Romans - రోమీయులకు 5 | View All

1. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము

అందరూ పాపులేననీ, పాపవిముక్తికి, రక్షణకు మార్గం యేసుప్రభువుపై నమ్మకం ఒక్కటేననీ పౌలు చూపించాడు. ఈ అధ్యాయంలో దేవుడు నిర్దోషులుగా ఎంచినవారి గురించి మరి కొన్ని సంగతులను పౌలు వివరిస్తున్నాడు. ఇక్కడి అంశం విశ్వాసులందరికీ రక్షణ నిశ్చితమైనది, శాశ్వతమైనది అన్నదే. వారికి ఇవన్నీ ఉన్నాయి: దేవునితో సమాధానం ఉంది (వ 1) దేవుని సన్నిధిలోకి ఎప్పుడూ ప్రవేశం (వ 2) ఆశాభావం (వ 2) బాధల్లో ఆనందించే సామర్థ్యత (వ 3) బాధలు ఆశాభావాన్ని పెంచుతాయన్న జ్ఞానం (వ 4) పవిత్రాత్మ అనే ఉచిత వరం (వ 5) దేవుని ప్రేమ గురించిన జ్ఞానం (వ 5-8) నిశ్చయమైన భద్రత (వ 9,10) దేవునిలో ఆనందం (వ 11) దేవునితో ఒక నూతన సంబంధంలో శాశ్వత జీవం (వ 12-21) దేవుడు విశ్వాసులను నిర్దోషులుగా ఎంచుతాడు కాబట్టి వారికీ ఆయనకూ మధ్య సమాధానం ఉంది. కొలొస్సయులకు 1:20; ఎఫెసీయులకు 2:14-17; 2 కోరింథీయులకు 5:18-21; యెషయా 32:17; యెషయా 53:5. ఇక్కడ సమాధానం అంటే దేవునికీ, క్రీస్తులో నమ్మకం పెట్టుకొన్నవారికీ సఖ్యతన్నమాట.

2. మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

“ప్రవేశం”– విశ్వాసులు దేవుని సముఖంలోకి ఎప్పుడైనా సరే, రావచ్చు (ఎఫెసీయులకు 2:18; ఎఫెసీయులకు 3:12; హెబ్రీయులకు 10:19-22). “కృప”– రోమీయులకు 1:7; రోమీయులకు 4:16; యోహాను 1:16-17; 2 కోరింథీయులకు 8:9; హెబ్రీయులకు 4:16; మత్తయి 7:9-11. ఇలా దేవుని చెంతకు ప్రవేశం యేసుప్రభువు ద్వారానే అన్న సంగతి గమనించండి (1 తిమోతికి 2:5; యోహాను 14:6, యోహాను 14:13-14 కూడా చూడండి). “ఆశాభావం”– దేవుడు విశ్వాసులను నమ్మకం మూలంగానే నిర్దోషులుగా న్యాయవంతులుగా ఎంచాడు గనుక, తరువాత ఆయనతో మహిమలో అనంత కాలం జీవిస్తామన్న నిబ్బరంతో దృఢ విశ్వాసంతో వారు ఆనందించవచ్చు (యోహాను 17:24; 1 థెస్సలొనీకయులకు 2:12; ప్రకటన గ్రంథం 21:2-4; ప్రకటన గ్రంథం 22:3-5). ఇక్కడ మహిమ అంటే విశ్వాసుల అంతిమ రక్షణను, విముక్తి స్థితిని సూచించేది (రోమీయులకు 8:17-22, రోమీయులకు 8:30). “ఆశాభావం” గురించి రోమీయులకు 8:24-25 చూడండి.

3. అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి

ఇప్పుడు ప్రశ్న ఒకటి తలెత్తుతుంది. దేవునితో విశ్వాసులకున్న శాంతిని వారికి కలిగే బాధలు తొలగించి వేయగలవా? పరలోకం గురించిన వారి ఆశాభావాన్ని రూపుమాపగలవా? “కాదు” అని చాలా గట్టిగా చెప్తున్నాడు పౌలు. బాధలు నిజానికి విశ్వాసుల ఆశాభావాన్ని పెంచుతాయి. అందువల్ల ఆ బాధలు తమకు మేలే చేస్తున్నాయని తెలిసి వారు ఆనందించగలుగుతారు. బాధలను క్రమంగా ఆశాభావంలోకి మార్చుకునే ఆధ్యాత్మిక విధానాన్ని విశ్వాసులు అనుభవాన్ని బట్టి మెల్లగా నేర్చుకుంటారు. విశ్వాస జీవితంలో ఇది క్రమక్రమంగా అలవడుతుంది. బాధలు సహనాన్ని పెంచుతాయి. తమకు బాధలు, కష్టాలు సహించగలిగేలా దేవుడు సహాయం చేస్తాడనీ వాటినుంచి అపనమ్మకంతో వెనక్కు తగ్గకుండా వాటిని తాము ఎదుర్కోగలమనీ విశ్వాసులు నేర్చుకుంటారు (హెబ్రీయులకు 10:35-39). వారికి వాటిల్లే ఘోరమైన బాధల్లో కూడా దేవుడు తమతో ఉన్నాడనీ, నమ్మకంలో వారిని స్థిరంగా ఉంచుతాడనీ వారు గ్రహిస్తారు (రోమీయులకు 8:35-37; యోహాను 10:27-28; 1 పేతురు 1:5-7). విశ్వాసుల విషయంలో సహనం మంచి వ్యక్తిత్వాన్ని పదునుపెడుతుంది. బాధలు, కష్టాలు, విషమ పరీక్షలు ఓర్చుకోవడం విశ్వాసులను మెరుగు పెట్టి వారిని బలవంతులుగా, భవిష్యత్తులో అలాంటివాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులుగా తీర్చిదిద్దుతుంది. ఈ పద్ధతి ద్వారా వారు మొదట నమ్మినప్పుడున్న ఆశాభావం ఎదిగి బలపడుతుంది.

4. శ్రమలయందును అతిశయపడుదము.

5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
కీర్తనల గ్రంథము 22:5, కీర్తనల గ్రంథము 25:20

విశ్వాసుల ఆశాభావానికి దేవుని ప్రేమలో స్థిరమైన పునాది ఉందని ఈ వచనాలు తెలుపుతున్నాయి. ఈ వచనాల అంశం అంతిమ రక్షణ, ముక్తి స్థితి నిశ్చయత. పౌలు వాదం ఇది: మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడే మనపట్ల ఆయన తన మహా ప్రేమను వెల్లడి చేశాడు. అయితే ఇప్పుడు మనం ఆయన స్నేహితులమయ్యాం కాబట్టి అదే ప్రేమ మనల్ని అంతం వరకు భద్రంగా ఉంచదా? రోమీయులకు 8:35-39 పోల్చి చూడండి. దేవుడు విశ్వాసులకు అంతిమ రక్షణ ఆశాభావాన్ని ఇచ్చినది చివర్లో వారిని నిరాశపరచాలని కాదు. వారికి దేని విషయంలో దేవుడు ఆశాభావాన్ని కలిగించాడో దాన్ని ఆయన చివరికి వారికి తప్పకుండా ఇస్తాడని విశ్వాసులు తెలుసుకోవచ్చు. ఈ ధైర్యం పవిత్రాత్మ వారి హృదయాల్లో నింపిన దేవుని ప్రేమను ఆధారం చేసుకుని ఉన్నది. కుమ్మరించడం అనే మాటలో చెప్పలేనంత సమృద్ధిగా ఇచ్చినట్టు అర్థం వస్తున్నది. దేవుని ప్రేమ ఈ విధంగా తెలియడం విశ్వాసులను ఆయన్ను ప్రేమించేలా చేస్తుంది (1 యోహాను 4:9-10, 1 యోహాను 4:19). పవిత్రాత్మ దేవుని ప్రేమను విశ్వాసులకు అందించి వారు దేవుణ్ణి, ఒకరినొకరు ప్రేమించేలా చేస్తాడు. దేవుడెవరినైతే నిర్దోషులుగా ఎంచుతాడో వారికి పవిత్రాత్మను ప్రసాదిస్తాడని గమనించండి (గలతియులకు 3:1-3, గలతియులకు 3:14).

6. ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.

మనం విశ్వాసులం కాకముందు స్థితిని వర్ణించేందుకు పౌలు మూడు మాటలను వాడుతున్నాడు – “బలం లేని స్థితిలో”, “భక్తిహీనులు”, “పాపులు”. వ 10లో మరొకటి దీనికి కలుపుతున్నాడు – “విరోధులు”. వేరే మాటల్లో చెప్పాలంటే సహజంగా మనం చెడ్డవాళ్ళం (రోమీయులకు 3:23; ఆదికాండము 8:21; యిర్మియా 17:9; మత్తయి 7:11). మనకు ఏకైక నిజ దేవుడు లేడు. ఆయనకన్నా మన పాపాలే మనకు ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన్ను మనం కోరలేదు. అందువల్ల మనం ఆయనకు శత్రువులం. ఎందుకంటే పాపమంతా ఆయనకు విరోధమే (కీర్తనల గ్రంథము 51:5). దేవునికి వ్యతిరేకమైనదాని పక్షంగా ఉండడం ఆయనకు శత్రువులుగా ఉండడమే (యాకోబు 4:4). అంతేకాకుండా మనల్ని మనం మంచివారుగా చేసుకునేందుకూ, పాపం చేయడం మానుకునేందుకూ, దేవుని స్నేహితులయ్యేందుకూ మనకు శక్తి లేకపోయింది. ఇవి మనకు కష్టమైన సంగతులు మాత్రమే కాదు, అసాధ్యాలు కూడా. కొన్నిసార్లు మనుషులు ఉపదేశించే ముక్తి మార్గాలు, మన దేశంలో విశేష ప్రఖ్యాతి పొందిన మార్గాలు – అంటే జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం ఎంత అసాధ్యమో దీన్నిబట్టి మనం గ్రహించవచ్చు. అయితే మనం చేయలేనిదాన్ని దేవుడు చేశాడు. క్రీస్తు వచ్చి మన స్థానంలో మరణించి మన పాపాలను తొలగించివేశాడు. మనం ఆయన్ను నమ్మినప్పుడు క్రీస్తు రక్తం మూలంగా (వ 9) మనలను నిర్దోషులుగా లెక్కించాడు; మనలను తన స్నేహితులుగా చేసుకున్నాడు (వ 10); మన అనుభవాన్ని దృక్పథాన్ని మొత్తంగా మార్చేశాడు (వ 1-4); తన ఆత్మను మనలో ఉంచి మనల్ని నూతన సృష్టిగా చేశాడు (వ 5).

7. నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.

8. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

9. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము.

ఈ మాటలు క్రీస్తు సిలువదగ్గర వెల్లడి అయిన దేవుని ప్రేమ మీద ఆధారపడి మనకు నేర్పుతున్నదేమిటంటే, విశ్వాసులింకా అపనమ్మకంతో ఆయన శత్రువులుగా ఉండగానే క్రీస్తు వారికోసం చనిపోయాడు, వారు నమ్మినప్పుడు వారిని నిర్దోషులుగా ఎంచి తన స్నేహితులుగా చేసుకున్నాడు. ఇది తిరుగులేని సత్యం. ఆయన వారినలా రక్షణ స్థితిలోనే ఉంచుతూ వారికోసం తాను చనిపోయినప్పుడు ఆరంభించిన పనిని ఆయన పూర్తిగా ముగిస్తాడన్నది మరింత తిరుగులేని సత్యం. ఇక్కడ “దేవుని కోపం” అంటే పాపంలో నిలిచివుండే వారందరిపైకీ రాబోయే దేవుని పవిత్ర కోపం (రోమీయులకు 2:5, రోమీయులకు 2:8; ఎఫెసీయులకు 5:5-6; కొలొస్సయులకు 3:6; ప్రకటన గ్రంథం 6:16-17). యేసుప్రభువు విశ్వాసులందరినీ దానినుంచి రక్షిస్తాడు (1 థెస్సలొనీకయులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 5:9).

10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

“సఖ్యపరచుకొన్నాడు”– 2 కోరింథీయులకు 5:18-21 చూడండి. ఆయన “జీవిస్తూ” ఉండడం మూలంగా వారికి అలా రక్షణ ఉంటుంది (వ 10. యోహాను 11:25; యోహాను 14:19 చూడండి). విశ్వాసులు ఆయన జీవంతో ఏకమయ్యారు (యోహాను 17:21, యోహాను 17:23; కొలొస్సయులకు 3:3-4). వారికోసం విజ్ఞాపనలు చేసేందుకు ఆయన శాశ్వతంగా జీవించే ఉంటాడు (రోమీయులకు 8:34; హెబ్రీయులకు 7:25). అందువల్ల వారు అంతం వరకు క్షేమంగా భద్రంగా ఉంటారు. అయితే ప్రశ్న ఏమిటంటే వారు నమ్మడం మానుకుంటే ఏమి జరుగుతుంది? క్రీస్తు వారికి చేసినది, ఇప్పుడు చేస్తున్నది అలా ఉండగానే వారు నశించిపోరా? దీనికి జవాబేమిటంటే వారికి నమ్మకం దయచేసిన దేవుడు, అంతం వరకు వారలా నమ్మకంలో కొనసాగేలా చేస్తాడు. లూకా 22:31-32; ఫిలిప్పీయులకు 1:6, ఫిలిప్పీయులకు 1:29; హెబ్రీయులకు 10:39. విశ్వాసులను సంరక్షించేందుకు భద్రంగా ఉంచేందుకూ అన్ని చర్యలూ తీసుకున్న దేవుడు వారి నమ్మకం అనే ఈ అత్యంత ప్రాముఖ్యమైన విషయంలో వారు తప్పిపోకుండా కాపాడడు అనుకోవడం బుద్ధికి అనుగుణమేనా, బైబిలుకు అనుగుణమేనా? కానే కాదు.

11. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.

దీన్ని అర్థం చేసుకున్నవారికి ఇదంతా మహానంద కారణం. ఇది మనల్ని తిరిగి వ 2కు తెస్తున్నది. “సఖ్యపడి”– 2 కోరింథీయులకు 5:18.

12. ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
ఆదికాండము 2:17, ఆదికాండము 3:6, ఆదికాండము 3:19

మానవ జాతికి మూల పురుషుడూ ప్రతినిధీ అయిన ఆదాముకు, దేవుడు నిర్దోషులుగా ఎంచిన వారి నాయకుడూ ప్రతినిధీ అయిన క్రీస్తుకూ ఉన్న తేడాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆదాముద్వారా మానవ జాతికి పాపం, మరణం ప్రాప్తించాయి. క్రీస్తుద్వారా నిర్దోషత్వం, జీవం కలిగాయి. ఆదాముద్వారా వచ్చిన మరణం ఖాయం. దీనికన్నా క్రీస్తుద్వారా కలిగిన జీవం మరింత ఖాయమని చూపడమే ఇక్కడ పౌలు ఉద్దేశం. ఆదాము పాపంలో మరణంలో పడిపోవడం వల్ల కలిగిన ఫలితాలను మార్చేందుకు దేవుడు క్రీస్తుద్వారా చేసిన పనిలోని గొప్పతనాన్ని మరింతగా వివరించడం కూడా ఇక్కడ పౌలు ఉద్దేశం. ఒక్క మనిషి ఆదాము పాపం చేసి పాపి అయ్యాడు కాబట్టి మనుషులంతా పాపులే – ఆదికాండము 2:17; ఆదికాండము 3:1-19. తన పోలికలో అతడు తన సంతానాన్ని కన్నాడు (ఆదికాండము 4:1). వారు తమ పోలికలో అలా చేశారు. ఈ విధంగా ఒక తరంనుంచి మరో తరానికి పాపం, భ్రష్ట స్వభావం ఒక భయంకరమైన అంటువ్యాధిలాగా సంక్రమించాయి (ఆదికాండము 8:21; కీర్తనల గ్రంథము 51:5; కీర్తనల గ్రంథము 58:3; యిర్మియా 17:9). ఈ పాప రోగం తప్పనిసరిగా మరణానికి దారితీస్తుంది – రోమీయులకు 6:23. ఆదామువల్ల మనుషులంతా పాపులయ్యారు. అంతేకాదు, ఆదాములో మనుషులంతా పాపం చేశారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అతడు పాపం చేసినప్పుడు మానవ జాతి అంతా అతనిలో ఉంది (హెబ్రీయులకు 7:9-10 పోల్చి చూడండి). అతడు చేసినది మనుషులంతా అతనిలో ఉండి చేశారు. ఆ సమయంలో భూమిపై ఉన్న ఒకే ఒక మనిషి ఆదామే గనుక మానవ జాతి మొత్తం అతడే.

13. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.

ఇక్కడ ధర్మశాస్త్రం అంటే దేవుడు మోషేద్వారా ఇచ్చిన ఆజ్ఞలు. పౌలు భావం ఇదై ఉండవచ్చు: దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందే మనుషులు పాపం చేశారు. అయితే ఆదాము మీరినట్టు (ఆదికాండము 2:17) వారు ఎలాంటి ప్రత్యేకమైన ఆజ్ఞనూ మీరలేదు. వారు మరణించారు గానీ అది వారి పాపాల మూలంగా కాదు. తమకై తాము ఏ పాపమూ చెయ్యని పసిపిల్లలు కూడా చనిపోయారు. ఆదామునుంచి మోషే కాలం వరకు ఇలా మరణం రాజ్యమేలడం ఎందుకని? ఆదాము పాపం వల్లే. ఆదాము అప్పుడు రాబోయేవానికి సూచన. ఆ రాబోయేవాడంటే క్రీస్తు (1 కోరింథీయులకు 15:45 లో క్రీస్తును చివరి ఆదాము అన్నాడు పౌలు). ఆదాము ఏవిధంగా క్రీస్తుకు సూచన? తన పాపాన్ని బట్టి ఏమాత్రం కాదు. ఎందుకంటే క్రీస్తు అసలు పాపం చెయ్యలేదు (2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; 1 పేతురు 2:22). ఆదాము ఒకే ఒక విషయంలో క్రీస్తుకు సూచన. అతని అవిధేయత కోటాను కోట్లమంది మనుషులపై ఎలా ప్రభావం చూపిందో, క్రీస్తు విధేయత కోటానుకోట్ల మందిపై అలాగే ప్రభావం చూపింది. ఆదాము “లో” ఉన్నవారంతా అతని మూలంగా చనిపోవాలి (వ 15), క్రీస్తు “లో” ఉన్నవారంతా ఆయన మూలంగా జీవిస్తారు (వ 18,19).

14. అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను,

15. అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.

“ఉచిత కృపావరం”– వ 17; రోమీయులకు 6:23; ఎఫెసీయులకు 2:8-9. “అనేకులకు”– అంటే ఆదాము సంతానమంతటికీ అని అర్థం. ఏదెను వనంలో ఆదాము చేసిన పాపం వల్ల వారూ చనిపోవడం తప్పనిసరి. అది నిశ్చయం. దేవుని కృప మానవాళి అంతటికీ ప్రవహించడం అనేది అంతకంటే మరెక్కువగా నిశ్చయం. అంటే, అందరికీ పాపవిముక్తి కలుగుతుందని కాదు. దేవుని కృప అందరికీ అందుబాటులోకి వచ్చింది. క్రీస్తులో నమ్మకం ఉంచితే అందరూ విముక్తి, రక్షణ పొందుతారని అర్థం.

16. మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.

ఇక్కడ దేవుని తీర్పు అంటే “నీవు...తప్పక చస్తావు” (ఆదికాండము 2:17) అనే మాట. మనుషులందరి వంశకర్త ఆదాము చేసిన ఒక్క పాపంవల్ల ఈ తీర్పు మనుషులందరి మీదికి వచ్చింది. కాని దేవుని ఉచిత కృపావరమైతే ఆదాము చేసిన ఒక్క పాపంనుంచి మాత్రమే కాక మానవ చరిత్ర అంతటిలో జరిగిన పాపాలన్నిటి నుంచీ తప్పించుకునే మార్గాన్ని అమర్చింది. ఆదాము పాపం మనుషులపైకి శిక్షావిధి తెచ్చింది. కానీ మనుషులు నమ్మకం చూపితే దేవుని కృప ఆ శిక్షావిధిని తొలగించి వారిని నిర్దోషులుగా చేస్తుంది (రోమీయులకు 3:22-24).

17. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.

“చావు...ఏలింది”– వ 14,21. మనుషులంతా మరణం కింద ఉన్నవారే. కఠినుడైన ఈ యజమాని అందరినీ తీసుకుపోయాడు. హెబ్రీయులకు 2:15 పోల్చి చూడండి. అయితే దేవుడు క్రీస్తు ద్వారా మరణాన్ని తప్పించుకునే మార్గాన్ని ఏర్పరచాడు. ఈ మార్గంలోకి వచ్చినవారు క్రీస్తుద్వారా “ఏలుతారు”. మరణమనే రాజుకు లొంగి ఉండవలసింది పోయి క్రీస్తులో శాశ్వత జీవాన్ని పొంది క్రీస్తులో తామే రాజులౌతారు (యోహాను 5:24; యోహాను 11:25-26; ఎఫెసీయులకు 2:6; ప్రకటన గ్రంథం 3:21; ప్రకటన గ్రంథం 22:5). ఓడిపోయినవారు విజేతలయ్యారు (రోమీయులకు 8:37 పోల్చి చూడండి).

18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.

“మనుషులందరికీ”– మనుషులందరికీ శాశ్వత జీవాన్ని దేవుడు అందుబాటులో ఉంచాడు. అయితే క్రీస్తును స్వీకరించిన వారికి మాత్రమే ఆ జీవం కలుగుతుంది (ప్రకటన గ్రంథం 22:17; 1 యోహాను 5:11-12; యోహాను 7:37-38). మనుషులు న్యాయవంతులుగా తీర్చబడడానికీ, శాశ్వత జీవానికీ ఉన్న దగ్గర సంబంధం గమనించండి. ఒకటి లేకుండా మరొకటి మనకు ఉండదు. “శిక్షావిధి”– వ 16. ఒకే న్యాయ క్రియ అంటే పాపుల కోసం బలిగా క్రీస్తు తనను తాను న్యాయబద్ధంగా ప్రతిష్ఠించు కోవడం అని అర్థమున్నట్టుంది.

19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడు దురు.
యెషయా 53:11

“విధేయత”– ఫిలిప్పీయులకు 2:8. వ 12-19లోని తేడాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మనుషులందరికీ దొరికేవాటికి రెండే రెండు మూలస్థానాలు ఆదాము, క్రీస్తు. పాపం, మరణం, శిక్ష వీటికి మూలం ఆదాము. శిక్షను తొలగించి విశ్వాసులను దేవునికి అంగీకారంగా చేసేవాటికి, అంటే నీతిన్యాయాలకు, జీవానికి, కృపకు మూలాధారం క్రీస్తు. “అవిధేయత”– ఆదికాండము 3:6.

20. మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,

“ధర్మశాస్త్రం”– వ 13,14. ఆజ్ఞలున్నాయి. మనుషులు వాటిని మీరుతారు కాబట్టి అతిక్రమాలు, అపరాధాలు పెరుగుతాయి. ఆజ్ఞలే లేకపోతే మీరడం దేన్ని? (రోమీయులకు 4:15). రోమీయులకు 7:7-12 లో దేవుని ఆజ్ఞలు వాస్తవానికి పాపాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయో పౌలు చూపిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఇవ్వడంలో దేవుని ఉద్దేశం పాపం అభివృద్ధి చెందాలని కాదు (అసలు ధర్మశాస్త్రం లేకుండానే పాపం అభివృద్ధి చెందింది – ఆదికాండము 6:5, ఆదికాండము 6:11; ఆదికాండము 8:21). మనుషులు తమకు కృప ఎంత అవసరమో గుర్తించగలగాలనే, తన కృప దాని మహిమ, ప్రభావమంతటితో ప్రత్యక్షం కావాలనే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.

21. ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

“మరణంలో పాపం ఎలా ఏలిందో”– వ 14,17. పాపాన్ని బట్టే మరణం ఏలింది. పాపం తనను సేవించే వారందరికీ మరణమనే జీతం ఇచ్చే క్రూరమైన నియంత (రోమీయులకు 6:23; యోహాను 8:34). దేవుని కృప పాపం కంటే, మరణం కంటే ఎక్కువ శక్తివంతమైనది. అది పాపాన్ని లయపరుస్తుంది, మనుషులను నిర్దోషులుగా తీర్చి వారిని శాశ్వత జీవానికి నడిపిస్తుంది (రోమీయులకు 6:23; తీతుకు 3:3-7). యేసుప్రభువు ద్వారా కృప ఏలుతూ ఉంది (హెబ్రీయులకు 4:16)! ఆయనలో నమ్మకముంచే వారందరి పాపాలనూ అది క్షమించి శిక్షావిధిని పూర్తిగా తొలగిస్తుంది (రోమీయులకు 6:14; రోమీయులకు 8:1). ఇక్కడ ఇద్దరు యజమానులు కనిపిస్తున్నారు – ఆదాముద్వారా వచ్చిన పాపం (వ 12), క్రీస్తు ద్వారా వచ్చిన కృప (వ 17; యోహాను 1:16-17). ఏ యజమానిని సేవించాలో మనందరం తేల్చుకోవాలి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Romans - రోమీయులకు 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు యొక్క నీతిలో విశ్వాసం ద్వారా సమర్థించబడటం యొక్క సంతోషకరమైన ప్రభావాలు. (1-5) 
వారి గతంతో సంబంధం లేకుండా నిజమైన విశ్వాసాన్ని స్వీకరించిన తర్వాత పాపి జీవితంలో పరివర్తనాత్మక మార్పు సంభవిస్తుంది. విశ్వాసం ద్వారా సమర్థించడం దేవునితో సయోధ్యను తెస్తుంది. దేవుని స్వాభావికంగా పవిత్రమైన మరియు నీతిమంతమైన స్వభావం అపరాధ భారంతో ఉన్న పాపితో కలిసి ఉండకూడదు. సమర్థన ఈ అపరాధాన్ని తొలగిస్తుంది, శాంతికి మార్గం సుగమం చేస్తుంది. ఈ సయోధ్య మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సంభవిస్తుంది, అతను దేవుడు మరియు మానవాళికి మధ్య అంతిమ శాంతిని కలిగించేవాడు మరియు మధ్యవర్తిగా పనిచేస్తాడు.
సాధువుల స్థితి దయతో కూడినది, మనం తీసుకురాబడిన స్థితి, మనం అసలు అలాంటి స్థితిలో పుట్టలేదని నొక్కి చెబుతుంది. ఇది మనం స్వంతంగా సాధించగలిగే స్థితి కాదు; బదులుగా, క్షమించబడిన అతిక్రమించిన వారిగా మనం దానిలోకి నడిపించబడ్డాము. ఈ స్థితిలో, మేము నిలబడతాము - పట్టుదలకు ప్రతీకగా ఉండే భంగిమ - దృఢంగా మరియు సురక్షితంగా, ఏ ప్రత్యర్థిని మించిన శక్తితో మద్దతునిస్తుంది. భవిష్యత్తులో దేవుని మహిమను ఆశించే వారికి, వర్తమానంలో ఆనందించడానికి తగినంత కారణం ఉంది.
కష్టాలు సహనం యొక్క అభివృద్ధికి దోహదం చేస్తాయి, వాటి స్వభావంతో మాత్రమే కాదు, వాటితో కలిసి పనిచేసే దేవుని శక్తివంతమైన దయ ద్వారా. సహనంతో సహించే వారు తమ బాధల తీవ్రతకు సరిపోయే దైవిక ఓదార్పులను సమృద్ధిగా పొందుతారు. ఈ అనుభవం మన గురించి లోతైన అవగాహనను పెంపొందిస్తుంది. దేవుని మహిమ యొక్క నిరీక్షణలో లంగరు వేయబడిన నిరీక్షణ అస్థిరంగా ఉంటుంది, ఎందుకంటే అది ప్రేమ యొక్క ఆత్మగా పనిచేసే పరిశుద్ధాత్మచే మూసివేయబడింది.
పరిశుద్ధాత్మ యొక్క దయతో కూడిన పనిలో సాధువులందరి హృదయాలలో దేవుని ప్రేమను ప్రసరింపజేయడం ఉంటుంది. మనపట్ల దేవుని ప్రేమకు సరైన కృతజ్ఞత, మన నిరీక్షణలో లేదా ఆయన నిమిత్తము మనకు ఎదురయ్యే పరీక్షలలో అవమానకరమైన భావాన్ని తొలగిస్తుంది.

అతని రక్తం ద్వారా మనం రాజీ పడ్డాం. (6-11) 
క్రీస్తు పాపుల కోసం తనను తాను త్యాగం చేసాడు, కేవలం పనికిరాని వారి కోసం మాత్రమే కాకుండా, అపరాధులు మరియు అసహ్యకరమైన వ్యక్తుల కోసం - వారి శాశ్వతమైన ఖండించడం దేవుని న్యాయం యొక్క మహిమను ప్రదర్శిస్తుంది. అతని ఉద్దేశ్యం మన పాపాలలోనే కాదు, మన పాపాల నుండి మనల్ని రక్షించడమే, మనం ఇంకా పాపంలో మునిగిపోయినప్పటికీ. జెకర్యా 11:8లో చెప్పబడినట్లుగా, శరీరానికి సంబంధించిన మనస్సు కేవలం దేవునికి విరోధి కాదు కానీ శత్రుత్వాన్ని కలిగి ఉంటుంది.
అటువంటి వ్యక్తుల కోసం క్రీస్తు మరణిస్తాడనే వాస్తవం ఒక లోతైన రహస్యంగా మిగిలిపోయింది, ఇది శాశ్వతమైన ఆరాధన మరియు ఆశ్చర్యానికి అర్హమైన ప్రేమ యొక్క అసమానమైన ప్రదర్శన. ఉదాహరణకు, ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోతారనే అపొస్తలుడి ఊహాత్మక దృశ్యాన్ని పరిగణించండి. ఆ సందర్భంలో కూడా, ఉద్దేశించిన లబ్ధిదారుని కొన్ని కష్టాల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా బాధలు భరించారు. అయితే, క్రీస్తులో విశ్వాసులు భౌతిక మరణం నుండి విడుదల చేయబడరు, విధిని అందరూ ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ఆశ్చర్యకరమైన విమోచన సంభవించే చెడు సహజ మరణం కంటే చాలా భయంకరమైనది. అపొస్తలుడు ఈ చెడును పాపంగా మరియు దైవిక కోపంగా గుర్తిస్తాడు, పాపం యొక్క పర్యవసానంగా దేవుని తప్పులేని న్యాయం ద్వారా నిర్ణయించబడుతుంది.
దైవిక కృప ద్వారా, పశ్చాత్తాపపడి, క్రీస్తును విశ్వసించే వారు, ఆయన చిందించిన రక్తం యొక్క ధర ద్వారా మరియు ఆ ప్రాయశ్చిత్తంపై విశ్వాసం ద్వారా సమర్థించబడతారు, వారు పాపం, సాతాను లేదా దేవుని నుండి అంతిమంగా విడిపోవడం నుండి రక్షించబడతారని హామీని పొందుతారు. సజీవుడైన ప్రభువు, అందరికీ పాలకుడు, నిజమైన విశ్వాసులందరి మోక్షానికి అత్యంత భరోసా ఇవ్వడం ద్వారా తన త్యాగపూరిత ప్రేమ యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాడు. క్రీస్తులో దేవుని ప్రేమ ద్వారా మోక్షానికి నిశ్చయతతో, విశ్వాసులు స్వర్గం యొక్క నిరీక్షణలో మరియు క్రీస్తు కొరకు వారి కష్టాలలో ఆనందాన్ని పొందడమే కాకుండా, వారి అచంచలమైన స్నేహితునిగా మరియు సమస్త భాగవతంగా, క్రీస్తు ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న దేవునిలో మహిమను కూడా పొందుతారు.

ఆడమ్ పతనం మొత్తం మానవాళిని పాపం మరియు మరణంలోకి తీసుకువచ్చింది. (12-14) 
కింది ప్రసంగం యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది: మన మొదటి తండ్రి పతనం యొక్క పరిణామాలతో పోల్చడం ద్వారా క్రీస్తు ద్వారా మనకు లభించిన ఆశీర్వాదాల గురించి మన అవగాహనను పెంచడం. ఈ ఆశీర్వాదాలు ఈ పరిణామాల తొలగింపును మాత్రమే కాకుండా చాలా మించినవిగా ఉన్నాయని ప్రదర్శించడం దీని లక్ష్యం. ఆడమ్ పాపం చేసినప్పుడు, అతని స్వభావం దోషిగా మరియు భ్రష్టుపట్టి, అతని వారసులకు బదిలీ చేయబడింది. తత్ఫలితంగా, అందరూ అతని ద్వారా పాపం చేసారు, మరియు పాపం యొక్క జీతం వలె మరణం చిత్రంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా వివిధ దుఃఖాలు-తాత్కాలిక, ఆధ్యాత్మిక మరియు శాశ్వతమైన మరణం-పాపం యొక్క అపరాధానికి తగిన పరిణామాలు ప్రారంభమవుతాయి.
ఆదాము పాపం చేయకపోతే, అతడు మరణాన్ని ఎదుర్కొనేవాడు కాదు. ఏది ఏమైనప్పటికీ, అతనిపై మరణశిక్ష విధించబడింది, ఇది ఒక క్రిమినల్ శిక్షకు సమానంగా ఉంటుంది మరియు అది తప్పించుకోలేని అంటు వ్యాధి వలె మానవాళికి విస్తరించింది. ఆదాముతో మనకున్న సంబంధం మరియు అతని ప్రారంభ అతిక్రమణలో మన ప్రమేయం యొక్క సాక్ష్యం మోషేచే చట్టం ఇవ్వబడటానికి చాలా కాలం ముందు ప్రపంచంలో పాపం యొక్క వ్యాప్తిలో ఉంది. ఈ పొడిగించిన కాలంలో మృత్యువు స్పృహతో పాపం చేసిన పెద్దలపై మాత్రమే కాకుండా అనేక మంది శిశువులపై కూడా ఉంది. వారు కూడా ఆడమ్‌లో శిక్షకు గురయ్యారని మరియు ఆదాము పాపం అతని వారసులందరికీ చేరిందని ఇది నొక్కి చెబుతుంది. ఆడమ్ తనకు సంబంధించిన వారందరికీ కొత్త ఒడంబడికకు హామీగా వచ్చే వ్యక్తిగా లేదా రకంగా పనిచేశాడు.

దేవుని కృప, క్రీస్తు యొక్క నీతి ద్వారా, మోక్షాన్ని తీసుకురావడానికి ఎక్కువ శక్తిని కలిగి ఉంది, ఆదాము పాపం కష్టాలను తెచ్చిపెట్టింది, (15-19) 
ఒక వ్యక్తి యొక్క అతిక్రమణ కారణంగా, మానవాళి అంతా శాశ్వతమైన ఖండించే అవకాశాన్ని ఎదుర్కొంటుంది. అయితే, దేవుని దయ మరియు దయ, నీతి మరియు మోక్షం యొక్క బహుమతితో పాటు, అతని మానవ రూపంలో యేసుక్రీస్తు ద్వారా అందించబడ్డాయి. విశేషమేమిటంటే, పరలోకం నుండి వచ్చిన ప్రభువు విశ్వాసుల సమూహాన్ని వారు ఆడమ్ నుండి వచ్చిన స్థితి కంటే సురక్షితమైన మరియు మరింత ఉన్నతమైన స్థితికి పెంచాడు.
ఈ ఉచిత బహుమతి వారిని పునరుద్ధరించిన ట్రయల్‌కు గురి చేయదు, అయితే ఆడమ్ స్థిరంగా ఉండి ఉంటే అతను ఎక్కడ నిలబడి ఉండేవాడో అదే విధంగా సమర్థించే స్థితిలో వాటిని ఏర్పాటు చేస్తుంది. వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, గుర్తించదగిన సారూప్యత ఉంది. ఒకరి అతిక్రమం మానవాళిని ఖండిస్తూ పాపం మరియు మరణాల వ్యాప్తికి దారితీసినట్లే, విశ్వాసం ద్వారా అతనితో అనుసంధానించబడిన వారందరినీ సమర్థించడం కోసం ఒకరి-క్రీస్తు యొక్క నీతి ప్రబలంగా ఉంటుంది.
దేవుని దయతో, క్రీస్తు ద్వారా ఉచితంగా ప్రసాదించిన బహుమతి చాలా మందికి పొంగిపోయింది. అయినప్పటికీ, చాలా మంది వ్యక్తులు దయ యొక్క పాలన యొక్క ఆశీర్వాదాలను కోరుకునే బదులు పాపం మరియు మరణం యొక్క ఆధిపత్యంలో ఉండటాన్ని ఎంచుకున్నారు. అయినప్పటికీ, తనను సంప్రదించడానికి ఇష్టపడేవారిని క్రీస్తు ఎన్నటికీ తిరస్కరించడు.

కృప అధికంగా ఉంది. (20,21)
క్రీస్తు మరియు అతని నీతి ద్వారా, ఆడమ్ యొక్క అతిక్రమణ ద్వారా పోగొట్టుకున్న వాటి కంటే మనం ఎక్కువ మరియు గొప్ప అధికారాలను పొందుతాము. నైతిక చట్టం అనేక ఆలోచనలు, వైఖరులు, పదాలు మరియు చర్యల యొక్క పాపపు స్వభావాన్ని ప్రకాశవంతం చేసింది, తద్వారా అతిక్రమణలను గుణించింది. పాపం మరింత ఎక్కువయ్యేలా చేసే బదులు, చట్టం దాని పాపాన్ని వెల్లడి చేసింది-ఒక గదిలోని స్పష్టమైన కాంతి అంతకు ముందు కనిపించని దుమ్ము మరియు మలినాన్ని బహిర్గతం చేస్తుంది.
ఆదాము యొక్క పాపం మరియు మనలోని అవినీతి చట్టం యొక్క ప్రవేశంతో స్పష్టంగా కనిపించే అతిక్రమం యొక్క విస్తరణను సూచిస్తుంది. చట్టం వల్ల కలిగే భయం సువార్త సుఖాల మాధుర్యాన్ని పెంచుతుంది. ఈ విధంగా, పవిత్రాత్మ, అపొస్తలుడి ద్వారా, పాపులుగా మన అవసరాలకు అనుగుణంగా, ఓదార్పుతో నిండిన కీలకమైన సత్యాన్ని అందజేస్తాడు. మరొకరితో పోలిస్తే ఒకరి స్థితి ఏమైనప్పటికీ, ప్రతి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పాపి, చట్టంచే ఖండించబడ్డాడు మరియు క్షమాపణ అవసరం.
సమర్థించే నీతి పాపం మరియు పవిత్రత యొక్క సమ్మేళనాన్ని కలిగి ఉండదు. శాశ్వతమైన ప్రతిఫలాన్ని క్లెయిమ్ చేయడానికి కల్మషం లేని మరియు దోషరహితమైన నీతి తప్పనిసరి. క్రీస్తు నీతిలో దానిని వెదకుదాము.



Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |