ఆ కాలంలో శుభవార్త ప్రకటించినవారంతా మంచి ఉద్దేశంతోనే ప్రకటించినవారు కారు. కొందరికి పౌలు గొప్పతనం, సఫలత అంటే అసూయ, తమను అతనికి పోటీదారులుగా భావించుకున్నారు. వారి మనస్తత్వం, దృక్పథం, పరిచర్య నిండా స్వార్థమే ఉంది. ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతూ ఉంది. కొందరు ప్రసంగీకులు ప్రఖ్యాతిని ఆర్జించాలనుకుంటారు. తమ పేరు కోసమే తమకు గొప్ప సఫలత కలగాలనుకుంటారు. ఇతర ప్రసంగీకులను తక్కువ చేసి మాట్లాడుతూ, చేతనైతే వారికి కష్టం కలిగించాలని కూడా చూస్తారు. కొందరు మాత్రం ఆ కాలంలో లాగానే యథార్థమైన మనసుతో, క్రీస్తు పట్ల, మనుషుల ఆత్మల పట్ల ప్రేమతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.