Luke - లూకా సువార్త 24 | View All

1. ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి

మత్తయి 28:1-8; మార్కు 16:1-10.

2. సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని

3. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.

4. ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.

దేవదూతలు కొన్ని సార్లు మానవ రూపంలో కనిపించారు. మత్తయి ఒకే దేవదూత కనిపించాడని రాశాడు. మార్కు తెల్లని దుస్తులు ధరించిన యువకుడి గురించి రాశాడు. ఇది పట్టించుకోవలసిన విషయమేమీ కాదు, ఎందుకంటే మాట్లాడే వ్యక్తి గురించే రాయడం గానీ అతనితో ఉన్నవారిని ప్రస్తావించకపోవడం అప్పుడప్పుడు జరిగేది.

5. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు?
యెషయా 8:19

6. ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు

7. మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో
కీర్తనల గ్రంథము 22:1-18

మత్తయి 16:21; మత్తయి 17:22-23; లూకా 9:22. శిష్యులంతా గలలీలో ఉన్నప్పుడే ఒకటికన్నా ఎక్కువ సార్లు ఆయన వారికీ సంగతి చెప్పాడు. ఈ స్త్రీలు ఉన్నప్పుడు కనీసం ఒక సారి చెప్పాడు.

8. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని

9. సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.

మార్కు 16:14.

10. ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.

11. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.

మార్కు 16:11.

12. అయితే పేతురు లేచి, సమాధి యొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను.

యేసు ఒకవేళ సజీవంగా తిరిగి లేచాడేమోనని పేతురు బహుశా తనలో తాను అనుకుని ఉండవచ్చు. యోహాను పేతురుతో కూడా వెళ్ళి ఆ సమాధి పరిస్థితి చూచి యేసు సజీవంగా లేచాడని నమ్మాడు. యోహాను 20:3-9 చూడండి.

13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామ మునకు వెళ్లుచు

మార్కు దీన్ని క్లుప్తంగా ప్రస్తావించాడు (మార్కు 16:12-13). లూకా మాత్రమే వివరంగా రాశాడు.

14. జరిగిన ఈ సంగతులన్ని టినిగూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి.

15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను;

16. అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.

వారు యేసును గుర్తు పట్టకుండా దేవుడే వారి కళ్ళు మూశాడు. అంతేగాకుండా సజీవంగా లేచిన తరువాత కొందరు తేలికగా గుర్తుపట్టలేకుండా ఆయన స్వరూపం మారినట్టు కూడా ఉంది (వ 31,36,37; మత్తయి 28:17; యోహాను 20:14-16, యోహాను 20:19).

17. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.

యేసు తరచుగా ఇలాంటి ప్రశ్నలు అడిగేది తనకు జవాబు తెలియక కాదు. వారు తమ ఆలోచనలను బయటికి చెప్పాలనే.

18. వారిలో క్లెయొపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.

19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను.

వారు నమ్మినది ఇంతేనా? – యేసు కేవలం ఒక ప్రవక్త అనేనా?

20. మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా?

21. ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.

“ఎదురు చూశాం”– అంటూ వారు భూతకాలంలో మాట్లాడ్డం గమనించండి. యేసుప్రభువు చనిపోవడంతో వారి ఆశలు కుప్పకూలిపోయాయి.

22. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్ల వారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి

23. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.

24. మాతోకూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.

యేసు సజీవుడయ్యాడని శిష్యులు నమ్మేందుకు ఖాళీ సమాధి గురించిన వార్త చాలలేదు. తోమావలె ఆయన్ను తమ కళ్ళతో చూడాలన్నారు (యోహాను 20:25).

25. అందు కాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,

పాత ఒడంబడిక ప్రవక్తల రచనలు వారికి తెలుసు. ఆ రచనలపై తమకు నమ్మకం ఉన్నదని వారు భావిస్తూవచ్చారు. అయితే ఈ వ్రాతలన్నీ యేసుప్రభువును గురించి రాసినవని నమ్మడంలో మందమతులయ్యారు. పాత ఒడంబడిక ప్రవక్తలు బాధలనుభవించే అభిషిక్తుణ్ణి గురించి, మహిమతో రాబోయే అభిషిక్తుణ్ణి గురించి కూడా రాశారు (కీర్తన 22; యెషయా 53; యెషయా 9:6-7; యెషయా 11:1-16 మొ।।). ఆ కాలం యూదులు బాధలనుభవించే ప్రభువును మర్చిపోయి మహిమ కోసమే ఎదురుచూశారు.

26. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి

27. మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
ద్వితీయోపదేశకాండము 18:15

వ 44. వారి గ్రహింపులోని లోపాన్ని యేసు ఇప్పుడు సరి చేస్తున్నాడు. మోషే (బైబిలులో మొదటి గ్రంథాలు) నుంచి కూడా పాత ఒడంబడిక అంతా యేసుప్రభువును గురించిన విషయాలతో నిండి ఉంది. మనం కూడా నమ్మకం, విధేయత కనపరిస్తే యేసుప్రభువు పాత ఒడంబడిక సత్యాలను మనక్కూడా వివరిస్తాడు. తన పవిత్రాత్మద్వారా, తన సేవకుల ద్వారా ఇది చేస్తాడు (యోహాను 14:26; యోహాను 16:13-15).

28. ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా

వారు తనను వారి ఇంట్లోకి ఆహ్వానించాలని ఆయన కోరిక. అలా కాకపోతే ఆయన ప్రవేశించడు (ప్రకటన గ్రంథం 3:20 పోల్చి చూడండి). ఆయనెవరో తెలియకుండానే వారాయన్ను ఆహ్వానించారు (మత్తయి 25:34-40; హెబ్రీయులకు 13:2 పోల్చి చూడండి).

29. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.

30. ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా

లూకా 9:16; లూకా 22:19.

31. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.

సజీవంగా లేచిన తరువాతి రోజుల్లో తలుపులు మూసి ఉన్నప్పటికీ యేసు హఠాత్తుగా ప్రత్యక్షం కావడం, అదృశ్యం కావడం గమనించండి (వ 36; యోహాను 20:19). హింసల పాలై మరణించిన దేహమే అది (38-43). అయితే అది అద్భుతమైన మార్పు చెందిన దేహం – 1 కోరింథీయులకు 15:35-44; ఫిలిప్పీయులకు 3:21.

32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

హృదయాలను మండించే శక్తి యేసుప్రభువుకు ఇప్పటికీ ఉంది.

33. ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదు నొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి

వ 9.

34. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కన బడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని

పేతురు అసలు పేరు సీమోను. కేఫా అని కూడా అతనికి పేరు (1 కోరింథీయులకు 15:5). పేతురుకు యేసు ఇలా ప్రత్యక్షం కావడం మరి ఏ ఇతర శుభవార్తలోనూ వర్ణించ బడలేదు.

35. త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.

36. వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి - మీకు సమాధానమవుగాకని వారితో అనెను.

యోహాను 20:19. తలుపు గడియ వేసి ఉంది.

37. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.

మార్కు 6:49-50 పోల్చి చూడండి. గడియ వేసి ఉన్న తలుపులోనుంచి రాగలిగేది భూతం, లేక ఆత్మ మాత్రమే అనుకున్నారు వాళ్ళు.

38. అప్పుడాయనమీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృద యములలో సందేహములు పుట్టనేల?

39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంస మును భూతమున కుండవని చెప్పి

ఆయన్ను సిలువ వేసినప్పుడు ఆయన చేతులకు కాళ్ళకు అయిన గాయాల గుర్తులు ఉన్నాయి. యేసు పలికిన ఈ మాటలను బట్టి సమాధినుండి ఆయన భౌతిక దేహం సజీవంగా లేచిందని రుజువౌతున్నది. ఆయన సజీవంగా లేవడం ఏదో ఒక ఆత్మ మేలుకోవడం వంటిది కాదు. సిలువ అనుభవించి, సమాధి పాలైన దేహమే ఇప్పుడు తిరిగి లేచింది. ఆ దేహాన్ని ఇతరులు చూడవచ్చు, తాకవచ్చు. అది ఆహారాన్ని జీర్ణం చేసుకోగలదు కూడా (వ 42,43).

40. తన చేతులను పాదము లను వారికి చూపెను.

41. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.

వ 25. శిష్యులు మనలాగే మనుషులు. ఇది నిజంగా నమ్మశక్యం కాని వింత అని వారు భావించారు.

42. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి.

43. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను.

యోహాను 21:12-15.

44. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను

యూదులు పాత ఒడంబడిక గ్రంథాన్ని కొన్ని సార్లు రెండు భాగాలు చేశారు – ధర్మశాస్త్రం, ప్రవక్తలు (వ 27; మత్తయి 5:17). కొన్ని సార్లు మూడు భాగాలు చేశారు – ధర్మశాస్త్రం, ప్రవక్తలు, కీర్తనలు. ఇప్పుడు మనకున్న పాత ఒడంబడికలోని పుస్తకాల వరుసకు వారు ఏర్పరచుకున్న వరుస వేరుగా ఉండేది. మూడవ భాగంలో కీర్తనల గ్రంథం మొదటి పుస్తకంగా ఉండేది. క్రైస్తవులు ఇప్పుడు సాధారణంగా పాత ఒడంబడిక గ్రంథాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. మోషే రాసిన పంచ గ్రంథాలు – ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు; చరిత్ర గ్రంథాలు – యెహోషువ నుంచి ఎస్తేరు వరకు; కావ్య గ్రంథాలు – యోబు నుండి పరమగీతం వరకు; ప్రవక్తల గ్రంథాలు – యెషయానుండి మలాకీ వరకు. క్రీస్తును గురించిన భవిష్యద్వాక్కులు, ఆయన్ను సూచించే సాదృశ్యాలు, పాత ఒడంబడిక అన్ని భాగాల్లోనూ కనిపిస్తాయి. యేసు ఇదంతా తన శిష్యులకు స్పష్టంగా చెప్పాడు – అప్పటికప్పుడు కాదు గాని 40 రోజుల కాలంలో (అపో. కార్యములు 1:3).

45. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి

“లేఖనాలు”– ఇక్కడ పాత ఒడంబడిక గ్రంథమంతా అని అర్థం. ఇప్పటికీ ఆయన లేఖనాలను విడమర్చి మనుషులకు అర్థమయ్యేలా వారి మనస్సులు తెరుస్తాడు. యెషయా 54:13; యోహాను 16:13; ఎఫెసీయులకు 1:17-18.

46. క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు
యెషయా 53:5, హోషేయ 6:2

47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

“పశ్చాత్తాపం”– లూకా 13:3-5; మత్తయి 3:2, మత్తయి 3:8; అపో. కార్యములు 17:30. “పాపక్షమాపణ”– మత్తయి 6:12; మత్తయి 9:5-7; మత్తయి 12:31; మత్తయి 18:23-25; ఎఫెసీయులకు 1:7; 1 యోహాను 1:9. పశ్చాత్తాపం లేకుండా సంపూర్ణ పాపక్షమాపణ సాధ్యం కాదు. అపో. కార్యములు 5:31; అపో. కార్యములు 26:18 కూడా చూడండి. పాపాలకోసం బలిగా క్రీస్తు బాధలనుభవించి చనిపోవడం, సజీవంగా తిరిగి లేవడమే మన క్షమాపణకు ఆధారం. వేరేదేదీ లేదు. ఈ సత్యాన్ని లోకమంతటా ప్రకటించాలి (మత్తయి 28:18-20; మార్కు 16:15). అయితే మొదటగా ఆయన మరణాన్ని కోరిన యూదులకు ప్రకటించాలి – అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 3:26. మత్తయి 28:19-20 చూడండి.

48. ఈ సంగతులకు మీరే సాక్షులు

యోహాను 15:27; అపో. కార్యములు 1:8. క్రీస్తుకు సాక్షులుగా ఆయన శిష్యులు తమ సాక్ష్యం కోసం బాధలనుభవించడానికి, ప్రాణాలు ఫణంగా పెట్టడానికి సిద్ధపడడం ద్వారా తమ నిజాయితీని, యథార్థతనూ ప్రదర్శించారు (అపో. కార్యములు 5:40-42; అపో. కార్యములు 7:57-60; అపో. కార్యములు 12:1-4; అపో. కార్యములు 14:19-20; 2 కోరింథీయులకు 11:23-26).

49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.

అపో. కార్యములు 1:4 చూడండి. తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినది పవిత్రాత్మను (యెషయా 44:3; యోవేలు 2:28; యోహాను 7:37-39; యోహాను 14:16-17). దేవుని శక్తి తోడు లేకుండా దేవుని పనిని చేయగలమని క్రీస్తు సేవకులు వ్యర్థంగా ఊహించరాదు. దేవుని శక్తితో వారేమి చేయగలిగారో అపొ కా గ్రంథంలో మనం చూడవచ్చు. పవిత్రాత్మ ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని, సహజంగా ఏ మనిషికీ లేని ప్రభావాన్ని ఇస్తాడు.

50. ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను.

బేతనీ జెరుసలంకు తూర్పున ఆలీవ్ కొండపై ఉంది. “దీవించాడు”– ఆదికాండము 12:1-3; లేవీయకాండము 9:22-24; సంఖ్యాకాండము 6:22-27 మొ।।.

51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.
కీర్తనల గ్రంథము 47:5

అపో. కార్యములు 1:9.

52. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి

లేఖనాలు అర్థం చేసుకునేలా వారి మనస్సులు తెరువబడ్డాయి. సజీవంగా తిరిగి లేచిన యేసుప్రభువు వారి ఎదుట ఉన్నాడు. ఆయన దేవుని అవతారమని, ఆరాధనకు పాత్రుడని ఇప్పుడు వారికి తెలుసు. మత్తయి 28:17; యోహాను 20:28-29. యేసుప్రభువు ఎవరో వారికి తెలియడానికీ, ఆయన్ను వారు ఆరాధించడానికీ, వారి ఆనందానికీ ఉన్న పరస్పర సంబంధం చూడండి. ఆనందాన్ని వెతకడం మూలంగా వారికి ఆనందం లభించలేదు గానీ యేసు ప్రభువులో నమ్మకం ఉంచడం ద్వారానే కలిగింది (1 పేతురు 1:8 పోల్చి చూడండి).

53. యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.

ఈ శుభవార్తలో అన్ని చోట్లా లూకా నొక్కి చెప్పిన అంశంతోనే ఈ పుస్తకాన్ని ముగిస్తున్నాడు – దేవుణ్ణి స్తుతించడం (లూకా 1:46, లూకా 1:64; లూకా 2:13 మొ।।). దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా చేసిన అద్భుత క్రియలన్నిటిని బట్టి శిష్యులతో కలిసి ఆయన్ను కీర్తించుదాం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 24 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు పునరుత్థానం. (1-12) 
క్రీస్తు మరణం మరియు సమాధి తర్వాత కూడా స్త్రీలు అతని పట్ల చూపే ప్రగాఢమైన ఆప్యాయత మరియు భక్తికి సాక్ష్యమివ్వండి. దొర్లిన రాయిని మరియు ఖాళీ సమాధిని కనుగొన్నప్పుడు వారి ఆశ్చర్యాన్ని గమనించండి. తరచుగా, క్రైస్తవులు తమను తాము అయోమయ స్థితిలో కనుగొంటారు, ఓదార్పు మరియు భరోసాను కోరుకుంటారు. శ్మశాన వస్త్రాలలో తమ యజమాని కోసం వెతకడానికి బదులుగా, వారు ప్రకాశవంతమైన వస్త్రధారణలో అలంకరించబడిన దేవదూతలపై దృష్టి పెట్టాలి. ఈ స్వర్గపు దూతలు క్రీస్తు మృతులలో నుండి లేచాడని, తన స్వంత శక్తి ద్వారా సాధించాడని ధృవీకరిస్తున్నారు. దేవదూతలు కొత్త సువార్తను తీసుకురానప్పటికీ, వారు క్రీస్తు బోధనలను మహిళలకు గుర్తుచేయడానికి మరియు వారి దరఖాస్తుపై వారికి బోధిస్తారు. యేసును దేవుని కుమారుడని మరియు నిజమైన మెస్సీయ అని దృఢంగా విశ్వసించిన శిష్యులు, ఆయన మరణం, పునరుత్థానం మరియు పరలోకానికి మహిమాన్వితమైన ప్రవేశం గురించి పదేపదే తెలియజేసేవారు, ఆయన స్వీయ పునరుత్థానాన్ని విశ్వసించడానికి వెనుకాడడం ఆసక్తికరం. అయినప్పటికీ, మన మతపరమైన దురభిప్రాయాలు తరచుగా అజ్ఞానం లేదా క్రీస్తు మాట్లాడిన మాటలను మరచిపోవటం నుండి ఉత్పన్నమవుతాయి. ఇటీవలే తన గురువు నుండి పారిపోయిన పీటర్ ఇప్పుడు ఆశ్చర్యంతో సమాధి వద్దకు పరుగెత్తాడు. మనం క్రీస్తు మాటలను సరిగ్గా గ్రహించినట్లయితే, మనల్ని పజిల్‌లో మరియు కలవరపరిచే అనేక అంశాలు స్పష్టంగా మరియు ప్రయోజనకరంగా మారతాయి.

అతను ఎమ్మాస్‌కు వెళ్లే మార్గంలో ఇద్దరు శిష్యులకు కనిపిస్తాడు. (13-27) 
ఎమ్మాస్‌కు వెళ్లే యేసు మరియు ఇద్దరు శిష్యుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ ఆయన పునరుత్థానం జరిగిన రోజునే జరిగింది. క్రీస్తు అనుచరులు అతని మరణం మరియు పునరుత్థానం గురించి చర్చలలో పాల్గొనడం సముచితం, అలాంటి సంభాషణలు జ్ఞానాన్ని పెంపొందించడానికి, జ్ఞాపకశక్తిని పునరుజ్జీవింపజేయడానికి మరియు వారిలో భక్తి ప్రేమలను ప్రేరేపించడానికి అనుమతిస్తాయి. అలాంటి ఆధ్యాత్మిక పనిలో ఇద్దరు శ్రద్ధగా పాల్గొంటున్నప్పుడు, క్రీస్తు వారితో చేరి మూడవవాడు అవుతానని వాగ్దానం చేశాడు. క్రీస్తును వెదకేవారు ఆయనను కనుగొంటారు, అతను శ్రద్ధగా విచారించే వారికి మరియు అవగాహన కోసం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకునే వారికి జ్ఞానాన్ని అందించే వారికి తనను తాను బహిర్గతం చేస్తాడు. ఈ ప్రత్యేక సందర్భంలో, శిష్యులు ఆయనను గుర్తించకపోయినప్పటికీ, వారు ఆయనతో స్వేచ్ఛగా సంభాషించగలిగేలా క్రీస్తు దానిని నిర్వహించాడు. తరచుగా, క్రీస్తు శిష్యులు ఆనందానికి కారణం ఉన్నప్పటికీ, వారి విశ్వాసం యొక్క బలహీనత కారణంగా, వారికి అందించిన ఓదార్పును స్వీకరించకుండా నిరోధించడం వల్ల తమను తాము విచారంగా చూస్తారు. క్రీస్తు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆయన తన శిష్యుల బాధలకు అనుగుణంగా ఉంటాడు మరియు వారి బాధలలో పాలుపంచుకుంటాడు. యేసు మరణము మరియు బాధలను గూర్చి తెలియని వారు యెరూషలేములో అపరిచితుల వలె ఉన్నారు. సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు ఆ అవగాహనను వ్యాప్తి చేయడానికి చురుకుగా ప్రయత్నించాలి. పాత నిబంధన లేఖనాలపై వారి బలహీన విశ్వాసం కోసం యేసు శిష్యులను మందలించాడు. లేఖనాలలో వెల్లడి చేయబడిన దైవిక సలహాల గురించి మనకు లోతైన అవగాహన ఉంటే, మనం తరచుగా చిక్కుకుపోయే అనేక గందరగోళాలను మనం తప్పించుకోగలము. శిష్యులు కష్టపడుతున్నప్పటికీ, క్రీస్తు యొక్క బాధలు నిజంగా ఆయన మహిమకు నిర్దేశించబడిన మార్గమని యేసు వివరించాడు. సిలువ ఆలోచనతో తమను తాము పునరుద్దరించండి. పాత నిబంధన యొక్క ప్రారంభ ప్రేరేపిత రచయిత అయిన మోషేతో ప్రారంభించి, యేసు తనకు సంబంధించిన భాగాలను వివరించాడు. లేఖనాల అంతటా, క్రీస్తుకు సంబంధించిన అనేక సూచనలు ఉన్నాయి, సమావేశమైనప్పుడు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. పాత నిబంధన యొక్క మొత్తం వస్త్రం ద్వారా సువార్త దయ యొక్క బంగారు దారం నేయబడింది. గ్రంధం యొక్క అంతిమ వివరణకర్తగా క్రీస్తు, తన పునరుత్థానం తర్వాత తనకు సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేయడం కొనసాగించాడు, కొత్త ఆలోచనలను పరిచయం చేయడం ద్వారా కాదు, కానీ లేఖనాలు ఎలా నెరవేరాయో ప్రదర్శించడం ద్వారా మరియు వాటిని శ్రద్ధగా అధ్యయనం చేసేలా ప్రజలకు మార్గనిర్దేశం చేయడం ద్వారా.

మరియు తనను తాను వారికి తెలియజేసుకుంటాడు. (28-35) 
క్రీస్తు మనతో ఉండాలంటే, మనం ఆయన సన్నిధిని తీవ్రంగా వెతకాలి. అతనితో సహవాసం యొక్క ఆనందం మరియు ప్రయోజనాన్ని రుచి చూసిన వారు సహజంగా అతని సహవాసం కోసం ఆరాటపడతారు. యేసు రొట్టె తీసుకున్నాడు, దానిని ఆశీర్వదించాడు, విరిచాడు మరియు వారితో పంచుకున్నాడు, తన ఆచార అధికారాన్ని మరియు ఆప్యాయతను ప్రదర్శిస్తూ, బహుశా మునుపటి పదాలను ఉపయోగించి ఉండవచ్చు. ఈ చర్యలో, ప్రతి భోజనంలో ఆయన ఆశీర్వాదం పొందాలని ఆయన మనకు నిర్దేశిస్తాడు. క్రీస్తు, తన ఆత్మ మరియు దయ ద్వారా, తన అనుచరుల ఆత్మలకు తనను తాను ఎలా వెల్లడిస్తాడో, లేఖనాలను విప్పి, ప్రభువు రాత్రి భోజన సమయంలో తన బల్ల వద్ద వారిని కలుసుకుని, రొట్టెలు విరిచేటప్పుడు తనను తాను ఎలా గుర్తించుకుంటాడో సాక్ష్యమివ్వండి. వారి మనస్సుల కళ్ళు తెరవడం ద్వారా ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఈ ప్రపంచంలో క్రీస్తు గురించి మన అభిప్రాయాలు క్లుప్తంగా ఉన్నాయి. అయితే, పరలోకంలో, మనం ఆయనను శాశ్వతంగా చూస్తాము. బోధకుడి గుర్తింపు గురించి వారికి తెలియనప్పుడు కూడా, శిష్యులు బోధించడం శక్తివంతమైనదని కనుగొన్నారు. క్రీస్తు గురించి మాట్లాడే లేఖనాలు అతని నిజమైన అనుచరుల హృదయాలను మండించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అత్యంత ప్రభావవంతమైన సందేశాలు యేసు పట్ల మనకున్న ప్రేమను మరియు మన కోసం ఆయన త్యాగాన్ని ప్రేరేపించేవి. క్రీస్తు తనను తాను ఎవరికి బయలుపరచుకున్నాడో వారికి వారి ఆత్మల కోసం అతను చేసిన వాటిని ఇతరులతో పంచుకోవాల్సిన బాధ్యత ఉంది. క్రీస్తు శిష్యులు తమ అనుభవాలను పోల్చుకోవడం మరియు ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా ప్రయోజనకరం.

క్రీస్తు ఇతర శిష్యులకు కనిపిస్తాడు. (36-49) 
ఒక అద్భుతరీతిలో, యేసు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, వారు ఇటీవల తనను విడిచిపెట్టినప్పటికీ, తన శాంతి గురించి వారికి హామీ ఇచ్చారు. అతను ఈ శాంతిని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను కూడా వాగ్దానం చేశాడు, తన గురించి అపార్థాల నుండి ఉత్పన్నమయ్యే ఇబ్బందికరమైన ఆలోచనలను పరిష్కరిస్తాడు. ప్రభువైన యేసు మన హృదయాల్లోని అన్ని అస్థిరమైన ఆలోచనల గురించి తెలుసు, మరియు అతను వాటిని అసహ్యకరమైనదిగా చూస్తాడు. అతను వారి అసమంజసమైన అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నాడు, జరిగినదంతా ప్రవక్తలచే ప్రవచించబడిందని మరియు పాపుల మోక్షానికి అవసరమైనదని నొక్కి చెప్పాడు.
పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపం యొక్క స్వభావం మరియు ఆవశ్యకత గురించి యేసు మాట్లాడాడు, తన పేరు మీద విశ్వాసం ద్వారా ఈ ఆశీర్వాదాలను పొందాలని అందరినీ కోరాడు. తన ఆత్మ ద్వారా, క్రీస్తు ప్రజల మనస్సులను ప్రభావితం చేస్తాడు, మంచిగా భావించే వారికి కూడా వారి అవగాహన తెరవవలసి ఉంటుంది. క్రీస్తు గురించి సరైన ఆలోచనలు కలిగి ఉండాలంటే లేఖనాలను అర్థం చేసుకోవడంలో కీలకం.

అతని ఆరోహణ. (50-53)
క్రీస్తు బెతనీ నుండి ఆలివ్ పర్వతం దగ్గరికి చేరుకున్నాడు, అతని బాధలు ప్రారంభమైన మరియు అతను బాధాకరమైన క్షణాలను అనుభవించిన ప్రదేశం. స్వర్గానికి ప్రయాణం, బాధ మరియు దుఃఖం యొక్క నివాసం నుండి మొదలవుతుంది. శిష్యులు ప్రత్యక్షంగా సాక్ష్యమివ్వని పునరుత్థానానికి భిన్నంగా, క్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యాడని వారు చూశారు, ఆయన ఆరోహణకు కాదనలేని రుజువును అందించారు. వారిని ఆశీర్వదించడానికి అతను చేతులు ఎత్తినప్పుడు, అతని నిష్క్రమణ అసంతృప్తితో కాకుండా ప్రేమతో గుర్తించబడిందని స్పష్టమైంది, అతని మేల్కొలుపులో శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మిగిల్చింది. క్రీస్తు, తన ఆరోహణ మరియు ఆరోహణలో, తన స్వంత శక్తిని ప్రదర్శించాడు.

ప్రతిస్పందనగా, శిష్యులు ఆయనను ఆరాధించారు, వారి అంగీకారం క్రీస్తు మహిమ యొక్క పునరుద్ధరించబడిన ద్యోతకాన్ని ప్రతిబింబిస్తుంది. యెరూషలేముకు వారి తిరిగి రావడం గొప్ప ఆనందంతో గుర్తించబడింది, భూమిపై ఉనికిలో ఉన్నప్పటికీ, నిజమైన విశ్వాసులకు క్రీస్తు మహిమ ఎలా ఆనందాన్ని కలిగిస్తుందో వివరిస్తుంది. దేవుని వాగ్దానాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, విశ్వాసులు స్తుతితో చేరుకోమని ప్రోత్సహించబడతారు, పరిశుద్ధాత్మ యొక్క స్వీకరణకు వారిని సిద్ధం చేసే మనస్తత్వం. ఈ స్థితిలో, భయాలు అణచివేయబడతాయి, బాధలు ఓదార్పుని పొందుతాయి మరియు ఆశ స్థిరంగా ఉంటుంది.
ఈ హామీ దయ యొక్క సింహాసనం వద్ద క్రైస్తవుని విశ్వాసానికి ఆధారం, తండ్రి సింహాసనం విశ్వాసులకు కృపా సింహాసనం అని గుర్తిస్తుంది, ఎందుకంటే ఇది మన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు సింహాసనం కూడా. క్రీస్తు వాగ్దానాలపై ఆధారపడటం, ఆయన శాసనాలలో నిమగ్నమవ్వడం, దేవుని దయలకు కృతజ్ఞతలు తెలియజేయడం, పరలోక విషయాలపై ప్రేమను ఏర్పరచుకోవడం మరియు అంతిమ సంతోషాన్ని నెరవేర్చడానికి విమోచకుడు తిరిగి రావాలని ఆత్రంగా ఎదురుచూడడం ఈ ప్రబోధం. "ఆమేన్. అయినప్పటికీ, ప్రభువైన యేసు, త్వరగా రండి."



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |