John - యోహాను సువార్త 6 | View All

1. అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.

యేసు మరణించి సజీవంగా తిరిగి లేచిన సంఘటన మినహాయిస్తే నాలుగు శుభవార్త పుస్తకాల్లోనూ రాసి ఉన్న అద్భుత కార్యం ఇదొక్కటే. దీన్ని బట్టి ఈ అద్భుతానికి ఉన్న గొప్ప అంతరార్థం, ప్రాముఖ్యత అర్థం అవుతున్నాయి. మత్తయి 14:13-21 నోట్స్ చూడండి. పస్కాపండుగ దగ్గర పడిన విషయం (వ 4), ఈ అద్భుతం “సూచన” అన్న విషయం యోహానొక్కడే రాశాడు. ఈ అధ్యాయంలో తరువాత కనిపించే క్రీస్తు మాటలు ఇందుకు కారణాన్ని తెలియజేస్తున్నాయి.

2. రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.

మత్తయి 9:35.

3. యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.

4. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.

5. కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని

6. యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.

“పస్కా”– నిర్గమ 12 అధ్యాయం; లేవీయకాండము 23:4-8. మన విషయంలో కూడా ఏం చెయ్యాలో ప్రభువుకు అంతా ముందే తెలుసు. కానీ మన నమ్మకాన్ని, ప్రేమను, విధేయతను పరీక్షిస్తుంటాడు. ఆదికాండము 22:1; కీర్తనల గ్రంథము 66:10-12; 1 పేతురు 1:6-7 చూడండి.

7. అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.

మార్కు 6:37. ఆ సమస్యకు పరిష్కారం ఫిలిప్పుకు తెలిసి ఉంటే అదేమిటో బయటికి చెప్పలేదు. యేసుప్రభువుకు అసాధ్యమంటూ ఏదీ లేదన్న సంగతి అతనికింకా అర్థం అయినట్టు లేదు. “దేనారం”– యోహాను 12:5; మత్తయి 18:28; మత్తయి 20:2 నోట్స్ చూడండి.

8. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ

9. ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా

10. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.

11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

“కృతజ్ఞత”– మత్తయి 14:19 చూడండి.

12. వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.

13. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

14. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
ద్వితీయోపదేశకాండము 18:15, ద్వితీయోపదేశకాండము 18:18

“సూచన”– యోహాను 2:11. ఈ అద్భుతం దేనికి సూచన? ద్వితీయోపదేశకాండము 18:15-18 లో రాసి ఉన్న ఆ గొప్ప ప్రవక్త తమ మధ్యకు వచ్చాడనడానికి ఇది సూచన అని ప్రజలు అనుకున్నారు. ఇది నిజమే, యేసు ఆ ప్రవక్తే. కానీ ఆ అద్భుతం యేసు పరలోకంనుంచి దిగివచ్చినవాడనీ (వ 33), జీవాహారమనీ (వ 35), తన ప్రజల పస్కా విందు అనీ (వ 53-56) సూచిస్తున్నది.

15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.

ఆయన ఉద్దేశం, నెరవేర్చవలసిన పని గురించి వారికెలాంటి గ్రహింపూ లేదు. దేవుని కుమారుడుగా ఆయనలో నమ్మకం లేదు. వారు తమ దేశంలోనుంచి రోమ్ పరిపాలనను తొలగించి శాంతి సౌభాగ్యాలను తెచ్చే ఇహలోక రాజ్యం గురించే ఆలోచిస్తున్నారు. యేసుకు అలాంటిదానితో నిమిత్తం లేదు. అప్పట్లో ఏ రాజకీయ వ్యవస్థనూ స్థాపించాలన్న ఆశ ఆయనకు లేదు. ఇప్పుడూ అంతే. ఆయన లోక పాపాల కోసం చనిపోయేందుకు వచ్చాడు. పతనమైన భ్రష్ట స్థితిలో ఉన్న మనుషులకు క్షమాపణ, ఆధ్యాత్మిక జీవం తేవడానికి వచ్చాడు.

16. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.

ఈ అద్భుతం మత్తయి, మార్కు శుభవార్తల్లో కూడా ఉంది. మత్తయి 14:22-33 నోట్స్ చూడండి.

17. అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

18. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.

19. వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;

20. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.

21. కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

ప్రకృతి శక్తులకు కట్టుబడకుండా, వాటిపై పూర్తి అదుపు కలిగి ఉన్న వ్యక్తిని ఈ సూచన చూపుతున్నది. కీర్తనల గ్రంథము 107:23-30; మత్తయి 8:23-27 చూడండి.

22. మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.

యేసు సరస్సు దాటి ఎలా రాగలిగాడో జనసమూహానికి అర్థం కాలేదు (వ 25).

23. అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.

24. కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.

వారు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చినది ఆయనెవరో వారికి తెలిసి కాదు, లేదా అలాంటి ఆధ్యాత్మిక కారణం ఏదైనా ఉండి కాదు.

25. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా

“గురువర్యా”– యోహాను 1:38.

26. యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

యేసుప్రభువుకు వారి హృదయాలు తెలుసు (యోహాను 2:24-25 చూడండి). తనను వెతకడంలో వారి ఉద్దేశాల పట్ల ఆయనకేమీ ఆనందం లేదు. వారికి ఆత్మ సంబంధమైన జ్ఞానం గానీ ఆసక్తి గానీ లేదు, తమ భౌతిక అవసరాలకు ఏమైనా దొరుకుతుందన్న తాపత్రయం మాత్రమే ఉంది. నేడు క్రైస్తవ సంఘాల్లోనూ, బయట కూడా సరికాని కారణాలను బట్టి క్రైస్తవులుగా ఉందామని ప్రయత్నించే అనేకమంది వీరివంటి వారే.

27. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

అన్నిటికంటే ముఖ్యంగా వారికి దేన్ని గురించి శ్రద్ధ ఉండాలో ప్రభువు చెప్తున్నాడు. ఈ క్షణికమైన జీవితావసరాల కోసం కాదు, శాశ్వత జీవం కోసమే, శరీరం కోసం కాదు ఆత్మకోసమే వారు పాటుపడాలి. మత్తయి 6:31-33; మత్తయి 16:26; యెషయా 55:1-2 కూడా చూడండి. “శాశ్వత జీవం”– యోహాను 3:16. మానవ పుత్రుడే (మత్తయి 8:20) ఆ ఆహారం ప్రసాదిస్తాడు గానీ దానికోసం వారు కష్టపడాలన్న సంగతి గమనించండి. అంటే పాపవిముక్తి అనేది కష్టపడి మంచి పనులు చేస్తే వస్తుందని కాదు. క్రీస్తు ఇచ్చేదాన్ని మనుషులు ఆయనలో వెదికేందుకూ క్రీస్తులో నమ్మకం ఉంచి ఆ ఈవిని పొందేందుకూ అన్ని ప్రయత్నాలూ చెయ్యాలని దీని భావం (వ 29). మత్తయి 11:12; హెబ్రీయులకు 4:11; 2 పేతురు 1:10 చూడండి.

28. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను అడుగగా

కష్టపడాలన్న క్రీస్తు మాటను వారు సరిగా అర్థం చేసుకున్నట్టు లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడంవల్ల పాప విముక్తినీ శాశ్వత జీవాన్నీ మంచి పనుల ద్వారా సంపాదించుకో వచ్చని వారు అనుకున్నారు. కానీ యోహాను 4:10; రోమీయులకు 6:23; ఎఫెసీయులకు 2:8-9; తీతుకు 3:5 చూడండి.

29. యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

వారి పొరపాటు అభిప్రాయాన్ని ప్రభువు సవరిస్తున్నాడు. మనుషులు తమ పాపవిముక్తి కోసం క్రీస్తులోనే నమ్మకం ఉంచాలని దేవుని ఆదేశం (యోహాను 1:12; యోహాను 3:15-16, యోహాను 3:36; యోహాను 5:24). క్రీస్తులో నమ్మకం ఉంచడం బుద్ధికి అనుగుణమైన యోగ్యమైన పని, ఎందుకంటే దేవుడు ఆయన్ను ఈ లోకానికి పంపించాడు. యోహాను శుభవార్త ఒక్కదాన్లోనే దేవుడు తనను పంపాడని యేసుప్రభువు 40 సార్లు చెప్పాడు. మనుషులు ఆయన మాటలు నమ్మాలంటే ఒక విషయాన్ని ఆయన ఎన్ని సార్లు చెప్పాలి?

30. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?

మత్తయి 16:1-4; 1 కోరింథీయులకు 1:22. తన గురించిన సత్యాన్ని వెల్లడి చేస్తున్న సూచనలను యేసుప్రభువు ఇంతకుముందే చూపించాడు. అయితే ఆ ప్రజలు ఆయన్ను నమ్మలేదు. వ 31లో వారు ఎడారిలో మన్నా గురించి మాట్లాడారు (నిర్గమకాండము 16:11-18, నిర్గమకాండము 16:35). యేసు చేసినదానిని మన్నాతో పోలుస్తున్నట్టున్నారు. యేసు 5 వేల మందికి ఒక పూట భోజనం పెట్టాడు. మోషే కాలంలోనైతే దేవుడు ఆ జాతి నంతటినీ 40 సంవత్సరాలు పోషించాడు. యేసు వారికి మామూలు రొట్టెలు తినిపించాడు. మోషే కాలంలో దేవుడు ఆకాశంనుంచి మన్నా కురిపించాడు. అభిషిక్తుడు వచ్చినప్పుడు మళ్ళీ ఆకాశంనుంచి మన్నా కురిపిస్తాడని యూదులు నమ్మారు. కానీ యేసు అలా చెయ్యలేదు.

31. భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.
నిర్గమకాండము 16:4-15, సంఖ్యాకాండము 11:7-9, Neh-h 9 15:1, కీర్తనల గ్రంథము 78:24, కీర్తనల గ్రంథము 105:40

32. కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.

మన్నా కురిపించినది దేవుడే. శాశ్వత జీవాన్ని కలిగించే పరలోక సంబంధమైన ఆహారాన్ని వారికి మోషే ఇవ్వడం అసాధ్యం. దేవుడు మాత్రమే అలా చెయ్యగలడు. తన సొంత కుమారుణ్ణి పంపడం ద్వారా దేవుడు అలా చేశాడు. దేవుడు ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆహారానికి మన్నా ఒక సాదృశ్యం, ఒక చిహ్నం మాత్రమే. ఆధ్యాత్మిక జీవాన్ని కలిగించే నిజమైన ఆహారం ఇదే.

33. పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

దేవుడిచ్చే ఆహారం ఒక వ్యక్తి అని గమనించండి. పరలోకంనుంచి వచ్చి మానవజాతికి ఆత్మ సంబంధమైన జీవాన్నిచ్చే వ్యక్తి ఆయన (వ 35).

34. కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.

యోహాను 4:15 పోల్చి చూడండి. ఆయన చెప్తున్న దాని గురించి ఆత్మ సంబంధంగా వారికేమీ అర్థం కాలేదు, వారాయన్ను నమ్మలేదు (వ 36).

35. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,

వారు పోగు చేసుకుని తినగల మన్నావంటి పదార్థం గురించి తాను మాట్లాడ్డం లేదని యేసు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన తన గురించే మాట్లాడుతున్నాడు (వ 48,51). తనను తాను ఆహారంగా చెప్పుకొంటూ ఉన్నప్పుడు మానవ దేహానికి ఆహారం ఎలానో, మనుషుల మనసులకు, హృదయాలకు, ఆత్మలకు తాను అలా అని పోల్చుకుంటున్నాడు అన్నమాట.

36. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.

వ 64; యోహాను 5:38; యోహాను 8:45; యోహాను 10:25.

37. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.

ఇది మరో గొప్ప వాగ్దానం. యేసుప్రభువు దగ్గరికి రావడంద్వారా మనం జీవాహారంలో భాగం పంచుకుంటామని ఇది తెలియజేస్తున్నది. ఆధ్యాత్మిక జీవం కలగాలంటే ఇదొక్కటే ఏకైక మార్గం (యోహాను 3:36; యోహాను 5:40; యోహాను 14:6; ప్రకటన గ్రంథం 22:17). ఆయన దగ్గరికి రావడం అంటే ఆయనలో నమ్మకం ఉంచడం; వారిలాగా అపనమ్మకంతో, వేరే ఉద్దేశాలతో రావడం కాకుండా నమ్మకంతో రావడం (వ 24,26). రావడమంటే మన హృదయాలు ఆయనకు దగ్గర కావడం, ఆత్మలో ఆయన వైపుకు తిరగడం. అలా వచ్చినవారిని ఆయన ఎప్పుడూ పంపివెయ్యడు. ఈ మాటలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎవరైనా, ఎక్కడ ఉన్నా అతడు లేక ఆమె క్రీస్తు దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని క్రీస్తు స్వీకరిస్తాడు. దేవుడు తనను ఎన్నుకోలేదేమోనని, కాబట్టి క్రీస్తు తనను స్వీకరించడేమోనని ఈ వచనం మొదటి భాగం విషయం ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. అతడు క్రీస్తు దగ్గరికి రావడమే దేవుడు అతణ్ణి ఎన్నుకున్నాడని రుజువు. దేవుడు మానవాళిలో నుంచి కొందరు వ్యక్తులను క్రీస్తుకు ఇచ్చాడన్నది నిజమే (యోహాను 10:29; యోహాను 17:6). ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రాకముందు అతడు, లేక ఆమె అలాంటి కోవకు చెందినవారో కాదో ఎవరూ చెప్పలేరు. అయితే దేవుడెన్నుకున్న వారందరూ మాత్రం నమ్మకంతో క్రీస్తు దగ్గరికి వస్తారు. అలా రావడం ద్వారా దేవుడు తమను క్రీస్తుకు ఇచ్చాడని రుజువు చేస్తారు. రోమీయులకు 8:29-30 నోట్స్ చూడండి. పాపవిముక్తి కోరుతున్న పాపి దేవుని రహస్య ఉద్దేశాల గురించి ఆందోళన పెట్టుకోవడం మాని, ఉన్నట్టుగా క్రీస్తు చెంతకు రావాలి (మత్తయి 11:28). రాదలచుకున్న వారంతా రావచ్చు (ప్రకటన గ్రంథం 22:17).

38. తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.

యోహాను 4:34 నోట్. ఈ ఒక అధ్యాయంలో తాను పరలోకంనుంచి దిగివచ్చానని ఐదు సార్లు యేసుప్రభువు చెప్పాడు (వ 33,38,50,51,58). మనమంతా ఆయన్ను నమ్ముదాం. మనం ఈ ఒక్క సత్యం నమ్మితే ఆయన చెప్పిన వేరే విషయాల గురించి తొట్రుపాటు, ఆందోళన చెందనవసరం లేదు. యేసు లోకానికి వచ్చిన ఇంకా కొన్ని కారణాలకోసం మత్తయి 5:17 నోట్ చూడండి.

39. నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

ఇక్కడ చివరి రోజున అంటే ఈ యుగాంతంలో విశ్వాసులు సజీవంగా తిరిగి లేచే రోజున (యోహాను 5:28-29 నోట్‌). విశ్వాసులు తన తండ్రి తన కిచ్చిన బహుమానమనీ ఈ బహుమానాన్ని గురించి తాను శ్రద్ధ తీసుకుంటూ దానిలో ఏ చిన్న భాగాన్ని కూడా పోగొట్టుకోననీ యేసు ఇక్కడ చెపుతున్నాడు. వ 40, 44లో యేసు ఖచ్చితంగా ఎలాంటి షరతులూ మినహాయింపులూ లేకుండా విశ్వాసులందరినీ సజీవంగా లేపుతానంటున్నాడు. అంటే ఆయన ఆరంభించిన రక్షణ కార్యాన్ని వారందరి విషయంలో ఆయన ముగిస్తాడన్న మాట. ఏ ఒక్క విశ్వాసి విషయంలో కూడా ఆయన విఫలం కాడు. ఇందులో విశ్వాసులకు పరిపూర్ణమైన భద్రత, క్షేమం ఉంది. దేవుని కుమారుని ప్రేమ, బలప్రభావాలపై, తండ్రి సంకల్పంపై ఇది ఆధారపడి ఉంది (యోహాను 10:28-30; రోమీయులకు 5:9-10; ఫిలిప్పీయులకు 1:6; హెబ్రీయులకు 7:25 పోల్చి చూడండి.)

40. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.

కుమారునివైపు చూచి ఆయనపై నమ్మకం ఉంచడ మంటే ఆయన చెంతకు రావడమే (వ 37). “శాశ్వత జీవం” గురించి నోట్ యోహాను 3:16.

41. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

యేసు వారికి ఈ భూమిపై ఇంతకుముందు ఎవరూ వినని మనోజ్ఞమైన ఉపదేశం, అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు. అందుకు ప్రతిగా వారు చేసినదల్లా సణుక్కొవడం, అభ్యంతరాలు లేవదీయడం. విశ్వాసం లేని భ్రష్టమైన మానవ హృదయం అలాంటిదే.

42. కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?

మత్తయి 13:55; మార్కు 6:3 కూడా చూడండి. క్రీస్తు ఎలా జన్మించాడో వారికి తెలియదు (మత్తయి 1:18-23; లూకా 1:26-35). ఆయన పరలోకంనుంచి వచ్చిన సంగతి వారికి తెలియదు. తెలుసుకోవాలన్న కోరికా లేదు.

43. ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.

సత్యాన్ని గ్రహించాలంటే సణుగుడు సరైన మార్గం కాదు. అది కేవలం మనుషుల పాపాన్ని పెంచుతుంది.

44. అందుకు యేసుమీలో మీరు సణుగుకొనకుడి;

వ 37 చూడండి. దేవుని తోడు లేకుండా పాపులైన మనుషులకు క్రీస్తు మాటలు అర్థం కావు, ఆయనపై నమ్మకం కలగదు. ఆయన చెంతకు రావడం అసాధ్యం. అయినా అవిశ్వాసులు జవాబుదారులు, దోషులుగా ఉన్నారు, శిక్షావిధికి గురైనవారు (యోహాను 3:18-20). చివరి రోజున విశ్వాసులందరినీ సజీవంగా లేపుతానని యేసు నాలుగు సార్లు చెప్పాడు (వ 39,40,54). ఈ సత్యం ఎంత నిశ్చయమో తెలియజేసేటందుకు ఈ మాటలను చాలా గట్టిగా మనస్సులో నాటుకునేలా చెప్తున్నాడు.

45. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
యెషయా 54:13

యెషయా 54:13; యిర్మియా 31:34. దేవుడు ఉపదేశకుడు అనే సత్యం గురించి నోట్స్ కీర్తనల గ్రంథము 25:4-5. దేవునినుంచి నేర్చుకునే ప్రతివాడూ క్రీస్తు దగ్గరికి వస్తాడు. సందేహం లేదు. క్రీస్తును తన రక్షకుడుగా ప్రభువుగా నమ్మకుండా దేవుడు తన ఉపదేశకుడు అని ఎవరన్నా అనడం వ్యర్థం.

46. వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

యోహాను 1:18. దేవత్వంలో ఈ ఇద్దరు వేరువేరు వ్యక్తులని మరోసారి గమనించండి – ఒకరిని మరొకరు చూశారు.

47. దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్న వాడు.

యేసు ఈ విషయాన్ని ఇంకా కొన్ని సార్లు చెప్పాడు (వ 40; యోహాను 3:15-16; యోహాను 5:24). నమ్మి ఆనందించండి.

48. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.

వ 35.

49. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

నమ్మకం లేని యూదులు యేసుకన్నా మోషే గొప్పవాడనుకున్నారు (వ 30-32). కానీ నిజం దీనికి వ్యతిరేకంగా ఉందని క్రీస్తు ఇక్కడ నిరూపిస్తున్నాడు. ఇస్రాయేల్ వారు తినిన మన్నా వారికి ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇవ్వలేదు. లేక చాలా కాలం ఈ లోకంలో బ్రతికేలా చెయ్యలేదు (వ 49). కానీ పరలోకంనుంచి వచ్చి ఆహారం అయిన క్రీస్తు ఎప్పటికీ నిలిచివుండే ఆత్మసంబంధమైన జీవాన్ని ఇస్తాడు. మన్నా ఒక్క జాతివారికే లభ్యం అయింది. కానీ క్రీస్తు ఇచ్చేది ఈ లోకంలోని వారందరికోసం (వ 51). పరలోకంనుంచి వచ్చిన ఆ ఆహారాన్ని ఒక వ్యక్తి గనుక తింటే అతడు చనిపోడని వ 50లో యేసు అంటున్నాడు. యోహాను 11:26 కూడా చూడండి. మరి క్రీస్తులో నమ్మకం ఉంచినవారు శారీరికంగా చనిపోరా? అవును చనిపోతారు గాని ఆత్మసంబంధంగా ఎప్పుడూ చనిపోరు. వారు మరణం నుంచి జీవంలోకి వెళ్ళిపోయారు (యోహాను 5:24). క్రొత్త ఒడంబడిక గ్రంథంలో విశ్వాసుల మృతిని కూడా సాధారణంగా మరణం అనలేదు, “నిద్ర” అన్నారు. యోహాను 11:11-13; అపో. కార్యములు 7:60; 1 కోరింథీయులకు 15:6; 1 థెస్సలొనీకయులకు 4:13 చూడండి. మరణం గురించి నోట్స్ ఆదికాండము 2:17 చూడండి.

50. దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే.

51. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

లోకమంతటి పాపాల పరిహారం కోసం తన దేహం బలి అర్పణ అనీ (యోహాను 1:29; యోహాను 3:15 చూడండి), ఆయనమీద నమ్మకం ఉంచడంద్వారా మనుషులకు ఆత్మ సంబంధమైన జీవం కలుగుతుందనీ యేసు ఉద్దేశం.

52. యూదులుఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

ఎప్పటిలాగానే నమ్మకం లేని ఈ మనుషులకు ఆయన చెప్పినది బోధపడలేదు. ఆధ్యాత్మికమైన వివేచన వారికి లేదు. ఆయన మాటలను అక్షరార్థంగా తీసుకున్నారు. యోహాను 3:4; యోహాను 4:15 పోల్చి చూడండి. యేసు తరుచుగా అలంకారికమైన భాషను ఉపయోగించాడు. దాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోకూడదు (వ 35; యోహాను 4:10; యోహాను 8:12; యోహాను 10:7; యోహాను 15:1; మొ।।). తరువాత వస్తున్న వచనాల విషయంలో కూడా ఇది గుర్తుంచుకోవాలి.

53. కావున యేసు ఇట్లనెనుమీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.

ఈ భాగంలో యేసు తన శరీరం, రక్తం గురించి నాలుగు సార్లు మాట్లాడాడు. మనుషులు తన శరీరాన్ని తిని తన రక్తాన్ని తాగాలని చెప్పాడు. అదే “నిజమైన” ఆహారం అన్నాడు. తానే ఆహారం అనీ, మనుషులు తనను తినాలనీ చెప్పాడు. విన్నవారు ఆ మాటలను ఉన్నవి ఉన్నట్టు అర్థం చేసుకోకూడదన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. వ 63 చూడండి. ఆయన వారి ఎదుట నిలబడి ఉన్నాడు. హత్య, నరమాంస భక్షణ అనే ఘోర నేరాలు చేయకుండా ఆయన్ను అక్షరాలా తినడం వారికి అసాధ్యం. ఈ రెంటిలో దేనినీ యేసుప్రభువు కలలోనైనా బోధించలేదు. ఆయన అక్షరాలా మనకు ఆహారం అని ఎలా భావించకూడదో అలానే ఆయన శరీరాన్ని అక్షరాలా తిని, రక్తాన్నీ తాగాలని మనం అనుకోకూడదు. ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పించేందుకు ఆయన భాషాలంకారాన్ని వాడుతున్నాడు. తాను అక్షరాలా ఒక తలుపు అనీ (యోహాను 10:7), లేక అక్షరాలా ఒక ద్రాక్షతీగె (యోహాను 15:1) అనీ ఆయన ఉద్దేశం కానట్టే ఆయన్ను అక్షరాలా తినాలని కూడా ఆయన ఉద్దేశం కాదు. పాత ఒడంబడిక గ్రంథంలో రక్తాన్ని తాగడం తినడం నిషేధం (ఆదికాండము 9:4; లేవీయకాండము 17:10-14; లేవీయకాండము 19:26). యేసు ఏ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పిస్తున్నాడు? వ 51లో చెప్పిన సత్యాన్నే, ఇక్కడ తన రక్తాన్ని కూడా చేర్చి నేర్పిస్తున్నాడు. “రక్తం” అంటే సిలువపై కారనున్న ఆయన రక్తం; మనుషుల పాపాలకు పరిహారబలిగా ఆయన ఇవ్వనున్న తన ప్రాణమన్న మాట (మత్తయి 26:27-28; రోమీయులకు 3:25 చూడండి). ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగడమంటే ఏమిటి? ఆయన చేసిన బలి అర్పణ నిజంగా మన కోసమేననీ, అది మన పాపాలను తీసివేస్తుందనీ నమ్మడమే (రోమీయులకు 3:25; ఎఫెసీయులకు 1:7; హెబ్రీయులకు 9:12-14; 1 యోహాను 1:7). నమ్మకం ద్వారా ఆయన్ను మన హృదయాల్లోకి స్వీకరించడమే. ఇది ఆత్మ సంబంధంగా తిని త్రాగడం. ఇది ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇస్తుంది. ఈ భాగమంతా ప్రభురాత్రి భోజన ఆచరణను సూచిస్తున్నదని కొందరు అనుకుంటున్నారు (మత్తయి 26:26-29; 1 కోరింథీయులకు 11:23-32). దీనికి చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ప్రభురాత్రి భోజన ఆచరణలోని ఆధ్యాత్మిక అర్థాన్ని ఈ వచనాలు వివరిస్తూ ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవం కలగాలంటే మనుషులు ఈ ఆచరణ పాటించాలని క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఎక్కడా రాసి లేదు. అదే నిజమైతే మరి సిలువ మీద నమ్మకం ఉంచిన దొంగ సంగతి ఏమిటి (లూకా 20:40-43)? ప్రభురాత్రి భోజనం ఎప్పుడూ పుచ్చుకోని ఇతర విశ్వాసుల, చిన్నపిల్లల సంగతి ఏమిటి? యేసు వ 53లో చాలా ఖచ్చితంగా తన శరీరం తినకపోతే, తన రక్తం త్రాగకపోతే వారిలో జీవం ఉండదని చెప్పాడు. ఇక్కడ ఆయన ఆత్మ సంబంధమైన వాస్తవాలను గురించి మాట్లాడుతున్నాడన్నది తేటతెల్లమే. ప్రభురాత్రి భోజన ఆచరణలో భాగం పుచ్చుకుంటూ కూడా ఆత్మ సంబంధంగా నమ్మకం ద్వారా ఎప్పుడూ ఆయన శరీరాన్ని తినకుండా, ఆయన రక్తాన్ని త్రాగకుండా ఉండడం సాధ్యమేనని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆధ్యాత్మికంగా నమ్మకం ద్వారా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి కూడా ప్రభురాత్రి భోజన సంస్కారంలో భాగం పుచ్చుకోకుండా ఉండడం కూడా సాధ్యమే. “తినకపోతే”, “త్రాగకపోతే”- అంటూ మాట్లాడడంలో పాపవిముక్తికి అత్యంత అవసరమైన విషయం గురించి యేసు మాట్లాడుతున్నాడు. యోహాను 3:3; మత్తయి 18:3; లూకా 13:3 కూడా చూడండి. ఇవన్నీ లేకుండా ఏ మనిషికీ ఆత్మ సంబంధమైన జీవం, పాపవిముక్తి, దేవుని రాజ్యంలోకి ప్రవేశం, పరలోకం లేవు. యేసుక్రీస్తు చెప్పిన అతి గంబీరమైన వాక్కులే ఇందుకు ఆధారం.

54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.

56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.

విశ్వాసి క్రీస్తులో ఉన్నాడు (రోమీయులకు 6:11; రోమీయులకు 8:1; 1 కోరింథీయులకు 1:2; ఎఫెసీయులకు 1:1-4); క్రీస్తు విశ్వాసిలో ఉన్నాడు (2 కోరింథీయులకు 13:5; కొలొస్సయులకు 1:27; కొలొస్సయులకు 3:11; ప్రకటన గ్రంథం 3:20). ఒకరు పరస్పరం మరొకరిలో ఉన్నారు – యోహాను 17:20-23. వారి జీవితాలు ఎప్పటికీ ఏకంగా పెనవేసుకొని ఉన్నాయి.

57. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

తండ్రి అయిన దేవునిమూలంగా క్రీస్తుకు జీవం ఉన్నదన్న సంగతి ఎంత వాస్తవమో క్రీస్తుమూలంగా విశ్వాసులకు జీవం ఉన్న సంగతి అంత వాస్తవం. జీవం ఉన్న తండ్రి, జీవం ఉన్న కుమారుడు, జీవం ఉన్న విశ్వాసులు – వీరంతా అతి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు.

58. ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను

59. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.

60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.

క్రీస్తు శత్రువులైన యూదులు కాదు ఈ మాటలన్నది. ఆయన శిష్యులే కొందరు అన్నారు. ఆయనకు సన్నిహితులైన పన్నెండుమంది కాదు. ఆయన ఉపదేశాలు వినేందుకు అప్పుడప్పుడు ఆయన వెంట వెళ్తూ ఉండేవారు కొందరు ఇలా అన్నారన్నమాట. ఇలా అన్నవారిలో కొందరు నిజంగా ఆయనపై నమ్మకం ఉంచినవారు కారు (వ 64). ఆయన్ను వదిలి వెళ్ళిపోవడం ద్వారా వారి అవిశ్వాసాన్ని వారు బయట పెట్టుకున్నారు (వ 66. 1 యోహాను 2:19 పోల్చి చూడండి). 53-58 వచనాల్లో యేసు నేర్పినది ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఆయనలో నమ్మకం ఉంచినవారికి దివ్యంగా కనిపిస్తుంది. అయితే నమ్మకం లేనివారికి నిజంగా అది “కఠినమైన” మాటే. వారి పాపవిముక్తికి ఏకైక మార్గం వారికోసం క్రీస్తు చేసిన బలి అర్పణేననీ, నమ్మకంద్వారా వారు ఆయనతో సంబంధం పెట్టుకోవాలనీ, లేదా వారు నశించిపోతారనీ వినడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇది కఠినమైన మాట అనడంలో తాము అంగీకరించేందుకు అది చాలా కష్టమైన మాట అని వారి ఉద్దేశం. నిజమైన విశ్వాసికి యేసు చెప్పినవి కొన్ని అర్థం చేసుకోవడానికి కష్టమైనప్పటికీ అంగీకరించేందుకు మాత్రం ఏదీ కష్టమైనది కాదు. ఇక్కడ క్రీస్తు ఉపదేశం ఆయన నిజ శిష్యులనూ కపట శిష్యులనూ వేరు చేసింది (యూదా ఇస్కరియోతు ఒక్కడు మాత్రం మరి కొంత కాలం వేరు కాకుండా అలానే ఉన్నాడు).

61. యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?

వ 41.

62. ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?
కీర్తనల గ్రంథము 47:5

మార్కు 16:19; లూకా 24:51; అపో. కార్యములు 1:9. క్రీస్తు పరలోకానికి పైకి వెళ్ళిపోతుండగా చూస్తే వారికి మరింత అభ్యంతరం కలుగుతుందా లేక ఆయన్ను నమ్ముతారా అని ఈ ప్రశ్నకు అర్థం కావచ్చు. “మునుపున్న చోటు” అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుడున్నచోటు అని అర్థం (వ 38; యోహాను 1:1; యోహాను 3:13).

63. ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని

“ఆత్మ”– దేవుని ఆత్మ. ఆ ఆత్మ మాత్రమే ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇవ్వగలడు (యోహాను 3:5-8; 2 కోరింథీయులకు 3:6). అక్షరాలా తన శరీరాన్ని తినడం ఎలాంటి మేలూ కలిగించదని క్రీస్తు ఇక్కడ సూచిస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవం ఏ వ్యక్తిలోకీ నోటి గుండా ప్రవేశించదు. అది నేరుగా మనిషి ఆత్మలోకి వెళ్తుంది. “శరీరం ప్రయోజనమేమీ లేనిది” అనే మాటలు అక్షరాల క్రీస్తు శరీరాన్ని తినడంవల్ల ఏమీ ప్రయోజనం ఉండదనే అర్థం మాత్రమే కాకుండా ఎవరి శరీరమూ, శారీరికంగా ఎవరి ప్రయత్నాలూ ఆధ్యాత్మిక జీవాన్ని ఇవ్వలేవని కూడా దీని అర్థం కావచ్చు. అంటే మానవ స్వభావంతో సంబంధం ఉన్నదేదీ అలా చెయ్యడం అసాధ్యం (యోహాను 1:13). “మీతో నేను చెప్పిన మాటలు” అంటే పై వచనాల్లో చెప్పిన మాటలు అని అర్థం. కానీ క్రీస్తు చెప్పిన మాటలన్నిటికీ ఇది సరిపోతుంది. అయితే మాటలు ఆత్మ సంబంధమైనవిగా జీవం ఇచ్చేవిగా ఉండడం ఎలా? దేవుని ఆత్మ ఈ మాటలను ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇచ్చేందుకు వాడుకుంటాడన్న మాట. క్రీస్తు మాటలను మనుషులు అర్థం చేసుకుని, నమ్మకం ఉంచి, ఆ ప్రకారం చేసి, జీవాన్ని పొందగలిగేలా దేవాత్మ చేస్తాడు. క్రీస్తు మాటల మూలంగా మనుషులు తమ అవసరతను గుర్తించేలా, క్రీస్తు చేసిన వాగ్దానాలపై ఆశపెట్టుకునేలా, తమ హృదయాలు తెరిచి ఆయన జీవాన్ని స్వీకరించేలా పవిత్రాత్మ చేస్తాడు.

64. మీలో విశ్వ సించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.

యోహాను 2:24-25. యూదా ఇస్కరియోతును క్రీస్తు తన శిష్యుల్లో ఒకడుగా ఎన్నుకోకముందే అతడు తనను శత్రువులకు పట్టి ఇస్తాడని ఆయనకు తెలుసు (వ 70,71). అలాగైతే అతణ్ణి ఎన్నుకోవడం ఎందుకు? బైబిలు లేఖనాలు, దేవుని ఉద్దేశాలు నెరవేరాలని. మత్తయి 26:24 చూడండి.

65. మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.

యేసుప్రభువు గొప్ప అద్భుతం చేశాడు, అద్భుతమైన మాటలు చెప్పాడు. అయితే చాలామంది తమ అపనమ్మకంలోనే ఉండిపోయారు. ఇందుకు కారణాన్ని ప్రభువు ఇక్కడ మరో సారి చెప్తున్నాడు (వ 44). ఇది వ 37లో ఉన్న విషయాన్నే మరో రీతిలో చెప్పడం. తండ్రి క్రీస్తుకు ఇవ్వని వారంతా ఆయన దగ్గరికి రారు.

66. అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.

వ 15 లోని మనస్తత్వం నుంచి కొందరు ఎంత త్వరగా ఈ స్థితికి మారిపోతారో గదా! వారు కోరేది తాము అదుపు చేయగలిగిన యేసును, తమ ఉద్దేశాల ప్రకారం చేసే యేసును, తమకు ఏది మంచిదని వారనుకుంటారో దాన్ని వారికిచ్చే యేసును. ఉన్న యేసును వారు కోరలేదు. ఆయన చెప్పిన “కఠినమైన” మాటల్ని (వ 60) వారు అంగీకరించలేకపోయారు. యేసు వారి అపనమ్మకాన్ని బట్టబయలు చేశాడు కూడా. అందువల్ల ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. యేసును మనం సరియైన కారణాలవల్ల అనుసరించాలి. అలా కాకపోతే ఎప్పటికైనా మనం కూడా ఆయన్ను వదిలి వెళ్లిపోతాం.

67. కాబట్టి యేసుమీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా

పన్నెండుమంది శిష్యులూ తనను వదిలి వెళ్ళరని యేసుకు తెలుసు. వారి మనసుల్లో ఏమున్నదో వారు నోరు తెరచి చెప్పాలని ఆయన ఉద్దేశం. ఇది వారికి పరీక్ష సమయం అనడంలో సందేహం లేదు.

68. సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;

శిష్యులందరి తరుఫునా ప్రతినిధిగా పేతురు మాట్లాడేవాడు (మత్తయి 16:15-16; మత్తయి 17:4; మొ।।). వారందరి మనసుల్లో (ఇస్కరియోతు యూదా తప్ప) ఉన్న సంగతిని ఇతడు ఇక్కడ వెల్లడిస్తున్నాడు. క్రీస్తును అనుసరించడంలో గల సరైన కారణం చెప్తున్నాడు. వారు క్రీస్తు మాటలను విశ్వసించారు. తాను ఏమిటని ఆయన చెప్పుకున్నాడో అదేనని వారికి నమ్మకం కుదిరింది. వారాయన్ను వదిలిపోలేరు. నిజమైన విశ్వాసికి క్రీస్తును విడిచి వెళ్ళిపోదగిన ఇతర ప్రదేశమేదీ లేదు, ఆశ్రయించదగిన వేరొక వ్యక్తి ఎవరూ లేరు.

69. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.

“అభిషిక్తుడు”– యేసు ఎవరో శిష్యులు చాలా వరకు అర్థం చేసుకున్నట్టే – ఆయన ఏ కల్మషమూ లేని పాపరహితుడు, దేవుడు ప్రత్యేకించి ఈ లోకానికి పంపినవాడు, దేవునికి ప్రతినిధి, ఇస్రాయేల్‌వారి అభిషిక్తుడు.

70. అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను.

యూదా అక్షరాలా పిశాచం కాదు. కానీ తన జీవితంపై అతడు సైతానుకు ఎంతగా అధికారం ఇచ్చాడంటే పిశాచంలాగానే అతడు ప్రవర్తించసాగాడు. యోహాను 12:4-6; యోహాను 13:2, యోహాను 13:26-27 కూడా చూడండి.

71. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఐదువేలు అద్భుతంగా తినిపించారు. (1-14) 
జాన్ సమూహానికి అద్భుతమైన ఆహారం అందించడాన్ని వివరిస్తాడు, దానిని తదుపరి చర్చకు అనుసంధానించాడు. ఈ అద్భుతం ప్రజలపై చూపిన ప్రభావాన్ని గమనించండి. ఒక గొప్ప ప్రవక్తగా మెస్సీయ రాక గురించి యూదుల సాధారణ అంచనాలు ఉన్నప్పటికీ, తమను తాము చట్టంలో నిపుణులుగా భావించే పరిసయ్యులు సాధారణ ప్రజల పట్ల అసహ్యకరమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు. అయితే, ఈ అకారణంగా సాధారణ వ్యక్తులు చట్టాన్ని నెరవేర్చే వ్యక్తి గురించి లోతైన అవగాహన కలిగి ఉన్నారు. ప్రజలు క్రీస్తును ప్రవచించబడిన ప్రవక్తగా గుర్తించడం మరియు అదే సమయంలో ఆయన సందేశాన్ని విస్మరించడం కూడా సాధ్యమే.

యేసు సముద్రం మీద నడుస్తున్నాడు. (15-21) 
ఇక్కడ క్రీస్తు శిష్యులు నమ్మకంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు, అదే సమయంలో, క్రీస్తు ప్రార్థనలో వారి కోసం మధ్యవర్తిత్వం వహించాడు. విధినిర్వహణలో ఉన్నప్పటికీ వారు అవస్థలు పడ్డారు. క్రీస్తుతో జతకట్టిన వారికి కూడా, ప్రస్తుత క్షణంలో సవాళ్లు మరియు బాధలు ఉండవచ్చు. కాంతి మరియు పగటి అనుచరులు తరచుగా మేఘాలు మరియు చీకటిని ఎదుర్కొంటారు. అలాంటి సమయాల్లో, యేసు సమీపిస్తున్నట్లు, సముద్రం మీద నడుస్తున్నట్లు వారు గ్రహించవచ్చు. ఆశ్చర్యకరంగా, ఓదార్పు మరియు విముక్తిని కలిగించే చాలా క్షణాలు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడతాయి మరియు భయాన్ని రేకెత్తిస్తాయి.
పాపులను దోషులుగా నిర్ధారించే శక్తివంతమైన శక్తి, "నీవు హింసించే యేసును నేనే" అనే ప్రకటనలో ఉంది, అయితే పరిశుద్ధుల ఓదార్పు కోసం, "నేను నీవు ప్రేమించే యేసును" అనే హామీని మించినది ఏమీ లేదు. మనము క్రీస్తుయేసును మన ప్రభువుగా స్వీకరించినట్లయితే, చీకటి రాత్రులలో మరియు అలలు వీచే గాలుల మధ్య కూడా మనకు భరోసా లభిస్తుంది, మనం చాలా కాలం ముందు ఒడ్డుకు చేరుకుంటాము.

అతను ఆధ్యాత్మిక ఆహారానికి దర్శకత్వం వహిస్తాడు. (22-27) 
యేసు అక్కడికి ఎలా వచ్చాడు అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇచ్చే బదులు, వారి విచారణను దారి మళ్లించాడు. మోక్షం కోసం అన్వేషణకు అత్యంత శ్రద్ధ మరియు నియమించబడిన పద్ధతులను శ్రద్ధగా ఉపయోగించడం అవసరం, అయినప్పటికీ అది మనుష్యకుమారుడు ప్రసాదించిన బహుమతిగా అనుసరించాలి. తండ్రి తన దివ్య స్వభావాన్ని ధృవీకరిస్తూ కుమారునికి ధృవీకరించారు. అలా చేయడం ద్వారా, అతను మనుష్యకుమారుడిని దేవుని కుమారుడిగా ప్రకటించాడు, అధికారం మరియు శక్తితో ఉన్నాడు.

సమూహంతో అతని ఉపన్యాసం. (28-65) 
28-35
మోక్షాన్ని కోరుకునే పాపులుగా మన నుండి ఆశించే విధేయత యొక్క అత్యంత కీలకమైన మరియు సవాలు చేసే అంశంగా క్రీస్తుపై విశ్వాసాన్ని స్థిరంగా ఉంచడం. ఆయన కృప ద్వారా, దేవుని కుమారునిపై విశ్వాసంతో కూడిన జీవితాన్ని గడపడానికి మనకు అధికారం లభించినప్పుడు, అది పవిత్రమైన సద్గుణాల అభివృద్ధికి మరియు ఆమోదయోగ్యమైన సేవా చర్యలకు దారి తీస్తుంది. దేవుడు, ప్రత్యేకంగా తండ్రి, ఒకప్పుడు వారి పూర్వీకులకు వారి భౌతిక జీవితాలను నిలబెట్టడానికి స్వర్గపు జీవనోపాధిని అందించాడు, ఇప్పుడు వారి ఆత్మల విముక్తి కోసం నిజమైన రొట్టెని అందజేస్తాడు. యేసును సమీపించడం మరియు ఆయనపై నమ్మకం ఉంచడం ఒకే సందేశాన్ని తెలియజేస్తాయి. రొట్టె శరీరాన్ని ఎలా నిలబెట్టి పోషిస్తుందో, ఆధ్యాత్మిక జీవితానికి మద్దతు ఇవ్వడంలో అదే విధమైన పాత్రను నిర్వర్తిస్తూ, తాను నిజమైన రొట్టె అని క్రీస్తు నొక్కిచెప్పాడు. అతను దేవుని నుండి ఉద్భవించిన రొట్టె, మన ఆత్మలకు జీవనోపాధిగా పనిచేయడానికి తండ్రి ప్రసాదించాడు. భౌతిక రొట్టె సజీవ శరీరం యొక్క జీవశక్తి ద్వారా పోషించబడుతుండగా, క్రీస్తు జీవించి ఉన్న రొట్టె, తన స్వంత స్వాభావిక శక్తి ద్వారా పోషించడం. సిలువ వేయబడిన క్రీస్తు సిద్ధాంతం ఎప్పటిలాగే విశ్వాసులకు బలాన్ని మరియు ఓదార్పునిస్తుంది. అతను స్వర్గం నుండి దిగివచ్చిన రొట్టె, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మరియు అతని అధికారం రెండింటినీ సూచిస్తుంది, అలాగే అతని ద్వారా మనకు ప్రవహించే అన్ని మంచి యొక్క దైవిక మూలం. ఈ రొట్టెని మనకు నిరంతరం అందించమని అవగాహనతో మరియు చిత్తశుద్ధితో ప్రభువును వేడుకుందాం.

36-46
అపరాధం, ఆపద మరియు పరిష్కారం, పరిశుద్ధాత్మ సూచనలచే మార్గనిర్దేశం చేయబడి, అతని నుండి మోక్షానికి ఆటంకం కలిగించే ప్రతిదాన్ని విడిచిపెట్టి, వ్యక్తులలో చేరుకోవటానికి సుముఖత మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. కుమారునికి అప్పగింపబడిన వారిలో ఎవ్వరూ తొలగించబడకూడదని లేదా అతనిచే కోల్పోకూడదని తండ్రి కోరిక. దైవానుగ్రహం అణచివేసి, కొంతవరకు వారి హృదయాన్ని మార్చే వరకు ఎవరూ రారు; అందువల్ల, వచ్చిన ఎవరైనా తిరస్కరణను ఎదుర్కోరు. సువార్త బహిర్గతం చేసే వినయపూర్వకమైన, పవిత్రమైన పద్ధతిలో రక్షింపబడే ఎవరినీ ఎదుర్కోదు. బదులుగా, దేవుడు తన మాట మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షిస్తాడు మరియు మానవ బాధ్యత వినడం మరియు నేర్చుకోవడం-అర్పించిన దయను స్వీకరించడం మరియు వాగ్దానానికి సమ్మతించడం. తండ్రి, తన ప్రియమైన కుమారునికి తప్ప మిగతా వారికి కనిపించని, కుమారుని మనస్సులపై అంతర్గత ప్రభావం, మాట్లాడే మాట మరియు వారి మధ్యకు పంపే మంత్రుల ద్వారా తన బోధనలను తెలియజేస్తాడు.

47-51
మన్నా యొక్క ప్రయోజనం పరిమితమైనది, ఈ భూసంబంధమైన జీవితానికి మాత్రమే విస్తరించింది. దీనికి విరుద్ధంగా, జీవించే రొట్టె చాలా గొప్పది, దానిలో పాలుపంచుకునే వారు ఎన్నటికీ మరణాన్ని అనుభవించలేరు. ఈ రొట్టె క్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని సూచిస్తుంది, ప్రపంచ పాపాల కోసం తండ్రికి బలి అర్పించాలని ఆయన భావించారు. ఇది ప్రతి దేశం నుండి పశ్చాత్తాపపడిన విశ్వాసులకు జీవితం మరియు దైవభక్తికి సంబంధించిన అన్నింటినీ పొందేందుకు ఉపయోగపడుతుంది.

52-59
మనుష్యకుమారుని యొక్క మాంసం మరియు రక్తం మానవ రూపంలో ఉన్న విమోచకుడికి ప్రతీక - క్రీస్తు సిలువ వేయబడి మరియు అతని ద్వారా సాధించిన విమోచన, దానితో పాటు అది తెచ్చే అమూల్యమైన ప్రయోజనాలను సూచిస్తుంది. వీటిలో పాప క్షమాపణ, దైవిక అంగీకారం, కృపా సింహాసనానికి ప్రాప్తి, ఒడంబడిక వాగ్దానాల నెరవేర్పు మరియు నిత్యజీవ బహుమతి ఉన్నాయి. క్రీస్తు యొక్క మాంసం మరియు రక్తం అని పిలుస్తారు, ఎందుకంటే అవి అతని శరీరాన్ని విచ్ఛిన్నం చేయడం మరియు అతని రక్తాన్ని చిందించడం ద్వారా పొందబడ్డాయి కాబట్టి నియమించబడ్డాయి. అంతేకాకుండా, అవి మన ఆత్మలకు జీవనోపాధిగా పనిచేస్తాయి, క్రీస్తుపై విశ్వాసం యొక్క సారాంశాన్ని సూచిస్తాయి. విశ్వాసం ద్వారా, మనం క్రీస్తులో మరియు ఆయన అందించే ఆశీర్వాదాలలో పాలుపంచుకుంటాము. ఒక వివేచనగల ఆత్మ, తన స్థితి మరియు అవసరాల గురించి తెలుసుకుని, మనస్సాక్షిని శాంతపరచడానికి మరియు నిజమైన పవిత్రతను పెంపొందించడానికి అవసరమైన ప్రతిదాన్ని విమోచకుడైన అవతార దేవునిలో కనుగొంటుంది. క్రీస్తు యొక్క సిలువను ధ్యానించడం మన పశ్చాత్తాపం, ప్రేమ మరియు కృతజ్ఞతతో జీవం పోస్తుంది. మన శరీరాలు ఆహారం ద్వారా జీవాన్ని పొందే విధంగానే, మనం ఆధ్యాత్మికంగా ఆయన ద్వారా జీవిస్తాము. అతను మన జీవితానికి మూలం, తల మరియు దాని సభ్యులు లేదా రూట్ మరియు శాఖల మధ్య సంబంధానికి సారూప్యంగా ఉన్నాడు; ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తాం.

60-65
క్రీస్తు యొక్క మానవత్వం ఇంతకు ముందు స్వర్గంలో లేదు, కానీ దేవుడు మరియు మనిషి యొక్క అసాధారణ కలయికగా, ఆ విశేషమైన జీవి స్వర్గం నుండి దిగి వచ్చినట్లు సరిగ్గా గుర్తించబడింది. మెస్సీయ యొక్క ఆధిపత్యం భూసంబంధమైన రాజ్యానికి చెందినది కాదు; అతనిపై ఆధ్యాత్మిక ఆధారపడటం మరియు అతని సమృద్ధి గురించి అతని బోధనలను అర్థం చేసుకోవడానికి విశ్వాసం అవసరం. మానవత్వం యొక్క సందర్భంలో ఆత్మ లేకుండా శరీరానికి విలువ లేనట్లే, అన్ని మతపరమైన ఆచారాలు జీవం లేనివి మరియు దేవుని ఆత్మ లేకుండా అర్థరహితమైనవి. మన ఆత్మలను అందించిన వ్యక్తి ఈ విషయాలలో మనకు బోధించగల ఏకైక మార్గదర్శి మరియు మనల్ని క్రీస్తు వైపుకు నడిపించగలడు, తద్వారా మనం ఆయనపై విశ్వాసం ద్వారా జీవించగలము. కృతజ్ఞతతో, మనం క్రీస్తు వైపు తిరగవచ్చు, ఆయనను సంప్రదించడానికి ఇష్టపడే ఎవరైనా హృదయపూర్వకంగా స్వీకరించబడతారని హామీ ఇచ్చారు.

చాలా మంది శిష్యులు తిరిగి వెళతారు. (66-71)
మేము యేసు మాటలు మరియు పనుల గురించి సవాలు చేసే ఆలోచనలను కలిగి ఉన్నప్పుడు, మనల్ని మనం ప్రలోభాలకు గురిచేస్తాము, అది ప్రభువు దయతో జోక్యం చేసుకోకపోతే, తిరోగమనానికి దారితీయవచ్చు. మానవత్వం యొక్క అవినీతి మరియు పాపాత్మకమైన స్వభావం తరచుగా ఒక గొప్ప సౌకర్యాన్ని కలిగి ఉండవలసిన వాటిని పొరపాట్లు చేసే సందర్భంగా మారుస్తుంది. మునుపటి సంభాషణలో, మన ప్రభువు తన అనుచరులకు శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు. శిష్యులు ఆ సూటి ప్రకటనను పట్టుకున్నారు మరియు ఇతరులు కష్టమైన బోధలపై దృష్టి సారించి, ఆయనను విడిచిపెట్టినప్పటికీ, ఆయనకు కట్టుబడి ఉండాలని నిశ్చయించుకున్నారు.
క్రీస్తు బోధనలు నిత్యజీవానికి సంబంధించిన సందేశాన్ని ఏర్పరుస్తాయి, కాబట్టి మనం జీవితంలో మరియు మరణం రెండింటిలోనూ వాటికి కట్టుబడి ఉండాలి. క్రీస్తును విడిచిపెట్టడం అంటే మన స్వంత ఆశీర్వాదాలను విడిచిపెట్టడం. యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయ అని, సజీవ దేవుని కుమారుడని శిష్యులు విశ్వసించారు. వెనుదిరగడానికి లేదా వెనుదిరగడానికి టెంప్టేషన్ ఎదురైనప్పుడు, ప్రాథమిక సూత్రాలను గుర్తుకు తెచ్చుకోవడం మరియు వాటికి స్థిరంగా కట్టుబడి ఉండటం తెలివైన పని.
మన ప్రభువు యొక్క పరిశీలనాత్మక ప్రశ్నను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం: "నువ్వు కూడా వెళ్లి నీ విమోచకుడిని విడిచిపెడతావా?" మనం ఇంకా ఎవరిని ఆశ్రయించగలం? ఆయన మాత్రమే పాప క్షమాపణ ద్వారా మోక్షాన్ని అందించగలడు. ఈ హామీ ఆత్మవిశ్వాసాన్ని, ఓదార్పుని మరియు ఆనందాన్ని తెస్తుంది, భయం మరియు నిరుత్సాహాన్ని దూరం చేస్తుంది. ఇది ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆనందాన్ని భద్రపరుస్తుంది మరియు తదుపరి ఆనందానికి మార్గం సుగమం చేస్తుంది.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |