Mark - మార్కు సువార్త 1 | View All

1. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము.

2. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును.

నిర్గమ 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.

మలాకీ 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకనిశబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు

యెషయా 40:3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.

4. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను.

5. అంతట యూదయ దేశస్థు లందరును, యెరూషలేము వారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

6. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు.

2రాజులు 1:8 అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగాఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.

జెకర్యా 13:4 ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు.

7. మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను;

8. నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.

9. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.

10. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.

11. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

ఆది 22:2 అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను

కీర్త 2:7 కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.

యెషయా 42:1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను.

13. ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.

14. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు

15. కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ;మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.

16. ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

17. యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.

18. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.

19. ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.

20. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

21. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.

22. ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.

23. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను.

24. వాడు నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను.

కీర్త 89:19 అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.

25. అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా

26. ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.

27. అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

28. వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.

29. వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.

30. సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.

31. ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.

32. సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి;

33. పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.

34. ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.

35. ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.

36. సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి

37. ఆయనను కనుగొని, అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా

38. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.

39. ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలోప్రక టించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను.

40. ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా

41. ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.

42. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.

43. అప్పుడాయన ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;

44. కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను.

లేవీ 13:49 ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను.

లేవీ 14:2-32 కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడలయాజకుడు పవిత్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించిసజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచికుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయ వలెను.అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను.ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింప వలెను.అతడు పాపపరి హారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైనదానివలె అపరాధపరిహారార్థమైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైనదాని రక్త ములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను.మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను.అప్పుడు యాజ కుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను.యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థ బలిపశువుయొక్క రక్తముమీద చమరవలెను.అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలిపశువును వధింపవలెను.యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వాడు పవిత్రుడగును.వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని యెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱెపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెనువారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను.వాడు పవిత్రతపొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొని రావలెను.యాజకుడు అపరాధ పరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.అప్పుడతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థబలిపశువు యొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చమరవలెను.మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొనితన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను.మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను.యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను.అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను.తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను.కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేని యెడల వాని విషయమైన విధియిదే.

45. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Mark - మార్కు సువార్త 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జాన్ బాప్టిస్ట్ కార్యాలయం. (1-8) 
యెషయా మరియు మలాకీ ఇద్దరూ యోహాను పరిచర్య ద్వారా యేసుక్రీస్తు సువార్త ప్రారంభం గురించి మాట్లాడారు. ఈ ప్రవక్తలు తన సువార్తలో, క్రీస్తు మన దగ్గరకు వస్తారని, దయ యొక్క సంపదను మరియు పరిపాలించే అధికారాన్ని కలిగి ఉన్నారని వెల్లడించారు. ప్రపంచం యొక్క విస్తృతమైన అవినీతి అతని మిషన్‌కు గణనీయమైన వ్యతిరేకతను సృష్టిస్తుంది. దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపినప్పుడు, ఆయన మన హృదయాలలోకి ప్రవేశించినట్లే, ఆయన కోసం మార్గాన్ని సిద్ధం చేశాడు. జాన్ క్రీస్తుకు సంబంధించి అత్యల్ప స్థానానికి కూడా అనర్హుడని భావించాడు. ఇది గమనించదగ్గ విషయం ఏమిటంటే, అత్యంత ప్రముఖులైన సెయింట్స్ ఎల్లప్పుడూ లోతైన వినయాన్ని ప్రదర్శించారు, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తంపై వారి ఆధారపడటాన్ని గుర్తిస్తారు మరియు ఇతరుల కంటే ఎక్కువగా ఆత్మను పవిత్రం చేస్తారు. పశ్చాత్తాపపడి, పాపాలు క్షమించబడిన వారికి క్రీస్తు సువార్తలో ముఖ్యమైన వాగ్దానం ఏమిటంటే, వారు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం తీసుకుంటారు, ఆయన కృపతో శుద్ధి చేయబడతారు మరియు ఆయన సన్నిధి ద్వారా ఓదార్పు పొందుతారు. మనలో చాలా మంది తరచుగా మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు, వాక్యంతో నిమగ్నమై ఉంటారు మరియు పూర్తి ప్రయోజనం మరియు సౌకర్యాన్ని అనుభవించకుండానే మతకర్మలను స్వీకరిస్తారు, ఎందుకంటే మనలో దైవిక కాంతి లేదు. మనం ఈ కాంతిని వెతకడంలో విఫలం కావడం వల్ల మనకు ప్రాథమికంగా ఈ వెలుగు లేదు. ఏది ఏమైనప్పటికీ, మన పరలోకపు తండ్రి ఈ వెలుగును, తన పరిశుద్ధాత్మను ప్రార్థన ద్వారా శ్రద్ధగా కోరుకునే వారికి ప్రసాదిస్తాడనే దేవుని తప్పులేని వాక్యం యొక్క హామీ మనకు ఉంది.

క్రీస్తు యొక్క బాప్టిజం మరియు టెంప్టేషన్. (9-13) 
క్రీస్తు యొక్క బాప్టిజం అతని మొదటి బహిరంగ ప్రదర్శనగా గుర్తించబడింది, సుదీర్ఘ కాలం అస్పష్టంగా ఉంది. ఈ ప్రపంచంలో తరచుగా గుర్తించబడని ముఖ్యమైన దాచిన సంభావ్యతను ఇది హైలైట్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ముందుగానే లేదా తరువాత, అటువంటి దాచిన విలువ క్రీస్తు విషయంలో ఉన్నట్లుగానే బహిర్గతమవుతుంది. యోహాను 17:19లో చెప్పబడినట్లుగా, మన పవిత్రీకరణ మరియు అతనితో పాటు బాప్టిజం యొక్క అంతిమ లక్ష్యంతో, మన కొరకు తనను తాను పవిత్రం చేసుకోవడానికి అతను ఇష్టపూర్వకంగా పాపాత్మకమైన శరీరాన్ని తీసుకున్నాడు.
యోహాను బాప్తిస్మానికి వినయపూర్వకంగా సమర్పించినప్పుడు దేవుడు క్రీస్తును ఎలా గౌరవించాడో పరిశీలించండి. ఆత్మ పావురంలా అతనిపైకి దిగింది, ఈ దైవిక ఆమోదాన్ని సూచిస్తుంది. అదే విధంగా, ఆత్మ దిగివచ్చి మనలో పని చేస్తున్నప్పుడు మనం ఆధ్యాత్మిక ద్యోతకాన్ని అనుభవించవచ్చు. మనలో దేవుని పని మన పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి మరియు మన ప్రయాణానికి ఆయన సన్నద్ధతకు బలవంతపు సాక్ష్యంగా పనిచేస్తుంది.
క్రీస్తు యొక్క టెంప్టేషన్ గురించి, అతను అరణ్యంలో ఉన్నాడని, క్రూరమృగాలతో కలిసి ఉన్నాడని మార్క్ పేర్కొన్నాడు. ఇది అతని తండ్రి యొక్క శ్రద్ధకు స్పష్టమైన ప్రదర్శన, దేవుడు తన అవసరాలను తీరుస్తాడనే మరింత హామీని అందజేస్తుంది. ప్రత్యేక రక్షణలు సమయానుకూలమైన నిబంధనల వాగ్దానంగా పనిచేస్తాయి. పాము మొదటి ఆడమ్‌ను తోటలో మరియు రెండవ ఆడమ్‌ను అరణ్యంలో వివిధ ఫలితాలతో శోధించినట్లే, దుష్టుడు అన్ని ప్రదేశాలలో మరియు పరిస్థితులలో ఆడమ్‌ల వారసులిద్దరినీ ప్రలోభపెడుతూనే ఉంటాడు.
ప్రలోభాలు వివిధ రూపాల్లో ఉన్నాయి, ఇతరుల సహవాసంలో లేదా ఏకాంత క్షణాలలో, అరణ్యంలో కూడా. చట్టబద్ధమైన పని, తినడం, త్రాగడం లేదా ఉపవాసం మరియు ప్రార్థన చేసే సమయంలో కూడా అలాంటి పరీక్షల నుండి ఎటువంటి ప్రదేశం లేదా జీవిత పరిస్థితి మినహాయించబడదు. తరచుగా, భక్తి మరియు కర్తవ్యం యొక్క ఈ క్షణాలలోనే అత్యంత ముఖ్యమైన ప్రలోభాలు తలెత్తుతాయి, కానీ అవి మధురమైన విజయాలకు కూడా అవకాశం కల్పిస్తాయి.
మంచి దేవదూతల పరిచర్య చెడు దేవదూతల దుర్మార్గపు ఉద్దేశాల నేపథ్యంలో గొప్ప ఓదార్పునిస్తుంది. అయినప్పటికీ, మన హృదయాలలో దేవుని పరిశుద్ధాత్మ నివసించడం మరింత ఓదార్పునిస్తుంది.

క్రీస్తు బోధిస్తాడు మరియు శిష్యులను పిలుస్తాడు. (14-22) 
యోహాను ఖైదు చేయబడిన తర్వాత యేసు గలిలయలో తన ప్రకటనా పరిచర్యను ప్రారంభించాడు. కొంతమంది వ్యక్తులను పక్కన పెట్టినప్పుడు, అదే దైవిక పనిని కొనసాగించడానికి ఇతరులు ఉద్భవిస్తారని ఈ పరివర్తన మనకు బోధిస్తుంది. క్రీస్తు బోధించిన లోతైన సత్యాలపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. పశ్చాత్తాపం ద్వారా, మనం బాధపెట్టిన మన సృష్టికర్తకు మహిమను సమర్పిస్తాము, విశ్వాసం ద్వారా మన పాపాల నుండి మనలను రక్షించడానికి వచ్చిన మన విమోచకుడికి కీర్తిని అందిస్తాము. క్రీస్తు ఈ రెండు అంశాలను పరస్పరం అనుసంధానించాడు మరియు ఎవరూ వాటిని వేరు చేయడానికి ప్రయత్నించకూడదు.
ఇంకా, లోకం దృష్టిలో చిన్నవారిగా పరిగణించబడుతున్నప్పటికీ, తమ బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించి, ఒకరిపట్ల ఒకరు దయ చూపే వారికి క్రీస్తు గౌరవం ఇస్తాడు. శ్రద్ధ మరియు ఐక్యత మెచ్చుకోదగినవి మాత్రమే కాదు, సంతోషకరమైనవి కూడా, మరియు యేసు ప్రభువు వారిపై తన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తాడు. ఎవరైతే క్రీస్తు పిలుస్తారో వారు అతనిని అనుసరించడానికి ప్రతిదీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి మరియు అతని కృప ద్వారా, అతను అలా చేయాలనే సుముఖతను వారిలో కలిగించాడు. దీని అర్థం భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు, ప్రాపంచిక అనుబంధాల నుండి నిర్లిప్తతను కొనసాగించడం, క్రీస్తు పట్ల మన కర్తవ్యానికి విరుద్ధంగా మరియు మన ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ముప్పు కలిగించే దేనినైనా వదులుకోవడం.
ముఖ్యంగా, సబ్బాత్ విశ్రాంతి ఏ ఉద్దేశ్యం కోసం నియమించబడిందో దానికి అనుగుణంగా, సబ్బాత్ సంబంధిత పనికి తనను తాను అంకితం చేసుకోవడం ద్వారా యేసు సబ్బాత్‌ను నమ్మకంగా పాటించాడు. క్రీస్తు బోధలు చాలా ఆశ్చర్యకరమైనవి, మరియు మనం వాటిని ఎంత ఎక్కువగా వింటున్నామో, అంతగా మనం ఆశ్చర్యపోవడానికి కారణాలను కనుగొంటాము.

అతడు అపవిత్రాత్మను వెళ్లగొట్టాడు. (23-28) 
డెవిల్ తన సహజమైన స్వచ్ఛతను కోల్పోవడం మరియు దేవుని పవిత్రాత్మ పట్ల వ్యతిరేకత కారణంగా అపవిత్రమైన ఆత్మగా వర్ణించబడింది. అతను తన వంచక సూచనలతో మానవుల ఆత్మలను పాడు చేస్తాడు. మా సమ్మేళనాలలో, ఉపరితల ఉపాధ్యాయుల నేతృత్వంలోని సేవలకు నిష్క్రియంగా హాజరయ్యే వారు ఉన్నారు. అయితే, ప్రభువు తన ఆత్మ ద్వారా దైవిక బోధలు మరియు దృఢ నిశ్చయంతో విశ్వాసపాత్రులైన పరిచారకులను పంపినప్పుడు, కొంతమంది వ్యక్తులు "నజరేయుడైన యేసు, నీతో మాకు ఏమి సంబంధం?" అని అరిచిన వ్యక్తి వలె ప్రతిస్పందించడానికి మొగ్గు చూపుతారు. ఏ సాధారణ గందరగోళం లేదా అంతరాయం యేసును దేవుని పరిశుద్ధుడిగా వెల్లడించలేదు. ఈ వ్యక్తులు యేసుతో ఏమీ చేయకూడదనుకుంటారు, ఎందుకంటే వారు మోక్షానికి నిరాశ చెందుతారు మరియు తిరస్కరణ యొక్క పరిణామాలకు భయపడతారు.
ఈ మాటలు సర్వశక్తిమంతుడిని తమ నుండి విడిచిపెట్టమని చెప్పేవారిని గుర్తుకు తెస్తాయి. అపవిత్రమైన ఆత్మ క్రీస్తును తృణీకరించింది మరియు భయపడింది, ఎందుకంటే అది అతని పవిత్రతను గుర్తించింది, ఎందుకంటే పడిపోయిన స్థితిలో ఉన్న మానవ మనస్సు దేవునికి, ముఖ్యంగా అతని పవిత్రతకు విరుద్ధమైనది. క్రీస్తు, తన కృప ద్వారా, సాతాను బారి నుండి ఆత్మలను విడిపించినప్పుడు, అది ప్రశాంతమైన ప్రక్రియ కాదు. దుర్మార్గుడైన ప్రత్యర్థి తాను నాశనం చేయలేని వారికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటి సంఘటనలకు సాక్ష్యమివ్వడం వల్ల ప్రజలు "ఈ కొత్త బోధన ఏమిటి?" ఇలాంటి విశేషమైన పరివర్తనలు నేడు జరుగుతాయి, కానీ ప్రజలు తరచుగా ఉదాసీనత మరియు నిర్లక్ష్యంతో వాటిని కొట్టివేస్తారు. ఇది కాకపోతే, సిలువ వేయబడిన రక్షకుని బోధించడం ద్వారా అపఖ్యాతి పాలైన దుష్ట వ్యక్తిని హుందాగా, నీతిమంతుడిగా మరియు దైవభక్తి గల వ్యక్తిగా మార్చడం, "ఇది ఎలాంటి సిద్ధాంతం?" అని విచారించమని చాలా మందిని బలవంతం చేస్తుంది.

అతను చాలా మంది వ్యాధులను నయం చేస్తాడు. (29-39) 
క్రీస్తు వచ్చినప్పుడల్లా, మంచితనాన్ని తీసుకురావడమే ఆయన ఉద్దేశం. మనం ఆయనకు సేవ చేసేలా మరియు ఆయనకు చెందిన ఇతరులకు సహాయం చేసేలా ఆయన స్వస్థపరుస్తాడు మరియు ఆయన కోసమే అలా చేస్తాడు. అనారోగ్యం లేదా అసలైన అడ్డంకుల కారణంగా, బహిరంగ సభలకు హాజరు కాలేని వారు రక్షకుని దయగల ఉనికిని ఊహించగలరు. ఆయన వారి కష్టాలను ఓదార్చాడు మరియు వారి బాధలను ఉపశమనం చేస్తాడు. వైద్యం అవసరమైన వారి సంఖ్యను గమనించండి. ఇతరులు క్రీస్తుతో విజయాన్ని అనుభవించినప్పుడు, ఆయనను ఉత్సాహంగా వెతకడానికి అది మనల్ని ప్రేరేపించాలి.
తరువాత, క్రీస్తు ఏకాంత ప్రదేశానికి వెళ్లిపోయాడు. పరధ్యానం లేదా వానిటీ యొక్క టెంప్టేషన్ నుండి విముక్తి పొందినప్పటికీ, అతను తిరోగమనాన్ని ఎంచుకున్నాడు. బిజీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు కూడా, ఉదాత్తమైన స్వభావం ఉన్నవారు కూడా, అప్పుడప్పుడు దేవునితో ఏకాంతాన్ని వెతకాలి.

అతను కుష్ఠురోగిని నయం చేస్తాడు. (40-45)
కుష్ఠురోగిని శుద్ధి చేసిన క్రీస్తు చర్యను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి క్రీస్తు సుముఖత గురించి ఎటువంటి సందేహం లేకుండా, "ప్రభువా, నీకు ఇష్టమైతే," అని చెబుతూ, రక్షకుని ప్రగాఢమైన వినయంతో మరియు అతని చిత్తానికి పూర్తి విధేయతతో చేరుకోవాలని ఇది మనకు నిర్దేశిస్తుంది. అదనంగా, క్రీస్తు నుండి మనం ఏమి ఆశించవచ్చో అది వివరిస్తుంది: మన విశ్వాసం ఫలితాన్ని నిర్ణయిస్తుంది. నిరుపేద కుష్టురోగి, "నీకు ఇష్టమైతే" అన్నాడు. తన మార్గదర్శకత్వంలో తమను తాము ఇష్టపూర్వకంగా ఉంచుకునే వారికి క్రీస్తు తన ఆశీర్వాదాలను అందించడానికి తక్షణమే మొగ్గు చూపుతాడు.
ప్రజల నుండి ప్రశంసలు కోరుతున్నట్లు అర్థం చేసుకోగలిగే చర్యలను అనుమతించే ఉద్దేశ్యం క్రీస్తుకు లేదు. అయితే, ఇప్పుడు క్రీస్తు స్తుతులను వ్యాప్తి చేయకుండా వెనుకకు వేయడానికి కారణాలు లేవు.



Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |