Matthew - మత్తయి సువార్త 8 | View All

1. ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.

ఇది అద్భుతాలు అధ్యాయం. ఇందులో యేసుప్రభువు మనుషుల వ్యాధులపైనా (వ 1-17), ఆధ్యాత్మిక జీవన సంబంధమైన సంగతులపైనా (వ 18-22), ప్రకృతి శక్తులపైనా (వ 23-27), అదృశ్యమైన ఆత్మల లోకంపైనా (వ 28-34) తన అధికారాన్నీ, ప్రభావాన్నీ కనపరుస్తున్నాడు. ఆయన తానెవరినని చెప్పుకున్నాడో – అంటే పరలోకంనుంచి వచ్చిన ప్రభువు – అక్షరాలా ఆయనే అనేందుకు ఇదంతా ధారాళమైన సాక్ష్యాధారం (యోహాను 3:13; యోహాను 8:23). క్రీస్తు అద్భుతాలు ఆయన మహిమను కనపరిచాయి – యోహాను 2:11. పరమ తండ్రి అయిన దేవుడు ఆయన్ను పంపాడనీ, ఆయన ఆ తండ్రితో ఏకంగా ఉన్నాడనీ ఇదంతా రుజువు చేస్తున్నది (యోహాను 5:36; యోహాను 10:37-38; యోహాను 14:11; అపో. కార్యములు 2:22). ఇవి క్రీస్తు యోగ్యతా పత్రాల లాంటివి, దేవుడు ఆయన యోగ్యతను దృఢపరుస్తూ రాసి ఇచ్చిన సిఫారసు లేఖల లాంటివి. ఇవి వ్రాత పూర్వకంగా లేవు, చేతల రూపంలోనే ఉన్నాయి. దేవుని రాజ్యం వచ్చిందనడానికి ఇవి నిదర్శనాలు (మత్తయి 12:18). యేసుప్రభువు చేసిన అద్భుతాలు మంత్రవిద్య ద్వారా చేయగలిగిన మాయలు కావు. “నివారణ లేని” కుష్ఠువంటి వ్యాధులున్నవారిని ఆయన బాగు చేశాడు. గుడ్డివారి కళ్ళను తెరిచాడు (మత్తయి 9:27-30; మత్తయి 11:4; మత్తయి 20:34), నీళ్ళమీద నడిచాడు (మత్తయి 14:25), చనిపోయిన వారిని బ్రతికించాడు (లూకా 7:11-15; లూకా 8:49-56; యోహాను 11:43-44). అంతే గాక తానే మరణంనుంచి లేచాడు (మత్తయి 28:1-6) – మానవ చరిత్రంతట్లో అలా చేసినది ఆయన ఒక్కడే. యేసు చేసినది కేవలం ఉపదేశించడం కాదు. అతి స్పష్టమైన రీతిలో దేవుని ప్రభావాన్నీ, దేవుని లక్షణాలనూ ప్రదర్శించాడు. అలాగని అద్భుతాలు చేసేవారంతా దేవునినుంచి వచ్చారని భావించకూడదు (మత్తయి 7:22; మత్తయి 24:24). కపట ప్రవక్తలు చేసే అద్భుతాలు సైతాను శక్తికి సాక్ష్యాధారాలు. వారి స్వభావం కూడా వారి ఉపదేశాల వల్లా, జీవిత విధానాల వల్లా క్రీస్తు శిష్యులైనవారికి తేటతెల్లమే.

2. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.

పాత ఒడంబడిక గ్రంథంలో కొన్ని వ్యాధులు పాపానికి సూచనలుగా, సాదృశ్యాలుగా ఉన్నాయి. అవి నయం కావడం ఆధ్యాత్మికంగా నివారణ కలగడానికి సూచన. లేవీయకాండము 13:1-44 గురించిన నోట్ చూడండి.

3. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి యాయెను.

యేసు అతణ్ణి ముట్టుకోవడం ఆయన కనికరాన్నీ ప్రేమనూ ప్రదర్శించే చర్య. పరలోక సింహాసనం నుంచి వచ్చిన రాజు ఒక అశుద్ధుణ్ణి (లేవీయకాండము 13:45-46) శుద్ధుడుగా ఆరోగ్యవంతుడుగా చేసేందుకు తన చెయ్యి చాపుతున్నాడు. ఆత్మ విషయాల్లో కూడా క్రీస్తు నిర్వర్తించే పని ఇదే (యోహాను 15:3; ఎఫెసీయులకు 5:25-27; హెబ్రీయులకు 9:13-14; 1 యోహాను 1:7). ఆయన మాటలు గమనించండి – “నాకిష్టమే”. ఆయన దగ్గరికి సహాయం కోరి వచ్చిన వారెవరినైనా యేసుప్రభువు నిరాకరించి పంపేసినట్టు బైబిల్లో ఎక్కడా కనిపించదు. మనుషులు ఆయన్ను అడిగినదాన్ని చేయడానికి ఆయనెప్పుడూ సిద్ధమే, ఆయన అందుకు సమర్థుడే.

4. అప్పుడు యేసు ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను
లేవీయకాండము 13:49, లేవీయకాండము 14:2, లేవీయకాండము 14:4-32

యేసు తనకు ప్రచారం, పేరు ప్రతిష్ఠలు కలగాలని ఎప్పుడూ కోరలేదు. నిజానికి దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు (వ 18; మత్తయి 9:30; మత్తయి 12:16; యోహాను 6:15). “యాజికి”– ఆ మనిషి యాజుల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వారు అతని వ్యాధి నిజంగా పూర్తిగా నయమైందని చూచి చెప్పాలి. అప్పుడే అతణ్ణి వారు శుద్ధుడుగా ప్రకటించి ఇంటికి తిరిగి వెళ్ళనిస్తారు. మోషే విధించిన కానుకను గురించి లేవీయకాండము 14:1-32 చూడండి.

5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి

రోమ్ సైన్యంలో వందమంది సైనికులకు నాయకుడు శతాధిపతి.

6. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.

7. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా

ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా సహాయం చేసేందుకు క్రీస్తు ఇష్టాన్ని ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం.

8. ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.

ప్రభువునుంచి ఏదైనా పొందగలిగే యోగ్యత తమకు పుష్కలంగా ఉందనుకునేవారు అందరి కన్నా అయోగ్యులు. తమకు యోగ్యత లేదనుకునేవారు నిజానికి ఎక్కువ యోగ్యత గలవారు. దేవుని దృష్టిలో వినయ భావం, యోగ్యత ఈ రెండు కలిసి ఉన్నాయి. మత్తయి 5:3 పోల్చి చూడండి.

9. నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.

దేవుడు యేసుప్రభువుకు వ్యాధులపై అధికారమిచ్చాడనీ ఆ శతాధిపతి నిస్సందేహంగా నమ్మాడు. అధికారం అంటే ఎలాంటిదో అతనికి తెలుసు. కాబట్టి యేసుప్రభువుకు ఉన్న శక్తిపై అతనికి ఆశ్చర్యకరమైన విశ్వాసం ఉంది.

10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

ఆ మనిషికి నమ్మకం ఉందని యేసుప్రభువు విస్తుపోలేదు గాని ఆ నమ్మకం చాలా ప్రత్యేకమైనదని భావించి దాన్ని మెచ్చుకున్నాడు. ఈ భూమిపై యేసుప్రభువు జీవిత కాలంలో రెండే రెండు విషయాలు ఆయన్ను ఆశ్చర్యపోయేలా చేశాయి. సాధారణంగా ఉండదు అనిపించిన చోట బలమైన నమ్మకం కనిపించడం, నమ్మకం ఉండవలసిన చోట అపనమ్మకం కనిపించడం (మార్కు 6:6). అసలు గొప్ప నమ్మకం ఉండవలసింది ఇస్రాయేల్ ప్రజలకే, ఈ విదేశీయుడికి కాదు. దేవుని ప్రేమ, ప్రభావం గురించిన ఉదాహరణలు, అభిషిక్తుడు వస్తాడన్న వాగ్దానాలు గల పాత ఒడంబడిక గ్రంథాన్ని దేవుడు ఇస్రాయేల్‌కే ఇచ్చాడు (రోమీయులకు 9:4-5).

11. అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
కీర్తనల గ్రంథము 107:3, యెషయా 59:19, మలాకీ 1:11

“తూర్పునుంచీ, పడమరనుంచీ” అంటే లోకంలోని ప్రజలంతా అని అర్థం. మత్తయి శుభవార్తలో మొట్టమొదటి సారి యేసు తన శుభవార్త, దేవుని రాజ్యం కేవలం ఒక్క జాతికోసం కాదనీ లోకమంతటికోసమనీ సూచిస్తున్నాడు. మత్తయి 28:19-20; మార్కు 16:15; లూకా 24:46-47; అపో. కార్యములు 1:8 చూడండి. యూదులు కానివారిలోనుంచి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించబోయే అనేకమందిలో ఈ శతాధిపతి మొదటివాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఇస్రాయేల్ జాతికి పూర్వీకులు, పితరులు. వారి చరిత్రలు ఆది 12–50 అధ్యాయాల్లో ఉన్నాయి.

12. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.

ఆ “రాజ్య సంబంధులు” అంటే దేవుని రాజ్యం ముందుగా ఎవరికి చెందిందో వాళ్ళు. అంటే ఇస్రాయేల్ జాతి అన్నమాట. పరలోక రాజు (మత్తయి 2:2) వారి దగ్గరికి వచ్చాడు, రాజ్యం గురించి ప్రకటించాడు. దాని లక్షణాలు కొన్నింటిని వివరించాడు. అందులో ప్రవేశించ దలచేవారు పశ్చాత్తాపం, నమ్మకం చూపాలని ఆదేశించాడు. అయితే యేసురాజుకు విధేయత చూపేందుకు వారు నిరాకరించారు. అందువల్ల కలిగే ఫలితాలు వారికి విపత్కరమే. మత్తయి 21:42-44 పోల్చి చూడండి. యేసు తరచుగా చేసిన హెచ్చరిక ఇది – మత్తయి 13:42-50; మత్తయి 22:13; మత్తయి 24:51; మత్తయి 25:30; లూకా 13:28. “చీకటి, ఏడుపు, పండ్లు కొరుక్కోవడం” ఇవి నరకంలో ఉండే బాధలనూ, వేదనలనూ కొంతవరకు సూచిస్తూ చెప్పిన మాటలు. మత్తయి 5:29-30; మత్తయి 13:42, మత్తయి 13:50; మత్తయి 22:13; మత్తయి 24:51; మత్తయి 25:30; మార్కు 9:47-49; లూకా 13:28; లూకా 16:19-31; 2 పేతురు 2:14, 2 పేతురు 2:17; యూదా 1:13 కూడా చూడండి. క్రీస్తు తీసుకువచ్చిన వెలుగును ద్వేషించినవారికి కలిగే శిక్ష శాశ్వత అంధకారమే (యోహాను 3:19-20). పళ్ళు కొరుక్కోవడం బహుశా భరించలేని నొప్పినీ, దేవుని న్యాయంపై కోపాన్ని సూచించవచ్చు. కీర్తనల గ్రంథము 112:10 పోల్చి చూడండి.

13. అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.

మనుషులు దేవునిపై ఏ విషయంలో నమ్మకం ఉంచుతారో అది తప్పక లభిస్తుంది. అధిక నమ్మకంతో మనం క్రీస్తు చెంతకు వస్తే అధిక మొత్తంలో దీవెనలు లభిస్తాయి. మత్తయి 9:2, మత్తయి 9:22, మత్తయి 9:29; మత్తయి 15:28; మత్తయి 17:20; మత్తయి 21:21; మార్కు 5:34; మార్కు 10:52; మార్కు 11:22-24 చూడండి. ఇక్కడ యేసు ఆ స్త్రీని తక్షణమే, సంపూర్ణంగా బాగు చేశాడు.

14. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి

పేతురుకు పెళ్ళి అయింది. మొదటి క్రీస్తురాయబారులంతా వివాహితులన్నట్టే ఉంది. 1 కోరింథీయులకు 9:5 చూడండి.

15. ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.

మనపట్ల యేసు చూపే దయ ఆయన్ను సేవించాలన్న అభిలాషను మనలో పుట్టించాలి.

16. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.

క్రీస్తు మాటలో సర్వశక్తితో కూడిన ప్రభావం, అధికారం ఉన్నాయి. దయ్యాలు పట్టడం గురించి నోట్ మత్తయి 4:24 చూడండి.

17. ఆయన మాటవలన దయ్యములను వెళ్ళ గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
యెషయా 53:4

యెషయా 53:4 చూడండి. ఆ భవిష్యద్వాక్కు యేసుప్రభువు వ్యాధులున్నవారిని బాగు చేసే పరిచర్య ద్వారా నెరవేరింది, సిలువపై ఆయన మరణించడం ద్వారా కాదు. అది ఆయన దయను తెలియజేస్తుంది. బాధల్లో ఉన్నవారి పట్ల ఆయన సానుభూతినీ, వారి వ్యాధులను పారద్రోలడంలో ఆయన కనపరచిన శక్తినీ తెలియజేస్తున్నది.

18. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.

అవతలివైపు అంటే తూర్పు తీరం. యేసు బస చేసిన కపెర్నెహూముకు అవతలి వైపు.

19. అంతట ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెద నని ఆయనతో చెప్పెను.

తన మార్గం తేలికగా కనిపించేలా చేసేందుకు యేసుప్రభువు ఎన్నడూ ప్రయత్నించలేదు. దేవుని ప్రమాణాలనూ ఆదేశాలనూ పలుచన చేయడంద్వారా ఎక్కువమందిని ఆకర్షించుకోవడానికి చూడలేదు. లూకా 14:25-35 పోల్చి చూడండి. వ 19లోని వ్యక్తి చాలా త్వరపడి నిర్ణయించుకున్నాడు. యేసు శిష్యుడుగా ఉండడంలోని కష్టాలను అతడు లెక్క వేసుకోలేదు. వ 21లోని వ్యక్తి తన నిర్ణయం తీసుకోవడంలో చాలా మందకొడిగా ఉన్నాడు. ఈ రెండు రకాల మనుషులూ ఇప్పటికీ మనలో ఉన్నారు.

20. అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.

తనను గురించి చెప్పుకోవడంలో యేసుప్రభువు “మానవ పుత్రుడు” అనే పేరును శుభవార్త పుస్తకాల్లో మొత్తం దాదాపు 80 సార్లు ఉపయోగించాడు. ఇది అభిషిక్తుణ్ణి సూచిస్తున్నది. దానియేలు 7:13-14 లో ఈ పేరు కనిపిస్తున్నది. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క నిజమైన మానవ స్వభావాన్ని కూడా ఈ పేరు సూచిస్తున్నది.

21. శిష్యులలో మరియొకడు ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
1 రాజులు 19:20

22. యేసు అతని చూచినన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను.

అంటే ఆధ్యాత్మిక జీవం లేనివారు వెళ్ళి భౌతికంగా చనిపోయినవారిని పాతిపెట్టుకోనిమ్మని అర్థం. తన తండ్రి చనిపోయేంత వరకు ఇంట్లో ఉండాలని ఈ మనిషి ఉద్దేశం. ఒక వేళ అంతకు ముందు అతని తండ్రి చనిపోతే అతణ్ణి సమాధి చేసే ప్రయత్నాల్లో ఈ మనిషి ఇంటి దగ్గరే ఉండేవాడు. క్రీస్తు ఎవరినైనా ఒక ప్రత్యేకమైన పరిచర్యకు పిలిస్తే వారు లోక సంబంధమైన బంధాలు, బాధ్యతలు అడ్డు తగలనీయకుండా ఆయనకు లోబడాలి. మత్తయి 10:37-39 పోల్చి చూడండి. లూకా 9:61-62 కూడా చూడండి.

23. ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.

24. అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా

25. వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.

26. అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.

శిష్యుల విషయం చూడడం యేసు చేయవలసిన మొదటి పని. తుఫానును ఆపడం కన్న ఇది కష్టమైన పని. తక్కువ నమ్మకం ఉంటే ఎక్కువ భయముంటుంది; పరిపూర్ణమైన నమ్మకం ఉంటే భయం ఉండదు. మత్తయి 6:30, మత్తయి 6:34 కూడా చూడండి. క్రీస్తు శిష్యులకు భయముండకూడదు – ప్రకృతి శక్తులన్నీ ఆయన అదుపులోనే ఉన్నాయి. కీర్తనల గ్రంథము 89:8-9 తో ఈ వచనాన్ని పోల్చి చూడండి. అక్కడ సముద్ర తరంగాలను అదుపులో ఉంచేది ఏకైక నిజ దేవుడైన యెహోవా. ఇక్కడ ఆ పని చేస్తున్నది యేసుప్రభువు. యేసుప్రభువు యెహోవాదేవుని అవతారం (నిర్గమకాండము 3:14-15; యోహాను 1:1, యోహాను 1:14; యోహాను 8:24, యోహాను 8:58; యోహాను 10:11; ఫిలిప్పీయులకు 2:6, ఫిలిప్పీయులకు 2:10-11; హెబ్రీయులకు 1:10-12. లూకా 2:11 నోట్‌).

27. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టి వాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.

అందరూ ఆలోచించవలసిన ప్రశ్న ఇది. దీనికి జవాబు బైబిల్లో ఉంది. యేసు చేసిన అద్భుతాలన్నిటి నుంచి నేర్చుకున్నట్టుగానే ఈ అద్భుతం నుంచి కూడా మనం ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవచ్చు. జీవితంలో మనల్ని ప్రమాదంలో పడేసే తుఫానులు ఉంటాయి. అయితే మనం క్రీస్తులో నమ్మకం పెట్టుకుంటే భయపడనవసరం లేదు – కీర్తనల గ్రంథము 46:1-3; కీర్తనల గ్రంథము 93:3-4.

28. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.

ఈ సంఘటన గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే మార్కు మత్తయి 5:1-20 చూడండి. అక్కడ దయ్యాలు పట్టిన ఈ ఇద్దరిలో ఒక మనిషి గురించి ప్రత్యేకంగా రాసి ఉంది. గదరేను ప్రదేశం గలలీ సరస్సుకు ఆగ్నేయ దిక్కున ఉంది. దయ్యాలు గురించి నోట్ మత్తయి 4:24.

29. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
1 రాజులు 17:18

యేసు ఎవరో మనుషులకు తెలియనప్పటికీ దయ్యాలకు తెలుసు (మార్కు 1:24; మార్కు 5:7). తెలిసి అవి ఆయనకు భయపడ్డాయి. “కాలం” అంటే శిక్షించేందుకు దేవుడు నిర్ణయించిన కాలం అని అర్థం. 2 పేతురు 2:4; యూదా 1:6 పోల్చి చూడండి. దయ్యాలు కొంత కాలం భూమిపై తమ పనులు చేసుకునేందుకు దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇందుకు కారణమేమిటో మనకు చెప్పలేదు గానీ సర్వ జ్ఞాని అయిన దేవుడు ఒక మంచి ఉద్దేశంతోనే ఇలా నియమించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.

30. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా

31. ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.

దయ్యాలు దేహాల్లో ఉండడానికి ఆత్రుత పడుతుంటాయని అనిపిస్తున్నది – ఏ దేహాలైనా కానివ్వండి. మత్తయి 12:43 పోల్చిచూడండి. ఈ దయ్యాలు వేరొకరి పందుల మందను ధ్వంసం చేసేందుకు యేసు ఎందుకు అనుమతించాడు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం పంది అశుద్ధ జంతువు. యూదులు పందులతో ఎలాంటి జోక్యమూ పెట్టుకోరాదు (లేవీయకాండము 11:7; ఆ అధ్యాయంపై నోట్స్ చూడండి). ఆ మంద ఒక యూదునికి చెందినదైతే, లేదా యూదులెవరన్నా మాంసం కోసం వాటిని కొనుక్కోబోతూ ఉంటే యేసుప్రభువు ఇలా చెయ్యడానికి కారణం అందులోనే కనిపిస్తున్నది.

32. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.

33. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.

34. ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.

ఒక గొప్ప అద్భుతం జరిగిందన్న వాస్తవం, ఇద్దరు మనుషులు అద్భుత రీతిలో విడుదల పొందడం వారినేమి కదిలించలేకపోయింది. ఆ ఊరంతా యేసును వదిలించుకోవాలని చూచింది. ఇబ్బందులకూ, నష్టానికీ ఆయన మూలమనుకున్నారు వారు. అప్పటినుంచి ప్రతి తరంలోనూ మానవజాతిలో ఈ రెండు గుంపులు ఉన్నాయి – యేసును ఆహ్వానించగోరేవాళ్ళూ, వదిలించుకోజూచేవాళ్ళూ.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అనేకమంది క్రీస్తును అనుసరిస్తారు. (1) 
ఈ వచనం పూర్వ ఉపన్యాసం యొక్క ముగింపును సూచిస్తుంది, క్రీస్తు ప్రత్యక్షతను అనుభవించిన వారు ఆయనను గూర్చిన తమ అవగాహనను మరింత లోతుగా అర్థం చేసుకోవడం ఆరాటపడతారు.

అతను ఒక కుష్ఠురోగిని నయం చేస్తాడు. (2-4) 
ఈ వచనాలు యేసు తన దైవిక అధికారాన్ని గుర్తించి, ఆరాధనా వైఖరిలో తన వద్దకు వచ్చిన ఒక కుష్ఠురోగిని స్వస్థపరిచిన కథను వివరిస్తాయి. ఈ ప్రక్షాళన ఎపిసోడ్ శారీరక రోగాలను నయం చేసే క్రీస్తు శక్తిని ప్రదర్శించడమే కాకుండా ఆయనను ఎలా చేరుకోవాలో మార్గదర్శకాన్ని కూడా అందిస్తుంది. మనం దేవుని చిత్తం గురించి అనిశ్చితంగా ఉన్నప్పటికీ, మనం ఆయన జ్ఞానం మరియు దయపై నమ్మకం ఉంచవచ్చు. క్రీస్తు రక్తము దానికి ప్రాయశ్చిత్తం చేయలేనంత గొప్ప పాపం లేదు, మరియు అతని దయ దానిని అధిగమించలేని అంతరంగిక అవినీతి అంత భయంకరమైనది కాదు. ఈ ప్రక్షాళనను అనుభవించడానికి, మనం క్రీస్తును వినయం యొక్క ఆత్మతో సంప్రదించాలి, అతని కరుణను కోరడం కంటే దానిని హక్కుగా కోరడం. దయ మరియు దయ కోసం విశ్వాసంతో క్రీస్తుని సంప్రదించే వారు కోరుకునే దయ మరియు దయను అందించడానికి అతను ఇష్టపూర్వకంగా సిద్ధంగా ఉన్నాడని హామీ ఇవ్వవచ్చు.
బాధలు, అవి క్రీస్తును తెలుసుకునేలా చేసి, ఆయన నుండి సహాయం మరియు మోక్షాన్ని పొందేలా మనలను నడిపించినప్పుడు, అవి నిజంగా ఒక ఆశీర్వాదం. వారి ఆధ్యాత్మిక సమస్యల నుండి శుద్ధి చేయబడిన వారు క్రీస్తు పరిచారకులను సంప్రదించడానికి వెనుకాడరు, వారి హృదయాలను తెరిచి, వారి నుండి సలహాలు, ఓదార్పు మరియు ప్రార్థనలు కోరతారు.

శతాధిపతి సేవకుడు స్వస్థత పొందాడు. (5-13) 
ఈ శతాధిపతి అన్యజనుడు మరియు రోమన్ సైనికుడు అయినప్పటికీ, నిజమైన భక్తిని ప్రదర్శించాడు. అతని వృత్తి మరియు సామాజిక హోదా అవిశ్వాసం మరియు పాపానికి సాకులుగా ఉపయోగపడలేదు. మన పిల్లలు మరియు సేవకుల ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి మనం శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ ఆయన తన సేవకుని పరిస్థితిని ఎలా తెలియజేస్తున్నాడో గమనించండి. వారు ఆధ్యాత్మికంగా అనారోగ్యంతో ఉండవచ్చు, ఆధ్యాత్మిక బాధల గురించి తెలియదు మరియు ఆధ్యాత్మిక మంచితనం గురించి తెలియదు. విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా వారిని క్రీస్తు వద్దకు తీసుకురావడం మన బాధ్యత.
శతాధిపతి యొక్క వినయాన్ని గమనించండి, వినయపూర్వకమైన వ్యక్తులు వారితో క్రీస్తు యొక్క దయగల పరస్పర చర్యల ద్వారా మరింత వినయపూర్వకంగా ఉంటారని గుర్తించండి. అతని అద్భుతమైన విశ్వాసానికి శ్రద్ధ వహించండి. మనపై మనం ఎంత తక్కువ విశ్వాసంతో ఉంటామో, క్రీస్తుపై మన విశ్వాసం అంత బలపడుతుంది. ఇందులో, శతాధిపతి తన సేవకులపై యజమాని వలె, సృష్టి మరియు ప్రకృతి యొక్క అన్ని అంశాలపై క్రీస్తు యొక్క దైవిక శక్తిని మరియు పాండిత్యాన్ని అంగీకరిస్తాడు. ఈ విధంగా, మనమందరం దేవునికి అంకితమైన సేవకులుగా ఉండాలి, ఆయన వాక్యానికి విధేయులుగా మరియు అతని సంరక్షణకు ప్రతిస్పందిస్తూ ఉండాలి.
అయితే, మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, అతను తరచుగా తక్కువ విశ్వాసాన్ని ఎదుర్కొంటాడు, ఫలితంగా స్వల్ప ఆధ్యాత్మిక ఫలం వస్తుంది. ఒక బాహ్య వృత్తి మనకు "రాజ్యపు పిల్లలు" అనే బిరుదును సంపాదించిపెట్టవచ్చు, కానీ మనం చూపించవలసిందల్లా మరియు నిజమైన విశ్వాసం లేకుంటే, మనం త్రోసివేయబడే ప్రమాదం ఉంది. సేవకుడు తన వ్యాధికి స్వస్థత పొందాడు మరియు శతాధిపతి అతని విశ్వాసానికి ఆమోదం పొందాడు. సందేశం స్పష్టంగా ఉంది: "నమ్మండి, మరియు మీరు అందుకుంటారు." క్రీస్తు యొక్క లోతైన శక్తిని మరియు విశ్వాసం యొక్క పరివర్తన శక్తిని సాక్ష్యమివ్వండి. మన ఆత్మల స్వస్థత అనేది క్రీస్తు రక్తం యొక్క విమోచన శక్తికి మనకున్న సంబంధానికి ఫలితం మరియు సాక్ష్యం.

పీటర్ భార్య తల్లికి స్వస్థత. (14-17) 
పీటర్ వివాహితుడు మరియు క్రీస్తు యొక్క అపొస్తలుడు, ఇది క్రీస్తు వివాహిత స్థితిని ఆమోదించినట్లు చూపిస్తుంది. పీటర్ భార్య కుటుంబం పట్ల ఆయనకున్న దయలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రోమ్‌లోని చర్చి, దాని మంత్రులను వివాహం చేసుకోకుండా నిషేధిస్తుంది, వారు ఆధారపడే ఈ అపొస్తలుడు సెట్ చేసిన ఉదాహరణకి విరుద్ధంగా ఉంది. పీటర్ తన ఇంటిలో తన అత్తగారిని కలిగి ఉన్నాడు, మన బంధువుల పట్ల దయ చూపడం మన కర్తవ్యానికి ఉదాహరణగా ఉపయోగపడుతుంది.
ఆధ్యాత్మిక స్వస్థత విషయానికి వస్తే, లేఖనాలు వాక్యాన్ని అందిస్తాయి మరియు ఆత్మ హృదయాన్ని ప్రభావితం చేసే మరియు ఒకరి జీవితాన్ని మార్చే స్పర్శను అందిస్తుంది. జ్వరాల నుండి కోలుకున్న వారు సాధారణంగా కొంత సమయం వరకు బలహీనత మరియు బలహీనతను అనుభవిస్తారు. అయినప్పటికీ, ఈ వైద్యం స్పష్టంగా అతీంద్రియమైనది, ఎందుకంటే స్త్రీ తక్షణమే తన ఆరోగ్యాన్ని తిరిగి పొందింది మరియు ఆమె ఇంటి పనులను తిరిగి ప్రారంభించగలదు. యేసు చేసిన అద్భుతాల ఖ్యాతి త్వరగా వ్యాపించి, జనసమూహాన్ని ఆయన వైపుకు ఆకర్షించింది. వారి సామాజిక స్థితి లేదా వారి పరిస్థితి తీవ్రతతో సంబంధం లేకుండా ఆయన రోగులందరినీ స్వస్థపరిచాడు.
మానవ శరీరం వివిధ వ్యాధులు మరియు దురదృష్టాలకు గురవుతుంది. "యేసుక్రీస్తు మన రోగాలను భరించాడు మరియు మన బాధలను భరించాడు" అనే సువార్త మాటలలో, తత్వవేత్తల బోధనల కంటే ఈ బాధలను ఎదుర్కోవడంలో మనకు మరింత ఓదార్పు మరియు ప్రోత్సాహం ఉంది. ఇతరులకు సహాయపడే సేవలో మనం శ్రమను వెచ్చించడానికి, అసౌకర్యాన్ని భరించడానికి మరియు ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉండాలి.

లేఖరి యొక్క ఉత్సాహపూరిత ప్రతిపాదన. (18-22) 
శాస్త్రులలో ఒకరు త్వరత్వరగా తనను తాను క్రీస్తుకు అంకితమైన అనుచరునిగా సమర్పించుకుని, దృఢమైన దృఢనిశ్చయంతో ఉన్నట్లు కనిపించాడు. తరచుగా సరైన పరిశీలన లేకుండా విశ్వాసం విషయంలో హఠాత్తుగా తీర్మానాలు చేయడం ప్రజలకు సాధారణం మరియు అలాంటి తీర్మానాలు తరచుగా నశ్వరమైనవి. ఈ లేఖకుడు క్రీస్తును వెంబడించాలనే తన ఆత్రుతను వ్యక్తం చేసినప్పుడు, ఎవరైనా ప్రోత్సాహాన్ని ఆశించి ఉండవచ్చు. అన్నింటికంటే, ఒకే లేఖకుడు డజను మంది మత్స్యకారుల కంటే ఎక్కువ గౌరవాన్ని మరియు సేవను తీసుకురాగలడు. అయితే, క్రీస్తు లేఖకుడి హృదయంలో ఉన్న నిజమైన ప్రేరణను గుర్తించాడు మరియు అతని అంతర్లీన ఆలోచనలకు ప్రతిస్పందించాడు, తద్వారా అతనిని ఎలా చేరుకోవాలో అందరికీ బోధించాడు.
లేఖకుడి సంకల్పం ప్రాపంచిక, అత్యాశతో కూడిన ధోరణి నుండి ఉద్భవించినట్లు కనిపించింది. మరోవైపు, క్రీస్తు తన తలపై ఎక్కడా లేడు, మరియు అతనిని అనుసరించే ఎవరైనా మరింత సౌకర్యవంతమైన జీవితాన్ని ఊహించలేరు. ఈ లేఖకుడు తన ఆఫర్‌ను అనుసరించకుండా వెళ్లిపోయాడని భావించడం సమంజసమే.
మరోవైపు, మరొక వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. హడావుడిగా తీర్మానాలు చేయడం ఎంత హానికరమో చర్యలు తీసుకోవడంలో జాప్యం కూడా అంతే హానికరం. క్రీస్తు సేవకు తనను తాను అంకితం చేసుకునే ముందు తన తండ్రి సమాధికి హాజరు కావడానికి అనుమతిని అభ్యర్థించాడు. ఈ అభ్యర్థన సహేతుకమైనదిగా అనిపించవచ్చు, కానీ అది సరైనది కాదు. క్రీస్తు పని పట్ల ఆయనకున్న ఉత్సాహం కొరవడింది. చనిపోయిన వారిని, ముఖ్యంగా చనిపోయిన తండ్రిని పూడ్చిపెట్టడం ఒక పుణ్యమైన పని అయితే, దానికి తగిన సమయం కాదు. క్రీస్తు మన సేవకు పిలుపునిస్తే, మన దగ్గరి బంధువుల పట్ల మనకున్న ఆప్యాయతలు మరియు ఇతర బాధ్యతలు కూడా తప్పక ఫలించవలసి ఉంటుంది. ఇష్టపడని హృదయం ఎల్లప్పుడూ ఒక సాకును కనుగొంటుంది.
యేసు కేవలం అతనితో, "నన్ను అనుసరించు" అని చెప్పాడు మరియు నిస్సందేహంగా, క్రీస్తు పదం యొక్క శక్తి, ఇతరుల మాదిరిగానే, అతనిలో కూడా కదిలింది. అతను నిజానికి, క్రీస్తును అనుసరించాడు మరియు అతనికి అంకితభావంతో ఉన్నాడు. రోమీయులకు 9:16లో నొక్కిచెప్పబడినట్లుగా, ఆయన మనకు ఇచ్చిన పిలుపు యొక్క బలవంతపు శక్తి ద్వారా మనం క్రీస్తు వైపుకు ఆకర్షించబడ్డామని ఈ సంఘటన వివరిస్తుంది.

తుఫానులో క్రీస్తు. (23-27) 
సముద్రయానాలను ప్రారంభించేవారికి, సముద్రంలో తరచుగా ప్రమాదాలను ఎదుర్కొనే వారికి, వారు తమ నమ్మకాన్ని ఉంచగల మరియు ఎవరికి వారు ప్రార్థించగల రక్షకుని కలిగి ఉన్నారని భావించడం ఓదార్పునిస్తుంది. ఈ రక్షకుడు నీటిపై ఉండి తుఫానులను తట్టుకోవడం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాడు. అదేవిధంగా, ఈ ప్రపంచంలోని అల్లకల్లోలమైన సముద్రంలో క్రీస్తుతో ప్రయాణించే వారికి, సవాళ్లను ఊహించడం చాలా అవసరం. పాపం మినహా అన్ని విషయాలలో మనలాగే ఉన్న క్రీస్తు మానవ స్వభావం కూడా అలసటను అనుభవించింది. ఈ సమయంలో, అతను తన శిష్యుల విశ్వాసాన్ని పరీక్షించడానికి నిద్రపోయాడు.
భయంతో శిష్యులు తమ గురువు వైపు తిరిగారు. ఇది ఒక సమస్యాత్మకమైన ఆత్మ యొక్క అనుభవానికి అద్దం పడుతుంది, ఇక్కడ కోరికలు మరియు ప్రలోభాలు పెరుగుతాయి మరియు ఆవేశం పెరుగుతాయి మరియు దేవుడు అజాగ్రత్తగా ఉన్నట్లు కనిపిస్తుంది, దానిని నిరాశ అంచుకు నెట్టివేస్తుంది. అటువంటి క్షణాలలో, ఆత్మ అతని నోటి నుండి ఒక మాట కోసం కేకలు వేస్తుంది, "ప్రభువైన యేసు, మౌనంగా ఉండకు, లేదా నేను కోల్పోయాను." నిజమైన విశ్వాసం ఉన్న చాలా మంది వ్యక్తులు తమను తాము బలహీన స్థితిలో కనుగొనవచ్చు. క్రీస్తు శిష్యులు తుఫాను సమయాల్లో భయాందోళనలకు లోనవుతారు, విషయాలు చెడ్డవనే ఆందోళనలతో తమను తాము హింసించుకుంటారు మరియు వారు మరింత దిగజారిపోతారని ముందే ఊహించారు.
అయినప్పటికీ, ఆత్మలో అనుమానం మరియు భయం యొక్క ముఖ్యమైన తుఫానులు, బంధం యొక్క ఆత్మ ద్వారా తీసుకురాబడ్డాయి, కొన్నిసార్లు అద్భుతమైన ప్రశాంతతతో ముగుస్తుంది, దత్తత యొక్క ఆత్మచే ప్రేరేపించబడి మరియు మాట్లాడబడుతుంది. శిష్యులు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే తుఫాను తక్షణమే పరిపూర్ణ ప్రశాంతంగా మారుతుంది. దీనిని సాధించగలిగినవాడు ఏదైనా చేయగలడు, అతనిలో విశ్వాసం మరియు ఓదార్పును పెంపొందించగలడు, అవి అంతర్లీనమైనా లేదా బాహ్యమైనా యెషయా 26:4

అతను దెయ్యాలు పట్టుకున్న ఇద్దరిని స్వస్థపరుస్తాడు. (28-34)
దయ్యాలు తమ రక్షకునిగా క్రీస్తుతో ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉండవు మరియు వారు అతని నుండి ఎటువంటి ప్రయోజనాన్ని కలిగి ఉండరు లేదా ఊహించరు. ఈ దైవిక ప్రేమ రహస్యం యొక్క గాఢత ఆశ్చర్యకరమైనది - పడిపోయిన మానవత్వం క్రీస్తుతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది, అయితే పడిపోయిన దేవదూతలకు అతనితో సంబంధం లేదు. హెబ్రీయులకు 2:16 పూర్తి వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తుంది. క్రీస్తు నుండి పూర్తిగా మినహాయించబడినప్పుడు అతనిలో ఉన్న శ్రేష్ఠతను గుర్తించడం డెవిల్స్‌కు బాధగా ఉండాలి.
దెయ్యాలకు క్రీస్తును తమ పాలకునిగా అంగీకరించాలనే కోరిక లేదు. క్రీస్తు సువార్తను పూర్తిగా తిరస్కరించే వారు కూడా అదే భాష మాట్లాడతారు. ఏది ఏమైనప్పటికీ, డెవిల్స్‌కు న్యాయమూర్తిగా క్రీస్తుతో ఎలాంటి సంబంధాలు లేవని వాదించడం సరైనది కాదు, ఎందుకంటే వారు చేస్తారు మరియు వారికి దాని గురించి బాగా తెలుసు. ఈ సత్యం మానవాళికి కూడా వర్తిస్తుంది. సాతాను మరియు అతని ఏజెంట్లు ఆయన అనుమతించినంత వరకు మాత్రమే వెళ్ళగలరు; ఆయన ఆజ్ఞాపించినప్పుడు వారు తమ పట్టును వదులుకోవాలి. అతను తన ప్రజల చుట్టూ ఉంచిన రక్షణ అడ్డంకిని వారు ఉల్లంఘించలేరు. అతని అనుమతి లేకుండా వారు స్వైన్‌లోకి కూడా ప్రవేశించలేరు, అతను కొన్నిసార్లు తెలివైన మరియు పవిత్ర ప్రయోజనాల కోసం మంజూరు చేస్తాడు. దెయ్యం తరచుగా ప్రజలను పాపం చేయమని బలవంతం చేస్తుంది, వారు పరిష్కరించుకున్న చర్యల వైపు వారిని నెట్టివేస్తుంది, చర్యలు అవమానం మరియు పశ్చాత్తాపాన్ని తెస్తాయని వారికి తెలుసు. అతని ఇష్టానుసారం అతనిచే బందీలుగా తీసుకెళ్లబడిన వారి పరిస్థితి నిజంగా దయనీయమైనది.
రక్షకుని ఆలింగనం చేసుకోవడం కంటే స్వైన్‌చే సూచించబడిన వారి ప్రాపంచిక కోరికలను చాలా మంది విలువైనదిగా ఎంచుకుంటారు. ఫలితంగా, వారు క్రీస్తును మరియు ఆయన అందించే మోక్షాన్ని కోల్పోతారు. క్రీస్తు తమ హృదయాల నుండి వెళ్ళిపోవాలని వారు కోరుకుంటారు మరియు అతని మాట తమలో చోటు చేసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే క్రీస్తు మరియు అతని బోధలు వారి మూలాధారమైన కోరికలను - వారు మునిగిపోయే పందులను భంగపరుస్తాయి. పర్యవసానంగా, క్రీస్తు తన పట్ల విసిగిపోయిన వారిని విడిచిపెట్టడంలో పూర్తిగా సమర్థించబడ్డాడు మరియు భవిష్యత్తులో, ప్రస్తుతం సర్వశక్తిమంతుడిని వారి నుండి విడిచిపెట్టమని చెప్పే వారితో, "వెళ్లండి, మీరు శపించబడ్డారు" అని చెప్పవచ్చు.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |