Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bible in Basic English (1964)
Bishop's Bible
Brenton's English Septuagint
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Commentary
1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింప బడి
మత్తయి 4:1-11.
2. అపవాదిచేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా
మొత్తం 40 రోజులూ యేసు సైతానుచేత విషమ పరీక్షలకు గురి అయ్యాడని లూకా చెప్తున్నాడు. మత్తయి అయితే ఆ 40 రోజుల తరువాత వచ్చిన మూడు పరీక్షల గురించి మాత్రమే రాశాడు.
3. అపవాది నీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను
4. అందుకు యేసు మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.ద్వితీయోపదేశకాండము 8:3
5. అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి
6. ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;
సైతాను ఇక్కడ నిజం చెప్తున్నాడా? యేసు ఈ మాటల్ని వ్యతిరేకించలేదు. బైబిల్లోని మరి కొన్ని వచనాలు ఇది నిజమే నని సూచిస్తున్నాయి (యోహాను 12:31; యోహాను 14:30; 1 యోహాను 5:19; 2 కోరింథీయులకు 4:4; ఎఫెసీయులకు 6:12). రాజ్యాధికారమూ, వైభవమూ సైతానుకెలా వెళ్ళాయి? మత్తయి 4:9 నోట్ చూడండి.
7. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.
8. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను.ద్వితీయోపదేశకాండము 6:13
9. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టినీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దుముకుము
10. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.కీర్తనల గ్రంథము 91:11-12
11. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.కీర్తనల గ్రంథము 91:11-12
12. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.ద్వితీయోపదేశకాండము 6:16
13. అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.
సైతాను తన ఓటమిని అంగీకరించలేదు. మరో సమయం, ప్రయత్నాలు మరింతగా ఫలించే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా విశ్వాసులు వాణ్ణి ఎదిరిస్తే పారిపోతాడు (యాకోబు 4:7) గానీ మళ్ళీ మళ్ళీ వస్తాడు.
14. అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.
యూదయ అరణ్యప్రాంతంలో ఎక్కడో ఉన్నాడు యేసు.
15. ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను.
మత్తయి 4:23-25. “సమాజకేంద్రాలు”– మత్తయి 4:23.
16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా
“విశ్రాంతి దినాన”– నిర్గమకాండము 20:8-11; మొ।।. క్రీస్తు అలవాటు చూడండి. హెబ్రీయులకు 10:25 పోల్చి చూడండి. ఆయన పాత ఒడంబడిక గ్రంథంలోని భాగాన్ని చదివాడు. ఆ కాలంలో కొత్తగా వచ్చిన మత బోధకులకు యూదుల సమాజ కేంద్రాల్లో వాక్కును చదివి వినిపించమనీ మాట్లాడమనీ అడిగేవారు.
17. ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా -
“గ్రంథం” – ఆ రోజుల్లో వచనాలు రాసి ఉన్న తోలు ముక్కలను వరుసగా కుట్టి మొత్తాన్ని చాపలాగా చుట్టేవారు. యూదులు పాత ఒడంబడిక లేఖనాలు రాసుకున్న విధానం ఇదే. ఈ తోలు చుట్టులను తమ సమాజ కేంద్రాల్లో ఉంచేవారు.
18. ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకునుయెషయా 58:6, యెషయా 61:1-2
యెషయా 61:1-2 చూడండి. రాబోయే అభిషిక్తుణ్ణి గురించి రాసిన మాటలుగా యూదులు వీటిని ఎంచారు. యేసు నెరవేర్చడానికి వచ్చిన ఈ మంచి పనులను గమనించండి.
19. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.యెషయా 58:6, యెషయా 61:1-2
20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.
21. సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.
ఇస్రాయేల్వారికి వాగ్దానం చేయబడిన అభిషిక్తుణ్ణి తానే అని యేసు ఇక్కడ చెప్తున్నాడు. మత్తయి 1:1 లో అభిషిక్తుణ్ణి గురించి నోట్.
22. అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగాకీర్తనల గ్రంథము 45:2, యెషయా 52:14
వారు ఆశ్చర్యపోయారు గానీ ఆయన్ను నమ్మలేదు. ఈ తరువాతి వచనాలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. మత్తయి 13:53-58 కూడా చూడండి.
23. ఆయన వారిని చూచివైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను.
యేసు గలలీలో తన పరిచర్య కేంద్రంగా కపెర్నహూంను ఎన్నుకున్నాడు. అక్కడ వింతగొలిపే అద్భుతాలు కొన్నిటిని జరిగించాడు – మత్తయి 4:13, మత్తయి 4:24, మత్తయి 4:25; మత్తయి 8:1-17.
24. మరియు ఆయనఏ ప్రవక్తయు స్వదేశ మందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మత్తయి 13:57; యోహాను 4:44.
25. ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను,1 రాజులు 17:1, 1 రాజులు 18:1
1 రాజులు 17:1, 1 రాజులు 17:8-16 చూడండి.
26. ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు.1 రాజులు 17:9
27. మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.2 రాజులు 5:1-14
2 రాజులు 5:1-14 చూడండి. ఇస్రాయేల్ప్రజల చేతిలో ఏలీయా, ఎలీషా అనే ఈ ఇద్దరు ప్రవక్తలూ అష్టకష్టాలు పడ్డారు. అయితే ఇతర జాతులవారికి గొప్ప దీవెన కారణంగా దేవుడు వీరిని వాడుకున్నాడు. వారి కాలంలో ఇస్రాయేల్వారు దేవుణ్ణి విసర్జించి వారి చుట్టూ ఉన్న విగ్రహపూజ చేసే జనాలకన్నా నీచంగా జీవించేవారు. తన కాలంలో కూడా యూదులు తిరుగుబాటు చేస్తూ అపనమ్మకంలోనే కొనసాగుతారని యేసుకు తెలుసు. తన శుభవార్త యూదేతరుల్లో వ్యాపిస్తుందని తెలుసు.
28. సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని
ఈ యూదులు మిగతా ప్రజలందరినీ చిన్నచూపు చూశారు. యేసు వారి చరిత్ర ఆధారంగా వారి పొరపాట్లను ఎత్తిచూపుతూ ఇతర ప్రజలను తమంటే మెరుగైనవారుగా చిత్రీకరించినట్టు అనిపించింది వారికి. అందుచేత వారికి కోపం కలిగింది.
29. ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి.
దేవుని కుమారుణ్ణి మట్టుపెట్టడానికి యూదులు చేసిన మొదటి ప్రయత్నం ఇది (ఇదే ఆఖరు ప్రయత్నం కాదు). కారణం? ఆయన వారికి సత్యం చెప్పాడు, ఆయన నుంచి దేవుని పవిత్రత అనే కాంతి పాపంతో నిండి ఉన్న వారి హృదయాలపై ప్రకాశించింది. యోహాను 3:19; యోహాను 7:7; యోహాను 8:40.
30. అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.
ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన కోరుకునేంత వరకు ఎవరూ ఆయన ప్రాణం తీసుకోలేకపోయారు. యోహాను 7:30; యోహాను 10:17-18 చూడండి.
31. అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను.
మార్కు 1:21-28.
32. ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.
33. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపట్టిన వాడొక డుండెను.
34. వాడునజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను.
35. అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలి పోయెను.
36. అందు కందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞా పింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి.యెషయా 52:14
37. అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను.
38. ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి.
మత్తయి 8:14-17. పేతురు మరో పేరు సీమోను.
39. ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.
40. సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను.
41. ఇంతేకాక దయ్యములునీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.
మత్తయి 8:4; మత్తయి 9:30; మత్తయి 12:16; మార్కు 1:34.
42. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశ మునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచి పోకుండ ఆపగా
మార్కు 1:35-39.
43. ఆయననేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.
“దేవుని రాజ్యం”– మత్తయి 4:17.
44. తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను.