Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణ ముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారుచుండెను,ప్రకటన గ్రంథం 22:1
ఈ నది గురించి మూడు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. (1) వెయ్యేళ్ళ పరిపాలనకాలంలో ఇస్రాయేల్ దేశంలో గొప్ప మార్పులను సూచించే అక్షరార్థమైనది. (2) ఇది కేవలం ఆధ్యాత్మిక పాఠాలను బోధించే సంకేతరూపమైన నది. అక్షరాలా దీనికి ఎలాంటి నెరవేర్పూ ఎన్నడూ ఉండదు. (3) ఈ వర్ణనలో అక్షరాలచిహ్నంగానూ, రెండు అర్థాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఉండబోయే అసలైన నది ఏదో ఉంటుంది. అంతేగాక దీనిద్వారా అధ్యాత్మిక పాఠాలు కూడా నేర్చుకోవలసి ఉంది. ఈ మూడో వివరణ సరియైనది కావచ్చునని ఈ రచయిత అభిప్రాయం. యెహెఙ్కేలు 40:1 నోట్ కూడా చూడండి. “ఆయన”– యెహెఙ్కేలు 40:3. “ఆలయం”– శారీరకమైనా ఆధ్యాత్మికమైనా ఏవిధమైన దీవెనలకైనా మూలం దేవాలయంలో నివసించబోయే దేవుడే (యెహెఙ్కేలు 43:7) అని సూచిస్తున్నది.
2. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను.
దేవుని మహిమాప్రకాశం ప్రవేశించిన ద్వారం తలుపు (యెహెఙ్కేలు 43:4) కిందనుండి నీరు ప్రవహిస్తుంది. దేవుడు ఎక్కడైతే లోపలికి వస్తాడో అక్కడినుంచి దీవెనలు తప్పక బయలు వెళ్తాయి.
3. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.
వెయ్యి మూరలు అంటే సుమారు 450 మీటర్లు.
4. ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.
నది ఆలయంలో ఒక ఊటగా ఆరంభమవుతుంది. రెండు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రవహించిందో లేదో లోతైన వెడల్పయిన నదిగా మారుతుంది. ఇతర వాగులూ నదులూ వచ్చి కలుస్తాయేమో అనుకునే అస్కారం కనిపించడం లేదు. ఇది ప్రస్తుతం ప్రకృతిలో సహజ నదులు పారినట్టు పారదు. 6వ వచనంలో దేవదూత ప్రశ్న బహుశా దీన్ని చూపడానికేనేమో.
5. ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను.
6. అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను.
7. నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను.ప్రకటన గ్రంథం 22:2
ఆదికాండము 2:9; యెషయా 35:1-2; యెషయా 51:3. నీరు జీవాన్ని తెస్తుంది.
8. అప్పుడాయన నాతో ఇట్లనెను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును.
“అరాబా”– యొర్దాను నది అరాబా లోయలో కొంతభాగం గుండా ప్రవహిస్తుంది. “సముద్రం”– అంటే మృతసముద్రం.
9. వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.
మృత సముద్రంలో ప్రస్తుతం చేపలూ తదితర జీవరాసులేమీ లేవు. దాన్లోని ఖనిజాలూ లవణాలూ అత్యధిక సాంద్రతలో ఉండడంవల్ల ప్రాణులేవీ దాన్లో బతకలేవు. వ్యాఖ్యాతలు ఇందులో ఆధ్యాత్మికమైన పాఠాలు తీసుకొన్నారు – పవిత్రాత్మ సజీవమైన నీటి ప్రవాహాలుగా (యోహాను 7:39) ఈ లోకంగుండా వెళ్తున్నాడు. తమ అపరాధాలు, పాపాలవల్ల మరణించిన స్థితిలో ఉన్నవారు ఆ నీటివల్ల బ్రతుకుతారు. అయితే ఇలా ఆధ్యాత్మిక పాఠాల్లో పడి భవిష్యత్తులో మృత సముద్రం ప్రాణుల నివాసానికి అనుగుణంగా మరవచ్చన్న విషయాన్ని విస్మరించరాదు.
10. మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.
“మహా సముద్రం”– మధ్యధరా సముద్రం.
11. అయితే ఆ సముద్రపు బురద స్థలము లును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.
ఉప్పు ఇంకా అవసరంగానే ఉన్న కాలాన్ని సూచిస్తున్నది.
12. నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.ప్రకటన గ్రంథం 22:2-14-19
దీన్లో ఉన్న ఆధ్యాత్మిక పాఠం కోసం కీర్తనల గ్రంథము 1:3 చూడండి. “ఔషధంగా”– ప్రకటన గ్రంథం 22:2 చూడండి. బైబిల్లో ఇతర ప్రవాహాల కోసం చూడండి – ఆదికాండము 2:10; ఆదికాండము 36:8-9; కీర్తనల గ్రంథము 46:4; యెషయా 33:21; జెకర్యా 14:8; యోహాను 7:37-39; ప్రకటన గ్రంథం 22:1-2.
13. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సరి హద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను.
ఇక్కడి నుంచి యెహెఙ్కేలు 48:29 వరకు ఇస్రాయేల్ దేశం విభజన గురించిన ఆదేశాలు ఉన్నాయి. యెహెఙ్కేలు 45:1-8 కూడా చూడండి. దేశం సరిహద్దుల గురించి, ఇస్రాయేల్ గోత్రాలు ఒక్కొక్కదానికీ చెందవలసిన భాగాల గురించీ ఇక్కడ వివరాలు ఉన్నాయి. ఈ దర్శనానికి ఎలాంటి అక్షరార్థమైన నెరవేర్పూ ఉండదనుకుంటే ఈ వివరాలు చెప్పేందుకు వాడిన భాష వింతగానే అనిపిస్తుంది మరి. “యోసేపు”– లేవి గోత్రానికి భాగం ఉండదు కాబట్టి మనష్షే, ఎఫ్రాయిములు రెండు గోత్రాలకూ భాగాలివ్వాలి.
14. నేను ప్రమాణముచేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.
“పూర్వీకులకు”– ఈ వచనాల్లోని భూభాగం ఎక్కడో ఉన్న మహిమ రాజ్యమో, మరొకటో కాదు గాని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చెయ్యబడిన దేశమే (ఆదికాండము 15:9-21; ఆదికాండము 17:18, ఆదికాండము 17:21; ఆదికాండము 28:13), పాత ఒడంబడిక గ్రంథం అంతటా కనిపించే దేశమే.
15. ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.
16. అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దు నకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును.
17. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
18. తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువ వలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.
యొర్దానుకు తూర్పున ఉన్న భాగం గతంలో రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రాలవారిది (ద్వితీయోపదేశకాండము 3:12-17). ఈ దర్శనంలో అది ఇస్రాయేల్వారి క్రిందికి రాదు. “తూర్పు సముద్రం”– మృత సముద్రం.
19. దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
“కాదేషు”, “ఈజిప్ట్వాగు”– సొలొమోను రాజ్యం ఇక్కడి వరకు వ్యాపించింది. “మహా సముద్రం”– మధ్యధరా సముద్రం.
20. పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.
21. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను.
22. మీరు చీట్లువేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టినవారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీవలె వారును చీట్లు వేయవలెను.
ఇది కొత్త ఆదేశం. మోషే ధర్మశాస్త్రంలో లేదు.
23. ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.