదురు నిలిచి, మనిషి కూడా తనతోబాటు ఉన్నత స్థానం వహించడానికి అవకాశం కలిగించాడు. మనిషిగా యేసు ఎదుర్కొన్న విషమ పరీక్ష గురించి హెబ్రీయులకు 2:18; హెబ్రీయులకు 4:15 లో ఉంది.

2. నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
నిర్గమకాండము 34:28

నిర్గమకాండము 24:18; నిర్గమకాండము 34:28; ద్వితీయోపదేశకాండము 8:2; 1 రాజులు 19:8 పోల్చి చూడండి. బైబిల్లో కొన్ని సార్లు 40 సంఖ్య పరీక్షకూ, సిద్ధబాటుకూ గుర్తు.

3. ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను

తండ్రి అయిన దేవునినుండి ఎలాంటి ఆదేశం లేకుండానే దేవుని శక్తిని తన స్వంత అవసరానికి యేసు ఉపయోగించుకోవాలని ప్రేరేపించడమే ఈ పరీక్ష ఉద్దేశం. మనుషులందరికీ ఆహారం అవసరమే. ప్రతివాడూ తన ఆహారాన్ని తాను సంపాదించుకునే ప్రయత్నం చెయ్యడంలో తప్పు లేదు. అయితే సంపాదించుకునే విధానం గురించే పరీక్ష వస్తుంది. ఎందుకంటే మనుషులు సైతాను మాటన్నా వినవచ్చు, లేక దేవుని వాక్కునైనా వినవచ్చు. దేవుని కుమారుడుగా యేసు బాధ్యత, విద్యుక్త ధర్మం, ఆధిక్యత ఏమిటంటే తన అవసరాలను తండ్రి తీరుస్తాడని నమ్మి, తండ్రి మాట ప్రకారం మాత్రమే ప్రవర్తించడం (యోహాను 4:34; యోహాను 5:30; యోహాను 6:38; యోహాను 8:29; హెబ్రీయులకు 10:5-7). సైతాను సూచనకు తల ఒగ్గి కడుపు నింపుకోవడం కంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా పస్తులుండడమే మేలు. ఈ లోకంలో మనుషులకు అవసరమైనవీ అవసరమని వారు అనుకున్నవీ అన్నిటి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఈ విషయంలో దేవుని విధానం ఒకటి ఉంది. సైతాను విధానాలు కొన్ని ఉన్నాయి. దేవుడు తన అవసరాలు తీర్చగలడన్న విషయం సందేహించేలా సైతాను మనల్ని ప్రేరేపిస్తాడు. మనమే పూనుకుని, అది మంచిదైనా చెడ్డదైనా ఏదో ఒక రీతిని మన అవసరాలు మనమే తీర్చుకునేలా చేస్తాడు. మత్తయి 6:25-33; లూకా 12:16-21; ఫిలిప్పీయులకు 4:19 పోల్చి చూడండి. ఈ విషమ పరీక్షను ఆదికాండము 3:1-6; నిర్గమకాండము 16:1-3, నిర్గమకాండము 16:28; కీర్తనల గ్రంథము 78:17-19 లోని విషమ పరీక్షలతో పోల్చి చూడండి.

4. అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
ద్వితీయోపదేశకాండము 8:3

సైతానుతో తన యుద్ధంలో యేసుప్రభువు ఆత్మ ఖడ్గాన్ని అంటే దేవుని వాక్కును ఉపయోగించాడు. సైతాను అగ్ని బాణాలను ఆర్పేందుకు నమ్మకమనే డాలును ఉపయోగించాడు (ఎఫెసీయులకు 6:16-17). “ప్రతి వాక్కు”– ఈ వాక్కులు ఎక్కడ కనిపిస్తాయి? బైబిల్లోనే – మరెక్కడా కాదు. 2 తిమోతికి 3:16; 2 పేతురు 1:21 చూడండి. “వ్రాసి ఉంది”– ద్వితీయోపదేశకాండము 8:3. యేసుకు దేవుని వాక్కు తెలుసు. దాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు, ప్రేమించాడు, నమ్మాడు, మన్నుమిన్నూ ఏకమైనా దానికే లోబడి ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే విషమ పరీక్షలో నెగ్గి, సైతాన్ను ఓడించగలిగాడు. అన్నిటిలో లాగానే ఇందులో కూడ ఆయన మనకు ఆదర్శం. బైబిలును ఎరిగి ఉండి, దాన్ని నమ్మి, ఆచరించడం ఎంత ప్రాముఖ్యమో చెప్పశక్యం కాదు. దేవుని వాక్కును ఎరుగని వారు సైతాను ప్రేరణలను తరచుగా గుర్తుపట్టలేకపోతారు. ఒకవేళ గుర్తుపట్టినా సైతానుతో పోరాడదలుచుకున్నా వారి ముఖ్యమైన ఆయుధం వారి చేతుల్లో ఉండదు.

5. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
Neh-h 11 1:1, యెషయా 52:1

సైతాను కూడా బైబిల్లోని వాక్కులను వల్లించగలడు. ఆత్మఖడ్గాన్ని మనపై ప్రయోగించడానికి అతడు ప్రయత్నిస్తాడు. అవసరమనుకుంటే బైబిలు అసలు దేవుని వాక్కు కానే కాదంటాడు. లేక అది దేవుని వాక్కే అని చెప్పి తన ఉద్దేశాలకు అనుగుణంగా దాన్ని వక్రం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ లోకంలో ఈ పనికి సైతానుకు సంతోషంగా సహాయం చేసేవారు చాలమంది ఉన్నారు – 2 కోరింథీయులకు 11:13-15; గలతియులకు 1:7. సైతాను బైబిలు వాక్కుల్ని అసందర్భంగా ప్రయోగించి వాటి అర్థాల్ని తారుమారు చేస్తాడు. వ 6 లోని వాక్కులు కీర్తనల గ్రంథము 91:11-12 లోనివి. దేవునిలో ఉంటూ, తమ జీవితాలపై దేవుని పరిపాలనను అంగీకరించినవారికి ఇచ్చిన మాటలు అవి (కీర్తనల గ్రంథము 91:1-9). దేవునికి వేరుగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఇష్టం వచ్చినట్టు చేసేవారికి ఈ వాగ్దానాలు ఇవ్వబడలేదు. సైతాను సలహాలను, ముఖ్యంగా బైబిలు వచనాలు ఎత్తి చెప్పినప్పుడు వాడి సలహాలను పాటించడం జ్ఞానం కాదు. దేవుడు చూపిన మార్గంలో కాకుండా మన పేరు ప్రఖ్యాతుల కోసం సుఖభోగాల కోసం, లేక స్వలాభం కోసం, దేవునికి మహిమ కలగని రీతిలో మనం స్వంతంగా పనులు చేసేలా చేయడమే సైతాను లక్ష్యం. సైతాను క్రీస్తుపై ప్రయోగించిన ఈ మూడు విషమ పరీక్షలూ ఆయన దేవుని సంకల్పానికి చూపవలసిన సంపూర్ణ విధేయత గురించినవే. క్రీస్తు వచ్చినది దేవునికి మహిమ కలగజేయడానికే గాని తనకోసం పేరు ప్రఖ్యాతులు అర్జించేందుకు కాదు. నీతియుక్తమైన ప్రయోజనమేమీ లేకుండా ఏవో కన్నుచెదరగొట్టే అద్భుతాలు చెయ్యడం క్రీస్తు పని కాదు.

6. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
కీర్తనల గ్రంథము 91:11-12

7. అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 6:16

ద్వితీయోపదేశకాండము 6:16 చూడండి. దేవుడు అద్భుత రీతిలో తమను విడిపిస్తాడులే అన్న తలంపుతో మనుషులు తమ బుద్ధిహీనత మూలంగా, గర్వం మూలంగా కష్టాల్లో ప్రమాదాల్లో ఇరుక్కోకూడదు. మనిషికి తగిన పని దేవునిపై నమ్మకం ఉంచి ఆయన మాటకు లోబడడమే గాని ఆయనను అద్భుతాలు చేసేలా బలవంతం చెయ్యడం కాదు. మొండి తెగువకూ నమ్మకానికీ చాలా తేడా ఉంది. సైతాను సందర్భానికి వ్యతిరేకంగా వాడిన దేవుని వాక్కుకు విరుగుడుగా సందర్భానుసారంగా సరిగా అర్థం వచ్చేలా యేసు మరో వాక్కును ఉపయోగించాడు. బైబిలును సరిగా అర్థం చేసుకోవాలంటే వాక్యాలను ఇతర వాక్యాలతో సరిపోల్చాలి. ఏ వాక్య భాగాన్నైనా సందర్భ సహితంగా పఠించాలి.

8. మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి

సైతాను ఇక్కడ తన రహస్యమైన కోరికను బయట పెడుతున్నాడు – మనుషులు తనను ఆరాధించాలని వాడి కోరిక. వాడు ఈ యుగదేవుడు (2 కోరింథీయులకు 4:4). అందువల్ల మనుషులు తనను గొప్పచేసి తనకు మొక్కి విధేయత చూపాలని కోరుతాడు. మనుషులు కొందరు తెలిసి, కొందరు తెలియకా అలానే చేస్తారు. లేవీయకాండము 17:7; ద్వితీయోపదేశకాండము 32:17; కీర్తనల గ్రంథము 106:37; 1 కోరింథీయులకు 10:20; ప్రకటన గ్రంథం 9:20 చూడండి. ఇది సాధించేందుకు భూమిమీద మత సంబంధం, లోక సంబంధం అయిన అన్ని వ్యవహారాల్లోనూ వాడు చురుకుగా పని చేస్తూ ఉంటాడు. తనవైపుకు వాడు మనుషుల్ని ఆకర్షించుకునే పద్ధతుల్లో ఒకటి సంపదలు, అధికారం ఎర చూపించడం ద్వారా. ఇలాంటివి వాడు ఇవ్వగలడు. ఎందుకంటే వాడు ఆదామును పాపంలోకి లాగినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అవన్నీ అతడి హస్తగతం అయ్యాయి. భూమిని పాలించడానికి దేవుడు నియమించిన వ్యక్తి ఆదాము (ఆదికాండము 1:27-28). అతడే మానవ జాతికి జనకుడు, ప్రతినిధి. అయితే అతడు పాపంలో పడి భ్రష్టుడై పోయినందువల్ల మానవ జాతిని సైతాను చాలా మట్టుకు తన వశం చేసుకోగలిగాడు. లూకా 4:6; యోహాను 12:31; ఎఫెసీయులకు 2:1-2; 2 తిమోతికి 2:26; 1 యోహాను 5:19 పోల్చిచూడండి. ఇహలోకంలోని కొంచెం సంపదను, కొంచెం ఘనతను, కొద్ది అధికారాన్ని సంపాదించుకోవాలని అనేకమంది న్యాయ సూత్రాలను విడిచి, దేవుని సత్యాన్ని నిరాకరించి, అబద్ధాలు, మోసం, స్వార్థం, అన్యాయంతో కూడిన మార్గాన్ని అనుసరిస్తారు. ఇది సైతాను మార్గం (ఇలాంటి వాళ్ళలో క్రైస్తవులని పేరు పెట్టుకున్నవారు కూడా ఉండడం చాలా విచారకరం). వీరికీ క్రీస్తుకూ ఉన్న తేడా ఒక్క విషయంలో తెలిసిపోతున్నది. కొంచెం ఇంటి స్థలం కోసం వారు న్యాయం, నియమాలనూ అన్నిటినీ వదిలివేస్తారు. క్రీస్తు అయితే లోకం మొత్తాన్ని సంపాదించడం కోసమైనా సరే ఒక్క స్వల్ప న్యాయ సూత్రాన్ని కూడా విడిచి పెట్టడు. తండ్రియైన దేవుని పట్ల నమ్మకంగా ఉండేందుకూ, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకూ క్రీస్తు సైతాను ఇవ్వజూపిన వాటన్నిటినీ గడ్డిపోచతో సమానంగా ఎంచాడు. అలా చేసినందువల్ల పేదరికం, బాధలు, మరణం వాటిల్లినా సరే వాటిని వదలలేదు. ఆయనే మనకు ఆదర్శం.

9. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెద నని ఆయనతో చెప్పగా
దానియేలు 3:5, దానియేలు 3:10, దానియేలు 3:15

10. యేసు వానితో - సాతానా, పొమ్ము - ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
ద్వితీయోపదేశకాండము 6:13

ద్వితీయోపదేశకాండము 6:13 చూడండి. నిజమైన ఆరాధన పరిమితిని ఇది తెలియజేస్తుంది. ప్రభువైన దేవుడు (యెహోవా – నిర్గమకాండము 3:14), అంటే బైబిల్లోని దేవుడు, అన్నిటినీ సృష్టించినవాడు, ఏకైక దేవుడు ఒక్కడే మన ఆరాధనకు అర్హుడు (నిర్గమకాండము 20:1-6 నోట్స్‌). బైబిల్లో దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ చాలు యేసుకు తక్షణమే, సంపూర్ణంగా, శాశ్వతంగా దానికి విధేయత చూపాలని ఆయన నిశ్చయం. దానినుంచి ఏమాత్రం పక్కకు తొలగాలన్న చిన్న సూచన అయినా సరే ఆయన వెంటనే దాన్ని త్రోసిపుచ్చేవాడు. ఆయనే మనకు ఆదర్శం. యేసు ఇతరుల ఆరాధనను స్వీకరించడం, దేవుడు దేవదూతలతో యేసును ఆరాధించాలని చెప్పడం, వీటినిబట్టి ఆయన దేవుని అవతారమని మనకు తెలుస్తున్నది (మత్తయి 28:17; హెబ్రీయులకు 1:6).

11. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.

యాకోబు 4:7 పోల్చిచూడండి. లూకా 4:13 చూడండి. ప్రస్తుతానికి సైతాను వెళ్ళిపోవలసి వచ్చింది. అయితే చేతనైనప్పుడల్లా తిరిగి వస్తూనే ఉంటాడు. పరలోక దూతల పని ఒకదాన్ని ఇక్కడ చూడండి (హెబ్రీయులకు 1:14).

12. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి

మత్తయి 14:3.

13. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

గలలీ సరస్సు తీరం పశ్చిమోత్తర దిక్కున ఉన్న ఊరు కపెర్‌నహూం. గలలీలో తన పరిచర్య కాలంలో యేసుప్రభువు కొంత కాలం ఇక్కడ నివసించాడు (మార్కు 2:1; మార్కు 9:33).

14. జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు

15. చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
యెషయా 9:1-2

యెషయా 9:1-2 చూడండి. ఈ గొప్ప కాంతి అభిషిక్తుడైన యేసు క్రీస్తే – లూకా 2:32; యోహాను 8:12; యోహాను 12:46.

16. అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు (ఈలాగు జరిగెను. )
యెషయా 9:1-2

17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

“పరలోక రాజ్యం”– ఈ మాట మత్తయి శుభవార్తలో మాత్రమే ఉంది. మార్కు, లూకా, యోహాను దేవుని రాజ్యం అనే పదాల్ని వాడారు. క్రొత్త ఒడంబడికలో ఈ రాజ్యం గురించిన ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఒక్క మత్తయి శుభవార్తలో ఇది దాదాపు 50 సార్లు, క్రొత్త ఒడంబడిక గ్రంథం మొత్తంమీద సుమారు 140 సార్లూ కనిపిస్తుంది. దీన్ని గురించిన కొన్ని ముఖ్యమైన రిఫరెన్సులు మత్తయి 5:3-10; మత్తయి 6:10, మత్తయి 6:33; మత్తయి 7:21; మత్తయి 13:11; మత్తయి 16:28; మత్తయి 18:3, మత్తయి 18:23; మత్తయి 21:43; మత్తయి 24:14; మత్తయి 25:34; యోహాను 3:3; యోహాను 18:36; అపో. కార్యములు 1:3, అపో. కార్యములు 1:6; అపో. కార్యములు 14:22; రోమీయులకు 14:17; 1 కోరింథీయులకు 4:20; 1 కోరింథీయులకు 6:9-10; 1 కోరింథీయులకు 15:24, 1 కోరింథీయులకు 15:50; గలతియులకు 5:21; ఎఫెసీయులకు 5:5; కొలొస్సయులకు 1:13; హెబ్రీయులకు 1:8; హెబ్రీయులకు 12:28; ప్రకటన గ్రంథం 1:9; ప్రకటన గ్రంథం 11:15; ప్రకటన గ్రంథం 12:10. “పరలోక” రాజ్యం అంటే ఆధ్యాత్మిక పరిపాలన. దాని మూలాధారం దేవుని నివాసమైన పరలోకంలో ఉంది. “దేవుని” రాజ్యం అంటే మనుషుల మధ్య, లేక మనుషుల హృదయాల్లో దేవుడు పరిపాలించడం. దేవుని రాజ్యం అంటే కొన్ని సార్లు దేవుని పరిపాలన బాహ్య రూపం అనీ, మరి కొన్ని సార్లు ఆయన విశ్వాసుల హృదయాల్లోని అంతరంగ ఆధ్యాత్మిక పరిపాలన అనీ అర్థం వస్తుంది. బాప్తిసం ఇచ్చే యోహాను, యేసుప్రభువూ కూడా రాజ్యం దగ్గరగా ఉందనే చెప్పారు. ఎందుకంటే పరలోకంనుంచి వచ్చిన రాజు యేసు తన సేవలో ప్రవేశిస్తున్నాడు (మత్తయి 2:2; మత్తయి 21:5). అందువల్ల పాత ఒడంబడిక దినాల్లో ఎరుగని ఒక సరికొత్త రీతిలో దేవుని పరిపాలన బ్రహ్మాండంగా ప్రత్యక్షం అయింది. (దేవుడు రాజుగా వెల్లడి అయ్యే సంగతుల గురించి నోట్స్ ఆదికాండము 50:20; కీర్తనల గ్రంథము 24:7-10; కీర్తనల గ్రంథము 47:2; యెషయా 6:5). ప్రజలు పశ్చాత్తాపపడి తమ జీవితాల్లో, హృదయాల్లో దేవుని పరిపాలనను అంగీకరించాలని యేసుప్రభువు ప్రకటించాడు. “పశ్చాత్తాపపడండి”– మత్తయి 3:2.

18. యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

19. ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;

మనుషులను పట్టే జాలరులుగా మారడం అంటే శిష్యుడు తన ప్రయోజనం కోసం మనుషుల్ని వలలో చిక్కించుకోవడం కాదు. క్రీస్తు రాయబారుల పని నాటికీ, నేటికీ, మనుషులను పాపంనుండి మళ్ళించి క్రీస్తు చెంతకూ శాశ్వత రక్షణకూ తీసుకురావడమే. భూమిపై చెయ్యగలిగిన అత్యంత ఘన కార్యం ఇదే. శిష్యులను మనుషుల్ని పట్టే జాలరులుగా చేసేది క్రీస్తే. ఇది వారి స్వభావాల్లోనుంచి రాదు. తమ స్వశక్తితో దీన్ని వారు సాధించలేరు. వారు క్రీస్తును అనుసరిస్తూ ఉండగా ఆయన వారిని అలా తయారు చేస్తాడు. ఆయన మార్గాన్ని అనుసరించి, ఆయన ఉపదేశాలను విధేయతతో వింటూ ఆయనిచ్చే ఆత్మను చేకొంటే అలా జరుగుతుంది. అపొస్తలుల కార్యములు పుస్తకంలోనూ, వారు రాసిన లేఖల్లోనూ వారు మనుషుల్ని పట్టే గొప్ప జాలరులుగా తయారైన సంగతిని చూడగలం.

20. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

యేసు వీరిని పిలిచిన పిలుపులోని ప్రభావం, అధికారాలనూ, వారు తక్షణమే లోబడిన విషయాన్నీ గమనించండి. మనుషుల్లోనుంచి తన సేవకులుగా ఉండడానికి దేవుడు కొందరిని పిలవడంలో ఆయన సర్వాధిపత్య నిర్ణయానికి ఇది మరో ఉదాహరణ (మార్కు 3:13-14; యోహాను 15:16; అపో. కార్యములు 22:14-15; ఆదికాండము 12:1; నిర్గమకాండము 3:4, నిర్గమకాండము 3:10; యెహోషువ 1:2; యిర్మియా 1:4-5).

21. ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.

ఆలయంలోని యాజుల్లోనుండీ, ధర్మశాస్త్ర పండితుల్లోనుండీ, ధనికుల్లోనుండీ, రాజకీయంగా సామాజికంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల్లోనుండీ యేసుప్రభువు తన శిష్యుల్ని ఎంచుకోలేదు. మామూలు పనిపాటలు చేసుకునే సామాన్య మనుషుల్ని ఎన్నుకున్నాడు. వారిని దేవుని రాజ్య సంబంధమైన పనిలో అసామాన్యులుగా తయారు చేశాడు. 1 కోరింథీయులకు 1:26-29 పోల్చిచూడండి. యేసుప్రభువు అనుసరించే పద్ధతి ఇప్పటికీ ఇదే.

22. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

23. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.

“సమాజ కేంద్రాలు”– ఇవి దైవారాధనా, ప్రార్థనలూ, మత ప్రబోధాలూ చేసేందుకూ, మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్ర సంబంధమైన వివాదాలు తీర్చేందుకూ యూదులు, ఇస్రాయేల్ దేశమంతటా కట్టుకున్న స్థలాలు. ఇవి యూదుల మత జీవనానికి కేంద్ర స్థానాలు. ఈ సమాజ కేంద్రాల నాయకులు ఒప్పుకున్నప్పుడు ఇలాంటి చోట్ల యేసు దేవుని వాక్కు ఉపదేశించాడు. అంతేగాక వీధుల్లో, కొండ చరియల్లో, జనం ఎక్కడ తన చుట్టూ పోగైతే అక్కడ బోధించాడు. దేవుడు మానవ హృదయాల్లో తన పరిపాలనను స్థాపిస్తూ ఉన్నాడన్న శుభవార్తే ఆయన సందేశం. ఆయన అన్ని రకాల వ్యాధులున్న వారినీ బాగు చేశాడు – కొన్ని సార్లు నోటి మాటద్వారా, కొన్ని సార్లు వారిని తాకడం ద్వారా. తన స్వార్థం కోసం ఆయన అద్భుతాలు చెయ్యలేదు (వ 1-7) గానీ తన కనికరాన్ని బట్టి ఇతరుల కోసం చేశాడు. ఇస్రాయేల్‌వారి అభిషిక్తుడుగా ఆయన చేపట్టిన మూడు సూత్రాల సేవ ఇది – ఉపదేశించడం, రోగుల్ని బాగు చెయ్యడం, రాజ్య శుభవార్త ప్రకటించడం. దేవుని సత్యాన్ని బోధించడం, ఉపదేశించడం చాలా గౌరవ ప్రదమైన పని అని మనం నేర్చుకోవాలి. దేవుని కుమారుడే దీన్ని సంతోషంగా చేశాడు. అంతేకాకుండా ఆయన అన్ని విధాలుగానూ అంటే శరీరం, మనసు, ఆత్మల విషయంలో మనుషులకు సహాయం చేసేందుకు సమకట్టాడని కూడా మనం నేర్చుకోవాలి. బాధలో ఉన్నవారికి వారి బాధనుండి విడిపించేందుకు ఆయన తనకు చేతనైనది చేయకుండా ఊరికినే బోధించలేదు. ఆయనే మన ఆదర్శం.

24. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

“సిరియా”– గలలీకి ఉత్తరాన ఉన్న దేశం. దీన్లో చాలా భాగం యూదేతరులు నివసించారు. “దయ్యాలు”– యేసు క్రీస్తు పరిచర్యలో దయ్యాలు పట్టినవారి విషయం తరచుగా కనిపిస్తుంది. క్రొత్త ఒడంబడిక గ్రంథం కొన్ని సార్లు దయ్యాలను మలిన పిశాచాలు లేక దురాత్మలు అని కూడా అంటూ ఉంది. వీళ్ళు ఎక్కడనుండి వచ్చారో దయ్యాలెలా అయ్యారో బైబిలులో చెప్పలేదు. అయితే సైతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వాడితో చేరిన పతనమైన దేవదూతలే వీళ్ళు అని మనం అర్థం చేసుకునేందుకు సహాయపడే సూచనలు బైబిల్లో ఉన్నాయి (మత్తయి 12:24; మత్తయి 25:41; ప్రకటన గ్రంథం 12:3). దయ్యాలు చనిపోయిన మనుషుల ఆత్మలని బైబిలు ఎక్కడా సూచించడం లేదు. దయ్యం పట్టడం అనేది మనిషిపై బయటనుంచి దురాత్మ ప్రభావితం, శక్తి ప్రయోగించడం చెయ్యడం మాత్రమే కాదు. ఒక వ్యక్తి శరీరాన్ని దురాత్మ స్వాధీనం చేసుకుని అందులో నివాసం చెయ్యడం. యేసుప్రభువుకు దయ్యాలపై సంపూర్ణ అధికారం ఉంది. ఒక్క మాటతో వాటిని మనుషుల్లోనుంచి ఆయన వెళ్ళగొట్టాడు (మత్తయి 8:16, మత్తయి 8:28-32). దయ్యాల గురించి లేవీయకాండము 17:7 కూడా చూడండి.

25. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దాను నకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.

దెకపొలి గలలీ సరస్సుకు, యొర్దాను నదికి తూర్పున ఉన్న ప్రాంతం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు యొక్క టెంప్టేషన్. (1-11) 
క్రీస్తు యొక్క టెంప్టేషన్ గురించి, దేవుని కుమారుడిగా మరియు ప్రపంచ రక్షకుడిగా ప్రకటించబడిన వెంటనే, అతను శోధనను ఎదుర్కొన్నాడు. గొప్ప అధికారాలు మరియు దైవిక అనుగ్రహం యొక్క ప్రత్యేక సంకేతాలు కూడా ఎవరినీ శోదించబడకుండా రక్షించవని ఇది నొక్కి చెబుతుంది. అయితే, పరిశుద్ధాత్మ దేవుని పిల్లలుగా మన స్వీకరణకు సాక్ష్యమిచ్చినప్పుడు, అది దుష్టాత్మ యొక్క అన్ని మోసాలను ఎదుర్కోగలదు. క్రీస్తు ఉద్దేశపూర్వకంగానే ఈ ఆధ్యాత్మిక యుద్ధంలోకి నడిపించబడ్డాడు. మనము మన స్వంత శక్తిపై ఆధారపడినప్పుడు మరియు దెయ్యాన్ని ప్రలోభపెట్టడం ద్వారా అతనిని రెచ్చగొట్టినప్పుడు, దేవుడు మనలను మన స్వంత మార్గాలకు విడిచిపెట్టే ప్రమాదం ఉంది. deu 8:3లో పేర్కొనబడినట్లుగా, వారి స్వంత కోరికలు వారిని ఆకర్షించినప్పుడు ఇతరులు ప్రలోభాలకు లోనవుతారు, దీనిని శోధకుడు సౌకర్యవంతంగా వదిలివేసాడు. దేవుని వాగ్దానం అచంచలమైనది మరియు నమ్మదగినది. అయినప్పటికీ, పాపంలో కొనసాగడానికి మనం కృప యొక్క సమృద్ధిని సాకుగా ఉపయోగించకూడదు.
సాతాను క్రీస్తుకు ప్రపంచ రాజ్యాలను మరియు వాటి మహిమను అందించడం ద్వారా విగ్రహారాధనలోకి నడిపించడానికి ప్రయత్నించాడు. ప్రాపంచిక వైభవం యొక్క ఆకర్షణ ఒక శక్తివంతమైన టెంప్టేషన్, ప్రత్యేకించి వివేచన లేని వారికి. క్రీస్తు సాతానును ఆరాధించమని ప్రలోభపెట్టాడు, కానీ అతను ఈ ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించాడు, "సాతాను, నా వెనుకకు రా!" కొన్ని ప్రలోభాలు బహిరంగంగా చెడ్డవి మరియు వాటిని వ్యతిరేకించడమే కాకుండా వెంటనే పక్కన పెట్టాలి. టెంప్టేషన్‌ను ఎదిరించడంలో వెంటనే మరియు దృఢ నిశ్చయంతో ఉండడం తెలివైన పని. మనం దయ్యానికి వ్యతిరేకంగా నిలబడితే, అతను మన నుండి పారిపోతాడు. అనిశ్చితి మరియు చర్చ తరచుగా టెంప్టేషన్‌కు లొంగిపోవడానికి దారి తీస్తుంది. సాతాను అందించే మనోహరమైన ఆఫర్లను కొద్దిమంది మాత్రమే నిర్ణయాత్మకంగా తిరస్కరించగలరు, కానీ మన స్వంత ఆత్మను మనం కోల్పోయినట్లయితే మొత్తం ప్రపంచాన్ని పొందడంలో లాభం ఏమిటి?
ప్రలోభాలను ఎదుర్కొన్న తర్వాత, క్రీస్తు దైవిక సహాయాన్ని పొందాడు, అతని మిషన్‌ను కొనసాగించడానికి అతనికి ప్రోత్సాహకరంగా మరియు ఆయనపై నమ్మకం ఉంచడానికి ఒక ఉదాహరణగా పనిచేశాడు. టెంప్టేషన్‌ను అనుభవించడం ఎలా ఉంటుందో అతనికి తెలుసు, మరియు సహాయం పొందడం యొక్క ఉపశమనాన్ని కూడా అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి, అతను శోదించబడిన వారితో సానుభూతి పొందడమే కాకుండా వారికి సకాలంలో ఉపశమనం కూడా అందిస్తాడని మనం ఊహించవచ్చు.

గలిలయలో క్రీస్తు పరిచర్య ప్రారంభం. (12-17) 
వాటిని విస్మరించే మరియు తిరస్కరించే వారి నుండి సువార్త మరియు దయ యొక్క మార్గాలను ఉపసంహరించుకోవడం దేవునికి న్యాయమైనది. క్రీస్తు తన ఉనికిని స్వాగతించని చోట ఉండడు. క్రీస్తు లేకుండా జీవించేవారు ఆధ్యాత్మిక చీకటిలో నివసిస్తారు. వారు ఈ స్థితిలో ఉండటానికి ఎంచుకున్నారు, కాంతి కంటే అజ్ఞానాన్ని ఇష్టపడతారు. సువార్త వచ్చినప్పుడు, అది వెలుగును తెస్తుంది. ఇది సువార్త వలెనే వెల్లడిస్తుంది మరియు మార్గనిర్దేశం చేస్తుంది. పశ్చాత్తాపం బోధించడం సువార్తలో ముఖ్యమైన భాగం. పశ్చాత్తాపం యొక్క కఠినమైన సందేశాన్ని బోధించిన బాప్టిస్ట్ యోహాను మాత్రమే కాదు, దయగల యేసు కూడా. ఈ సందేశం అవసరం అలాగే ఉంది. క్రీస్తు ఆరోహణ తరువాత పరిశుద్ధాత్మ కుమ్మరించబడే వరకు పరలోక రాజ్యము యొక్క పూర్తి సాక్షాత్కారము సంపూర్ణంగా పరిగణించబడలేదు.

సైమన్ మరియు ఇతరుల పిలుపు. (18-22) 
క్రీస్తు తన బోధనను ప్రారంభించినప్పుడు, అతను మొదట తన శ్రోతలుగా ఉండే శిష్యులను సమీకరించడం ప్రారంభించాడు మరియు తరువాత తన బోధనలను ప్రకటించాడు. ఈ శిష్యులు అతని అద్భుతాలకు సాక్ష్యమివ్వడానికి మరియు వాటి గురించి సాక్ష్యమివ్వడానికి ఎంపిక చేయబడ్డారు. అతను హేరోదు కోర్టుకు లేదా యెరూషలేములోని ఉన్నత స్థాయి అధికారుల వద్దకు వెళ్లలేదు కానీ గలిలయ సముద్రం ఒడ్డుకు వెళ్లాడు, అక్కడ అతను మత్స్యకారులను పిలిచాడు. పేతురు మరియు ఆండ్రూలను పిలిచిన అదే దైవిక శక్తి అన్నాస్ మరియు కైఫా వంటి వ్యక్తులను ప్రభావితం చేయగలదు, ఎందుకంటే ఏదీ దేవుని సామర్థ్యానికి మించినది కాదు. ఏది ఏమైనప్పటికీ, జ్ఞానులను కలవరపెట్టడానికి క్రీస్తు ఉద్దేశపూర్వకంగా ప్రపంచ దృష్టిలో సరళంగా పరిగణించబడే వారిని ఎంపిక చేస్తాడు. నిజాయితీగల వృత్తిలో శ్రద్ధ వహించడం క్రీస్తుకు సంతోషాన్నిస్తుంది మరియు పవిత్ర జీవితానికి ఆటంకం కలిగించదు. పనిలేకుండా ఉండడం వల్ల ప్రజలు దేవుని పిలుపు కంటే సాతాను ప్రలోభాలకు ఎక్కువగా గురవుతారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ మరియు విధేయత చూపడాన్ని చూడటం ఆనందం మరియు ఆశ యొక్క మూలం. క్రీస్తు వచ్చినప్పుడు, అర్థవంతమైన పనిలో నిమగ్నమై ఉండటం అభినందనీయం. మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, "నేను క్రీస్తులో ఉన్నానా?" మరియు దానిని అనుసరించి, "నేను నా పిలుపును నెరవేరుస్తున్నానా?" వారు మొదట్లో సాధారణ శిష్యులుగా క్రీస్తును అనుసరించారు యోహాను 1:37, వారు ఇప్పుడు తమ వృత్తులను విడిచిపెట్టవలసి వచ్చింది. క్రీస్తును సరిగ్గా అనుసరించాలనుకునే వారు, ప్రాపంచిక అనుబంధాలతో విడిపోవడానికి వారి సుముఖతను ప్రదర్శిస్తూ, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రతిదీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువైన యేసు శక్తికి సంబంధించిన ఈ ఉదాహరణ, ఆయన కృపపై ఆధారపడటానికి మనకు ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది, ఆయన మాట్లాడినప్పుడు, ఆయన సంకల్పం వెంటనే నెరవేరుతుంది.

యేసు బోధిస్తాడు మరియు అద్భుతాలు చేస్తాడు. (23-25)
క్రీస్తు ఎక్కడికి వెళ్లినా, అతను తన బోధల యొక్క వైద్యం శక్తికి మరియు ఆత్మ యొక్క ప్రభావానికి ప్రతీకగా అద్భుతాల ద్వారా తన దైవిక మిషన్‌ను పునరుద్ఘాటించాడు. ఈరోజు మన శరీరాలలో రక్షకుని అద్భుత స్వస్థతను మనం ప్రత్యక్షంగా అనుభవించలేకపోయినా, మనం ఔషధం ద్వారా ఆరోగ్యానికి పునరుద్ధరించబడినప్పుడు, మనం ఇప్పటికీ ఆయనకు స్తుతిస్తాము. ప్రకరణము మూడు విస్తృతమైన పదాలను ఉపయోగిస్తుంది. అతను ప్రతి రకమైన అనారోగ్యం లేదా వ్యాధిని దాని తీవ్రత లేదా సంక్లిష్టతతో సంబంధం లేకుండా సరిదిద్దాడు; కేవలం మాటతో నయం చేయడానికి క్రీస్తుకు ఏదీ చాలా సవాలుగా లేదు. మూడు నిర్దిష్ట అనారోగ్యాలు ప్రస్తావించబడ్డాయి: పక్షవాతం, అత్యంత లోతైన శారీరక బలహీనతను సూచిస్తుంది; వెర్రితనం, తీవ్రమైన మానసిక రుగ్మతను సూచిస్తుంది; మరియు దుష్ట ఆత్మలచే స్వాధీనం చేసుకోవడం, శరీరం మరియు మనస్సు రెండింటికీ గొప్ప బాధ మరియు విపత్తును సూచిస్తుంది. అయినప్పటికీ, క్రీస్తు ఈ బాధలన్నింటినీ స్వస్థపరిచాడు. శారీరక రుగ్మతలను పరిష్కరించడం ద్వారా, అతను ప్రపంచంలో తన ప్రాథమిక లక్ష్యం: ఆధ్యాత్మిక వ్యాధులను నయం చేయడం. పాపం అనేది ఆత్మ యొక్క బాధ, అనారోగ్యం మరియు వేదన, మరియు క్రీస్తు పాపాన్ని నిర్మూలించడానికి వచ్చాడు, తద్వారా ఆత్మను ఆరోగ్యానికి పునరుద్ధరించాడు.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |