Acts - అపొ. కార్యములు 2 | View All

1. పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.
లేవీయకాండము 23:15-21, ద్వితీయోపదేశకాండము 16:9-11

“పెంతెకొస్తు”అంటే “యాభైయో” అని అర్థం. ఇది ఇస్రాయేల్‌వారి పండుగలలో ఒకటి. దీన్ని “వారాల పండుగ” కూడా అన్నారు (లేవీయకాండము 23:15-21 నోట్స్‌). పస్కా పండుగ తరువాత యాభై రోజులకు ఇది వచ్చేది. ఇది కోతకాలం మహోత్సవం. పవిత్రాత్మ ఆ రోజునే వచ్చి ప్రజలకు పశ్చాత్తాపం, నమ్మకం కలిగించి వారిని క్రీస్తు దగ్గరికి తేవడం అనే గొప్ప కోత ఆరంభించడం తగిన విషయమే. ఆయన కోసం ఎదురు చూస్తున్న శిష్యులను ఆవరించడానికి దేవుని ఆత్మ వచ్చిన ఆ ప్రత్యేకమైన పెంతెకొస్తు దినం చరిత్ర అంతట్లోకి మహా గొప్ప దినాలలో ఒకటి. మనుషుల మధ్య దేవుని పనిలో అది కొత్త ఆరంభం. ఆ దినాన ఓ కొత్త యుగం – కృప యుగం, పవిత్రాత్మ యుగం – ఆరంభమైంది. క్రీస్తు శుభవార్త భూదిగంతాల వరకు వెళ్ళవలసిన కాలం ఆ రోజునే మొదలయింది. మొదలయిందని సూచించే అపురూపమైన వింతలకు దేవుడు అనుగ్రహించాడు. ఇది ఆశ్చర్యకరమైన సంగతి కాదు. దీన్ని ధర్మశాస్త్ర యుగారంభంతో పోల్చి చూడండి (నిర్గమకాండము 19:16-19).

2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.

గ్రీకు భాషలో (హీబ్రూలో లాగానే) గాలికి, ఊపిరికి, ఆత్మకు ఒకే పదం వాడారు. కాబట్టి గాలి దేవుని ఆత్మకు సూచనగా కావడం సహజమే (యోహాను 3:8; యెహెఙ్కేలు 37:9-14). పవిత్రాత్మ గాలి ధ్వనితో రావడం తగిన విషయమే.

3. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

మంటలు దేవుని సన్నిధికి సూచన అని యూదులు అనేక శతాబ్దాల నుంచి గుర్తించారు (నిర్గమకాండము 3:2 నోట్ చూడండి). మంటల్లాంటి ఈ నాలుకలు కనిపించడం ప్రతి శిష్యుడికీ దేవుని ఆత్మ ఇతర శిష్యులందరితో ఉన్నాడని గుర్తుగా ఉంది. అవి వారి ముఖ్యమైన పని ఏమై ఉంటుందో దానికి సూచనగా ఉన్నాయి కూడా. వారు దేవుని కోసం మాట్లాడేవారు (అపో. కార్యములు 1:8). సరిగా మాట్లాడేందుకు వారి శక్తిసామర్థ్యాలు దేవాత్మ మూలంగా కలుగుతాయని కూడా అవి సూచనలని చెప్పవచ్చు. పవిత్రాత్మ రాకడ యేసుప్రభువు చెప్పిన మాటల నెరవేర్పు (అపో. కార్యములు 1:4-5; లూకా 24:49; యోహాను 14:16-17, యోహాను 14:26; యోహాను 16:6).

4. అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

“పవిత్రాత్మతో నిండిపోయారు”– అపో. కార్యములు 1:5; ఎఫెసీయులకు 5:18 నోట్స్. దేవుని ఆత్మతో నిండిపోవడం విశ్వాసులు అనుభవించవలసిన ప్రాముఖ్యమైన విషయం. పెంతెకొస్తు దినాన కనిపించిన సూచనలు ముఖ్యమైనవి కావు. తనకు ఇష్టం వచ్చినట్టు దేవుడు సూచనలను ఇవ్వవచ్చు. ఇవ్వకపోవచ్చు. అయితే తనను వెదికేవారికి ఆయన తన పవిత్రాత్మ సంపూర్ణతను తప్పక ఇస్తాడు (వ 39; లూకా 11:13). పెంతెకొస్తు దినాన కనిపించిన సూచనల కోసం వెదకాలని దేవుడు ఎప్పుడూ ఎక్కడా ఆదేశించలేదు (మత్తయి 12:38-39 పోల్చి చూడండి). కానీ తన ఆత్మతో మనం నిండిపోవాలని మాత్రం ఆజ్ఞాపిస్తున్నాడు. సూచనలు లేకపోతే మనం పవిత్రాత్మతో నిండిపోయామని మనం తెలుసుకోవడం సాధ్యమా? అవును, సాధ్యమే. విశ్వాసం మూలంగా, అంటే దేవుని వాగ్దానాలపై ఆధారపడే విశ్వాసం మూలంగా తెలుసుకోగలం (1 యోహాను 5:14-15; మార్కు 11:24). ఆ తరువాత మన అనుభవం మనం దేవాత్మతో నిండిపోయామని స్థిరపరుస్తుంది. ఆ రోజున శిష్యులు చేసినట్టు “ఇతర భాషలతో మాట్లాడడం” అనేదాని అర్థం కోసం వ 11 నోట్ చూడండి.

5. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.

ఈ భక్తిపరులైన యూదులు యూదయ నివాసులు (వ 9), లేదా ఇతర దేశాలలో నివసించాక జెరుసలంలో ఉండడానికి వచ్చిన యూదులు, లేదా పస్కా పెంతెకొస్తు పండుగల సమయంలో జెరుసలం దర్శించిన యూదులు. ఈ వచనాలలో 15 వేరువేరు దేశాలు కనబడుతున్నాయి. అవి తూర్పున ప్రస్తుత ఇరాన్ దేశం నుంచి పశ్చిమాన రోమ్ వరకు వ్యాపించిన దేశాలు. ఆ రోజున జెరుసలంలో సమకూడిన యూదులు రెండు రకాలు. కొందరు “కలవరపడ్డారు” (వ 6), ఆశ్చర్యంతో నిండిపోయారు (వ 7), విస్తుపోయారు (వ 12). అసాధారణమైనది, అద్భుతమైనది ఏదో జరుగుతున్నదని వారికి తెలిసింది గాని అదేమిటో వారు ఊహించ లేకపోయారు. మరి కొందరు దాని గురించి తమకు అంతా తెలుసుననుకొన్నా (వ 13). వారు కొత్తది, అసాధారణమైనది ఏదైనా జరిగితే నవ్వుతూ దాన్ని తిరస్కరించే రకం. ప్రతిదాని గురించి వివరణ చెప్పగలమని భావించే రకం. అది మానవ చరిత్ర అంతట్లోకీ మహోదయం. వారు చేయగలిగినదంతా ఎగతాళి చేయడం. ప్రతి తరంలోనూ పవిత్రాత్మతో నిండినవారు ఈ రెండు రకాల వారినీ చూస్తారు.

6. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.

7. అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?

గలలీలో నివసించే యూదులు మాట్లాడే రీతిని బట్టి వారు గలలీవారని ఇతర యూదులకు తెలిసింది (మార్కు 14:70).

8. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?

10. కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,

11. క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.

“మన సొంత భాషలలో”– ఇది మూడు సార్లు చెప్పిన మాట (వ 6,8). శిష్యులు ఎన్నడూ నేర్చుకోని విదేశీ భాషలలో మాట్లాడడానికి దేవుడు వారికి తక్షణమే సామర్థ్యం ఇచ్చాడు. వారి మాటలు విన్నవారు వాటిని అర్థం చేసుకోగలిగారు (శిష్యులు వాటిని అర్థం చేసుకోగలిగారో లేదో ఆ సంగతి రాసిలేదు). ఈ భాషలు ఏ జాతికీ తెలియని భాషలు కావు. పవిత్రాత్మ బాప్తిసం, లేక సంపూర్ణతతో తప్పక కనబడే సూచన ఇదే అయితే మన కాలంలో, సంఘ చరిత్ర అంతట్లో ఈ సూచన కనబడడం చాలా అరుదు అని మనం చెప్పాలి. కానీ సూచనల గురించి వ 4 నోట్ చూడండి. భాషలలో మాట్లాడడం గురించి అపో. కార్యములు 10:46; అపో. కార్యములు 19:6; 1 కోరింథీయులకు 12:10, 1 కోరింథీయులకు 12:28, 1 కోరింథీయులకు 12:30; 1 కోరింథీయులకు 13:1, 1 కోరింథీయులకు 13:8; 1 కోరింథీయులకు 14:5-6, 1 కోరింథీయులకు 14:18, 1 కోరింథీయులకు 14:21-23, 1 కోరింథీయులకు 14:39 నోట్స్ చూడండి.

12. అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

13. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.

మద్యంతో మత్తుగా ఉన్నారని శిష్యులను నిందించడం ఒక విధంగా అర్థవంతమైనదే. మత్తుగా ఉండడం అంటే మద్యం ఆధీనంలో ఉండడం. శిష్యులు పవిత్రాత్మ ఆధీనంలో ఉన్నారు. వారి ప్రవర్తనను జనసమూహం సాధారణమైనదిగా భావించినట్టు లేదు. ఎఫెసీయులకు 5:18 పోల్చి చూడండి. మామూలు ప్రవర్తన అని ప్రజలు అనుకొన్నదానికంటే పవిత్రాత్మ సంపూర్ణత దేవుని పిల్లలను ఎంతో ఉన్నతంగా హెచ్చిస్తుంది.

14. అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.

యేసు ఈ లోకంలో ఉన్నప్పటిలాగే క్రీస్తురాయబారుల తరఫున పేతురు మాట్లాడేవాడు. ఈ కొత్త యుగంలోని మొదటి ప్రసంగం ఈ వచనంతో ఆరంభమవుతున్నది. దీని ముఖ్యాంశాలు పవిత్రాత్మ, యేసు క్రీస్తు మరణం, పునర్జీవితం, ఉన్నత స్థానం పొందడం.

15. మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.

దేవుని భయం ఉన్న యూదులు ఉదయ కాలాన ద్రాక్షరసం తాగేవారు కాదు. మాంసం తింటేనే తప్ప ద్రాక్షమద్యం తాగరు. సాయంకాల సమయంలోనే మాంసం తినేవారు.

16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా

17-21 వచనాలు యోవేలు 2:28-32 నుంచి తీసినవి (అయితే వ 32లోని ఆఖరు భాగం విడిచిపెట్టబడింది). “ఈ విధంగా నెరవేరుతూ ఉంది” అంటే తన ఆత్మను పంపుతానని దేవుడు చేసిన వాగ్దానం పెంతెకొస్తు దినాన నెరవేర్చాడు.

17. అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ ¸యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.
యోవేలు 2:28-32

“చివరి రోజుల్లో” అనే మాటలు యోవేలు గ్రంథంలో లేవు. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో కొన్ని సార్లు చివరి రోజులంటే క్రీస్తు మొదటి రాకడనుంచి ఆయన రెండో రాకడవరకు ఉన్న కాలమంతా – హెబ్రీయులకు 1:2; యాకోబు 5:2; 1 పేతురు 1:20; 2 పేతురు 3:3; 1 యోహాను 2:18 (“చివరి ఘడియ”); యూదా 1:18 (“చివరి కాలం”). తన ఆత్మను “సర్వప్రజల మీద” కుమ్మరిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. పెంతెకొస్తు దినాన జరిగినది కొంతవరకే ఈ మాట నెరవేర్చింది. ఎందుకంటే అప్పుడు యూదులూ యూద మతం అవలంబించినవారు మాత్రమే పవిత్రాత్మను పొందారు. ఇంకా కొంత నెరవేర్పు అపో. కార్యములు 8:17; అపో. కార్యములు 10:44-45; అపో. కార్యములు 19:6 లో కనబడుతుంది. క్రీస్తు శుభవార్త ప్రకటన లోకంలో వ్యాపిస్తూ ఉండగా ఇంకా వేరువేరు దేశాలవారు దేవుని ఆత్మను పొందారు. ఈ యుగం ముగిసేవరకూ ఇలా సాగుతూ ఉంటుంది (వ 20). “కొడుకులు”, “కూతుళ్ళు”, “యువకులు”, “ముసలివారు” ఏ భేదం లేకుండా ఆత్మను పొందుతారు. “దేవుని మూలంగా పలుకుతారు” అనేదాని గురించిన నోట్స్ సంఖ్యాకాండము 11:25; మొ।।. దర్శనాలు, కలల గురించిన నోట్స్ అపో. కార్యములు 18:9-10; ఆదికాండము 15:1; సంఖ్యాకాండము 12:6.

18. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.

“నా సేవకుల మీద”– దేవుడు తన ఆత్మను లోకమంతటికీ ఇవ్వడు. తనను నమ్మి అలా తన సేవకులైనవారికే ఇస్తాడు. యోహాను 14:17 చూడండి.

19. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.

20. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.

“ప్రభు...దినం”– ఇది ఈ యుగ సమాప్తంలో ఆరంభం అవుతుంది. ఆ కాలంలో క్రీస్తు రెండో రాకడ జరుగుతుంది. యెషయా 13:6-13; యోవేలు 1:15; 1 థెస్సలొనీకయులకు 5:2; 2 థెస్సలొనీకయులకు 2:2; 2 పేతురు 3:10 నోట్స్ చూడండి. సూర్యమండలంలో చంద్రబింబంలో ఉన్న సూచనలు ఆ దినాన కనబడుతాయని యెషయా 13:9-10; మత్తయి 24:29-30; ప్రకటన గ్రంథం 6:12-17 వెల్లడి చేశాయి. ఇక్కడ 19వ లోని సూచనలు ప్రకటన గ్రంథం 8:7-8, ప్రకటన గ్రంథం 8:10; ప్రకటన గ్రంథం 9:2, ప్రకటన గ్రంథం 9:17-18; ప్రకటన గ్రంథం 16:3-4, ప్రకటన గ్రంథం 16:8 లో కనిపిస్తాయి. ఇక్కడ అపొ కా గ్రంథంలోని సందర్భాన్ని బట్టి చూస్తే వ 17,18లో వర్ణించబడిన పవిత్రాత్మ కార్యం ప్రభు దినం ఆరంభమయ్యే వరకు సాగుతూ ఉంటుందని చెప్పవచ్చు.

21. అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.

యెషయా 55:6-7; రోమీయులకు 10:12-13; 1 కోరింథీయులకు 1:2 చూడండి. ఇక్కడ “ప్రభువు పేర ప్రార్థన చేయడం” అంటే పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయనవైపు తిరిగి పాపవిముక్తి, రక్షణ ప్రసాదించమని ఆయనను ప్రాధేయపడడం. పేతురు తాను ఏ ప్రభువును గురించి మాట్లాడుతున్నాడో వెంటనే తరువాతి వచనాలలో స్పష్టం చేశాడు. యోవేలులో యెహోవా అనే పేరు ఉంది. అయితే పేతురు ప్రభువైన యేసును సూచిస్తున్నాడు (వ 38). యేసు యెహోవా అవతారమని క్రొత్త ఒడంబడికలో ఉన్న అనేక సూచనలలో ఇది ఒకటి. లూకా 2:11 నోట్‌లో రిఫరెన్సులను చూడండి.

22. ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందిన వానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.

14-21 వచనాలలోనిది 12,13 వచనాలలో ఉన్న ప్రశ్నల గురించిన వర్ణన. ఇప్పుడు పేతురు తన సందేశంలోని ముఖ్యాంశాన్ని ప్రకటించసాగుతున్నాడు. క్రీస్తు అతణ్ణి సాక్షిగా నియమించాడు (అపో. కార్యములు 1:8); ఈ పనికోసం పవిత్రాత్మ అతనికి బలప్రభావాలు కలిగించాడు (అపో. కార్యములు 2:4). ఇప్పుడు అతడు సాక్ష్యం చెపుతున్నాడు. అతని మాటలు క్రీస్తు విషయాలతో నిండి ఉన్నాయి. పేతురు ఆయన సంగతితో ఆరంభించాడు, ఆయన సంగతితో ముగించాడు. నజరేతువాడైన యేసు యోగ్యుడని దేవుడు వెల్లడి చేశాడు (యోహాను 5:36; యోహాను 10:37-38). అద్భుతాల గురించి యోహాను 2:11; మత్తయి 8:1 నోట్స్ చూడండి.

23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.

యేసుప్రభువు మనుషుల పాపాలకోసం బలిగా సిలువ మరణం అనుభవించాలనే ఉద్దేశంతో దేవుడు ఆయనను లోకానికి పంపాడు (మత్తయి 20:28; మత్తయి 26:27-28; యోహాను 1:29; యోహాను 3:14-16; యోహాను 6:51; యోహాను 10:11). అయినా ఆయనను సిలువ వేసినది దుర్మార్గులైన మనుషులే. వారు దాని గురించి దోషులయ్యారు.

24. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
2 సమూయేలు 22:6, కీర్తనల గ్రంథము 18:4, కీర్తనల గ్రంథము 116:3

మత్తయి 28:6. మరణం యేసుప్రభువును బంధించివుంచడం ఎందుకు అసాధ్యం అంటే అలా జరగకూడదని దేవుని ఏర్పాటు. తండ్రి అయిన దేవుడు మరణం మీద ఆయనకు అధికారం ఇచ్చాడు (యోహాను 10:17-18).

25. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను.
కీర్తనల గ్రంథము 16:8-11

ఇక్కడ పేతురు ఈ సత్యాన్ని బయలు పరుస్తున్నాడు – క్రీస్తు మరణంనుంచి సజీవంగా లేవడం అనేది కీర్తనల గ్రంథము 16:8-11 నెరవేర్పు (అక్కడ నోట్స్ చూడండి). క్రీస్తు అలా లేవకపోతే ఆ లేఖనాలు అర్థం లేనివై ఉండేవి. ఇది కూడా అసాధ్యం (యోహాను 10:35; మత్తయి 5:17-18).

26. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.

27. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.

28. నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు

29. సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను;
1 రాజులు 2:10

కీర్తనల గ్రంథము 16:8-11 దావీదు విషయంలో నెరవేరలేదని పేతురు వర్ణిస్తున్నాడు. దావీదు మరణంనుంచి లేవలేదు (1 రాజులు 2:10-12).

30. అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరెగి,
2 సమూయేలు 7:12-13, కీర్తనల గ్రంథము 132:11, యిర్మియా 30:9

2 సమూయేలు 7:8-16; కీర్తనల గ్రంథము 89:3-4, కీర్తనల గ్రంథము 89:20-37. దావీదు గొప్ప ప్రవక్త. అతడు రాసిన కీర్తనలలో పవిత్రాత్మ ఆవేశం మూలంగా క్రీస్తును గురించి అనేక సంగతులను ముందుగానే తెలియజేశాడు (లూకా 24:44). ప్రవక్తను గురించిన నోట్ ఆదికాండము 20:7.

31. క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.
కీర్తనల గ్రంథము 16:10

32. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.

“సాక్షులం”– అపో. కార్యములు 1:8.

33. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు.

ఎఫెసీయులకు 1:19-21; ఫిలిప్పీయులకు 2:9-11. కుడివైపు గౌరవ స్థానం. “పవిత్రాత్మ”– యోహాను 14:16-17, యోహాను 14:26. యేసుప్రభువు పవిత్రాత్మను ఎప్పుడు, ఎక్కడ కుమ్మరించాలని ఇష్టపడతాడో అప్పుడు, అక్కడ ఇంకా కుమ్మరిస్తున్నాడు. ఆ అధికారం ఆయనకుంది (మత్తయి 28:18; యోహాను 17:2).

34. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు
కీర్తనల గ్రంథము 110:1

35. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
కీర్తనల గ్రంథము 110:1

36. మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

పేతురు ఎత్తి చెప్పిన పాత ఒడంబడిక వచనాలు యేసు ఇస్రాయేల్‌ప్రజల అభిషిక్తుడనీ ప్రభువనీ తెలియజేస్తున్నాయి. దేవుడు తన సొంత కుమారుణ్ణి, తన దైవిక స్వభావం గలవాణ్ణి (యోహాను 1:1) అభిషిక్తుడుగా, ఇస్రాయేల్‌ప్రజల యజమానిగా నియమించాడు. యేసును నిరాకరించి సిలువ వేసిన ఆ జాతికి పేతురు తెచ్చిన ఆశ్చర్యకరమైన సందేశం ఇదే.

37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా

అపో. కార్యములు 16:29-30. పవిత్రాత్మ ఆ యూదుల మనసులలో అంతర్వాణులలో పని చేస్తూ ఈ ఫలితాన్ని కలిగించాడు. ఈ రోజుల్లో కూడా ఆయన ఇలా పని చేస్తున్నాడు. ఆయన ఒక్కడే ఇలా చేయగలడు. యోహాను 16:7-11 చూడండి. వారి మాటలు పశ్చాత్తాపాన్ని సూచిస్తున్నాయి.

38. పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

పశ్చాత్తాపం, బాప్తిసం గురించిన నోట్స్ మత్తయి 3:2, మత్తయి 3:6; మార్కు 16:16; లూకా 13:3. యోహాను ఇచ్చిన బాప్తిసం లాగా కాక క్రైస్తవ బాప్తిసం యేసు పేరుతో, పవిత్రాత్మ అనే దేవుని ఉచిత వరంతో సంబంధం గలది. అపో. కార్యములు 19:5 కూడా చూడండి. పాపక్షమాపణ కావాలంటే బాప్తిసం తప్పకుండా తీసుకోవాలని పేతురు ఉపదేశించడం లేదు. క్షమాపణ మనుషులు చేయగల ఏ క్రియమీదా, ఏ ఆచారం, ఏ సంస్కారం మీదా ఆధారపడదని అతనికి బాగా తెలుసు. క్షమాపణ దేవుని కృపమూలంగానే కలుగుతుంది, నమ్మకంద్వారానే కలుగుతుంది. క్షమాపణ గురించి మత్తయి 6:12; మత్తయి 9:5-7; మత్తయి 12:31; మత్తయి 18:23-25; ఎఫెసీయులకు 1:7; 1 యోహాను 1:9; యెషయా 55:7 నోట్స్ చూడండి. ఇక్కడ పేతురు మాటల భావం స్పష్టంగా ఉంది. ఈ మాటలలో ఆ భావాన్ని చెప్పవచ్చు – “యేసును గురించి మీరు మనసు మార్చుకొని, ఆయనను ఇస్రాయేల్ అభిషిక్తుడుగా, దేవుని కుమారుడుగా నిరాకరించిన పాపంనుంచి మళ్ళుకొని ఆయనను స్వీకరించండి. ఆయన పేర, అంటే ఆయన స్వభావం, పదవి, అధికారం ప్రకారంగా, ఆయనలో ఉన్న మీ నమ్మకానికి బహిరంగ సూచనగా బాప్తిసం పొందండి. అది తనమీద నమ్మకముంచినవారికి ఆయన ఉచితంగా ఇచ్చే పాపక్షమాపణకు కూడా సూచనగా ఉంటుంది”. పాప క్షమాపణ కోసం బాప్తిసం పొందడం పాపక్షమాపణ దొరికేలా బాప్తిసం పొందడమని అర్థం కాదు. ఈ వచనం మత్తయి 3:11 తో పోల్చి చూడండి. యోహాను బాప్తిసం ఇచ్చిన కారణం ప్రజలు పశ్చాత్తాప పడినందువల్లే. “యేసుక్రీస్తు పేర” బాప్తిసం అంటే ప్రభువుగా అభిషిక్తుడుగా ఉన్న ఆయన అధికారం చొప్పున బాప్తిసం (వ 36). విశ్వాసులకు బాప్తిసమిస్తూ ఉన్నప్పుడు ఇచ్చేవారు పలకవలసిన మాటలను పేతురు ఇక్కడ ఇవ్వడం లేదు. మత్తయి 28:19 పోల్చి చూడండి. దేవుడు పవిత్రాత్మను ఉచితంగా, కృపావరంగా ఇస్తాడని గమనించండి. యోహాను 7:37-39; యోహాను 14:16-17; గలతియులకు 3:2 పోల్చి చూడండి. అపో. కార్యములు 10:44-48 చూడండి. కొర్నేలి, అతనితో ఉన్నవారు బాప్తిసం పొందకముందే పవిత్రాత్మను (పాపక్షమాపణను కూడా) పొందారు.

39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
యోవేలు 2:32

దేవుడు తన ఆత్మను గురించిన వాగ్దానం మొదట యూదులకు చేశాడు గానీ అది అంతటా ఉన్న ప్రజలందరికోసం. దేవుడు పిలిచిన సంగతి గురించి మత్తయి 9:13; రోమీయులకు 8:28-30; 1 కోరింథీయులకు 1:9, 1 కోరింథీయులకు 1:24, 1 కోరింథీయులకు 1:26; గలతియులకు 5:13; ఎఫెసీయులకు 4:1, ఎఫెసీయులకు 4:4; కొలొస్సయులకు 3:15; 2 థెస్సలొనీకయులకు 2:14; 1 తిమోతికి 6:12; హెబ్రీయులకు 9:15; 1 పేతురు 2:9, 1 పేతురు 2:20.

40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.
ద్వితీయోపదేశకాండము 32:5, కీర్తనల గ్రంథము 78:8, కీర్తనల గ్రంథము 89:3-4

వాక్కు పరిచర్య చేస్తూ దేవాత్మతో నిండిన, నమ్మకమైన బోధకుని పనిని చూశారా? క్రీస్తును గురించిన సత్యాలను వారి ఎదుట పెట్టడం సరిపోదని పేతురుకు తెలుసు. క్రీస్తును తిరస్కరించడంలో ఎంతో అపాయం ఉందని హెచ్చరించి ఆయనను స్వీకరించాలని వారిని బతిమాలాడు. ప్రతి తరం “వక్ర బుద్ధులైన తరం”. ప్రజలను హెచ్చరించి బతిమాలవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది.

41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.

పేతురు ఇచ్చిన సందేశాన్ని అంగీకరించడం అంటే వారు యేసుప్రభువులో నమ్మకముంచి ఆయనను ప్రభువుగా, అభిషిక్తుడుగా, పాపవిముక్తి ప్రధాతగా స్వీకరించారని అర్థం (వ 36,38). నమ్మడం ద్వారా పాపక్షమాపణ, శాశ్వత జీవం కలిగి (యోహాను 3:16, యోహాను 3:36; యోహాను 5:24; యోహాను 6:47) తాము నమ్మిన సంగతికి బహిరంగ సూచనగా బాప్తిసం పొందారు. అలా చేసిన ఈ 3000 మంది జెరుసలంలో క్రీస్తును తిరస్కరించి సిలువ వేసిన నాయకుల మధ్య ఉన్నారు. అయినా వారు నమ్మి బాప్తిసం పొందారు. క్రీస్తు మరణం నుంచి లేచాడని రుజువులు అంత సంపూర్ణంగా, తేటగా ఉన్నాయన్నమాట. పవిత్రాత్మ ద్వారా రాయబారులు చెప్పిన సాక్ష్యం అంత శక్తివంతంగా ఉందన్న మాట.

42. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.

“రొట్టె విరవడం”– బహుశా ప్రభు రాత్రిభోజనం ఆచరించడమని అర్థం. వ 46; 1 కోరింథీయులకు 11:17-26 చూడండి. “ప్రార్థన”– దీని కంటే ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ అవసరమైనదీ ప్రాముఖ్యమైనదీ మరేదైనా ఉందా? (లూకా 18:1; ఎఫెసీయులకు 6:18; ఫిలిప్పీయులకు 4:6-7; 1 థెస్సలొనీకయులకు 5:17-18; యూదా 1:20). “చేయడంలో ఎడతెగక ఉన్నారు”– వారి నమ్మకం వాస్తవమైనదని ఇది రుజువు. మత్తయి 7:17-27; యోహాను 15:1-8; 1 కోరింథీయులకు 15:1-2; కొలొస్సయులకు 1:23; హెబ్రీయులకు 3:6, హెబ్రీయులకు 3:14 నోట్స్ చూడండి. ఆ విశ్వాసులు ఏ విషయాలలో నిమగ్నులై ఉన్నారో చూడండి. అవి నాలుగు. శుభవార్తను విని దాన్ని నమ్మామని చెప్పి తమ సొంత మార్గాలకు వెళ్ళడం వారికి తృప్తి అనిపించలేదు. రాయబారులకు కూడా అది తృప్తి అనిపించలేదు. వారు ఇతరులను శిష్యులుగా చేసి వారికి ఉపదేశం ఇవ్వాలని యేసు ఆదేశించాడు (మత్తయి 28:18-20). ఇక్కడ వారు అలా చేయడం కనిపిస్తున్నది. విశ్వాసులను స్థానిక సంఘంగా కూడగడుతూ యేసుప్రభు కృపలో, జ్ఞానంలో పెరిగేలా వారికి అవకాశమిస్తూ ఉన్నారు రాయబారులు. “రాయబారుల ఉపదేశం” క్రీస్తు ఇవ్వండని వారికిచ్చిన ఉపదేశం. క్రొత్త ఒడంబడిక గ్రంథమంతా దానితో నిండివుంది. క్రైస్తవ ఎదుగుదలకు, సేవ అభివృద్ధికి సహవాసం – క్రీస్తుతోను ఆయన ప్రజలతోను సహవాసం – కూడా చాలా అవసరం (1 కోరింథీయులకు 1:9; ఫిలిప్పీయులకు 2:1; ఫిలిప్పీయులకు 3:10; 1 యోహాను 1:3, 1 యోహాను 1:6-7). సహవాసం అంటే మనసులో, హృదయంలో ఉన్నవాటిని ఇతరులకు బయట పెట్టడం, వారితో సేవలో, క్రైస్తవ పోరాటాలలో, కష్టాలలో, సంతోషాలలో పాల్గొనడం (రోమీయులకు 12:15-16), క్రీస్తులాగా ప్రేమించడం (యోహాను 13:34), క్రీస్తును గురించిన విషయాలను వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడడం (ఎఫెసీయులకు 5:19). 1 యోహాను 1:3 నోట్ చూడండి.

43. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.

దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో తన ప్రజలకు తోడుగా ఉన్నాడు. ఈ పరిస్థితి ఎప్పుడూ ప్రజలకు భయం కలిగిస్తుంది. రాయబారులు ప్రకటించిన సత్యాలను స్థిరపరచడానికి దేవుడు ఈ అద్భుతాలను కలిగించాడు (హెబ్రీయులకు 2:3-4). లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతాలు చేసిన యేసుప్రభువు తానే ఇంకా తన రాయబారులతో ఉంటూ తన పని సాగిస్తున్నాడని ఈ అద్భుతాలు సూచించాయి (అపో. కార్యములు 1:1-2). అద్భుతాలు, సూచకమైన క్రియల గురించి మత్తయి 8:1; యోహాను 2:11 నోట్స్ చూడండి.

44. విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచు కొనిరి.

ఇది స్వేచ్ఛాపూర్వకమైన ప్రేమ ప్రదర్శనం (అపో. కార్యములు 4:32-35). ఇలా చేయాలని ఎవరూ ఆజ్ఞాపించలేదు. అపో. కార్యములు 5:1-4 పోల్చి చూడండి. దీనికి కమ్యూనిజంతో సంబంధం ఏమీ లేదు. కమ్యూనిస్టు దేశాలలో ప్రజలు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా, ఇష్టపడ్డా, ఇష్టపడకపోయినా, కొందరు నాయకులు వారి మీద కఠినంగా ప్రభుత్వం చేస్తారు. ఈ విశ్వాసులు చేసినది వేరు సంగతి. క్రీస్తులో తమ ఐక్యతను వారు ప్రదర్శిస్తున్నారు. ఈ ఐక్యతను దేవుని ఆత్మ కలిగించాడు. యోహాను 17:20-23; 1 కోరింథీయులకు 12:12-13 చూడండి.

45. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.

46. మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై

వారికి గుడి గానీ ఆరాధనకోసం ఏ కట్టడం గానీ లేదు గనుక వీలున్న చోట్ల సమకూడేవారు. ఈ ఆసక్తిగల విశ్వాసులకు వారానికొక సారి సమకూడడం చాలలేదు. ఇంకా ఇంకా దేవుని వాక్కు విందామనీ ప్రార్థన చేద్దామనీ సహవాసం చేద్దామనీ ఆశించేవారు. అదంతా యథార్థంగా సంతోషంగా ఉన్నవారి అంతరంగంలోనుంచి వచ్చింది. వారి అంతరంగ స్థితిని బట్టి ఊపిరి తీయడం ఎంత సహజమో దేవుణ్ణి స్తుతించడం అంత సహజం. స్తుతించడం గురించి కీర్తనల గ్రంథము 33:1-3 నోట్స్ చూడండి. క్రీస్తుసంఘంలో లేనివారు వారి యథార్థతను, ప్రేమను చూచి వారిని అభిమానించారు. ప్రతిరోజూ ప్రజలలో కొందరు యేసుప్రభువుమీద నమ్మకముంచి విశ్వాసుల సహవాసంలో చేరడం ఆశ్చర్యం కాదు. ఆనాటి విశ్వాసులలాగా మనం ఉంటే మన రోజుల్లో కూడా అలా జరగదా?

47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Acts - అపొ. కార్యములు 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ అవరోహణ. (1-4) 
వారి గురువు వారితో ఉన్నప్పుడు, గొప్పతనం కోసం పోటీ పడుతున్నప్పుడు శిష్యుల మధ్య తరచుగా జరిగే గొడవలను మనం విస్మరించకూడదు. అయితే ఈ వివాదాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇటీవల, వారు తరచుగా కలిసి ప్రార్థనలు చేశారు. పైనుండి ఆత్మ కుమ్మరించబడాలని మనం కోరుకుంటే, మనం పూర్తిగా సామరస్యంగా ఉండనివ్వండి. శిష్యుల మధ్య భిన్నాభిప్రాయాలు మరియు అభిరుచులు ఉన్నప్పటికీ, మనం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కట్టుబడి ఉందాం, ఎందుకంటే సోదరులు ఎక్కడ ఐక్యంగా జీవిస్తారో, ప్రభువు తన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాడు. శక్తివంతమైన, పరుగెత్తే గాలి ప్రజల మనస్సులపై మరియు తత్ఫలితంగా ప్రపంచంపై దేవుని ఆత్మ యొక్క శక్తివంతమైన ప్రభావం మరియు కార్యాచరణను సూచిస్తుంది. ఆత్మ యొక్క నమ్మకాలు అతని సుఖాలకు మార్గం సుగమం చేస్తాయి మరియు ఆశీర్వదించబడిన గాలి యొక్క బలమైన గాలులు ఆత్మను దాని సున్నితమైన మరియు ఓదార్పు గాలుల కోసం సిద్ధం చేస్తాయి.
క్రీస్తు గురించి జాన్ ది బాప్టిస్ట్ జోస్యం ప్రకారం, "అతను మీకు పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు." అగ్ని వలె, ఆత్మ హృదయాన్ని కరిగిస్తుంది, మలినాలను ప్రక్షాళన చేస్తుంది మరియు ఆత్మలో భక్తి ప్రేమలను వెలిగిస్తుంది, ఇక్కడ బలిపీఠంపై ఉన్న అగ్ని వలె ఆధ్యాత్మిక త్యాగాలు అర్పిస్తారు. వారందరూ మునుపటి కంటే పరిశుద్ధాత్మతో సమృద్ధిగా నింపబడ్డారు, ఆత్మ యొక్క కృపతో సుసంపన్నం అయ్యారు మరియు అతని పవిత్రీకరణ ప్రభావాలలో ఎక్కువగా ఉన్నారు. వారు ఈ ప్రపంచం నుండి మరింత విడిపోయారు మరియు తదుపరి దానితో మరింత పరిచయం అయ్యారు. వారి హృదయాలు ఆత్మ యొక్క సౌఖ్యాలతో పొంగిపోయాయి, క్రీస్తు ప్రేమలో మరియు స్వర్గం యొక్క నిరీక్షణలో గతంలో కంటే ఎక్కువ ఆనందించారు. వారి బాధలు, భయాలు అన్నీ ఈ పొంగిపొర్లాయి. వారు కూడా పరిశుద్ధాత్మ యొక్క బహుమతులతో నింపబడ్డారు, సువార్తను ముందుకు తీసుకెళ్లే అద్భుత శక్తులను కలిగి ఉన్నారు. వారు ముందుగా ఆలోచించి మాట్లాడలేదు కానీ ఆత్మ వారి మాటలను నడిపించినట్లు.

అపొస్తలులు వివిధ భాషల్లో మాట్లాడతారు. (5-13) 
బాబెల్ వద్ద ఉద్భవించిన భాషల వైవిధ్యం జ్ఞానం మరియు మతం యొక్క వ్యాప్తికి గణనీయంగా ఆటంకం కలిగించింది. క్రైస్తవ విశ్వాసాన్ని ప్రచారం చేయడానికి ప్రభువు మొదట్లో సాధనంగా ఉపయోగించిన వ్యక్తులు భాషాపరమైన అవగాహన బహుమతి లేకుండా అధిగమించలేని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ బహుమతి వారి అధికారం నేరుగా దేవుని నుండి వచ్చిందని ఒక ప్రదర్శనగా పనిచేసింది.

యూదులకు పీటర్ చిరునామా. (14-36) 
14-21
పీటర్ యొక్క ఉపన్యాసం అతని పూర్వపు తిరస్కరణ నుండి పూర్తిగా కోలుకోవడం మరియు దైవిక అనుగ్రహానికి పూర్తిగా పునరుద్ధరణను సూచిస్తుంది. ఒకప్పుడు క్రీస్తును నిరాకరించినవాడు ఇప్పుడు బహిరంగంగా ఆయనను ఒప్పుకున్నాడు. ఆత్మ యొక్క అద్భుత ప్రవాహానికి సంబంధించిన పీటర్ యొక్క కథనం శ్రోతలను క్రీస్తుపై విశ్వాసాన్ని స్వీకరించడానికి మరియు అతని చర్చితో ఏకం చేయడానికి కదిలించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానం మరియు ఆరోహణ ఫలితంగా స్క్రిప్చర్ యొక్క నెరవేర్పు, రెండింటికీ సాక్ష్యంగా పనిచేసింది.
పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ నిర్దేశించినట్లుగా మాతృభాషలో మాట్లాడినప్పటికీ, పేతురు లేఖనాలను విస్మరించలేదు. క్రీస్తు శిష్యులు తమ బైబిల్ బోధనలను ఎప్పటికీ అధిగమించరు, మరియు స్పిరిట్ లేఖనాలను అణగదొక్కడానికి కాదు, అవగాహన, ఆమోదం మరియు విధేయతను సులభతరం చేయడానికి మంజూరు చేయబడింది. నిస్సందేహంగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభువు పేరును ప్రార్థించి, పాపుల రక్షకుడిగా మరియు సమస్త మానవాళికి న్యాయాధిపతిగా అంగీకరించేవారు మాత్రమే గొప్ప రోజున శిక్ష నుండి తప్పించుకుంటారు.

22-36
క్రీస్తు వృత్తాంతాన్ని వివరిస్తూ యేసుపై ఉపన్యాసం ఇచ్చేందుకు పీటర్ పరిశుద్ధాత్మ ప్రసాదించిన బహుమతిని ఉపయోగించుకున్నాడు. ఈ ప్రసంగం క్రీస్తు యొక్క ఇటీవలి మరణం మరియు బాధల వృత్తాంతాన్ని కలిగి ఉంది, ఇది అద్భుతమైన దయ మరియు జ్ఞానంతో కూడిన దేవుని చర్యగా భావించబడింది. దైవిక న్యాయం నెరవేరడం, దేవుడు మరియు మానవాళిని మళ్లీ ఏకం చేయడం మరియు చివరికి క్రీస్తును మహిమపరచడం-మార్పులేని శాశ్వతమైన ప్రణాళిక యొక్క అభివ్యక్తి కోసం ఇది చాలా అవసరం. దీనికి విరుద్ధంగా, ప్రజల దృక్కోణం నుండి, ఈ సంఘటనలలో వారి పాత్ర ఘోరమైన పాపం మరియు మూర్ఖత్వానికి సంబంధించిన చర్యగా పరిగణించబడింది.
పీటర్ క్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క రూపాంతర ప్రాముఖ్యతపై విస్తృతంగా వివరించాడు, అతని మరణంతో సంబంధం ఉన్న అవమానాన్ని తొలగిస్తాడు. క్రీస్తు, దేవుని పవిత్రమైన మరియు నియమించబడిన పవిత్రుడిగా, విమోచన మిషన్‌కు అంకితమివ్వబడ్డాడు, అతని మరణం మరియు బాధలు విశ్వాసులందరికీ శాశ్వతమైన ఆశీర్వాద జీవితానికి ప్రవేశ ద్వారంగా ఉండేలా చూసుకున్నాడు. అపొస్తలులు సాక్షులుగా పని చేయడంతో, ఈ కీలకమైన సంఘటన ప్రవచనాలకు అనుగుణంగా జరిగింది.
ఇంకా, పునరుత్థానం ఏకైక పునాది కాదు; క్రీస్తు తన శిష్యులపై అద్భుతమైన బహుమతులు మరియు దైవిక ప్రభావాలను ప్రసాదించాడు, వారి స్పష్టమైన ప్రభావాలను చూశారు. రక్షకుని ద్వారా, సంపూర్ణమైన జీవితానికి మార్గాలు వెల్లడి చేయబడ్డాయి, దేవుని యొక్క శాశ్వతమైన ఉనికి మరియు అనుగ్రహంపై విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈ ఆశీర్వాదాలన్నీ యేసును ప్రభువుగా మరియు అభిషిక్త రక్షకునిగా దృఢంగా విశ్వసించడం నుండి ఉద్భవించాయి.

మూడు వేల మంది ఆత్మలు మారారు. (37-41) 
దైవిక సందేశం మొదటిసారిగా తెలియజేయబడిన క్షణం నుండి, అది దైవిక శక్తిని కలిగి ఉందని స్పష్టమైంది, వేలాది మంది విశ్వాస విధేయతను స్వీకరించేలా చేసింది. ఏదేమైనప్పటికీ, పేతురు యొక్క మాటలు లేదా ప్రత్యక్షమైన అద్భుతం మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క ఉనికి లేకుండా అటువంటి లోతైన ప్రభావాలను తీసుకురాలేదు. పాపులు, వారి కళ్ళు తెరిచినప్పుడు, సహజంగానే వారి పాపాల గురించి లోతైన దృఢ విశ్వాసం మరియు అంతర్గత అశాంతిని అనుభవిస్తారు.
అపొస్తలుడు వారి పాపాల కోసం బహిరంగంగా పశ్చాత్తాపపడాలని మరియు ఆయన పేరులో బాప్టిజం పొందడం ద్వారా మెస్సీయగా యేసుపై వారి విశ్వాసాన్ని ప్రకటించమని ప్రోత్సహించాడు. విశ్వాసం యొక్క ఈ బహిరంగ ప్రకటన ద్వారా, వారు తమ పాపాల క్షమాపణను పొందుతారు మరియు పవిత్రాత్మ యొక్క బహుమతులు మరియు కృపలలో పాలుపంచుకుంటారు. దుష్ట వ్యక్తుల నుండి వేరు చేయవలసిన ఆవశ్యకత వారి ప్రభావం నుండి స్వీయ-సంరక్షణకు ప్రాథమిక సాధనంగా నొక్కి చెప్పబడింది. నిజంగా పశ్చాత్తాపపడి, యేసుక్రీస్తుకు లొంగిపోయేవారు, దుర్మార్గుల నుండి విడదీయడం ద్వారా వారి నిజాయితీని ప్రదర్శించాలి, విస్మయం మరియు భక్తి భావంతో చురుకుగా దూరంగా ఉండాలి.
దేవుని దయ ద్వారా, మూడు వేల మంది వ్యక్తులు సువార్త ఆహ్వానానికి ప్రతిస్పందించారు. పవిత్రాత్మ యొక్క బహుమతి, అందరిచే స్వీకరించబడింది మరియు ప్రతి నిజమైన విశ్వాసికి అందుబాటులో ఉంటుంది, దత్తత యొక్క ఆత్మగా గుర్తించబడింది-ఇది స్వర్గపు తండ్రి కుటుంబంలోని ప్రతి సభ్యునికి సుసంపన్నం, మార్గనిర్దేశం మరియు పవిత్రం చేసే దయ. పశ్చాత్తాపం మరియు పాప క్షమాపణ యొక్క ప్రకటన కొనసాగుతుంది, విమోచకుని పేరుతో అత్యంత ఘోరమైన నేరస్థులకు కూడా ఇది విస్తరిస్తుంది. పరిశుద్ధాత్మ విశ్వాసుల హృదయాలలో ఈ ఆశీర్వాదాలను ధృవీకరిస్తూనే ఉన్నారు మరియు ప్రోత్సాహం యొక్క వాగ్దానాలు ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు విస్తరించబడ్డాయి. ఆశీర్వాదాల ఆఫర్ సమీపంలో మరియు దూరంగా ఉన్న అందరికీ తెరిచి ఉంటుంది.

శిష్యుల భక్తి మరియు ఆప్యాయత. (42-47)
ఈ శ్లోకాలలో, ఆదిమ చర్చి యొక్క ప్రారంభ రోజుల వృత్తాంతాన్ని మనం కనుగొంటాము-ఈ కాలం దాని బాల్యం ద్వారా వర్ణించబడింది మరియు లోతైన అమాయకత్వంతో గుర్తించబడింది. ఈ కమ్యూనిటీ సభ్యులు పవిత్రమైన పద్ధతులకు దగ్గరగా కట్టుబడి, భక్తి మరియు భక్తి యొక్క సమృద్ధిని ప్రదర్శిస్తారు. నిజమైన క్రైస్తవం, దాని పరివర్తన శక్తితో స్వీకరించబడినప్పుడు, సహజంగానే ఆత్మను దేవునితో సహవాసం వైపు మళ్లిస్తుంది, అక్కడ ఆయన మనల్ని కలుస్తానని వాగ్దానం చేశాడు.
ఆవిష్కృతమైన సంఘటనల పరిమాణం విశ్వాసులను ప్రాపంచిక ఆందోళనల కంటే పైకి లేపింది మరియు పరిశుద్ధాత్మ వారిని ప్రేమతో నింపాడు, అది ప్రతి వ్యక్తి ఇతరులను తమలాగే ఉన్నతంగా భావించేలా చేస్తుంది. ఈ ప్రేమ వ్యక్తిగత యాజమాన్యాన్ని రద్దు చేయడం ద్వారా కాకుండా స్వార్థాన్ని నిర్మూలించడం మరియు దాతృత్వ స్ఫూర్తిని ప్రోత్సహించడం ద్వారా మతపరమైన భాగస్వామ్యం యొక్క భావాన్ని పెంపొందించింది. ఈ సామూహిక స్ఫూర్తిని ప్రేరేపించిన దేవుడు, ఈ విశ్వాసులు యూదయాలోని వారి ఆస్తుల నుండి రాబోయే స్థానభ్రంశం గురించి ముందుగానే చూశాడు.
ప్రతిరోజూ, ప్రభువు సువార్తను స్వీకరించడానికి మరిన్ని హృదయాలను ప్రభావితం చేసాడు, విశ్వాసాన్ని ప్రకటించేవారిని మాత్రమే కాకుండా, దేవునిచే యథార్థంగా ఆమోదించబడిన వారిని కూడా ఆకర్షించాడు, దయను పునరుత్పత్తి చేసే పరివర్తన శక్తిని అనుభవించాడు. దేవుడు శాశ్వతమైన మోక్షానికి ఉద్దేశించిన వారు, ఆయన మహిమను గూర్చిన జ్ఞానం మొత్తం భూమిని నింపేంత వరకు ఎదురులేని విధంగా క్రీస్తు వైపుకు ఆకర్షించబడతారు.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |