ఈ వచనాలు మనకు ఉత్తమ సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. మత్తయి 4:4 లో యేసు క్రీస్తు ఈ వచనాల్లో కొంత భాగాన్ని ఉదహరించాడు. దేవుని పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం భక్తికీ నమ్మకానికీ సహాయకరమని 2వ వచనం సూచిస్తుంది. ద్వితీయోపదేశకాండము 5:15 ద్వితీయోపదేశకాండము 7:18 ద్వితీయోపదేశకాండము 9:7 ద్వితీయోపదేశకాండము 15:15 ద్వితీయోపదేశకాండము 16:3 ద్వితీయోపదేశకాండము 16:12 ద్వితీయోపదేశకాండము 24:9 ద్వితీయోపదేశకాండము 24:22 ద్వితీయోపదేశకాండము 32:7. ద్వితీయోపదేశకాండం అంటే దేవుని పనులను జ్ఞాపకం చేసే పుస్తకం. అనేక చోట్ల వారు ఏమిటో, దేవుడు వారి పట్ల జరిగించిన దేమిటో గుర్తుచేసుకోవడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెపుతున్నది. దేవుడు తన ప్రజలకు సీనాయి ఎడారిలో దారి చూపడంలో అనేకమైన సత్ప్రయోజనాలున్నాయి –
వారికి అణుకువ కలిగించడం (వ 2,3),
వారిని పరీక్షించడం (వ 2,16),
వారి హృదయ స్థితి వెల్లడి చెయ్యడం (వ 2),
దేవునివాక్కు విని దాని ప్రకారం నడుచుకోవడంలోనే మనిషికి నిజమైన జీవం కలుగుతుందన్న అతి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని వారికి అర్థమయ్యేలా చెయ్యడం (వ 3),
వారు శక్తిమంతులై భక్తిపరులై విధేయులైన పిల్లలుగా మారాలని వారి మేలుకోసమే వారిని శిక్షలో పెట్టడం (వ 5) – ఇదంతా ఆయనకు వారిమీద ఉన్న గొప్ప ప్రేమవల్లే. ఇంత ధన్యకరమైన ఫలితాలను కలిగించడంలో తోడ్పడ్డ ఎడారి అనుభవాలకు స్వాగతం చెప్పుకోవాలి. ఈనాడు కూడా ఈ ఎడారి లోకంలో గుండా దేవుడు తన విశ్వాసులను తీసుకువెళ్ళడం ద్వారా అదే పని చేస్తున్నాడు (హెబ్రీయులకు 12:1-13). విశ్వాసులకు ఈ జీవితంలో జరిగేదంతా ఈ కారణం వల్లే.